Balakanda Sarga 32 In Telugu – బాలకాండ ద్వాత్రింశః సర్గః

Balakanda Sarga 32 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వాత్రింశః సర్గలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యకు చేరిన తరువాత జరిగే సంఘటనలు వివరించబడ్డాయి. దశరథ మహారాజు వారిని సంతోషంగా స్వాగతిస్తాడు. కైకేయి, సుమిత్ర, కౌసల్యలు సీతను తమ కోడలిగా ఆహ్వానిస్తారు. రామ-సీతల వివాహానికి ప్రజలు ఆనందంతో మురిసిపోతారు. ఈ సందర్భంలో, దశరథుడు తన సింహాసనాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయిస్తాడు.

కుశనాభకన్యోపాఖ్యానమ్

బ్రహ్మయోనిర్మహానాసీత్కుశో నామ మహాతపాః |
అక్లిష్టవ్రతధర్మజ్ఞః సజ్జనప్రతిపూజకః ||

1

స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్ |
వైదర్భ్యాం జనయామాస చతురః సదృశాన్సుతాన్ ||

2

కుశాంబం కుశనాభం చ అధూర్తరజసం వసుమ్ |
దీప్తియుక్తాన్మహోత్సాహాన్ క్షత్రధర్మచికీర్షయా ||

3

తానువాచ కుశః పుత్రాన్ధర్మిష్ఠాన్సత్యవాదినః |
క్రియతాం పాలనం పుత్రా ధర్మం ప్రాప్స్యథ పుష్కలమ్ ||

4

కుశస్య వచనం శ్రుత్వా చత్వారో లోకసంమతాః |
నివేశం చక్రిరే సర్వే పురాణాం నృవరాస్తదా ||

5

కుశాంబస్తు మహాతేజాః కౌశాంబీమకరోత్పురీమ్ |
కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయమ్ ||

6

అధూర్తరజసో రామ ధర్మారణ్యం మహీపతిః |
చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరివ్రజమ్ ||

7

ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః |
ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతతః ||

8

సుమాగధీ నదీ పుణ్యా మగధాన్విశ్రుతా యయౌ |
పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే ||

9

సైషా హి మాగధీ రామ వసోస్తస్య మహాత్మనః |
పూర్వాభిచరితా రామ సుక్షేత్రా సస్యమాలినీ ||

10

కుశనాభస్తు రాజర్షిః కన్యాశతమనుత్తమమ్ |
జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునందన ||

11

తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలంకృతాః |
ఉద్యానభూమిమాగమ్య ప్రావృషీవ శతహ్రదాః ||

12

గాయంత్యో నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ సర్వశః |
ఆమోదం పరమం జగ్ముర్వరాభరణభూషితాః ||

13

అథ తాశ్చారుసర్వాంగ్యో రూపేణాప్రతిమా భువి |
ఉద్యానభూమిమాగమ్య తారా ఇవ ఘనాంతరే ||

14

తాః సర్వగుణసంపన్నా రూపయౌవనసంయుతాః |
దృష్ట్వా సర్వాత్మకో వాయురిదం వచనమబ్రవీత్ ||

15

అహం వః కామయే సర్వా భార్యా మమ భవిష్యథ |
మానుషస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ ||

16

చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః |
అక్షయం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ ||

17

తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్టకర్మణః |
అపహాస్య తతో వాక్యం కన్యాశతమథాబ్రవీత్ ||

18

అంతశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ |
ప్రభావజ్ఞాశ్చ తే సర్వాః కిమస్మానవమన్యసే ||

19

కుశనాభసుతాః సర్వాః సమర్థాస్త్వాం సురోత్తమ |
స్థానాచ్చ్యావయితుం దేవం రక్షామస్తు తపో వయమ్ ||

20

మా భూత్స కాలో దుర్మేధః పితరం సత్యవాదినమ్ |
నావమన్యస్వ ధర్మేణ స్వయం‍వరముపాస్మహే ||

21

పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి నః |
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||

22

తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః |
ప్రవిశ్య సర్వగాత్రాణి బభంజ భగవాన్ప్రభుః ||

23

తాః కన్యా వాయునా భగ్నా వివిశుర్నృపతేర్గృహమ్ |
ప్రాపతన్భువి సంభ్రాంతాః సలజ్జాః సాశ్రులోచనాః ||

24

స చ తా దయితా దీనాః కన్యాః పరమశోభనాః |
దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాంత ఇదమబ్రవీత్ ||

25

కిమిదం కథ్యతాం పుత్ర్యః కో ధర్మమవమన్యతే |
కుబ్జాః కేన కృతాః సర్వా వేష్టంత్యో నాభిభాషథ |
ఏవం రాజా వినిశ్వస్య సమాధిం సందధే తతః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్వాత్రింశః సర్గః ||

Balakanda Sarga 32 Meaning In Telugu

” ఓ రామా! పూర్వము కుశుడు అనే మహా తపస్వి ఉండే వాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసిన వాడు. మంచి వాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య వారికి నలుగురు కుమారులు. వారిపేర్లు కుశాంబుడు. కుశనాభుడు. అధూర్తజసుడు. వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు. సుగుణ వంతులు.

ఆయనకు రాజ్యపాలన చేయవలెనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నాడు. ” ఓ పుత్రులారా! మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి.” అని అన్నాడు.

తండ్రి మాటను అనుసరించి ఆ నలుగురూ జనపదములను నిర్మించారు.

కుశాంబుని చేత నిర్మింప బడిన నగరము పేరు కౌశాంబి.

కుశనాధుని చేత నిర్మింప బడిన నగరము పేరు మహోదయము.

అధూర్త రజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము.

వసువు నిర్మించిన నగరము పేరు గిరివ్రజపురము.

మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురము భూమి. దీని చుట్టూ ఐదు పర్వతములు ఉన్నాయి. మగధ దేశములో పుట్టిన శోణ నది ఈ ఐదు పర్వతముల మధ్య ప్రవహించుచున్నది. ఈ శోణ నది తూర్పునుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరీవాహక ప్రాంతము అన్నీ సస్యశ్యామలములైన పంట పొలాలతో నిండి ఉన్నాయి.

కుశనాభుని భార్య ఘృతాచి. వారికి నూర్గురు కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్య వతులు. వారికి యుక్త వయసు వచ్చింది.

ఒకరోజు ఆ కన్యలందరూ వన విహారము చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు. “నేను వాయుదేవుడను. నేను మీ అందరనూ వివాహమాడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వము సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యౌవనము కొద్ది కాలమే ఉంటుంది. కాని మా దేవతలు నిత్య యౌవనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి.” అని అన్నాడు వాయుదేవుడు.

ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు.

” ఓ వాయుదేవా! నీవు సకల జీవరాసులలో సంచరిస్తుంటావు. అందరికీ ప్రాణ దాతవు. నీ శక్తి మాకు తెలుసు. కాని నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు కాని మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రు లము కాము. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు ఈ లోకంలో ఏ కన్యకూడా తల్లి తండ్రుల మాటను జవదాటే దుస్థితి కలుగకుండు గాక! మాకు మా తండ్రి ప్రభువు. దైవము. మా తండ్రి మమ్ములను ఎవరికి ఇచ్చి వివాహము చేస్తాడో వారినో మేము వివాహము చేసుకుంటాము.” అని చెప్పారు ఆ కన్యలు.

వారి మాటలకు వాయుదేవునకు కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములు అన్నీ బలము లేకుండా చేసాడు. ఏ మాత్రం బలము లేని ఆ కన్యలు ఎలాగోలాగ అంత:పురము చేరుకున్నారు. కిందపడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు.

వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తె ల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు.

” ఓ పుత్రికలారా! ఏమిజరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది. దీనికి కారణం ఎవరు.” అని అడిగాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ త్రయస్త్రింశః సర్గః (33) >>

Ayodhya Kanda Sarga 32 In Telugu – అయోధ్యాకాండ ద్వాత్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 32

అయోధ్యాకాండ ద్వాత్రింశ సర్గ రామాయణంలో కీలక ఘట్టం. ఈ సర్గలో భరతుడు, కైకేయి కుమారుడు, రాముడిని తిరిగి తీసుకురావడానికి చింతించడాన్ని వివరిస్తుంది. భరతుడు తన తల్లి కైకేయి చేసిన తప్పును తెలుసుకుని, దాని ఫలితంగా తండ్రి దశరథుని మరణం మరియు రాముడు అడవికి వెళ్లడం కారణంగా దుఃఖంలో మునిగిపోతాడు. అతను రాముడిని తిరిగి తీసుకురావడం కోసం దండకారణ్యానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఈ సర్గలో భరతుడు తన ధర్మం, కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటాడు. రాముడి పట్ల తన ప్రేమను మరియు సత్కారాన్ని వ్యక్తం చేస్తాడు. భరతుని కృతజ్ఞత, పాశ్చాత్యత్వం మరియు కుటుంబానుబంధాలు ప్రధాన అంశాలుగా ఉంటాయి.

విత్తవిశ్రాణనమ్

తతః శాసనమాజ్ఞాయ భ్రాతుః శుభతరం ప్రియమ్ |
గత్వా స ప్రవివేశాశు సుయజ్ఞస్య నివేశనమ్ || ౧ ||

తం విప్రమగ్న్యగారస్థం వందిత్వా లక్ష్మణోఽబ్రవీత్ |
సఖేఽభ్యాగచ్ఛ పశ్య త్వం వేశ్మ దుష్కరకారిణః || ౨ ||

తతః సంధ్యాముపాస్యాశు గత్వా సౌమిత్రిణా సహ |
జుష్టం తత్ప్రావిశల్లక్ష్మ్యా రమ్యం రామనివేశనమ్ || ౩ ||

తమాగతం వేదవిదం ప్రాంజలిః సీతయా సహ |
సుయజ్ఞమభిచక్రామ రాఘవోఽగ్నిమివార్చితమ్ || ౪ ||

జాతరూపమయైర్ముఖ్యైరంగదైః కుండలైః శుభైః |
సహేమసూత్రైర్మణిభిః కేయూరైర్వలయైరపి || ౫ ||

అన్యైశ్చ రత్నైర్బహుభిః కాకుత్స్థః ప్రత్యపూజయత్ |
సుయజ్ఞం స తదోవాచ రామః సీతాప్రచోదితః || ౬ ||

హారం చ హేమసూత్రం చ భార్యాయై సౌమ్య హారయ |
రశనాం చాధునా సీతా దాతుమిచ్ఛతి తే సఖే || ౭ ||

అంగదాని విచిత్రాణి కేయూరాణి శుభాని చ |
ప్రయచ్ఛతి సఖే తుభ్యం భార్యాయై గచ్ఛతీ వనమ్ || ౮ ||

పర్యంకమగ్ర్యాస్తరణం నానారత్నవిభూషితమ్ |
తమపీచ్ఛతి వైదేహీ ప్రతిష్ఠాపయితుం త్వయి || ౯ ||

నాగః శత్రుంజయో నామ మాతులోఽయం దదౌ మమ |
తం తే గజసహస్రేణ దదామి ద్విజపుంగవ || ౧౦ ||

ఇత్యుక్తః స హి రామేణ సుయజ్ఞః ప్రతిగృహ్య తత్ |
రామలక్ష్మణసీతానాం ప్రయుయోజాఽశిషః శుభాః || ౧౧ ||

అథ భ్రాతరమవ్యగ్రం ప్రియం రామః ప్రియంవదః |
సౌమిత్రిం తమువాచేదం బ్రహ్మేవ త్రిదశేశ్వరమ్ || ౧౨ ||

అగస్త్యం కౌశికం చైవ తావుభౌ బ్రాహ్మణోత్తమౌ |
అర్చయాహూయ సౌమిత్రే రత్నైః సస్యమివాంబుభిః || ౧౩ ||

తర్పయస్వ మహాబాహో గోసహస్రైశ్చ మానద |
సువర్ణై రజతైశ్చైవ మణిభిశ్చ మహాధనైః || ౧౪ ||

కౌసల్యాం చ సుమిత్రాం చ భక్తః పర్యుపతిష్ఠతి | [య ఆశీర్భిః]
ఆచార్యస్తైత్తిరీయాణామభిరూపశ్చ వేదవిత్ || ౧౫ ||

తస్య యానం చ దాసీశ్చ సౌమిత్రే సంప్రదాపయ |
కౌశేయాని చ వస్త్రాణి యావత్తుష్యతి స ద్విజః || ౧౬ ||

సూతశ్చిత్రరథశ్చార్యః సచివః సుచిరోషితః |
తోషయైనం మహార్హైశ్చ రత్నైర్వస్త్రైర్ధనైస్తథా || ౧౭ ||

పశుకాభిశ్చ సర్వాభిర్గవాం దశశతేన చ |
యే చేమే కఠకాలాపా బహవో దండమాణవాః || ౧౮ ||

నిత్యస్వాధ్యాయశీలత్వాన్నాన్యత్కుర్వంతి కించన |
అలసాః స్వాదుకామాశ్చ మహతాం చాపి సమ్మతాః || ౧౯ ||

తేషామశీతియానాని రత్నపూర్ణాని దాపయ |
శాలివాహసహస్రం చ ద్వే శతే భద్రకాంస్తథా || ౨౦ ||

వ్యంజనార్థం చ సౌమిత్రే గోసహస్రముపాకురు |
మేఖలీనాం మహాసంఘః కౌసల్యాం సముపస్థితః || ౨౧ ||

తేషాం సహస్రం సౌమిత్రే ప్రత్యేకం సంప్రదాపయ |
అంబా యథా చ సా నందేత్కౌసల్యామమ దక్షిణామ్ || ౨౨ ||

తథా ద్విజాతీంస్తాన్సర్వాంల్లక్ష్మణార్చయ సర్వశః |
తతః స పురుషవ్యాఘ్రస్తద్ధనం లక్ష్మణః స్వయమ్ || ౨౩ ||

యథోక్తం బ్రాహ్మణేంద్రాణామదదాద్ధనదో యథా |
అథాబ్రవీద్బాష్పకలాంస్తిష్ఠతశ్చోపజీవినః || ౨౪ ||

సంప్రదాయ బహుద్రవ్యమేకైకస్యోపజీవనమ్ |
లక్ష్మణస్య చ యద్వేశ్మ గృహం చ యదిదం మమ || ౨౫ ||

అశూన్యం కార్యమేకైకం యావదాగమనం మమ |
ఇత్యుక్త్వా దుఃఖితం సర్వం జనం తముపజీవినమ్ || ౨౬ ||

ఉవాచేదం ధనాధ్యక్షం ధనమానీయతామితి |
తతోఽస్య ధనమాజహ్రుః సర్వమేవోపజీవినః || ౨౭ ||

స రాశిః సుమహాంస్తత్ర దర్శనీయో హ్యదృశ్యత |
తతః స పురుషవ్యాఘ్రస్తద్ధనం సహలక్ష్మణః || ౨౮ ||

ద్విజేభ్యో బాలవృద్ధేభ్యః కృపణేభ్యో హ్యదాపయత్ |
తత్రాసీత్పింగలో గార్గ్యస్త్రిజటో నామ వై ద్విజః || ౨౯ ||

ఉంఛవృత్తిర్వనే నిత్యం ఫాలకుద్దాలలాంగలీ |
తం వృద్ధం తరుణీ భార్యా బాలానాదాయ దారకాన్ || ౩౦ ||

అబ్రవీద్బ్రాహ్మణం వాక్యం దారిద్ర్యేణాభిపీడితా |
అపాస్య ఫాలం కుద్దాలం కురుష్వ వచనం మమ || ౩౧ ||

రామం దర్శయ ధర్మజ్ఞం యది కించిదవాప్స్యసి |
భార్యాయా వచనం శ్రుత్వా శాటీమాచ్ఛాద్య దుశ్ఛదామ్ || ౩౨ || [స భార్యా]

స ప్రాతిష్ఠత పంథానం యత్ర రామనివేశనమ్ |
భృగ్వంగిరసమం దీప్త్యా త్రిజటం జనసంసది || ౩౩ ||

ఆ పంచమాయాః కక్ష్యాయా నైనం కశ్చిదవారయత్ |
స రాజపుత్రమాసాద్య త్రిజటో వాక్యమబ్రవీత్ || ౩౪ ||

నిర్ధనో బహుపుత్రోఽస్మి రాజపుత్ర మహాయశః |
ఉంఛవృత్తిర్వనే నిత్యం ప్రత్యవేక్షస్వ మామితి || ౩౫ ||

తమువాచ తతో రామః పరిహాససమన్వితమ్ |
గవాం సహస్రమప్యేకం న తు విశ్రాణితం మయా || ౩౬ ||

పరిక్షిపసి దండేన యావత్తావదవాప్య్ససి |
స శాటీం త్వరితః కట్యాం సంభ్రాంతః పరివేష్ట్య తామ్ || ౩౭ ||

ఆవిద్ధ్య దండం చిక్షేప సర్వప్రాణేన వేగితః |
స తీర్త్వా సరయూపారం దండస్తస్య కరాచ్చ్యుతః || ౩౮ ||

గోవ్రజే బహుసాహస్రే పపాతోక్షణసన్నిధౌ |
తం పరిష్వజ్య ధర్మాత్మా ఆ తస్మాత్సరయూతటాత్ || ౩౯ ||

ఆనయామాస తా గోపైస్త్రిజటాయాశ్రమం ప్రతి |
ఉవాచ చ తతో రామస్తం గార్గ్యమభిసాంత్వయన్ |
మన్యుర్న ఖలు కర్తవ్యః పరిహాసో హ్యయం మమ || ౪౦ ||

ఇదం హి తేజస్తవ యద్దురత్యయం
తదేవ జిజ్ఞాసితుమిచ్ఛతా మయా |
ఇమం భవానర్థమభిప్రచోదితో
వృణీష్వ కిం చేదపరం వ్యవస్యతి || ౪౧ ||

బ్రవీమి సత్యేన న తేఽస్తి యంత్రణా
ధనం హి యద్యన్మమ విప్రకారణాత్ |
భవత్సు సమ్యక్ర్పతిపాదనేన త-
-న్మయాఽఽర్జితం ప్రీతియశస్కరం భవేత్ || ౪౨ ||

తతః సభార్యస్త్రిజటో మహాముని-
-ర్గవామనీకం ప్రతిగృహ్య మోదితః |
యశోబలప్రీతిసుఖోపబృంహణీ-
-స్తదాఽఽశిషః ప్రత్యవదన్మహాత్మనః || ౪౩ ||

స చాపి రామః ప్రతిపూర్ణమానసో
మహద్ధనం ధర్మబలైరుపార్జితమ్ |
నియోజయామాస సుహృజ్జనేఽచిరా-
-ద్యథార్హసమ్మానవచఃప్రచోదితః || ౪౪ ||

ద్విజః సుహృద్భృత్యజనోఽథవా తదా
దరిద్రభిక్షాచరణశ్చ యోఽభవత్ |
న తత్ర కశ్చిన్న బభూవ తర్పితో
యథార్హసమ్మాననదానసంభ్రమైః || ౪౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వాత్రింశః సర్గః || ౩౨ ||

Ayodhya Kanda Sarga 32 Meaning In Telugu

అన్నగారి ఆదేశము మేరకు లక్ష్మణుడు వసిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుని ఇంటికి వెళ్లాడు. అప్పుడు సుయజ్ఞుడు అగ్నికార్యము చేసుకుంటున్నాడు. అతనిని చూచి లక్ష్మణుడు ఇలా అన్నాడు. “మిత్రమా! రాముడు నిన్ను తీసుకొని రమ్మన్నాడు. రాముడు ఏంచేస్తున్నాడో నువ్వే స్వయంగా వచ్చి చూడు.”అని అన్నాడు లక్ష్మణుడు.

సుయజ్ఞుడు అగ్ని కార్యమును, సంధ్యావందనమును ముగించుకొని లక్ష్మణుని వెంట రాముని మందిరమునకు వెళ్లాడు. సుయజ్ఞుని చూడగానే రాముడు లేచి అతనికి దగ్గరగా వచ్చాడు. సీతను కూడా రమ్మన్నాడు. సీతారాములు సుయజ్ఞుని చుట్టూ తిరిగి నమస్కారము చేసారు. తన దగ్గర ఉన్న ఆభరణములు, ధనము సుయజ్ఞునికి ఇచ్చాడు. ఇంకా ఇలా అన్నాడు.

నా “మిత్రమా! నేను నాభార్య అరణ్యములకుపోతున్నాము. నేను నా ఆభరణములు అన్నీ నీకు ఇచ్చాను. సీత కూడా తనవద్ద ఉన్న ఆభరణములను నీ భార్యకు ఇవ్వవలెనని అనుకుంటూ ఉన్నది. దయతో స్వీకరించు. అవే కాకుండా నేను నాకు నా మేనమామ ఇచ్చిన ఏనుగులు కూడా నీకు ఇస్తున్నాను. స్వీకరించు.” అని అన్నాడు.

సుయజ్ఞుడు సీతారాములు ఇచ్చినవి అన్నీ స్వీకరించి సీతారాములను ఆశీర్వదించాడు. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఇప్పుడు నువ్వు బ్రాహ్మణోత్తములైన అగస్త్యుని, కౌశికునీ పిలిపించి వారిని అర్చించి వారికి నీ వద్ద ఉన్న అమూల్య ఆభరణములు, రత్నములు వారికి దానంగా ఇవ్వు. తరువాత తైత్తిరీయ ఆచార్యులను, వేద పండితులను మనము లేని సమయములో మనతల్లులకు ప్రతిరోజూ ఆశీర్వచనములను అందించే బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి ధన, కనక, వస్తు వాహనములను దానముగా ఇమ్ము. మన తండ్రి గారికి అనుకూలుడైన మంత్రి చిత్రరథుడు మన ఇంట్లోనే ఉ న్నాడు. అతడిని పిలిపించి అతనికి కూడా రత్మములు, వస్త్రములు, వాహనములు దానముగా ఇమ్ము. మన వేదపాఠశాలలలో నిత్యము వేదమును నేర్చుకొను విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా రథములు, వాహనములు, గోవులను, రుచికరమైన మంచి మంచి ఆహార పదార్థములను దానంగా ఇమ్ము. ఇంకా మన తల్లులు సంతోష పడేట్టు వారు ఎవరికి దానం చెయ్యమంటే వారికి దానములుచెయ్యి. మన తల్లుల సంతోషమే మనకు ముఖ్యం.” అని అన్నాడు రాముడు.

రాముడు ఆదేశించి నట్టు లక్ష్మణుడు దానములు విరివిగా చేసాడు. రాముడు కూడా అప్పటి వరకూ తనకు సేవచేస్తూ తనను అనుసరించి ఉన్న సేవకులకు అపారంగా ధనాన్ని పంచిపెట్టాడు.

“సేవకులారా! నేను లక్ష్మణుడు తిరిగి వచ్చువరకూ మా మందిరములను జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వీటిలో మేము ఉన్నట్టే సుయజ్ఞుడు సీతారాములు ఇచ్చినవి అన్నీ స్వీకరించి సీతారాములను ఆశీర్వదించాడు.

తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఇప్పుడు నువ్వు బ్రాహ్మణోత్తములైన అగస్త్యుని, కౌశికునీ పిలిపించి వారిని అర్చించి వారికి నీ వద్ద ఉన్న అమూల్య ఆభరణములు, రత్నములు వారికి దానంగా ఇవ్వు. తరువాత తైత్తిరీయ ఆచార్యులను, వేద పండితులను మనము లేని సమయములో మనతల్లులకు ప్రతిరోజూ ఆశీర్వచనములను అందించే బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి ధన, కనక, వస్తు వాహనములను దానముగా ఇమ్ము. మన తండ్రి గారికి అనుకూలుడైన మంత్రి చిత్రరథుడు మన ఇంట్లోనే ఉ న్నాడు. అతడిని పిలిపించి అతనికి కూడా రత్మములు, వస్త్రములు, వాహనములు దానముగా ఇమ్ము. మన వేదపాఠశాలలలో నిత్యము వేదమును నేర్చుకొను విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా రథములు, వాహనములు, గోవులను, రుచికరమైన మంచి మంచి ఆహార పదార్థములను దానంగా ఇమ్ము. ఇంకా మన తల్లులు సంతోష పడేట్టు వారు ఎవరికి దానం చెయ్యమంటే వారికి దానములుచెయ్యి. మన తల్లుల సంతోషమే మనకు ముఖ్యం.” అని అన్నాడు రాముడు.
రాముడు ఆదేశించి నట్టు లక్ష్మణుడు దానములు విరివిగా చేసాడు. రాముడు కూడా అప్పటి వరకూ తనకు సేవచేస్తూ తనను అనుసరించి ఉన్న సేవకులకు అపారంగా ధనాన్ని పంచిపెట్టాడు.

“సేవకులారా! నేను లక్ష్మణుడు తిరిగి వచ్చువరకూ మా మందిరములను జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వీటిలో మేము ఉన్నట్టే అందరూ అనుకోవాలి. అలాగా వీటిని అనుదినమూ శుభ్రం చేసి దీపములు వెలిగించి ఉంచండి.” అని ఆదేశించాడు. తరువాత రాముడు లక్ష్మణుడు కలిసి అపార మైన ధనమును బ్రాహ్మణులకు బాలురకు వృద్ధులకు పంచిపెట్టారు.

ఆ సమయంలో అయోధ్యలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారు. కానీ కడుపేదవాడు. అడవులలో కందమూలములు తవ్వుకొని జీవిస్తూ ఉండేవాడు. రాముడు దానములు చేస్తున్నాడని విని అతని భార్య అతనితో ఇలా అంది. “రాముడు దానములు విరివిగా చేస్తున్నాడట. మీరుకూడా వెళ్లి ఏమైనా అడగండి.” అని త్రిజటుని రాముని వద్దకు పంపింది. త్రిజటుడు రాముని వద్దకు వెళ్లాడు. తన పరిస్థితి గురించి చెప్పి ఏమైనా దానం చెయ్యమని అడిగాడు. అప్పుడు రాముడు అతనితో ఇలాఅన్నాడు. “నేను ఇప్పటి దాకా గోదానము చెయ్యలేదు. నువ్వు నీ చేతిలో ఉన్న గునపమును ఎంత దూరము విసరగలవో అంత దూరము పట్టే గోవులను నీకు ఇస్తాను.” అని అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న చిన్నగునపమును బలంగా విసిరాడు. అది సరయూ నదీ తీరంలో వెళ్లి పడింది. రాముడు అంతమేరా పట్టే ఆవులను త్రిజటునికి దానంగా ఇచ్చాడు.

“ఓ బ్రాహ్మణోత్తమా! ఏదో పరిహాసమునకు మిమ్ములను గునపము విసరమన్నాను. నా అజ్ఞానానికి మన్నించండి. మీకు ఇంకా ఏమి కావాలో కోరుకోండి. నేను నా ధనమును అంతా బ్రాహ్మణులకు దానంగా ఇస్తున్నాను. ఇంత అని నియమము లేదు. నీ ఇష్టం వచ్చినంత కోరుకో” అని అన్నాడు రాముడు.

“రామా! నాకు ఇవి చాలు. ఇంక ఏమీ అక్కరలేదు.” అని రాముని ఆశీర్వదించాడు. తరువాత రాముడు తనవద్ద ఇంకా మిగిలిన ధనమును అంతా తన మిత్రులకు దానంగా ఇచ్చాడు. ఆ సమయంలో రాముని చేతిమీదుగా దానం తీసుకోని వాడు అయోధ్యలో లేడు అంటే అతిశయోక్తిలేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రయస్త్రింశః సర్గః (౩౩) >>

Ayodhya Kanda Sarga 31 in Telugu – అయోధ్యాకాండ ఏకత్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 31

రామాయణం యొక్క అయోధ్యాకాండలో ఏకత్రింశ సర్గ రాముడి తన పుత్రుడు రాముడు, సీత మరియు లక్ష్మణుడు అడవికి వెళ్ళిన దుఃఖంతో ఉన్న రాజా దశరథుడు, తన గత దోషాలపై పశ్చాత్తాపం చెంది, కౌసల్యకి తన కథను చెప్పడం గురించి ఉంటుంది. ఆయన గతంలో శ్రవణ కుమారుడిని పొరపాటున వేట వేస్తూ, అతని తల్లిదండ్రులకు దుఃఖం కలిగించాడని చెప్పడం కీలకం. దశరథుడు తన కర్మ ఫలం గా ఇప్పుడు రాముడిని వదలవలసి వచ్చింది. ఈ సర్గలో దశరథుని దుఃఖం, పశ్చాత్తాపం మరియు రాముడి గురించి వేదనను వ్యక్తం చేస్తుంది. ఈ సంఘటనలు దశరథుని మరణానికి దారితీస్తాయి, రాజ్యం లో విషాదం నెలకొల్పుతుంది.

లక్ష్మణవనానుగమనభ్యనుజ్ఞా

ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణః పూర్వమాగతః |
బాష్పపర్యాకులముఖః శోకం సోఢుమశక్నువన్ || ౧ ||

స భ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందనః |
సీతామువాచాతియశా రాఘవం చ మహావ్రతమ్ || ౨ ||

యది గంతుం కృతా బుద్ధిర్వనం మృగగజాయుతమ్ |
అహం త్వాఽనుగమిష్యామి వనమగ్రే ధనుర్ధరః || ౩ ||

మయా సమేతోఽరణ్యాని బహూని విచరిష్యసి |
పక్షిభిర్మృగయూథైశ్చ సంఘుష్టాని సమంతతః || ౪ ||

న దేవలోకాక్రమణం నామరత్వమహం వృణే |
ఐశ్వర్యం వాఽపి లోకానాం కామయే న త్వయా వినా || ౫ ||

ఏవం బ్రువాణః సౌమిత్రిర్వనవాసాయ నిశ్చితః |
రామేణ బహుభిః సాంత్వైర్నిషిద్ధః పునరబ్రవీత్ || ౬ ||

అనుజ్ఞాతశ్చ భవతా పూర్వమేవ యదస్మ్యహమ్ |
కిమిదానీం పునరిదం క్రియతే మే నివారణమ్ || ౭ ||

యదర్థం ప్రతిషేధో మే క్రియతే గంతుమిచ్ఛతః |
ఏతదిచ్ఛామి విజ్ఞాతుం సంశయో హి మమానఘ || ౮ ||

తతోఽబ్రవీన్మహాతేజా రామో లక్ష్మణమగ్రతః |
స్థితం ప్రాగ్గామినం వీరం యాచమానం కృతాంజలిమ్ || ౯ ||

స్నిగ్ధో ధర్మరతో వీరః సతతం సత్పథే స్థితః |
ప్రియః ప్రాణసమో వశ్యో భ్రాతా చాసి సఖా చ మే || ౧౦ ||

మయాఽద్య సహ సౌమిత్రే త్వయి గచ్ఛతి తద్వనమ్ |
కో భరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్వినీమ్ || ౧౧ ||

అభివర్షతి కామైర్యః పర్జన్యః పృథివీమివ |
స కామపాశపర్యస్తో మహాతేజా మహీపతిః || ౧౨ ||

సా హి రాజ్యమిదం ప్రాప్య నృపస్యాశ్వపతేః సుతా |
దుఃఖితానాం సపత్నీనాం న కరిష్యతి శోభనమ్ || ౧౩ ||

న స్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాం చ సుదుఃఖితామ్ |
భరతో రాజ్యమాసాద్య కైకేయ్యాం పర్యవస్థితః || ౧౪ ||

తామార్యాం స్వయమేవేహ రాజానుగ్రహణేన వా |
సౌమిత్రే భర కౌసల్యాముక్తమర్థమిమం చర || ౧౫ ||

ఏవం మమ చ తే భక్తిర్భవిష్యతి సుదర్శితా |
ధర్మజ్ఞ గురుపూజాయాం ధర్మశ్చాప్యతులో మహాన్ || ౧౬ ||

ఏవం కురుష్వ సౌమిత్రే మత్కృతే రఘునందన |
అస్మాభిర్విప్రహీణాయా మాతుర్నో న భవేత్సుఖమ్ || ౧౭ ||

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః శ్లక్ష్ణయా గిరా |
ప్రత్యువాచ తదా రామం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్ || ౧౮ ||

తవైవ తేజసా వీర భరతః పూజయిష్యతి |
కౌసల్యాం చ సుమిత్రాం చ ప్రయతో నాత్ర సంశయః || ౧౯ ||

అధికపాఠః –
యది దుఃస్థో న రక్షేత భరతో రాజ్యముత్తమమ్ |
ప్రాప్య దుర్మనసా వీర గర్వేణ చ విశేషతః || ౨౦ ||

తమహం దుర్మతిం క్రూరం వధిష్యామి న సంశయః |
తత్పక్ష్యానపి తాన్సర్వాంస్త్రైలోక్యమపి కిం ను సా || ౨౧ ||

కౌసల్యా బిభృయాదార్యా సహస్రమపి మద్విధాన్ |
యస్యాః సహస్రం గ్రామాణాం సంప్రాప్తముపజీవినమ్ || ౨౨ ||

తదాత్మభరణే చైవ మమ మాతుస్తథైవ చ |
పర్యాప్తా మద్విధానాం చ భరణాయ యశస్వినీ || ౨౩ ||

కురుష్వ మామనుచరం వైధర్మ్యం నేహ విద్యతే |
కృతార్థోఽహం భవిష్యామి తవ చార్థః ప్రకల్పతే || ౨౪ ||

ధనురాదాయ సశరం ఖనిత్రపిటకాధరః |
అగ్రతస్తే గమిష్యామి పంథానమనుదర్శయన్ || ౨౫ ||

ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ |
వన్యాని యాని చాన్యాని స్వాహారాణి తపస్వినామ్ || ౨౬ ||

భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే |
అహం సర్వం కరిష్యామి జాగ్రతః స్వపతశ్చ తే || ౨౭ ||

రామస్త్వనేన వాక్యేన సుప్రీతః ప్రత్యువాచ తమ్ |
వ్రజాపృచ్ఛస్వ సౌమిత్రే సర్వమేవ సుహృజ్జనమ్ || ౨౮ ||

యే చ రాజ్ఞో దదౌ దివ్యే మహాత్మా వరుణః స్వయమ్ |
జనకస్య మహాయజ్ఞే ధనుషీ రౌద్రదర్శనే || ౨౯ ||

అభేద్య కవచే దివ్యే తూణీ చాక్షయసాయకౌ |
ఆదిత్యవిమలౌ చోభౌ ఖడ్గౌ హేమపరిష్కృతౌ || ౩౦ ||

సత్కృత్య నిహితం సర్వమేతదాచార్యసద్మని |
స త్వమాయుధమాదాయ క్షిప్రమావ్రజ లక్ష్మణ || ౩౧ ||

స సుహృజ్జనమామంత్ర్య వనవాసాయ నిశ్చితః |
ఇక్ష్వాకుగురుమాగమ్య జగ్రాహాయుధముత్తమమ్ || ౩౨ ||

తద్దివ్యం రఘుశార్దూలః సత్కృతం మాల్యభూషితమ్ |
రామాయ దర్శయామాస సౌమిత్రిః సర్వమాయుధమ్ || ౩౩ ||

తమువాచాత్మవాన్రామః ప్రీత్యా లక్ష్మణమాగతమ్ |
కాలే త్వమాగతః సౌమ్య కాంక్షితే మమ లక్ష్మణ || ౩౪ ||

అహం ప్రదాతుమిచ్ఛామి యదిదం మామకం ధనమ్ |
బ్రాహ్మణేభ్యస్తపస్విభ్యస్త్వయా సహ పరంతప || ౩౫ ||

వసంతీహ దృఢం భక్త్యా గురుషు ద్విజసత్తమాః |
తేషామపి చ మే భూయః సర్వేషాం చోపజీవినామ్ || ౩౬ ||

వసిష్ఠపుత్రం తు సుయజ్ఞమార్యం
త్వమానయాశు ప్రవరం ద్విజానామ్ |
అభిప్రయాస్యామి వనం సమస్తా-
-నభ్యర్చ్య శిష్టానపరాన్ద్విజాతీన్ || ౩౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకత్రింశః సర్గః || ౩౧ ||

Ayodhya Kanda Sarga 31 Meaning In Telugu

సీతారాములు వనవాస విషయము గురించి వాదించు కుంటున్నప్పుడు లక్ష్మణుడు అక్కడకు వచ్చాడు. బయట ఉండి వారి మాటలు అన్నీ విన్నాడు. ఆ దంపతుల అన్యోన్యతకు చలించి పోయాడు. అన్న రాముని కాళ్ల మీదపడ్డాడు.

“రామా! క్రూరమృగములతో నిండిన అరణ్యములలో నీకు తోడుగా ఉండడానికి సుకుమారి అయిన వదిన రాగా లేనిది నేను నీ వెంట రాలేనా. నేనుకూడా నీ వెంట వస్తాను. నీకు ముందు ఉండి దారి చూపిస్తాను. రామా! చిన్నప్పటి నుండి నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇప్పుడు కూడా ఉండలేను. నీవు లేని ఈ అయోధ్య కానీ, త్రిలోకాధి పత్యము కానీ నాకు అక్కరలేదు.” అన్నాడు లక్ష్మణుడు.

ఇప్పటి దాకా తల్లి కౌసల్యను భార్య సీతను వనవాసమునకు రావద్దని వాదించాడు. తల్లి ఒప్పుకుంది. భార్య ఒప్పుకోలేదు. ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుని వంతు వచ్చింది. యధాప్రకారము లక్ష్మణుని కూడా తన వెంట అడవులకు రావద్దని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు రాముడు. లక్ష్మణుడు ససేమిరా ఒప్పుకోలేదు.

“రామా! నన్ను నీ వెంట అరణ్యమునకు ఎందుకు రావద్దు అంటున్నావో కారణం చెప్పు” అని నిలదీసాడు. దానికి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీవు నాకు మంచి స్నేహితుడవు. ధర్మతప్పకుండా చరించే వాడివి. వీరుడివి. ఎల్లప్పుడూ సన్మార్గములో పయనిస్తావు. అదీ కాకుండా నాకు నీవు ప్రాణంతో సమానం. నేను ఏది చెబితే అది చేస్తావు. అటువంటి నీవు నాతో పాటు వనమునకు వస్తే నా తల్లి కౌసల్య, నీ తల్లి సుమిత్ర ఒంటరి వాళ్లు అవుతారుకదా! వారి ఆలనాపాలనా ఎవరు చూస్తారు. వారి గురించి ఎవరు పట్టించుకుంటారు. కాబట్టి నీవు అయోధ్యలో ఉండటమే ధర్మము.

ప్రస్తుతము మన తండ్రి దశరథుడు తన భార్య కైక మోహ పాశములో చిక్కుకొని ఉన్నాడు. భరతుని పట్టాభిషేకము తరువాత కైక తన సవతులైన మన తల్లులను ఎన్ని కష్టముల పాలు చేస్తుందో ఏమో. ఇంక భరతుడు కూడా తన తల్లి కైక మాటలను విని మన తల్లుల గురించి పట్టించుకోడు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్లను జాగ్రత్తగా చూచుకోవాలి కదా! నీవు అలా చేసావనుకో నీకు నా మీదున్న ప్రేమ, భక్తి ప్రకటితమవుతుంది. తల్లులకు సేవ చెయ్యడం కన్నా పరమ ధర్మము ఏముంటుంది. కనీసము నా మొహం చూచి అయినా నీవు ఇక్కడే ఉండి తల్లుల సంరక్షణ చూసుకో.” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.

కాని లక్ష్మణుడు ఆ మాటలకు ఒప్పుకోలేదు. “రామా! అదేమిటి అలా అంటావు. నీవు అంటే భరతునికి భయం, భక్తి, గౌరవము. నీ పరాక్రమమునకు భయపడి భరతుడు మన తల్లులను అత్యధికంగా గౌరవిస్తాడు కానీ అవమానించడు. ఇందులో ఎలాంటి సంశయము లేదు.

అదీ కాకుండా నీ తల్లి కౌసల్యకు ఆమె పుట్టింటి ఆస్తి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలలో ప్రజలు ఆమెను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తారు. వాటి మీద వచ్చే ఆదాయంతో ఆమె వెయ్యిమందిని పోషించ గలదు. అందుకని మన తల్లుల గురించి మనకు భయం లేదు. కాబట్టి నన్ను నీతో కూడా రావడానికి అనుమతించు. నాజన్మ ధన్యము అవుతుంది. అరణ్యములలో నీవు సీత విహరిస్తూ ఉంటే మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను. మీకు కావలసినవిఅన్నీ అమరుస్తాను.”అని అన్నాడు లక్ష్మణుడు.

ఇంక ఎంత చెప్పినా లక్ష్మణుడు వినడు అనుకున్నాడు రాముడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీ నిర్ణయము నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మనము వనవాసము పోవుటకు తగిన ఏర్పాట్లు చెయ్యి. నీ స్నేహితులందరికీ చెప్పి వారి దగ్గర సెలవు తీసుకొని రా. వెళ్లు. లక్ష్మణా!జనక మహారాజు యజ్ఞమునకు మనము వెళ్లినపుడు, వరుణ దేవుడు మన ఇద్దరికీ ఒక దివ్య ధనుస్సు, అక్షయతూణీరములు, దివ్య కవచములు, రెండు ఖడ్గములు ప్రసాదించాడు కదా. వాటిని మనము గురువుగారు వసిష్ఠుల వారి ఇంట్లో ఉంచి పూజిస్తున్నాము కదా. వాటిని మన వెంట తీసుకొని రా. అని అన్నాడు రాముడు. అన్నగారి మాట ప్రకారము లక్ష్మణుడు తనమిత్రుల వద్ద సెలవు తీసుకొని, వసిష్ఠువారి ఇంటి నుండి ఆయుధములను తీసుకొన్నాడు. వాటిని తీసుకొని వచ్చి రాముడికి చూపించాడు.

“లక్ష్మణా! నేను వనవాసమునకు వెళుతున్నాను కదా! అందుకనీ నా వద్ద ఉన్న ధనము, ఆభరణములు సదాచారులైన బ్రాహ్మణులకు దానంగా ఇవ్వతలచుకొన్నాను. నీవు వెళ్లి వసిష్ఠుని కుమారుడు సుయజ్ఞుని నీ వెంట తీసుకొని రా. ఆయనతో కూడా సదాచార పరాయణులైన అనేక మంది బ్రాహ్మణులను తీసుకొని రా. నా ధనము, ఆభరణములు వారికి దానంగా ఇస్తాను.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వాత్రింశః సర్గః (32) >>

Balakanda Sarga 30 In Telugu – బాలకాండ త్రింశః సర్గః

Balakanda Sarga 30 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ త్రింశః సర్గలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యకు తిరిగి రావడం వివరించబడింది. సీతా కల్యాణం అనంతరం, వారు విశ్వామిత్రుడితో కలిసి స్వస్థలానికి చేరుకుంటారు. అయోధ్య ప్రజలు మరియు దశరథ మహారాజు వారిని సంతోషంగా స్వాగతించేందుకు ఎదురుచూస్తారు. తమ కుమారులను, వారి భార్యలను చూసి దశరథుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు.

యజ్ఞరక్షణమ్

అథ తౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రావరిందమౌ |
దేశే కాలే చ వాక్యజ్ఞావబ్రూతాం కౌశికం వచః ||

1

భగవన్ శ్రోతుమిచ్ఛావో యస్మిన్కాలే నిశాచరౌ |
సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్నాతివర్తేత తత్ క్షణమ్ ||

2

ఏవం బ్రువాణౌ కాకుత్స్థౌ త్వరమాణౌ యుయుత్సయా |
సర్వే తే మునయః ప్రీతాః ప్రశశంసుర్నృపాత్మజౌ ||

3

అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువామ్ |
దీక్షాం గతో హ్యేష మునిర్మౌనిత్వం చ గమిష్యతి ||

4

తౌ చ తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ |
అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతామ్ ||

5

ఉపాసాం‍చక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ |
రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిందమౌ ||

6

అథ కాలే గతే తస్మిన్షష్ఠేఽహని సమాగతే |
సౌమిత్రిమబ్రవీద్రామో యత్తో భవ సమాహితః ||

7

రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయా |
ప్రజజ్వాల తతో వేదిః సోపాధ్యాయపురోహితా ||

8

సదర్భచమసస్రుక్కా ససమిత్కుసుమోచ్చయా |
విశ్వామిత్రేణ సహితా వేదిర్జజ్వాల సర్త్విజా ||

9

మంత్రవచ్చ యథాన్యాయం యజ్ఞోఽసౌ సంప్రవర్తతే |
ఆకాశే చ మహాన్ శబ్దః ప్రాదురాసీద్భయానకః ||

10

ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషి నిర్గతః |
తథా మాయాం వికుర్వాణౌ రాక్షసావభ్యధావతామ్ ||

11

మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చ యే |
ఆగమ్య భీమసంకాశా రుధిరౌఘమవాసృజన్ ||

12

సా తేన రుధిరౌఘేణ వేదీం తామభ్యవర్షతామ్ |
దృష్ట్వా వేదిం తథాభూతాం సానుజః క్రోధసంయుతః ||

13

సహసాఽభిద్రుతో రామస్తానపశ్యత్తతో దివి |
తావాపతంతౌ సహసా దృష్ట్వా రాజీవలోచనః ||

14

లక్ష్మణం త్వాథ సంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్ |
పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్రాక్షసాన్పిశితాశనాన్ ||

15

మానవాస్త్రసమాధూతాననిలేన యథా ఘనాన్ |
[* అధికపాఠః – కరిష్యామి న సందేహో నోత్సహే హంతుం ఈదృశాన్ | ఇత్యుక్త్వా వచనం రామశ్చాపే సంధాయ వేగవాన్ | *]
మానవం పరమోదారమస్త్రం పరమభాస్వరమ్ ||

16

చిక్షేప పరమ క్రుద్ధో మారీచోరసి రాఘవః |
స తేన పరమాస్త్రేణ మానవేన సమాహితః ||

17

సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగరసంప్లవే |
విచేతనం విఘూర్ణంతం శీతేషుబలపీడితమ్ ||

18

నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్ |
పశ్య లక్ష్మణశీతేషుం మానవం మనుసంహితమ్ ||

19

మోహయిత్వా నయత్యేనం న చ ప్రాణైర్వియుజ్యతే |
ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్దుష్టచారిణః ||

20

రాక్షసాన్పాపకర్మస్థాన్యజ్ఞఘ్నాన్పిశితాశనాన్ |
[* ఇత్యుక్త్వా లక్ష్మణం చాశు లాఘవం దర్శయన్ ఇవ | *]
సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతమ్ ||

21

సుబాహూరసి చిక్షేప స విద్ధః ప్రాపతద్భువి |
శేషాన్వాయవ్యమాదాయ నిజఘాన మహాయశాః ||

22

రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్ |
స హత్వా రక్షసాన్సర్వాన్యజ్ఞఘ్నాన్రఘునందనః ||

23

ఋషిభిః పూజితస్తత్ర యథేంద్రో విజయే పురా |
అథ యజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునిః |
నిరీతికా దిశో దృష్ట్వా కాకుత్స్థమిదమబ్రవీత్ ||

24

కృతార్థోఽస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా |
సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః ||

25
[* స హి రామం ప్రశస్యైవం తాభ్యాం సంధ్యాముపాగమత్ | *]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రింశః సర్గః ||

మరునాడు రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా అన్నారు.

“ఓ మహర్షీ! మీ యాగము భగ్నము చేయుటకు రాక్షసులు ఎప్పుడు వస్తారు. మేము ఎప్పుడు వారిని ఎదుర్కొనవలెను. ఎందుకంటే రాక్షసులు వచ్చిన తక్షణం మేము వారిని ఎదుర్కోవాలి కదా!” అని అడిగారు.

ఆసమయములో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు రామలక్ష్మణులతో ఇలా అన్నారు.

“మహర్షుల వారు మౌనదీక్షలో ఉన్నారు. నేటి నుండి ఆరు రాత్రులు మీరు యాగమును రక్షించవలెను.” అని పలికారు.

వారి ఆజ్ఞను శిరసావహించారు రామలక్ష్మణులు. నిరంతరమూ ధనస్సును చేత బూని రామ లక్ష్మణులు ఆరు పగళ్లు ఆరు రాత్రులు యాగమును రక్షించారు. వారు విశ్వామిత్రుని పక్కను ఉండి ఆయనకు ఎలాంటి ఆపదా రాకుండా రక్షించారు.

ఆరవ దినము గడుచు చున్నది. రాముడు లక్ష్మణుని చూచి “లక్ష్మణా! ఇది ఆరవ రోజు. చాలా అప్రమత్తంగా ఉండు.రాక్షసులు ఏ క్షణమునైనా దాడి చేయవచ్చు.” అని లక్ష్మణుని హెచ్చరించాడు.

ఋషులు యజ్ఞము చేస్తున్నారు. అగ్నిహోత్రము మండుచున్నది. ఒక్కసారిగా అగ్నిహోూత్రము లోనుండి మంటలు భగ్గున పైకి లేచాయి. ఏదో జరగబోతోంది అని అనుకున్నాడు రాముడు.

ఇంతలో ఆకాశము నుండి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు మేఘముల రూపములో ఆకాశము అంతా కమ్ముకున్నారు. ఆ రాక్షసులు ఆకాశము నుండి రక్తమును వర్షము వలె కురిపించారు. రక్తము పడిన హెూమ గుండము లో నుండి అగ్ని జ్వాలలు పైకి ఎగిసాయి.

ఇదంతా చూచిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! రాక్షసులు ఆకాశము నుండి రక్త వర్షము కురిపించు చున్నారు. నేను నా బాణములతో ఆ మేఘరూపములో ఉన్న రాక్షసులను తరిమి వేస్తాను.” అని అన్నాడు.

రాముడు కోపంతో మానవాస్త్రమును ఆ రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన మానవాస్త్రము మారీచుని వక్షస్థలము • మీద సూటిగా తగిలింది. ఆ అస్త్రము దెబ్బకు మారీచుడు నూరు యోజనముల దూరములో ఉన్న సముద్రములో పోయి పడ్డాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుని చూచి ఇలాఅన్నాడు. “లక్ష్మణా! నేను సంధించిన మానవాస్త్రము ఎవరినీ చంపదు. కేవలము మూర్ఛపోయేట్టు చేస్తుంది. ఆ రాక్షసుడు కూడా అచేతనుడై సముద్రములో పడ్డాడు. కాని ఈ రాక్షసులను క్షమించరాదు. వీరి ప్రాణములు తీయడమే సరిఅయిన మార్గము” అని అన్నాడు.

వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రమును సుబాహుని మీద సంధించాడు. ఆ అస్త్రము తగిలి సుబాహుడు నేలకూలాడు. వెంటనే గిలా గిలా కొట్టుకొని మరణించాడు. రాముడు మిగిలిన రాక్షసులను వాయవ్యాస్త్రము ప్రయోగించి నాశనం చేసాడు.

ఆ ప్రకారంగా రాముడు విశ్వామిత్రుని యజ్ఞమునకు భంగము కలిగించు రాక్షసుల నందరినీ తన దివ్యాస్త్రములతో సమూలంగా చంపాడు.

యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అయింది. విశ్వామిత్రుడు దీక్ష నుండి లేచాడు. రామ లక్ష్మణులను చూచాడు. ఎంతోసంతోషంతో ఇలా అన్నాడు.

“రామా! నేను సంకల్పించిన యాగము నిర్విఘ్నముగా పూర్తి అయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞప్రకారము యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమముపేరు సార్థకం చేసావు.” అని అన్నాడు.

శ్రీమద్రామాయణము బాల కాండ ముప్పయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకత్రింశః సర్గః (31) >>

Ayodhya Kanda Sarga 20 In Telugu – అయోధ్యాకాండ వింశః సర్గః

Ayodhya Kanda Sarga 20

రామాయణం యొక్క అయోధ్యాకాండలో వింశ సర్గం ప్రధానంగా రాముడు, సీతా, లక్ష్మణులు అరణ్యానికి ప్రయాణమవ్వడాన్ని గురించి వివరిస్తుంది. రాముడు తన తండ్రి దశరథుని ఆజ్ఞను పాటిస్తూ సీతా, లక్ష్మణులతో పాటు దండకారణ్యంలో నివసించేందుకు బయలుదేరుతాడు. వారు గంగానదిని దాటి గుహులను, పర్వతాలను దాటుతూ అరణ్యంలో అడుగుపెడతారు. వారు ఇక్కడ ఉండేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ రిషులు, మూనులతో ఆత్మీయంగా మాట్లాడుతారు. ఈ ప్రయాణం వారి ధైర్యం, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అందరూ ధైర్యంగా ఒకరికొకరు సహాయం చేస్తూ, ధర్మాన్ని కాపాడతారని ప్రగాఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ సర్గ రాముడు తన ధర్మాన్ని పాటించడంలో అతని నిబద్ధతను మరియు అరణ్యంలో వారి ప్రయాణం ప్రారంభాన్ని వివరిస్తుంది.

కౌసల్యాక్రందః

తస్మింస్తు పురుషవ్యాఘ్రే నిష్క్రామతి కృతాంజలౌ |
ఆర్తశబ్దో మహాంజజ్ఞే స్త్రీణామంతఃపురే తదా || ౧ ||

కృత్యేష్వచోదితః పిత్రా సర్వస్యాంతఃపురస్య చ |
గతిర్యః శరణం చాపి స రామోఽద్య ప్రవత్స్యతి || ౨ ||

కౌసల్యాయాం యథా యుక్తో జనన్యాం వర్తతే సదా |
తథైవ వర్తతేఽస్మాసు జన్మప్రభృతి రాఘవః || ౩ ||

న క్రుధ్యత్యభిశప్తోఽపి క్రోధనీయాని వర్జయన్ |
కృద్ధాన్ప్రసాదయన్సర్వాన్స ఇతోఽద్య ప్రవత్స్యతి || ౪ ||

అబుద్ధిర్బత నో రాజా జీవలోకం చరత్యయమ్ |
యో గతిం సర్వలోకానాం పరిత్యజతి రాఘవమ్ || ౫ ||

ఇతి సర్వా మహిష్యస్తాః వివత్సా ఇవ ధేనవః |
పతిమాచుక్రుశుశ్చైవ సస్వరం చాపి చుక్రుశుః || ౬ ||

స హి చాంతః పురే ఘోరమార్తశబ్దం మహీపతిః |
పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా వ్యాలీయతాసనే || ౭ ||

రామస్తు భృశమాయస్తో నిఃశ్వసన్నివ కుంజరః |
జగామ సహితో భ్రాత్రా మాతురంతఃపురం వశీ || ౮ ||

సోఽపశ్యత్పురుషం తత్ర వృద్ధం పరమపూజితమ్ |
ఉపవిష్టం గృహద్వారి తిష్ఠతశ్చాపరాన్బహూన్ || ౯ ||

దృష్ట్వైవ తు తదా రామం తే సర్వే సహసోత్థితాః |
జయేన జయతాం శ్రేష్ఠం వర్ధయంతి స్మ రాఘవమ్ || ౧౦ ||

ప్రవిశ్య ప్రథమాం కక్ష్యాం ద్వితీయాయాం దదర్శ సః |
బ్రాహ్మణాన్వేదసంపన్నాన్వృద్ధాన్రాజ్ఞాఽభిసత్కృతాన్ || ౧౧ ||

ప్రణమ్య రామస్తాన్వృద్ధాంస్తృతీయాయాం దదర్శ సః |
స్త్రియో వృద్ధాశ్చ బాలాశ్చ ద్వారరక్షణతత్పరాః || ౧౨ ||

వర్ధయిత్వా ప్రహృష్టాస్తాః ప్రవిశ్య చ గృహం స్త్రియః |
న్యవేదయంత త్వరితాః రామమాతుః ప్రియం తదా || ౧౩ ||

కౌసల్యాఽపి తదా దేవీ రాత్రిం స్థిత్వా సమాహితా |
ప్రభాతే త్వకరోత్పూజాం విష్ణోః పుత్రహితైషిణీ || ౧౪ ||

సా క్షౌమవసనా హృష్టా నిత్యం వ్రతపరాయణా |
అగ్నిం జుహోతి స్మ తదా మంత్రవత్కృతమంగళా || ౧౫ ||

ప్రవిశ్య చ తదా రామో మాతురంతఃపురం శుభమ్ |
దదర్శ మాతరం తత్ర హావయంతీ హుతాశనమ్ || ౧౬ ||

దేవకార్యనిమిత్తం చ తత్రాపశ్యత్సముద్యతమ్ |
దధ్యక్షతం ఘృతం చైవ మోదకాన్హవిషస్తథా || ౧౭ ||

లాజాన్మాల్యాని శుక్లాని పాయసం కృసరం తథా |
సమిధః పూర్ణకుంభాంశ్చ దదర్శ రఘునందనః || ౧౮ ||

తాం శుక్లక్షౌమసంవీతాం వ్రతయోగేన కర్శితామ్ |
తర్పయంతీం దదర్శాద్భిర్దేవతాం దేవవర్ణినీమ్ || ౧౯ ||

సా చిరస్యాత్మజం దృష్ట్వా మాతృనందనమాగతమ్ |
అభిచక్రామ సంహృష్టాః కిశోరం బడవా యథా || ౨౦ ||

స మాతరమభిక్రాంతాముపసంగృహ్య రాఘవః |
పరిష్వక్తశ్చ బాహుభ్యాముపాఘ్రాతశ్చ మూర్ధని || ౨౧ ||

తమువాచ దురాధర్షం రాఘవం సుతమాత్మనః |
కౌసల్యా పుత్రవాత్సల్యాదిదం ప్రియహితం వచః || ౨౨ ||

వృద్ధానాం ధర్మశీలానాం రాజర్షీణాం మహాత్మనామ్ |
ప్రాప్నుహ్యాయుశ్చ కీర్తిం చ ధర్మం చోపహితం కులే || ౨౩ ||

సత్యప్రతిజ్ఞం పితరం రాజానం పశ్య రాఘవ |
అద్యైవ హి త్వాం ధర్మాత్మా యౌవరాజ్యేఽభిషేక్ష్యతి || ౨౪ ||

దత్తమాసనమాలభ్య భోజనేన నిమంత్రితః |
మాతరం రాఘవః కించిద్వ్రీడాత్ప్రాంజలిరబ్రవీత్ || ౨౫ ||

స స్వభావవినీతశ్చ గౌరవాచ్చ తదాఽఽనతః |
ప్రస్థితో దండకారణ్యమాప్రష్టుముపచక్రమే || ౨౬ ||

దేవి నూనం న జానీషే మహద్భయముపస్థితమ్ |
ఇదం తవ చ దుఃఖాయ వైదేహ్యా లక్ష్మణస్య చ || ౨౭ ||

గమిష్యే దండకారణ్యం కిమనేనాసనేన మే |
విష్టరాసనయోగ్యో హి కాలోఽయం మాముపస్థితః || ౨౮ ||

చతుర్దశ హి వర్షాణి వత్స్యామి విజనే వనే |
మధుమూలఫలైర్జీవన్హిత్వా మునివదామిషమ్ || ౨౯ ||

భరతాయ మహారాజో యౌవరాజ్యం ప్రయచ్ఛతి |
మాం పునర్దండకారణ్యే వివాసయతి తాపసమ్ || ౩౦ ||

స షట్ చాష్టౌ చ వర్షాణి వత్స్యామి విజనే వనే |
ఆసేవమానో వన్యాని ఫలమూలైశ్చ వర్తయన్ || ౩౧ ||

సా నికృత్తేవ సాలస్య యష్టిః పరశునా వనే |
పపాత సహసా దేవీ దేవతేవ దివశ్చ్యుతా || ౩౨ ||

తామదుఃఖోచితాం దృష్ట్వా పతితాం కదలీమివ |
రామస్తూత్థాపయామాస మాతరం గతచేతసమ్ || ౩౩ ||

ఉపావృత్యోత్థితాం దీనాం బడబామివ వాహితామ్ |
పాంసుకుంఠితసర్వాంగీం విమమర్శ చ పాణినా || ౩౪ ||

సా రాఘవముపాసీనమసుఖార్తా సుఖోచితా |
ఉవాచ పురుషవ్యాఘ్రముపశృణ్వతి లక్ష్మణే || ౩౫ ||

యది పుత్ర న జాయేథాః మమ శోకాయ రాఘవ |
న స్మ దుఃఖమతో భూయః పశ్యేయమహమప్రజాః || ౩౬ ||

ఏక ఏవ హి వంధ్యాయాః శోకో భవతి మానసః |
అప్రజాఽస్మీతి సంతాపో న హ్యన్యః పుత్ర విద్యతే || ౩౭ ||

న దృష్టపూర్వం కళ్యాణం సుఖం వా పతిపౌరుషే |
అపి పుత్రే తు పశ్యేయమితి రామస్థితం మయా || ౩౮ ||

సా బహూన్యమనోజ్ఞాని వాక్యాని హృదయచ్ఛిదామ్ |
అహం శ్రోష్యే సపత్నీనామవరాణాం వరా సతీ || ౩౯ ||

అతో దుఃఖతరం కిం ను ప్రమదానాం భవిష్యతి |
మమ శోకో విలాపశ్చ యాదృశోఽయమనంతకః || ౪౦ ||

త్వయి సన్నిహితేఽప్యేవమహమాసం నిరాకృతా |
కిం పునః ప్రోషితే తాత ధ్రువం మరణమేవ మే || ౪౧ ||

అత్యంతం నిగృహీతాఽస్మి భర్తుర్నిత్యమతంత్రితా |
పరివారేణ కైకేయ్యాః సమా వాఽప్యథవావరా || ౪౨ ||

యో హి మాం సేవతే కశ్చిదథవాఽప్యనువర్తతే |
కైకేయ్యాః పుత్రమన్వీక్ష్య స జనో నాభిభాషతే || ౪౩ ||

నిత్యక్రోధతయా తస్యాః కథం ను ఖరవాది తత్ |
కైకేయ్యా వదనం ద్రష్టుం పుత్ర శక్ష్యామి దుర్గతా || ౪౪ ||

దశ సప్త చ వర్షాణి తవ జాతస్య రాఘవ |
ఆసితాని ప్రకాంక్షంత్యా మయా దుఃఖపరిక్షయమ్ || ౪౫ ||

తదక్షయమహం దుఃఖం నోత్సహే సహితుం చిరమ్ |
విప్రకారం సపత్నీనామేవం జీర్ణాఽపి రాఘవ || ౪౬ ||

అపశ్యంతీ తవ ముఖం పరిపూర్ణశశిప్రభమ్ |
కృపణా వర్తయిష్యామి కథం కృపణజీవికామ్ || ౪౭ ||

ఉపవాసైశ్చ యోగైశ్చ బహుభిశ్చ పరిశ్రమైః |
దుఃఖసంవర్ధితో మోఘం త్వం హి దుర్గతయా మయా || ౪౮ ||

స్థిరం తు హృదయం మన్యే మమేదం యన్న దీర్యతే |
ప్రావృషీవ మహానద్యాః స్పృష్టం కూలం నవాంభసా || ౪౯ ||

మమైవ నూనం మరణం న విద్యతే
న చావకాశోఽస్తి యమక్షయే మమ |
యదంతకోఽద్యైవ న మాం జిహీర్షతి
ప్రసహ్య సింహో రుదతీం మృగీమివ || ౫౦ ||

స్థిరం హి నూనం హృదయం మమాయసం
న భిద్యతే యద్భువి నావదీర్యతే |
అనేన దుఃఖేన చ దేహమర్పితం
ధ్రువం హ్యకాలే మరణం న విద్యతే || ౫౧ ||

ఇదం తు దుఃఖం యదనర్థకాని మే
వ్రతాని దానాని చ సంయమాశ్చ హి |
తపశ్చ తప్తం యదపత్యకారణాత్
సునిష్ఫలం బీజమివోప్తమూషరే || ౫౨ ||

యది హ్యకాలే మరణం స్వయేచ్ఛయా
లభేత కశ్చిద్గురుదుఃఖకర్శితః |
గతాఽహమద్యైవ పరేతసంసదం
వినా త్వయా ధేనురివాత్మజేన వై || ౫౩ ||

అథాపి కిం జీవితమద్య మే వృథా
త్వయా వినా చంద్రనిభాననప్రభ |
అనువ్రజిష్యామి వనం త్వయైవ గౌః
సుదుర్బలా వత్సమివానుకాంక్షయా || ౫౪ ||

భృశమసుఖమమర్షితా తదా
బహు విలలాప సమీక్ష్య రాఘవమ్ |
వ్యసనముపనిశామ్య సా మహత్
సుతమివ బద్ధమవేక్ష్య కిన్నరీ || ౫౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే వింశః సర్గః || ౨౦ ||

Ayodhya Kanda Sarga 20 Meaning In Telugu

(ఇంతకు ముందు సర్గలో వాల్మీకి మహర్షి రాముడు కౌసల్య మందిరము ప్రవేశించాడు అని చెప్పాడు. కాని ఈ సర్గలో కొంచెం వెనక్కు వెళ్లాడు. ఇప్పుడు మనము ఇంకా దశరథుని అంతఃపురము లోనే ఉన్నాము. ఇంక చదవండి.)

కైక మాటలను మన్నించి రాముడు అక్కడనుండి బయటకు వచ్చిన తరువాత కైక అంతఃపురములోని స్త్రీలు, దశరథుని ఇతర భార్యలు భోరున ఏడ్చారు. అయ్యో రాముడు అడవులకు వెళ్లిపోతున్నాడా అని దు:ఖించారు. (దశరథునికి కైసల్యా, సుమిత్ర,కైకేయీ కాక ఇంకా మూడువందలయాభై మంది భార్యలు ఉన్నట్టు ప్రతీతి.)

“తండ్రి నోటి నుండి మాట వెలుపలికి వచ్చీ రాకముందే ఆ కార్యములను చక్కబెట్టే రాముడు, అంత:పురములోని వారికి ఏ లోటూరాకుండా అన్ని అమర్చేరాముడు అరణ్యములకు పోతున్నాడు. తన తల్లి పట్ల ఎటువంటి భక్తి, ప్రేమ చూపుతున్నాడో, మన యందు కూడా అలాంటి భక్తి వినయము ప్రేమ చూపిన రాముడు అరణ్యము లకు పోతున్నాడు. కోపమంటే ఎరుగని రాముడు, ఎవరైనా తన మీద కోపగించినా వారి మీద కోపించని రాముడు ఇప్పుడు అరణ్యములకు పోతున్నాడు. ఇన్నాళ్లు దశరథుడు ఏదో తెలివిగల రాజు అనుకున్నాము, కాని ఇంత తెలివితక్కువగా కన్నకొడుకును కారడవులకు పంపే మూర్ఖుడు అనేకోలేదు.” ఈ ప్రకారంగా అంత:పుర స్త్రీలందరూ తలొక మాటా అనుకుంటూ దు:ఖిస్తున్నారు.

వారి మాటలు విన్న దశరథునికి శోకము ఇంకా ఎక్కువ అయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అంతలోనే స్పృహ తప్పుతున్నాడు. మరలా తేరుకుంటున్నాడు. రాముని కోసం చుట్టు వెర్రి చూపులు చూస్తున్నాడు. రాముడు కనపడక మరలా హతాశుడవుతున్నాడు.
కౌసల్య అంతఃపురము బయట ద్వారముల వద్ద అనేక మంది బ్రాహ్మణులు నిలబడి ఉన్నారు. రాముని చూడగానే వారందరూ లేచి నిలబడ్డారు. అందులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు “రామా! నీకు జయమగు గాక” అని ఆశీర్వదించాడు. రాముడు అక్కడ నిలబడి ఉన్న బ్రాహ్మణులకు అందరికీ భక్తితో నమస్కరించాడు.

తరువాత ద్వారము వద్ద బ్రాహ్మణులు, ముత్తయిదువలు నిలబడి ఉన్నారు. రాముని రావడం చూచి వారందరూ లేచి నిలబడ్డారు. వారందరూ జయజయ ధ్వానములతో రాముని కౌసల్యా మందిరమునకు స్వాగతించారు.

మరి కొంత మంది లోపలకు పరుగు పరుగున వెళ్లి కౌసల్యకు రాముడు వస్తున్నాడు అన్న వార్తను అందించారు. కౌసల్య రాత్రి అంతా జాగారము చేసి పొద్దుటే లేచి, స్నానాదికములు ఆచరించి, తెల్లని పట్టుచీర కట్టుకొని రాముని క్షేమం కోరుతూ విష్ణు పూజ చేసింది. తరువాత అగ్నిలో మంగళ ద్రవ్యములు హెూమం చేస్తూ ఉంది. రాముడు అంతఃపురములో ప్రవేశించి హెూమము చేస్తూ ఉన్న తల్లిని చూచాడు.

రాముడు రావడం చూచి కౌసల్య లేచి రాముని దగ్గరగా వచ్చింది. రాముడు తల్లి పాదములకు నమస్కరించాడు. కౌసల్య రాముని ఆశీర్వదించింది. తరువాత రాముని రెండు చేతలతో లేపి గట్టిగా కౌగలించుకొని తలమీద ముద్దు పెట్టుకొంది. “నాయనా రామా! నీవు కూడా నీపూర్వీకుల వలె కీర్తి ప్రతిష్టలు పొందుదువు గాక! నీవు నీ వంశకర్తలు ఆచరించిన ధర్మములను పాటించెదవు గాక! నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను ఈ రోజు యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాను అన్నాడు. నీ తండ్రి మాట తప్పడు. నీకు ఈ రోజే యౌవరాజ్య పట్టాభిషేకము జరగ గలదు.

రామా! రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో. రా నాయనా భోజనము చేద్దువు గానీ.” అని ఆప్యాయంగా రాముని భోజనానికి పిలిచింది. రాముడు మరలా తన తల్లి కౌసల్యకు నమస్కరించి ఇలా అన్నాడు. “అమ్మా! ఇప్పుడు మనకు ఒక అనుకోని ఆపద ఒకటి వచ్చి పడినది. నేను ఇప్పుడు అత్యవసరంగా దండకారణ్యము పోవలెను. దీని వలన నీవు, సీత, లక్ష్మణుడు దు:ఖిస్తారు అని నాకు తెలుసు. కాని ఇది తప్పదు. నేను వెళ్లి తీరాలి. కాబట్టి నాకు నేటి నుండి ఈ రాజభోగము లు, రాజ భోజనములు, సింహాసనములు నిషిద్ధములు. నేను కందమూలములు తింటూ, దర్భాసనము మీద పడుకోవాలి. ఈ విధముగా నేను పదునాలుగేళ్లు వనవాసము చెయ్యాలి. నాకు బదులుగా భరతుడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది తండ్రి గారి నిర్ణయము. నాకు శిరోధార్యము.” అని అన్నాడు.

రాముడు ఈ మాటలు అంటూ ఉండగానే కౌసల్య నిట్టనిలువునా కూలిపోయింది. రాముడు వెంటనే తల్లిని పైకి లేపి పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చో పెట్టాడు. పరిచారికలు చల్లని నీళ్లు ఆమె మొహం మీద చల్లి సేదదీర్చారు. కౌసల్యకు దుఃఖము ఆగటం లేదు. కళ్లనుండి నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంది. నోటమాట పెగలడంలేదు.

“రామా! నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావయ్యా! నాకు ఈ వార్త చెప్పడానికేనా! అసలు నాకు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది. పిల్లలు లేరు అని ఒకే దిగులు ఉండేది. కాని ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగి ప్రయోజకుడవు అయి నాకు ఎనలేని దుఃఖము కలిగిస్తున్నావు. ఇది నీకు న్యాయమా రామా!

రామా! నేను పెళ్లి చేసుకొని ఇక్కడకు వచ్చిన తరువాత సుఖము అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా భర్త రాజుగా ఉ న్న రోజుల్లో నాకు ఏనాడూ సుఖము లేదు. కనీసము నువ్వు పట్టాభిషిక్తుడవు అయిన తరువాత అన్నా సుఖపడదామనుకున్నాను. ఆ ఆశకూడా అడియాస చేసావు రామా!

రామా! నేను అందరి కంటే పెద్ద భార్యను అయి ఉండి కూడా, నీ వనవాసముతో అందరి ముందూ తలదించుకోవాల్సిన పరిస్థితి, వారి సూటీ పోటీ మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు దాపురించింది. ఇంతకు మించి స్త్రీలకు దు:ఖము ఏముంటుంది. రామా! నీవు ఇక్కడ ఉండగానే నా సవతులు నన్ను నిరాదరిస్తున్నారు. ఇంక నీవు లేకపోతే చెప్పవలెనా. నా బతుకు దుర్భరము అవుతుంది. అందుకే నాకు మరణమే శరణ్యము.
రామా! నా భర్త నన్ను ఏనాడూ అందరితో పాటు ఆదరించలేదు. ముఖ్యంగా ఆ కైక, ఆమె దాస దాసీల పాటి కూడా నేను చెయ్యలేదు. నా భర్త వారి కన్నా హీనంగా నన్ను చూచాడు. పేరుకు పెద్దభార్యనే కానీ స్వతంత్రించి ఏ పనీ చెయ్యలేను. నాది ఒక బానిసబతుకు. నువ్వు చెప్పినట్టు రేపు భరతుడు రాజైతే. ఈరోజు నన్ను పలకరించే వాళ్లు కూడా రేపు నా మొహం చూడరు. నాతో మాట్లాడరు. ఇంక కైక సంగతి చెప్ప పనిలేదు. రేపటి నుండి నన్ను ఒక మనిషిగా కూడా చూడదు. చీటికీ మాటికీ నన్ను నిందిస్తూ ఉంటుంది. అసలు ఆమె మొహం చూడటానికే నాకు భయంగా ఉంటుంది.

రామా! నిన్ను చూచుకొని, ఇన్నాళ్లు ఈ దుర్భరమైన బాధలు భరించాను. నీకు ఉపనయనము అయిన నాటి నుండి దాదాపు పదిహేడు సంవత్సరములు నువ్వు రాజ్యాభిషిక్తుడవు అవుతావనీ, నా కష్టములు తీరుస్తావని ఆశతో ఎదురు చూచాను. నీ మాటలతో ఆ ఆశ నిరాశ అయింది. ఈ వృద్ధాప్యంలో నేను, నా సవతుల సూటీ పోటీ మాటలు, వారు చేయు అవమానములు భరించలేను.

ఇన్నాళ్లు నీ ముద్దులొలికే మొహం చూస్తూ ఈ బాధలన్నీ దిగమింగుకున్నాను. ఇంక నువ్వు నాకు కనపడవు. నేను ఈ బాధలు భరించలేను. నేను ఎంతో దురదృష్టవంతురాలను. లేకపోతే నీ క్షేమం గురించి, నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలనీ, నీవు రాజ్యాభిషిక్తుడివికావాలనీ ఎన్నో పూజలు వ్రతాలూ ఉపవాసాలు చేసాను. ఏ దేవుడూ నన్ను కరుణించలేదు. నా బాధలను తీర్చలేదు. అవన్నీ వ్యర్ధమైపోయాయి.

రామా! నా గుండె చాలా కఠినమయింది లేకపోతే నీవు చెప్పిన ఈ దుర్వార్త విని నా గుండెలు ఈ పాటికి పగిలిపోవాల్సింది. కాని అలా జరగలేదు.. నాగుండెలు రాతి బండలు. అవి పగలవు. నాకు మరణము రాదు.

రామా! నాకు పుత్ర సంతానము కావాలని ఎన్నో పూజలు, ఎన్నెన్నో వ్రతాలూ యజ్ఞాలు యాగాలు చేసాను. నీవు పుట్టావు. కానీ ఏం లాభం. అవి ఫలించలేదు. నీకు వనవాసము ప్రాప్తించింది.

రామా! మానవులకు తమ ఇష్టం వచ్చినప్పుడు మరణించే అవకాశము లేదు కదా! లేకపోతే నీవు ఈ మాట చెప్పగానే హాయిగా మరణించి ఉండేదాన్ని. ఎందుకంటే రామా! ఇంక నేను ఎందుకు బతకాలి. ఎవరి కోసం బతకాలి. ఏం అనుభవించడానికి బతకాలి. వ్యర్ధంగా కలకాలం బతకడం కంటే మరణించడం మేలు కదా!

లేకపోతే రామా! ఒకపని చెయ్యి. నన్నుకూడా నీ వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లు. నీ యోగక్షేమాలు చూసుకుంటూ నీ వెంటే ఉంటాను.” అని కౌసల్య రాముని చూచి తన మనసులో ఉన్న బాధను ఆవేశాన్ని అంతా వెళ్లగక్కింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకవింశః సర్గః (21) >>

Balakanda Sarga 28 In Telugu – బాలకాండ అష్టావింశః సర్గః

Balakanda Sarga 28 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టావింశః సర్గలో పరశురాముడు శ్రీరాముడిని పరీక్షించడానికి వచ్చాడు. శివధనస్సు విరగడం విని, తన విష్ణు ధనస్సుతో శ్రీరాముడిని పరీక్షించాలని అనుకుంటాడు. శ్రీరాముడు ఆ ధనస్సును సునాయాసంగా ఎత్తి, తన శక్తిని ప్రదర్శిస్తాడు. పరశురాముడు శ్రీరాముని పరాక్రమాన్ని తెలుసుకుని, తన అహంకారాన్ని విడిచి వేస్తాడు. ఆ తర్వాత, శ్రీరాముడు నిజమైన విష్ణువు అవతారమని గుర్తించి, పరశురాముడు తన శస్త్రాలను సమర్పించి, అక్కడి నుండి నిష్క్రమిస్తాడు.

అస్త్రసంహారగ్రహణమ్

ప్రతిగృహ్య తతోఽస్త్రాణి ప్రహృష్టవదనః శుచిః |
గచ్ఛన్నేవ చ కాకుత్స్థో విశ్వామిత్రమథాబ్రవీత్ ||

1

గృహీతాస్త్రోఽస్మి భగవన్దురాధర్షః సురాసురైః |
అస్త్రాణాం త్వహమిచ్ఛామి సంహారం మునిపుంగవ ||

2

ఏవం బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రో మహామతిః |
సంహారం వ్యాజహారాథ ధృతిమాన్సువ్రతః శుచిః ||

3

సత్యవంతం సత్యకీర్తిం ధృష్టం రభసమేవ చ |
ప్రతిహారతరం నామ పరాఙ్ముఖమవాఙ్ముఖమ్ ||

4

లక్షాక్షవిషమౌ చైవ దృఢనాభ సునాభకౌ |
దశాక్షశతవక్త్రౌ చ దశశీర్షశతోదరౌ ||

5

పద్మనాభమహానాభౌ దుందునాభసునాభకౌ |
జ్యోతిషం కృశనం చైవ నైరాశ్యవిమలావుభౌ ||

6 [శకునం]

యోగంధరహరిద్రౌ చ దైత్యప్రమథనం తథా |
శుచిర్బాహుర్మహాబాహుర్నిష్కులిర్విరుచిస్తథా ||

7

సార్చిర్మాలీ ధృతిర్మాలీ వృత్తిమాన్రుచిరస్తథా |
పిత్ర్యం సౌమనసం చైవ విధూతమకరావుభౌ ||

8

కరవీరకరం చైవ ధనధాన్యౌ చ రాఘవ |
కామరూపం కామరుచిం మోహమావరణం తథా ||

9

జృంభకం సర్వనాభం చ సంతానవరణౌ తథా |
కృశాశ్వతనయాన్రామ భాస్వరాన్కామరూపిణః ||

10

ప్రతీచ్ఛ మమ భద్రం తే పాత్రభూతోఽసి రాఘవ |
బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రహృష్టేనాంతరాత్మనా ||

11

దివ్యభాస్వరదేహాశ్చ మూర్తిమంతః సుఖప్రదాః |
కేచిదంగారసదృశాః కేచిద్ధూమోపమాస్తథా ||

12

చంద్రార్కసదృశాః కేచిత్ప్రహ్వాంజలిపుటాస్తథా |
రామం ప్రాంజలయో భూత్వాబ్రువన్మధురభాషిణః ||

13

ఇమే స్మ నరశార్దూల శాధి కిం కరవామ తే |
మానసాః కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యథ ||

14

గమ్యతామితి తానాహ యథేష్టం రఘునందనః |
అథ తే రామమామంత్ర్య కృత్వా చాపి ప్రదక్షిణమ్ ||

15

ఏవమస్త్వితి కాకుత్స్థముక్త్వా జగ్ముర్యథాగతమ్ |
స చ తాన్రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునిమ్ ||

16

గచ్ఛన్నేవాథ మధురం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ |
కిం న్వేతన్మేఘసంకాశం పర్వతస్యావిదూరతః ||

17

వృక్షషండమితో భాతి పరం కౌతూహలం హి మే |
దర్శనీయం మృగాకీర్ణం మనోహరమతీవ చ ||

18

నానాప్రకారైః శకునైర్వల్గునాదైరలంకృతమ్ |
నిఃసృతాః స్మ మునిశ్రేష్ఠ కాంతారాద్రోమహర్షణాత్ ||

19

అనయా త్వవగచ్ఛామి దేశస్య సుఖవత్తయా |
సర్వం మే శంస భగవన్కస్యాశ్రమపదం త్విదమ్ ||

20

సంప్రాప్తా యత్ర తే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణః |
తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే ||

21

భగవంస్తస్య కో దేశః సా యత్ర తవ యాజ్ఞికీ |
రక్షితవ్యా క్రియా బ్రహ్మన్మయా వధ్యాశ్చ రాక్షసాః |
ఏతత్సర్వం మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ||

22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టావింశః సర్గః ||

Balakanda Sarga 28 Meaning In Telugu

ఆ ప్రకారంగా విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గ మధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు, రాక్షసులకు అజేయుడనయ్యాను. కాని వాటికి ఉపసంహారము కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా!” అని అడిగాడు.

అస్త్రములను ఉపసంహరించడం అంటే ఒక సారి వేసిన అస్త్రమును, టార్గెట్ ను ఢీకొట్టక ముందే వెనుకకు తీసుకోడం. ఆ రోజుల్లో అస్త్రము వేసే శక్తి దానిని ఉపసంహరించే శక్తి రెండూ ఉండేవి. నేటి రోజుల్లో తుపాకీ గానీ, పిస్టల్ గానీ, పెద్ద పెద్ద మిసైల్సు కానీ ఒకసారి ప్రయోగిస్తే, ఇంతే సంగతులు… ఇంక వెనకకు తిరిగి రావు. టార్గెట్ను ధ్వంసంచేస్తాయి. అదీ నేటి అస్త్ర శక్తి.).

ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు. రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారము కూడా ఉపదేశించాడు.

అంతే కాకుండా, పూర్వము భృశాశ్వుని చే సృష్టింపబడిన అస్త్రములు అన్నిటినీ రామునికి ఉపదేశించాడు. ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి 7 శ్లోకములలో చెప్పాడు. ఆ అస్త్రముల పేర్లు ఏవంటే……

సత్యవంతము, సత్యకీర్తి, ధృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాఙ్ముఖము, అవాఙ్ముఖము, లక్షాక్షము, విషమము, ధృఢనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కృశనము, నైరాశ్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము.

(వీటి పేర్లు చూస్తుంటే ఇవి మానవుల లక్షణములు, ఉదాహరణకు… మోహము, రుచిరము, విమలము; ఇంకా మానవులకు ఉన్న సంపదలు ఉదా: సంతానము, కొన్ని శాస్త్రములు ఉదా: జ్యోతిషము. ఇలాగా అస్త్రములు అంటే కేవలము ఆయుధములు అనే కాదు శాస్త్రములు, లక్షణములు వాటి ఆవశ్యకత అని అర్థం స్ఫురిస్తూ ఉంది.)

రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసరం ఎదురు చూచారు. రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినపుడు రమ్మని పంపివేసాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రామునికి ప్రదక్షిణ పూర్వక నమస్వారము చేసి వెళ్లిపోయారు.

తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు. వారికి ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమము మంచి ఫలవృక్షములతోనూ, పూల తీగలతోనూ, అత్యంత మనోరంజకంగా ఉంది. విశ్వామిత్రుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! ఈ ప్రదేశము చాలా మనోహరముగా ఉంది. మనము ఆ రాక్షస ప్రాంతము వదిలి పెట్టినాము అనుకుంటాను. ఇంత మనోహరముగా ఉన్న ఈ ఆశ్రమము ఎవరిది? వివరించండి. ఇంతకూ తమరి ఆశ్రమము ఎక్కడ ఉంది. మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు. రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడుచేస్తున్నారు. నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి. నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి. వీటి గురించి నాకు వివరంగా చెప్పండి” అని అడిగాడు రాముడు.

(ఇప్పటి దాకా రాముడు చెప్పిన పని చేస్తున్నాడు, ఇచ్చినవి (అస్త్రములు) పుచ్చుకుంటున్నాడు. కానీ నోరు మెదప లేదు. ఇప్పుడు ఒక ఆర్మీ మేజర్ అడిగినట్టు తాను నెరవేర్చవలసిన మిషన్ గురించి వివరాలు అడుగుతున్నాడు. గమనించండి.)

అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా చెప్పసాగాడు.

వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ ఏకోనత్రింశః సర్గః (29) >>

Ayodhya Kanda Sarga 7 In Telugu – అయోధ్యాకాండ సప్తమః సర్గః

Ayodhya Kanda Sarga 7 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. సప్తమః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.

మంథరాపరిదేవనమ్

జ్ఞాతిదాసీ యతోజాతా కైకేయ్యాస్తు సహోషితా |
ప్రాసాదం చంద్రసంకాశమారురోహ యదృచ్ఛయా ||

1

సిక్తరాజపథాం రమ్యాం ప్రకీర్ణకుసుమోత్కరామ్ |
అయోధ్యాం మంథరా తస్మాత్ప్రాసాదాదన్వవైక్షత ||

2

పతాకాభిర్వరార్హాభిర్ధ్వజైశ్చ సమలంకృతామ్ |
వృతాం ఛన్నపథైశ్చాపి శిరఃస్నాతజనైర్వృతామ్ ||

3

మాల్యమోదకహస్తైశ్చ ద్విజేంద్రైరభినాదితామ్ |
శుక్లదేవగృహద్వారాం సర్వవాదిత్రనిస్వనామ్ ||

4

సంప్రహృష్టజనాకీర్ణాం బ్రహ్మఘోషాభినాదితామ్ |
ప్రహృష్టవరహస్త్యశ్వాం సంప్రణర్దితగోవృషామ్ ||

5

ప్రహృష్టముదితైః పౌరైరుచ్ఛ్రితధ్వజమాలినీమ్ |
అయోధ్యాం మంథరా దృష్ట్వా పరం విస్మయమాగతా ||

6

ప్రహర్షోత్ఫుల్లనయనాం పాండురక్షౌమవాసినీమ్ |
అవిదూరే స్థితాం దృష్ట్వా ధాత్రీం పప్రచ్ఛ మంథరా ||

7

ఉత్తమేనాభిసంయుక్తా హర్షేణార్థపరా సతీ |
రామమాతా ధనం కిం ను జనేభ్యః సంప్రయచ్ఛతి ||

8

అతిమాత్రప్రహర్షోఽయం కిం జనస్య చ శంస మే |
కారయిష్యతి కిం వాపి సంప్రహృష్టో మహీపతిః ||

9

విదీర్యమాణా హర్షేణ ధాత్రీ తు పరయా ముదా |
ఆచచక్షేఽథ కుబ్జాయై భూయసీం రాఘవశ్రియమ్ ||

10

శ్వః పుష్యేణ జితక్రోధం యౌవరాజ్యేన రాఘవమ్ |
రాజా దశరథో రామమభిషేచయితానఘమ్ ||

11

ధాత్ర్యాస్తు వచనం శ్రుత్వా కుబ్జా క్షిప్రమమర్షితా |
కైలాసశిఖరాకారాత్ప్రాసాదాదవరోహత ||

12

సా దహ్యమానా కోపేన మంథరా పాపదర్శినీ |
శయానామేత్య కైకేయీమిదం వచనమబ్రవీత్ ||

13

ఉత్తిష్ఠ మూఢే కిం శేషే భయం త్వామభివర్తతే |
ఉపప్లుతమఘౌఘేన కిమాత్మానం న బుధ్యసే ||

14

అనిష్టే సుభగాకారే సౌభాగ్యేన వికత్థసే |
చలం హి తవ సౌభాగ్యం నద్యాః స్రోత ఇవోష్ణగే ||

15

ఏవముక్తా తు కైకేయీ రుష్టయా పరుషం వచః |
కుబ్జయా పాపదర్శిన్యా విషాదమగమత్పరమ్ ||

16

కైకేయీ త్వబ్రవీత్కుబ్జాం కచ్చిత్క్షేమం న మంథరే |
విషణ్ణవదనాం హి త్వాం లక్షయే భృశదుఃఖితామ్ ||

17

మంథరా తు వచః శ్రుత్వా కైకేయ్యా మధురాక్షరమ్ |
ఉవాచ క్రోధసంయుక్తా వాక్యం వాక్యవిశారదా ||

18

సా విషణ్ణతరా భూత్వా కుబ్జా తస్యా హితైషిణీ |
విషాదయంతీ ప్రోవాచ భేదయంతీ చ రాఘవమ్ ||

19

అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం త్వద్వినాశనమ్ |
రామం దశరథో రాజా యౌవరాజ్యేఽభిషేక్ష్యతి ||

20

సాస్మ్యగాధే భయే మగ్నా దుఃఖశోకసమన్వితా |
దహ్యమానాఽనలేనేవ త్వద్ధితార్థమిహాగతా ||

21

తవ దుఃఖేన కైకేయి మమ దుఃఖం మహద్భవేత్ |
త్వద్వృద్ధౌ మమ వృద్ధిశ్చ భవేదత్ర న సంశయః ||

22

నరాధిపకులే జాతా మహిషీ త్వం మహీపతేః |
ఉగ్రత్వం రాజధర్మాణాం కథం దేవి న బుధ్యసే ||

23

ధర్మవాదీ శఠో భర్తా శ్లక్ష్ణవాదీ చ దారుణః |
శుద్ధభావేన జానీషే తేనైవమతిసంధితా ||

24

ఉపస్థితం ప్రయుంజానస్త్వయి సాంత్వమనర్థకమ్ |
అర్థేనైవాద్య తే భర్తా కౌసల్యాం యోజయిష్యతి ||

25

అపవాహ్య స దుష్టాత్మా భరతం తవ బంధుషు |
కాల్యే స్థాపయితా రామం రాజ్యే నిహతకంటకే ||

26

శత్రుః పతిప్రవాదేన మాత్రేవ హితకామ్యయా |
ఆశీవిష ఇవాంకేన బాలే పరిహృతస్త్వయా ||

27

యథా హి కుర్యాత్సర్పో వా శత్రుర్వా ప్రత్యుపేక్షితః |
రాజ్ఞా దశరథేనాద్య సపుత్రా త్వం తథా కృతా ||

28

పాపేనానృతసాంత్వేన బాలే నిత్యసుఖోచితే |
రామం స్థాపయతా రాజ్యే సానుబంధా హతా హ్యసి ||

29

సా ప్రాప్తకాలం కైకేయి క్షిప్రం కురు హితం తవ |
త్రాయస్వ పుత్రమాత్మానం మాం చ విస్మయదర్శనే ||

30

మంథరాయా వచః శ్రుత్వా శయనాత్సా శుభాననా |
ఉత్తస్థౌ హర్షసంపూర్ణా చంద్రలేఖేవ శారదీ ||

31

అతీవ సా తు సంహృష్టా కైకేయీ విస్మయాన్వితా |
ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభమ్ ||

32

దత్త్వా త్వాభరణం తస్యై కుబ్జాయై ప్రమదోత్తమా |
కైకేయీ మంథరాం దృష్ట్వా పునరేవాబ్రవీదిదమ్ ||

33

ఇదం తు మంథరే మహ్యమాఖ్యాసి పరమం ప్రియమ్ |
ఏతన్మే ప్రియమాఖ్యాతం భూయః కిం వా కరోమి తే ||

34

రామే వా భరతే వాఽహం విశేషం నోపలక్షయే |
తస్మాత్తుష్టాఽస్మి యద్రాజా రామం రాజ్యేఽభిషేక్ష్యతి ||

35

న మే పరం కించిదితస్త్వయా పునః
ప్రియం ప్రియార్హే సువచం వచో వరమ్ |
తథా హ్యవోచస్త్వమతః ప్రియోత్తరం
పరం వరం తే ప్రదదామి తం వృణు ||

36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తమః సర్గః ||

Ayodhya Kanda Sarga 7 Meaning In Telugu

దశరథుని ముగ్గురు భార్యలలో మూడవ భార్య కైక. కేకయ రాజ కుమార్తె. ఆమెకు దశరథునితో వివాహం అయిన తరువాత ఆమెకు తోడుగా మంథర అనే దాసి ఆమె వెంట అయోధ్యకు వచ్చింది. మంధర కైకేయికి ఆంతరంగిక దాసి. సలహాదారు. అటువంటి మంధర ఆ రోజు మేడమీదికి ఎక్కి అయోధ్యానగరాన్ని చూచింది. అయోధ్య అంతా కోలాహలంగా కనపడింది. రాజమార్గములు అన్నీ తోరణముల తోనూ పతాకములతోనూ అలంకరింపబడి ఉన్నాయి. పౌరులందరూ హడావిడిగా రాచ నగరుకు వస్తున్నారు.

ఇదంతా చూచిన మంథరకు ఏమి జరుగుతూ ఉందో అర్ధం కాలేదు. పక్కను ఉన్న ఒక దాసీని పిలిచి “అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంది? ఆ కౌసల్య ఒట్టి పిసినారి కదా. ఆమె కూడా దానధర్మములు చేస్తూ ఉందా? ఏమి కారణం? దశరథుడు ఏమైనా ఘనకార్యం చేసాడా!” అని అడిగింది.

ఆ దాసి మంథరతో ఇలా అంది. ” అవును. దశరథమహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామునికి యువరాజుగా పట్టాభిషేకము జరిపిస్తున్నాడు.” అని చెప్పి హడావిడిగా వెళ్లిపోయింది.

ఎదుటి వారి ఉన్నతిని చూచి ఓర్వలేని మంథర లో కోపము, అసూయ ప్రవేశించాయి. వెంటనే విసా విసా కైకేయి మందిరమునకు వెళ్లింది. ఆ సమయంలో కైకేయి మెత్తటి పరుపు మీద పడుకొని ఉంది.

కైకను చూచి మంథర కోపంతో “ఓసి తెలివితక్కువదానా! బయట కొంపలు మునుగుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా పడుకొని ఉన్నావా! నీకు రాబోయే ఆపదలు నీకు తెలియడం లేదు.” అని అంది మంథర

కైకకు ఏమీ అర్థం కాలేదు. మంథర వంక ఏమి జరిగింది అన్నట్టు చూచింది.

“అయ్యో నీకు ఇంకా ఏమీ అర్థం కాలేదా! నీ భర్తకు నీవు అత్యంత ప్రియమైన భార్యవు అని అనుకుంటున్నావా! కాదమ్మా కాదు. ఎన్నటికీ కాదు. అదంతా నీ భ్రమ. నీ సౌభాగ్యం అంతా ఎండాకాలంలో నీటి మడుగు వలె ఎంది పోయిందే తల్లీ” అని పరుషంగా మాట్లాడింది మంథర.

ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది. “మంథరా! ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు! అసలు నీకు ఇంత కోపం దుఃఖం ఎలా కలిగింది. ఎందుకు కలిగింది. కాస్త వివరంగా చెప్పవే” అంది కైక. ఆమాటలకు ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మంథర.

‘ఏం చెప్పమంటావే తల్లీ! నీ కొంప నట్టేట మునిగింది. నీకు అంతులేని కష్టం వచ్చి పడింది. నీకు ఈ విషయం తెలుసా. దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేస్తున్నాడట. నీతో ఒక మాటన్నా అన్నాడు. నీ అనుమతి తీసుకున్నాడా.” అని సన్న సన్నగా నొక్కుతూ అంది.

“అసలు ఆ విషయం తెలియగానే నాకు ఒళ్లంతా మండి పోయింది అనుకో! పట్టరాని దు:ఖంలో మునిగిపోయాను. నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నీవేమో తీరుబడిగా పడుకొని ఉన్నావు. నీకు చీమ కుట్టినట్టయినా లేదు.

అమ్మ కైకా! నేను నీ వెంట ఇంత దూరం వచ్చాను కదా. నీ సుఖం నా సుఖం అనీ, నీ కష్టం నా కష్టం అనుకొని ఇన్నాళ్లు నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాను కదా! అయ్యో! రాజ వంశంలో పుట్టి దశరథమహారాజు గారికి ముద్దుల భార్య వు అయి ఉండీ రాచనగరులో జరిగే కుట్రలు తెలుసుకోలేకపోతే ఎలాగా! నీ భర్త నీతో పైపైన ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూ ప్రేమగా మాట్లాడుతున్నా, లోలోపల నీకు తీరని అపకారం చేస్తున్నాడమ్మా. అది నీవు గ్రహించలేక పోతున్నావు.

అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. నీవు అసలే అమాయకురాలివి. తెల్లనివి అన్నీ పాలు నల్లనివి అన్నీ నీళ్లు అని నమ్ముతావు. అందుకే నీ భర్త నీకు ఇంత ద్రోహం, మోసం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నావు. పైపై ఇచ్చకపు మాటలు నీకు, ప్రయోజనాలన్నీ కౌసల్యకు. ఇదమ్మా నీ భర్త వరస. అందుకే కాస్త నా మాట విను. నీ భర్త, నీ కుమారుడు భరతుని, శత్రుఘ్నుని వాళ్ల మేనమామ గారి ఇంటికి పంపాడా. ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు. భరతుని అడ్డు తొలగించుకొని రాజ్యం అంతా రామునికి కట్టబెడుతున్నాడు.

ఏమోనమ్మా! పామును పక్కలో పెట్టుకొని పడుకుంటున్నావు. అది అదునుచూచి కాటేసింది. నీ విషయంలో దశరథుడు అదే చేసాడు. నీకేమో కోరినవి అన్నీ తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్టు నటిస్తూ, నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు. రామునికి పట్టాభిషేకం చేసి నీకూ నీ కుమారునికీ తీరని అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఓ కైకా! ఇప్పటి కన్నా మేలుకో. ఏదో ఒకటి చెయ్యి ఈ పట్టాభిషేకమును ఆపు. నిన్ను నీ కుమారుడు భరతుని రక్షించుకో అంది మంథర కైకను ఓరగా చూస్తూ.

కైక “మంథరా!” అని అరిచింది. కైకకు రామ పట్టాభిషేకము అని మాత్రం వినబడింది. మిగిలిన మాటలు ఏమీ వినబడలేదు. “ఏమన్నావే! నా రామునికి పట్టాభిషేకమా! ఎంతటి శుభవార్త చెప్పావే. ఇదుగో ఈ ఆభరణం కానుకగా తీసుకో. ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు ఇది చాలా ఇంకా ఏమన్నా కావాలా” అంటూ తనమెడలోని హారాన్ని మంథరకు కానుకగా ఇచ్చింది. కైక మనస్సు ఆనంద డోలికలలో తేలిపోతూ ఉంది.

“మంథరా! నాకు రాముడన్నా భరతుడన్నా ఒకటేనే. ఇద్దరూ నాకు సమానమే. అందుకే నా భర్త రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు అని తెలిసి నా హృదయం ఆనందంతో ఊగిపోతూ ఉంది. అబ్బా! నీవు కూడా ఆనందంగా ఉండవే. మనకు ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు. అడగవే. నీకే కావాలో అడుగు. కాదనకుండా ఇస్తాను.” అని సంతోషంతో మంథరను పట్టుకొని ఊపుతూ కేరింతలు కొట్టింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టమః సర్గః (8) >>

Ayodhya Kanda Sarga 22 In Telugu | అయోధ్యాకాండ ద్వావింశః సర్గః

Ayodhya Kanda Sarga 22 In Telugu

అయోధ్యా కాండ మహాకావ్యం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ కాండలో రాముడికి జరిగే పలు సంఘటనలు వివరించబడినాయి. సర్గ 22లో, దశరథ మహారాజు రాముడిని అరణ్యవాసం చేయడానికి ప్రస్తుతిస్తారు. ఈ పరిణామం కారణంగా కౌసల్య మరియు సుమిత్ర విపరీతంగా బాధపడుతారు. రాముడు తండ్రి ఆజ్ఞను పాటిస్తూ, సీత మరియు లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి వెళ్లే నిర్ణయం తీసుకుంటాడు. ఈ భాగంలో కథానాయికలు వారి భావోద్వేగాలను మరియు కఠిన సమయాలను ఎలా ఎదుర్కొంటారో వివరిస్తారు.

దైవప్రాబల్యమ్

అథ తం వ్యథయా దీనం సవిశేషమమర్షితమ్ |
శ్వసంతమివ నాగేంద్రం రోషవిస్ఫారితేక్షణమ్ ||

1

ఆసాద్య రామః సౌమిత్రిం సుహృదం భ్రాతరం ప్రియమ్ |
ఉవాచేదం స ధైర్యేణ ధారయన్సత్త్వమాత్మవాన్ ||

2

నిగృహ్య రోషం శోకం చ ధైర్యమాశ్రిత్య కేవలమ్ |
అవమానం నిరస్యేమం గృహీత్వా హర్షముత్తమమ్ ||

3

ఉపక్లుప్తం హి యత్కించిదభిషేకార్థమద్య మే |
సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయమ్ ||

4

సౌమిత్రే యోఽభిషేకార్థే మమ సంభారసంభ్రమః |
అభిషేకనివృత్త్యర్థే సోఽస్తు సంభారసