మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తపంచాశః సర్గలో, త్రిశంకు పురాణం రాముడికి వివరించబడింది, ఇది విశ్వామిత్రుని పురాణంలో భాగమైంది. బ్రహ్మ విశ్వామిత్రుడిని బ్రాహ్మణ-సన్యాసిగా కాకుండా, రాజుగా-సన్యాసిగా ఉండమని ఆశీర్వదించినప్పుడు, విశ్వామిత్రుడు దేశంలోని దక్షిణ ప్రాంతాలలో తన ఆశ్రయాన్ని కొనసాగిస్తాడు. ఈలోగా, త్రిశంకు అనే రాజు మర్త్య శరీరంతో స్వర్గానికి వెళ్లాలని కోరుకున్నాడు మరియు ఆ సూచనను తిరస్కరించిన వశిష్టుడిని సంప్రదించాడు. అప్పుడు ఆ రాజు అదే ఆలోచనతో అదే వశిష్ఠుని కుమారులను సంప్రదిస్తాడు.
“ఓ రామా! వసిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తరువాత, ఆ అవమాన భారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్లాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రము ఆహారముగా తీసుకుంటూ, ఘోరమైన తపస్సుచేసాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, ధృడనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మించారు. అప్పటికి వేయి సంవత్సరములు గడిచాయి.
విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ విశ్వామిత్రా! నీ తపస్సునకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడవు. ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేసావు. అందుచేత నీవు రాజర్షివి అయ్యావు.” అని పలికాడు.
తరువాత బ్రహ్మదేవుడు స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంత కాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా. నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు. బ్రహ్మర్షి అని పిలువబడేవరకు తపస్సు చేస్తాను. అని నిర్ణయించుకున్నాడు. మరలా తపస్సు చేయడం మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు.
ఆవిధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజుఉండేవాడు. అతనికి ఈ శరీరంతోపాటు స్వర్గానికి వెళ్లాలి అనే కోరిక బలీయంగా ఉండేది. ఆయన ఆస్థానములో వసిష్ఠుడు పురోహితుడుగా ఉండేవాడు.
త్రిశంకు వసిష్ఠుని పిలిచి తన కోరిక తెలిపాడు. త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వసిష్ఠుడు ఆ పని తన వల్లకాదు అని చెప్పాడు.
“నీ వల్ల కాక పోతే నీ కుమారులతో చేయిస్తాను” అని పలికి త్రిశంకుడు వసిష్ఠుని కుమారుల వద్దకు వెళ్లాడు. వసిష్ఠుని నూర్గురు కుమారులు తమతమ ఆశ్రమములలో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు వెళ్లాడు త్రిశంకు. వాళ్లముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు.
“ఓ ముని కుమారులారా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. కాని మీ తండ్రిగారు వసిష్ఠులవారు నా చేత ఆ యజ్ఞము చేయించుటకు ఒప్పుకొనలేదు. అందు వలన మీ వద్దకు వచ్చాను. నేను ఈ శరీరముతో స్వర్గలోకమునకు పోవుటకు తగిన యజ్ఞమును మీరు నా చేత చేయించాలి. మీరు మహానుభావులు. అటువంటి యజ్ఞచేయించుటకు మీరే సమర్థులు.
వసిష్ఠుడు నాకు పురోహితుడు. ఆయన కాదన్నపుడు ఆ కార్యము ఆయన కుమారులైన మీరే నెరవేర్చాలి. రాజులకు పురోహితులు దైవసమానులు కదా!. అందువలన మీరు నాకు దైవ సమానులు. కాబట్టి నా కోరిక కాదనకండి. నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకమునకు పంపండి” అని వేడుకున్నాడు త్రిశంకు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టషష్టితమః సర్గలో, రాముడు, లక్ష్మణుడు విష్వామిత్రుడితో కలిసి మిథిలానగరికి చేరుకుంటారు. అక్కడ వారు సీతాస్వయంవరానికి హాజరవుతారు. సీతను పొందాలనుకునే అనేక రాజులు శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరూ ఆ ధనుస్సును ఎత్తలేరు. చివరికి, రాముడు ఆ ధనుస్సును ఎత్తి, దానిని విరజేస్తాడు.
జనకమహారాజు పంపిన దూతలు అత్యంత ప్రయాసల కోర్చి మూడుదినములకు అయోధ్య నగరమునకు చేరుకున్నారు. రాజభవనమునకు వెళ్లారు. బయట ఉన్న ద్వార పాలకులకు “మిథిలా నగరము నుండి జనకమహారాజు దూతలు వచ్చారు అని దశరథ మహారాజు గారికి మనవి చేయండి.” అని వర్తమానము పంపారు.
ఆ వర్తమానమును అందుకున్న దశరథుడు వారిని లోపలకు రమ్మన్నాడు. జనక మహారాజు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు అయిన దశరథమహారాజును చూచి వినయంతో నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు.
“దశరథ మహారాజా! తమరికి జయము కలుగు గాక! మేము మిథిలాధి పతి అయిన జనకమహారాజు వద్దనుండి దూతలుగా వచ్చాము. జనక మహారాజు తమరియొక్క, తమరి మంత్రి, సామంత, పురోహితుల యొక్క యోగ క్షేమ సమాచారములు విచారించు చున్నారు. తమరి కుశలము కనుక్కోమని చెప్పారు. తమరి కుమారులు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి సంరక్షణలో సురక్షితముగా ఉన్నారని తమరికి చెప్పమన్నారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిథి సత్కారములు అందుకుంటున్నారు అని చెప్పమన్నారు. విశ్వామిత్రుల వారి అనుమతితో తమరితో ఈ మాటలు, వారి మాటలుగా చెప్పమన్నారు.
“నేను నా కుమార్తె సీతను వీరత్వమునే శుల్కముగా నిర్ణయించి వివాహము జరిపిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన విషయం తమరికి తెలుసు. కాని నా కుమార్తెను వరించి వచ్చిన వీరులందరూ నా చేత పరాజితులై పారిపోయారు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను, విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలకు వచ్చిన తమరి కుమారుడు, రాముడు, తన వీరత్వముతో గెల్చుకున్నాడు. తర తరాలుగా మా గృహములో పూజలందుకొనుచున్న శివధనుస్సును తమరి కుమారుడు రాముడు అవలీలగా ఎక్కుపెట్టి మధ్యకు విరిచి లోకానికి తన పరాక్రమమును చాటాడు.
వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను నా ప్రతిజ్ఞ ప్రకారము తమరి కుమారుడు రామునికి ఇచ్చి వివాహము చేయుటకు నాకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా ప్రార్థించుచున్నాను. తమరు బంధువులు, మిత్రులు, పురోహితులు సహితంగా మిథిలకు విచ్చేయవలసినదిగా కోరుచున్నాను. తమరుమిథిలకు వచ్చి శ్రీరాముని వివాహ మహోత్సవమును జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.” అని జనక మహారాజు విశ్వామిత్రుల అనుమతి పొంది, తమ పురోహితులు శతానందులవారి అనుమతి పొంది తమరితో పైవిధముగా చెప్పమన్నారు.” అని ఆ దూతలు జనక మహారాజు సందేశమును దశరథునికి సవినయంగా మనవిచేసారు.
తన కుమారునికి వివాహము అని తెలిసి దశరథుడు ఎంతో సంతోషించాడు. వసిష్ఠుని, పురోహితులను పిలిపించాడు.
వారితో ‘ ఇలా అన్నాడు. “రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి విదేహ పురములో ఉన్నాడని వర్తమానము వచ్చింది. మన రాముని బల పరాక్రమములు చూచి విదేహ మహారాజు జనకుడు తన కుమార్తె సీతను మన రామునికి ఇచ్చి వివాహము చేయ సంకల్పించాడట. కాబట్టి మీరు జనకుని గురించి వివరాలు సేకరించండి. జనకునితో సంబంధము మీ అందరకూ ఇష్టం అయితే. జనకుని ఆచార వ్యవహారాలు మీకు నచ్చితే, మనము విదేహ పురమునకు బయలుదేరి వెళుదాము.” అని అన్నాడు.
దశరథుని ఆస్థానములో ఉన్న పురోహితులు, ఋషులు తమలో తాము తర్కించుకొని అందరూ ఏక కంఠంతో జనకునితో సంబంధము తమకు ఇష్టమే అని చెప్పారు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. “రేపే ప్రయాణము” అని నిర్ణయించాడు.
జనక మహారాజు దూతలు ఆ రాత్రికి దశరథమహారాజు అతిధులుగా అయోధ్యలో ఉన్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచపంచాశః సర్గలో, విశ్వామిత్రుడు పరమశివుని దయతో క్షిపణులను పొందడం ద్వారా వశిష్ట ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తాడు. విష్-మిల్కర్ పవిత్ర ఆవు, కామధేనుడు సృష్టించిన దళాలు విశ్వామిత్రుని సైన్యాన్ని మరియు అతని వంద మంది కుమారులను అంతమొందించినప్పుడు, అతను ఆగ్రహం చెందాడు మరియు అసాధారణమైన క్షిపణులను ప్రసాదించమని శివుడిని ప్రార్థించాడు. వాటిని పొందిన తరువాత, అతను మళ్ళీ వశిష్ట మహర్షి ఆశ్రమానికి వచ్చి దానిని పూర్తిగా నాశనం చేస్తాడు. అప్పుడు విపరీతమైన కోపంతో వశిష్ట మహర్షి విశ్వామిత్రుడిని ఎదుర్కోవడానికి తన బ్రహ్మ లాఠీని ఆశ్రయిస్తాడు.
కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామితుని పరాక్రమమునకు చెల్లా చెదరు కావడం చూచాడు వసిష్ఠుడు.
“ఓ కామధేనువా! ఇంకా సేనలను సృష్టించు.” అని ఆదేశిం చాడు వసిష్ఠుడు. మరలా కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారవము నుండి సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజవీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ల నుండి ప్లవులు అనే సేనలు, యోనినుండి యవనులు, గోమయమునుండి శకులు, ఆవు రోమకూపముల నుండి మ్లేచ్ఛులు పుట్టారు. వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసారు.
తమ సేనలు నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని నూర్గురు కుమారులు. వారందరూ ఒక్కుమ్మడిగా వసిష్ఠుని మీదికి దుమికారు. వసిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు. తన కుమారులు, సైన్యము నాశనం కావడం కళ్లారా చూచాడు విశ్వామిత్రుడు. చాలా సేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు. విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకూ పనికిరాకుండా పోయూయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షిమాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉ న్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకము చేసాడు. విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్లిపోయాడు.
విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేసాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ రాజా! నీవు ఎందుకు ఇంతఘోర తపస్సు చేస్తున్నావు. నీకు ఏమి కావాలి. కోరుకో!” అని అడిగాడు.
“ఓ మహాదేవా! తమరు నాయందు దయయుంచి ధనుర్వేదమును, అందలి రహస్యములను, సాంగోపాంగముగా ఉ పదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్రవిద్యలను నాకు ఉ పదేశించండి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి” అని ప్రార్థించాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుని కోరికకు నవ్వి “నీవు కోరిన విద్యలు అన్నీ నీకు ప్రసాదించాను.” అని వరం ఇచ్చాడు మహాశివుడు. మహాశివుడు అంతర్థానము అయ్యాడు.
విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. వెంటనే వసిష్ఠుని ఆశ్రమమునకు వెళ్లాడు. అతని ఆశ్రమమును సర్వనాశనం చేసాడు. అహం కారంతో అట్టహాసం చేసాడు. ఆశ్రమములోని మునులు అందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్నిచనిపోగా మరి కొన్నిపారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి.
“భయపడకండి. నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను. మిమ్ములను రక్షిస్తాను.” అని వసిష్ఠుడు అరుస్తున్నాడు. కాని ఎవరూ అతని మాట వినలేదు. అందరూ పారిపోయారు. వసిష్ఠుని ఆశ్రమము అంతా శ్మశానము మాదిరి మారిపోయింది.
విశ్వామిత్రుడు చేసిన మారణ కాండ చూచి వసిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్రా! నేనుఎంతో కాలంగా పెంచి పోషించిన జీవ జాలమును, వృద్ధిచేసిన ఆశ్రమమును క్షణ కాలంలో నాశనం చేసావు. నీకు భవిష్యత్తులేదు. నిన్ను నాశనం చేస్తాను.” అని తన దండమును చేతిలోకి తీసుకొని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు.
శ్రీమద్రామాయణము
బాలకాండము యాభై ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ తత్సత్ తత్సత్.
మరునాడు ఉదయం జనకమహారాజు కాలకృత్యములను తీర్చుకొనని విశ్వామిత్రుని వద్దకు వెళ్లాడు. విశ్వామిత్రుని, రామ లక్ష్మణులను, వారితో వచ్చిన ఋషులను తన భవనమునకు తీసుకొని వచ్చాడు. విశ్వామిత్రునికి పూజలు చేసాడు.
“ఓ విశ్వామిత్ర మహర్షీ! రామలక్ష్మణులారా! మీకు ఇదే మా స్వాగతం. నేను మీ ఆజ్ఞాబద్ధుడను. తమరికి ఏమి కావాలో నన్ను ఆజ్ఞాపించండి. తక్షణమే నెరవేరుస్తాను.” అని పలికాడు జనకుడు.
“ఓ జనకమహారాజా! నీ వినయవిధేయతలు అత్యంత ప్రశంసనీయములు. వీరు ఇరువురు అయోధ్య చక్రవర్తి దశరథి “మహారాజు పుత్రులు. వీరు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన ధనుస్సును చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి నీవు వారికి ఆ ధనుస్సు చూపించు. వారు ఆ ధనుస్సును చూచి అయోధ్యకు తిరిగి వెళ్లిపోతారు.” అని అన్నాడు.
అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! వారికి ఆ ధనుస్సును చూపించే ముందు ఆ ధనుస్సు గురించి వివరిస్తాను. ఆ ధనుస్సు శివధనుస్సు. పూర్వము దక్షయజ్ఞ సమయములో రుద్రుడు తనకు యజ్ఞములో హవిర్భాగమును ఇవ్వనందుకు ఈ శివధనుస్సును ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు అందరూ ఈశ్వరుని ప్రార్థించారు. ఈశ్వరుడు దేవతలను క్షమించాడు. అప్పుడు తాను ఎత్తిన శివధనుస్సును ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి, పరమశివుడు ఆ ధనుస్సును నిమి చక్రవర్తి వంశంలో ఆరవ వాడైన దేవ రాతుని వద్ద ఉంచాడు. ఆ దేవరాతుడు మా పూర్వీకుడు. ఆ ప్రకారంగా ఈ శివధనుస్సు మా భవనంలో ఉన్న పూజా మందిరంలో వంశపారంపర్యంగా పూజలందుకుంటూ ఉంది.
తరువాత నేను ఒక సారి యజ్ఞము చేయ సంకల్పించాను. యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను. అప్పుడు నాగేటి చాలులో నాకు ఒక కన్య దొరికింది. ఆమె పేరు సీత. అయోనిజ. (మానవ యోని నుండి జన్మించనిది).
సీతకు యుక్తవయసువచ్చినది. ఆమెను వివాహమాడటానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నించారు. కాని సీతను వివాహమాడే వాడు అత్యంత పరాక్రమ వంతుడు అయి ఉండాలని నేను ఒక నియమం పెట్టాను. సీతను “వీర్యశుల్క” గా ప్రకటించాను. (అనగా సీతను వివాహమాడాలంటే వీరత్వమును శుల్కముగా ఇవ్వాలి).
సీతను వివాహ మాడటానికి మిథిలకు వచ్చిన రాకుమారులకు నేను ఈ ధనుస్సును చూపించి దానిని ఎక్కు పెట్టమన్నాను. వారందరిలో ఏ ఒక్కరు కూడా ఈ ధనుస్సును కనీసం కదల్చలేక పోయారు. అందుకని నేను ఎవరికీ సీతను ఇచ్చి వివాహము చేయలేదు.
ఓ మహర్షీ! నేను నా కుమార్తె సీతను వీర్య శుల్వగా ప్రకటించి, వారికి అలవి కాని పరీక్ష పెట్టి, సీతను ఇచ్చి వివాహము చేయలేదని, ఆ రాజకుమారులందరూ నా మీద కోపగించారు. నా మీదకు యుద్ధానికి వచ్చారు. మిథిలను ముట్టడించారు. నా వద్ద ఉన్న సైన్యముతో వారిని ఎదిరించలేకపోయాను.
ఆ విధంగా ఒక సంవత్సరము గడిచింది. మిథిలానగరములో ఉన్న అత్యవసర వస్తువులు, ధాన్యములు తరిగిపోయాయి. ప్రజలు ఆహారము కోసరము అలమటిస్తున్నారు. అప్పుడు నేను తపస్సుచేసి దేవతలను ప్రార్థించాను. దేవతలు నా ప్రార్థనను మన్నించి నాకు సైన్యమును సమకూర్చారు. నేను దేవతలు సమకూర్చిన సైన్యముతో ఆ రాజులను ఓడించి పారద్రోలాను. దేవతా సైన్యము ధాటికి తట్టుకోలేక శత్రురాజులు తలొక దిక్కు, పారిపోయారు.
ఓ విశ్వామిత్ర మహర్షీ! ఇదీ ఈ ధనుస్సు వృత్తాంతము. నేను శివధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగితే అన్న మాట ప్రకారము నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహము జరిపిస్తాను.” అని అన్నాడు జనకుడు.
అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గంలో, దశరథ మహారాజు కౌసల్య, సుమిత్ర, మరియు కైకేయిలతో కలసి రాముడి వనం పంపిన పశ్చాత్తాపంతో బాధపడుతాడు. దశరథుడు రాత్రింబవళ్లు రాముడి గురించే ఆలోచిస్తూ అనుతాపంలో మునిగి తానెవరి మాటలు వినకుండా ఉంటాడు. రాత్రి ఒకప్పుడు, అతను తన గత జీవితంలో చేసిన పాపం గురించి స్మరించుకుంటాడు, అందులో శ్రవణ కుమారుడు అనే అంధురాళ్ల కుమారుడిని పొరపాటున వధించిన సంఘటన. ఈ బాధతో, దశరథుడు తన మరణం సమీపంలో ఉన్నాడు. ఈ సర్గ దశరథుడి పశ్చాత్తాపం, అతని కుమారుడి వియోగంలో నష్టభావాన్ని, మరియు కర్మ ఫలితాలను తెలియజేస్తుంది.
దశరథుడు కలతనిద్రలో ఉన్నాడు. పూర్వము జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నిద్రపట్టడం లేదు. ఆ విషయం కౌసల్యకు చెబితే తన దు:ఖము కొంచెమైనా ఉపశమిస్తుంది అని అనుకున్నాడు. కౌసల్యను పిలిచాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో ఇలా చెప్పసాగాడు.
ఓ కౌసల్యా! మానవుడు తాను చేసిన పుణ్యమునకు పాపమునకు ఈ జన్మలోనే తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వాడు ఎవరైనా సరే, ఒక పనిని మొదలు పెట్టే ముందు, తాను చేయబోయే పని మంచిదా, చెడ్డదా, ఆ పని వలన మంచి ఫలితము వస్తుందా లేక చెడ్డ ఫలితము వస్తుందా అని తెలుసుకొని తరువాత ఆ పని మొదలుపెట్టాలి. అలా చెయ్యని వాడు మూర్ఖుడు, ఏమీ తెలియని వాడు అని పెద్దలు అంటారు.
మోదుగుపూలు పెద్దవిగా ఉంటాయి. కాని మామిడి పూత చాలా చిన్నదిగా ఉంటుంది. మోదుగ పూలు పెద్దవి కాబట్టి పెద్ద పెద్ద కాయలు, పండ్లు కాస్తాయి అని మామిడి చెట్లను నరికి, మోదుగ చెట్లను పెంచిన వాడు మూఢుడు కాక మరేమవుతాడు. ఎందుకూ పనికిరాని మోదుగ కాయలను చూచి ఏడుస్తాడు. తాను చేయబోయే పనికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియకుండా ఆ పని చేసేవాడు, పూతా పిందే లేని చెట్టుకు నీరు పోసి పెంచిన వాడితో సమానము. మామిడి చెట్టులాంటి రాముని అడవులకు పంపి, మోదుగ చెట్లను పెంచుతున్నాను. కాని ఈ పాపమునకు బలమైన కారణము ఉంది.
నేను మంచి యవ్వనములో ఉండగా నాకు శబ్దవేధి విద్యనేర్చుకున్నాను. ఎంత చీకటిలో ఉన్న మృగము నైనా అది చేయు శబ్దమును విని దానిని గురితప్పకుండా కొట్టగల నేర్పు నాకు ఉండేది. అదే నాకు చేటు తెచ్చింది. మహా పాపము చేయించింది.
ఓ కౌసల్యా! అప్పటికి నాకు వివాహము కాలేదు. మంచి యవ్వనములో ఉన్నాను. పైగా యువరాజును. కోరికలు ఎక్కువ. దానితో కూడా మదము, గర్వము కూడా ఎక్కువే. ఒక వర్షాకాలంలో నేను సరయూనది సమీపములోని అడవికి వేటకు వెళ్లాను. వేటాడి వేటాడి అలసి పోయాను. అంతలో చీకటి పడింది. నాకు రాత్రిళ్లు వేటాడటం చాలా ఇష్టం. సరోవరములో నీటిని తాగుటకు వచ్చు జంతువులు నీరు తాగునపుడు చేయు గుడ గుడ శబ్దములను బట్టి వాటిని బాణములతో కొట్టి వినోదించేవాడిని.
అదే ప్రకారము ఆ రాత్రికూడా నేను ఒక సరోవరము దాపున మాటు వేసి కూర్చున్నాను. ఆ రోజు ఒక ఏనుగును వేటాడవలెనని సంకల్పముతో ఉన్నాను. ఇంతలో నీటిలో దిగిన శబ్దము, కుండలో నీరు నింపునపుడు వచ్చే శబ్దము నాకు వినపడ్డాయి. నేను ఏనుగు తన తొండముతో నీరు తాగుతూ ఉంది అని అనుకున్నాను. ఒక బాణము తీసి, ఆ శబ్దము వచ్చు వైపు గురిపెట్టి కొట్టాను. ఏనుగు ఘీంకారమునకు బదులు “అయ్యో అమ్మా అమ్మా” అంటూ మనిషి అరిచిన శబ్దము వినపడింది.
నేను పరుగు పరుగున ఆ సరోవరము వద్దకు వెళ్లాను. అక్కడ ఒక ముని కుమారుడు పడి ఉన్నాడు. నేను వదిలిన బాణము అతని గుండెల్లో గుచ్చుకొని ఉంది. “మేము ఈ అడవితో తపస్సుచేసుకుంటుంటే మా మీద ఏ దుర్మార్గుడు బాణప్రయోగము చేసినాడో కదా! మేము ఎవరికీ అపకారము చేయలేదే! నీళ్లు తీసుకొని పోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కాని నన్ను ఎవరో బాణంతో కొట్టారు. మేము హింస అంటే ఏమిటో ఎరుగము. ఎవరికీ ఏ విధమైన అపకారమూ చెయ్యము.
అటువంటిమాకు ఈ విధంగా బాణంతో కొట్టి మరణ శిక్ష విధించుటకు కారణమేమి? నేను ఎవరికీ ఏ అపకారము చెయ్యలేదు. అంటువంటిది నన్ను ఎందుకు బాణంతో కొట్టాల్సివచ్చింది. అతడు ఎవరో కానీ ఏ విధంగానూ మంచి ఫలితము ఇవ్వని ఈ పని చేసి మహాపాపం చేసాడు. నేను చనిపోతున్నందుకు నాకు విచారములేదు. కాని నా తల్లి తండ్రుల గురించే నాకు బాధగా ఉంది. నా తల్లి తండ్రులను వారి వృధ్యాప్యములో నేను వారిని పోషిస్తున్నాను. నేను ఇలా అర్థాంతరంగా మరణిస్తే వారికి దిక్కు ఎవరు? ఆ మూర్ఖుడు ఎవరో గానీ నన్ను మాత్రమే చంపలేదు. నాతోపాటు నా తల్లితండ్రులను కూడా చంపాడు. ” అని పరి పరి విధములుగా బాధతో విలపిస్తున్నాడు.
ఆ మాటలు విన్న మా మనసు వికలమైపోయింది. ఏమి చెయ్యడానికి తోచలేదు. ఆ ముని కుమారుని దగ్గరగా వెళ్లాను. అతడు తెచ్చిన కుండా పక్కనే పడి ఉంది. అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నేను అతని పక్కనే కూర్చున్నాను. ఆ ముని కుమారుడు కళ్లు పైకెత్తి నన్ను చూచాడు.
“ఓ రాజా! నువ్వేనా నన్ను బాణంతో కొట్టింది. నేను నీకు ఏమి అపకారము చేసానని నన్ను బాణంతో కొట్టావు. నేను నా తల్లి తండ్రుల కొరకు నీళ్లు తీసుకొని పోవడానికి వచ్చాను. అది అపరాధమా! నువ్వు నన్నే కాదు. నా తల్లి తండ్రులనుకూడా చంపావు. నా తల్లి తండ్రులు దాహంతో అలమటిస్తున్నారు. నేను నీళ్లు తీసుకొని వస్తానని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని నేను ఇక్కడ బాణము తగిలి చనిపోయినట్టు వారికి తెలియదు. నా తండ్రికి నేను చనిపోయానని తెలిసినా ఏమీ చేయలేడు కదా! ఒక వృక్షమును నరుకుతుంటే పక్కన ఉన్న వృక్షము ఏమీ చేయలేనట్టు, నేను చనిపోతున్నా నా తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాడు. కాని, నా తండ్రి, నాకు ఈ దుస్థితి కలిగించిన నిన్ను, దారుణంగా శపించగలడు. అందుకని నీవు ఈ జలమును తీసుకొని పోయి నా తండ్రికి ఇచ్చి ఆయన దాహము తీర్చు. ఆయన శాంతిస్తాడు. అదుగో ఆ కనపడే కాలి బాట వెంట వెళితే మా ఆశ్రమము వస్తుంది. నీవు వెంటనే వెళ్లి మా తండ్రికి ఈ విషయం చెప్పు.
ఓ రాజా! నీవు కొట్టిన బాణము నా శరీరంలో గుచ్చుకొని చాలా బాధకలిగిస్తూ ఉంది. నీవు దానిని బయటకు లాగు. నాకు సత్వరమే మరణం ప్రసాదించు.” అని ఆ ముని కుమారుడు నాతో అన్నాడు. నేను ఆ బాణమును తీస్తే అతను వెంటనే మరణిస్తాడు. తియ్యకపోతే మరణయాతన అనుభవిస్తాడు. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను పడుతున్న బాధను గ్రహించాడు ఆ ముని కుమారుడు. కాని అప్పటికే ఆ ముని కుమారుడు బాధతో నేల మీదపడి గిలా గిలా కొట్టుకుంటున్నాడు. అంత బాధలో కూడా నాతో ఇలా అన్నాడు.
“ఓ రాజా! నీవు బ్రహ్మ హత్య చేసానని భయపడకు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడను కాను. నా తండ్రి వైశ్యుడు. నా తల్లి శూద్ర వనిత. కాబట్టి నీకు ఆభయం లేదు.” అని అంత బాధలో కూడా నా మనసుకు ఊరట కలిగించాడు. ఆ ముని కుమారుడి బాధను చూడలేక నేను అతని శరీరము నుండి బాణమును లాగేసాను. ఆ ముని కుమారుడు నా వంకే చూస్తూ ప్రాణములు విడిచాడు. నేను కొట్టిన బాణముచే మృతిచెందిన ఆ ముని కుమారుని చూచి నా మనస్సుకు చాలా బాధకలిగింది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిపంచాశః సర్గలో, విశ్వామిత్రుడు కామధేనుని పొందాలని ప్రయత్నిస్తాడు, కాని వశిష్ట మహర్షి విశ్వామిత్రుని బేరసారాలు మరియు వస్తుమార్పిడిని పట్టుదలతో నిరాకరిస్తాడు. ‘సామాన్యమైన ఆవును మాత్రమే పవిత్రంగా భావించి, అది మార్కెట్ చేయలేని వస్తువు అయినప్పుడు, ఏ కోరికనైనా పాలు చేసే శబల ఎలా ఇవ్వబడుతుంది లేదా ఇతర సంపదల కోసం ఎలా మార్చబడుతుంది…’ అనేది వశిష్ఠుని వాదన. అయినప్పటికీ, విశ్వామిత్రుడు తన బిడ్డింగ్కు వెళతాడు, కానీ ఫలించలేదు.
ఏతదేవ హి మే రాజన్వివిధాశ్చ క్రియాస్తథా |
అదోమూలాః క్రియాః సర్వా మమ రాజన్న సంశయః |
బహునా కిం ప్రలాపేన న దాస్యే కామదోహినీమ్ ||
25
Balakanda Sarga 53 In Telugu Pdf With Meaning
వసిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమ కూర్చింది. చెరకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు అడిగినవారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనము చేసారు. వసిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంత:పుర కాంతలు, వారి వెంటవచ్చిన పురోహితులు, పరివారము, అందరూ ఎంతో సంతోషించారు.
అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ ఆతిథ్యమునకు మేమందరమూ ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి లక్ష గోవులను ఇస్తాను. ఈ కామధేనువు నాకు ఇవ్వండి. ఓ మహర్షీ! ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపద అంతా రాజు యొక్క అధీనము కదా! కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి.” అని అడిగాడు.
ఆ మాటలకు వసిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు. “ఓ విశ్వామిత్రా! నీవు వందల వేల ఆవులు ఇచ్చినను, వెండి బంగారము రాసులు ఇచ్చినను. నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇది నా ప్రాణము. మా బంధము శాశ్వతము. నేను ప్రతిరోజూ చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను. ” అని చెప్పాడు వసిష్ఠుడు.
“అది కాదు మహర్షీ! ఒక్క ఆవులే కాదు. బంగారముతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి నాలుగు తెల్లని ఉత్తమాశ్వమఱులను కట్టిన 8 బంగారు రధములు ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. అంతెందుకు నీకు కోటి పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. సరే….. అదీకాకపోతే నీకు ఏం కావాలో కోరుకో….. అవి అన్నీ ఇస్తాను. రత్నములా, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో… అవన్నీ ఇస్తాను. కానీ ఈ కామధేనువును మాతం నాకు ఇవ్వు. ” అని అడిగాడు విశ్వామిత్రుడు.
“నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రము ఈ కామధేనువును నీకు ఇవ్వను. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము. నా జీవితము. ఇదే నాకు అన్ని యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకములైన క్రియలు.
నేను చేసే అన్ని యజ్ఞములకు, యాగములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత, ఎట్టి పరిస్థితులలోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వలేను… ఇవ్వను” అని చెప్పాడు వసిష్ఠుడు.
అయోధ్యాకాండ ద్విషష్ఠితమః సర్గలో మంత్రలే అత్రి మహర్షి ఇంటికి వెళ్ళి ఆధ్యాత్మికత, తపస్సు గురించి ప్రశంసలు అందుకుంటాడు. అత్రి మహర్షి, అతని భార్య అనసూయ, అతని ఆశ్రమంలో రాముడు, సీత మరియు లక్ష్మణుడిని ఆతిథ్యం ఇస్తారు. అనసూయ, సీతకు దుస్తులు మరియు ఆభరణాలు అందజేస్తుంది. ఆమె సీతకు పతివ్రత ధర్మాన్ని గురించి ఉపదేశాలు ఇస్తుంది. సీత, తన పతివ్రత ధర్మాన్ని పాటించాలని ప్రతిజ్ఞ చేస్తుంది. అందరూ కృతజ్ఞతా భావంతో ఆశ్రమం నుండి బయలుదేరి మరిన్ని అడవులలో ప్రయాణిస్తారు. ఈ సర్గ, సీత, రాముడు మరియు లక్ష్మణుడి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడాన్ని ప్రతిబింబిస్తుంది.
రాముని వియోగంతో కుమిలిపోతున్న కౌసల్య అన్న మాటలకు దశరథుడు బదులు చెప్పలేకపోయాడు. తనలో తాను దు:ఖిస్తున్నాడు. ఆ దుఃఖంలోనే దశరథునికి తాను పూర్వము చేసిన పాపము గుర్తుకు వచ్చింది. తాను వేసిన శబ్దవేది బాణముల వలన కలిగిన మహాపరాధము తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తానుచేసిన పాపము మరొకరితో పంచుకొంటేనేగాని తీరదు అని అనుకున్నాడు. కౌసల్య వంక తిరిగాడు. ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు.
“కౌసల్యా! భర్త గుణవంతుడైనా, దుర్మార్గుడైనా, సతికి పతియే కదా ప్రత్యక్ష దైవము. నీకు దుఃఖము లేదు అని నేను అనను. కాని ఎంత దు:ఖములో కూడా భర్తనైన నన్ను ఈ విధంగా తిట్టడం ధర్మమేనా! ఆలోచించు.” అని అన్నాడు.
ఆ మాటలకు కౌసల్య తన కన్నీటితోనే బదులు చెప్పింది. అలాగే దశరథుని పాదముల మీద వాలి పోయింది. ఆయన పాదములు తన కన్నీటితో అభిషేకించింది.
“మహారాజా! మీరు నన్ను వేడుకొనడం ద్వారా నన్ను మీరు ఖండ ఖండాలుగా ఖండించినట్టయింది. మిమ్మల్ని తిట్టడం ద్వారా నేను మహాపరాధమే చేసాను. కాని మీరు కోపించకుండా నన్ను అనునయిస్తున్నారు. నేను ఎంత పాపం చేసానో ఇప్పుడు నాకు అర్థం అయింది. ఓ మహారాజా! మీరు ధర్మాత్ములు అని నాకు తెలియును. నాకూ ధర్మం తెలుసు. అంత అవివేకురాలిని కాను. కానీ పుత్రశోకం తట్టుకోలేక ఆ బాధలో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను.
మహారాజా! తమరికి తెలియనిది కాదు. శోకము అన్ని అపరాథములకు మూలము. శోకసముద్రములో మునిగిన వాడికి మంచి చెడూ తెలియదు. శాస్త్రజ్ఞానము నశిస్తుంది. ధైర్యాన్ని కోల్పోతాడు. తాను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉంటాడు. శోకము మనిషికి కనపడని శత్రువు. సర్వనాశనం చేస్తుంది. ఎదురుగా ఉన్న శత్రువు కొట్టిన దెబ్బను తప్పుకోవచ్చు కానీ, మనసులో పుట్టిన చిన్నపాటి దుఃఖమును తట్టకోడం కష్టం. అన్ని ధర్మములు తెలిసినవారు, సర్వసంగపరిత్యాగులు అయిన సన్యాసులు కూడా శోకముతో కుమిలిపోవడం, మూర్ఖంగా ప్రవర్తించడం మనకు తెలుసుకదా!
ఓ మహారాజా! రాముడు మనలను విడిచిపోయి నేటికి ఐదు దినములు అయినది కానీ నాకు ఐదు సంవత్సరములు అయినట్టుంది. రాముడు మనసులో మెదిలితేనే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. ఆ శోకావేశములో ఏమేమో మాటలాడి ఉంటాను. నన్ను క్షమించండి.” అని ప్రార్థించింది కౌసల్య ఇంతలో సాయంకాలము అయింది. దశరథుడు అలాగే ఒరిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు.
శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము అరువది రెండవ భాగము సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుఃషష్టితమః సర్గలో, విష్ణుమూర్తి దశరథుని తపస్సుకు సంతృప్తి చెంది, రామునిగా అవతరించడానికి సన్నాహాలు చేస్తాడు. దశరథుని యాగం పూర్తయిన తర్వాత, అగ్నిదేవుడు ప్రత్యక్షమై, పాయసాన్ని ఆయనకు అందిస్తాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంపించి, వారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే నాలుగు కుమారులను పొందుతారు.
“ఓ రంభా! విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందరందాలతో అతనిని వశపరచుకొని అతని తపస్సు భగ్నం చేయాలి. ఇది దేవతా కార్యము. నీవు చేయాలి. తప్పదు. “అని అన్నాడు.
ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. “ఓ దేవేంద్రా! నీమాటలు మాకు శిరోధార్యము. కాని ఆ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం.” అని చెప్పింది.
దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. “రంభా! నీకేం భయం లేదు. నేను, మన్మధుడు, కోకిలల రూపంలో నీ పక్కనే ఉంటాము. సమ యానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడపనిలేదు. నీ హావభావవిలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు. నా మాట మన్నించు.” అని అన్నాడు.
రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్లింది. ఆయన ముందు నాట్యం చేసింది. ఆడింది. పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అనుకున్నాడు.
ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహము కలిగింది. ఇది అంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమాన పడ్డాడు. రంభను శపించాడు.
“తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభ పరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు పదివేల సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాపవిమోచన కలుగుతుంది.” అని శాపము, విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది.
ఇది చూచి దేవేంద్రుడు, మన్మధుడు పారిపోయారు.
తరువాత విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాప పడ్డాడు.
“అయ్యో అనవసరంగా రంభ మీద కోపించాను. శపించాను. నా తపస్సును వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను ముఖ్యంగా కోపాన్ని జయించలేక పోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంక ఎవరి మీదా కోపగించు కోకూడదు. నన్ను ఎవరు ఏమి చేసినా ఎవరి మీదా కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించువరకూ ఘోర తపస్సు చేస్తాను. ” అని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ త్రిచత్వారింశః సర్గ, “కౌసల్యాపరిదేవితమ్”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన అధ్యాయం. ఈ సర్గలో, కౌసల్యా దేవి తన కుమారుడు రాముడు వనవాసానికి వెళ్లిపోవడం వల్ల కలిగిన వియోగంతో దుఃఖంలో మునిగిపోతుంది. రాముడి లేని పరిస్థితిలో, ఆమె మనసులో ఉన్న బాధలను, ఆవేదనను వ్యక్తం చేస్తుంది. కౌసల్యా రాముడి బాల్యాన్నీ, అతని సద్గుణాలనూ, ఆమె పట్ల ఉన్న ప్రేమను తలచుకుంటూ విలపిస్తుంది. ఈ సర్గ కౌసల్యా దేవి హృదయవేదనను, ఆమె ప్రేమను, మరియు తల్లి మరియు కుమారుడి మధ్య ఉన్న బలమైన బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.
వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే కౌసల్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఆమె కూడా రాముని విడిచి ఉండలేక మనసులోనే కుమిలిపోతూ ఉంది. దశరథుని చూచి ఇలా అంది:
“మహారాజా! మన జీవితములలో కైక విషము చిలకరించి నది. ఇప్పుడు కుముసము విడిచిన పాము వలె నిగ నిగ లాడుతూ మెరిసిపోతూ ఉంది. మనకు దుఃఖంతో కుమిలిపోతున్నాము. ఓ మహారాజా! రాముని అయోధ్యనుండి వెడలగొట్టిన కైక నన్నుకూడా విడిచిపెట్టదు. నన్ను వెంటాడి వేధిస్తుంది. పాము వలె కాటేస్తుంది. కనీసము కైక రాముని అరణ్యములకు పంపకుండా తన వద్ద దాసునిగా నియమించుకొనినా కూడా ఎంతో బాగుండేది. నాకళ్ల ఎదుట నా కుమారుడు ఉండే వాడు. నాలుగు ఇళ్లలో బిక్ష తీసుకొని వచ్చి నన్ను పోషించేవాడు.
ఓ మహారాజా! నీవుమాత్రము తక్కువ చేసావా! దేవతలకు ఇవ్వవలసిన హవిస్సులను రాక్షసులకు ఇచ్చినట్టు, రామునికి ఇవ్వవలసిన రాజ్యమును భరతునికి ఇచ్చావు. ఓ మహారాజా! ఈ పాటికి నా రాముడు అడవిలోకి ప్రవేశించి ఉంటాడంటావా! సీత, లక్ష్మణుడు వెంటరాగా అడవులలో దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటాడంటావా! ఎన్నడూ కష్టములు అంటే తెలియని రాముని, సీతను లక్ష్మణుని, ఆ కైక మాటవిని అడవులకు పంపావు. వాళ్లు ఎన్ని కష్టాలు పడుతున్నారో! ఏమో! ఈ వయసులో వారు సుఖాలు అనుభవిం చాల్సింది పోయి, అరణ్యములలో అష్టకష్టాలు పడుతున్నారు. సంభక్ష్య పరమాన్నములు తినడానికి అలవాటు పడ్డవాళ్లు ఆ అడవిలో దిక్కులేని వాళ్లమాదిరి కందమూలములు ఎలా తింటున్నారో కదా!
ఓ మహారాజా! రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ అయోధ్యకు వచ్చినపుడు చూడటానికి నేను బతికి ఉంటానా! ఆ మంగళకరమైన దృశ్యము కళ్లారా చూడగలనా! రామలక్ష్మణులు తిరిగి రాగానే అయోధ్య అంతా పౌర్ణమి నాటి సముద్రము మాదిరి ఎంత ఉప్పొంగిపోతుందోకదా! రాముడు సీతను రథము మీద తన పక్కన కూర్చుండపెట్టుకొని ఎప్పుడు అయోధ్యలో ప్రవేశిస్తాడో కదా! సీతారామలక్ష్మణులు అయోధ్యలోకి ప్రవేశిస్తుంటే అయోధ్యా ప్రజలు వారి మీద పూలు, లాజలు, చల్లే దృశ్యము ఎప్పుడు కనపడుతుందోకదా! అయోధ్యలోకి ప్రవేశించేముందు సీతారాములు అయోధ్య పట్టణమునకు ప్రదక్షిణము చేస్తూ కన్యలకు, బ్రాహ్మణులకు కానుకలు ఇచ్చే దృశ్యము ఎన్నడు చూస్తానో కదా!
ఓ మహారాజా! రాముడు ఈ పధ్నాలుగుసంవత్సరములు అరణ్యములలో మునుల వద్ద ఉండి ఎన్నో ధర్మములు,శాస్త్రములు నేర్చుకొని బుద్ధి పరిణతిచెంది వస్తాడేమో కాని నా రాముడు నాకు మాత్రం ఆడుకునే మూడేళ్ల చంటి వాడి మాదిరి గానే ఉంటాడు. రాముడు రాగానే నేను వాడితో ఆడుకుంటాను. మీరు కాదనకూడదు. అసలు నాకు ఈ పుత్రవియోగము కలగడానికి కారణం నేను ఏజన్మలోనో పాలు తాగే దూడలు వాటి తల్లుల వద్ద పాలుతాగడానికి పోయినపుడు నేను ఆ ఆవుల స్తన్యములను కోసివేసి ఉంటాను. అందుకనే నాకు ఇలాంటి దుర్గతి కలిగింది.
ఓ మహారాజా! నేను గోవునైతే నా రాముడు గోవత్సము. అట్టి మా ఇద్దరినీ సింహము వంటి కైక వేరు చేసినది. ఆ పాపము ఊరికే పోదు. ఓ మహారాజా! నా రాముని విడిచి నేనుజీవించడం కల్ల. ఇంక ఒక్కరోజుకూడా రాముని లేకుండా నేను జీవించడం నా వల్ల కాదు. ఆ శక్తి నాకు లేదు. ఎందు కంటే దావానలము అరణ్యమును కాల్చివేసి నట్టు, పుత్రశోకము అనే అగ్ని నన్ను అనునిత్యమూ దహించి వేస్తూ ఉంది. ఆ అగ్నిలో నేను కాలి బూడిద అవడం తథ్యం.” అని భోరు భోరున ఏడుస్తూ ఉంది కౌసల్య.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకపంచాశః సర్గలో, తన తండ్రి గౌతముడు తన తల్లి అహల్యతో తిరిగి కలవడం గురించి ఆరా తీస్తూ, శతానంద మహర్షి విశ్వామిత్రుని పురాణాన్ని వివరిస్తాడు. విశ్వామిత్రుడు ఒకానొక సమయంలో గొప్ప రాజుగా ఉన్నప్పుడు, అనేక స్వీయ-ముఖ్యమైన దోపిడీల ద్వారా సంపాదించిన విశ్వామిత్రుని యొక్క నిజాయితీకి కట్టుబడి ఉన్నందుకు శతానంద రాముడిని అభినందించాడు. విశ్వామిత్రుని జీవిత చరిత్రను రాముడికి తెలియజేయడంలో శతానంద విలువైనది, ఎందుకంటే విశ్వామిత్రుడు చేసినట్లుగా రాజులను అతిగా భరించడం రాజులకు అననుకూలంగా ఉంటుంది.
జనకుని పక్కను ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానంద భరితుడు అయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు.
“ ఓ మహర్షీ! శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా! నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా! మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా! దైవము ప్రతికూలించడం వలన మా తల్లి గారికి జరిగిన దురదృష్టము గురించి వివరంగా చెప్పావా! రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్లినదా! మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరిం చాడా! నా తండ్రి అయిన గౌతముడు శ్రీ రాముని పూజించాడా! అతిధి సత్కారములు చేసాడా! శ్రీ రాముడు నా తండ్రిని ఆదరించాడా! గౌరవించాడా! మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా!” అని శతానందుడఱు ఆతురతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు.
ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు. “ఓ శతానందా! నేను చెప్పవలసినది అంతా రామునికి చెప్పాను. చేయవలసినది అంతా చేసాను. రేణుకా దేవి జమదగ్నిని చేరి నట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినది.” అని విశ్వామిత్రుడు శతానందునితో అన్నాడు.
ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు. “శ్రీ రామా! సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతము. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. వీరి సాంగత్యము చే నీవు ధన్యుడవు అయ్యావు. విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను.
ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు. చక్రవర్తి. ధర్మవేత్త. సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేసాడు. వీరి వంశము గురించి చెబుతాను విను.
ప్రజాపతి పుత్రుడు కుశుడు. ఆ కుశుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుని కుమారుడు గాధి. ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయనను గాధేయుడు అని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసాడు. ఒక అక్షౌహిణీ సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేసాడు. అందరు రాజులను ఓడించాడు.
ఆ ప్రకారంగా నగరములు, అరణ్యములు. ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వసిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు. వసిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు, ఫల వృక్షములతో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో మంది దేవ ఋషులు, దేవతలు, బ్రహ్మ ఋషులు వసిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమమునకు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఉన్నవారికి ఈర్ష్య ద్వేషములు, కోప తాపములు అసూయ లేవు. వాలఖిల్యులూ, వైఖానసులు, ఋషులు జపములు, హోమములు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొంత మంది ఫలములనే ఆహారము తీసుకుంటూ, కొంత మందికేవలము నీరు తాగుతూ మరి కొంత మంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఎటుచూచినా పవిత్రత ప్రశాంతత వెల్లి విరుస్తూ ఉండేది. అటువంటి ప్రశాంత వాతావరణము లో ఉన్న వసిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు.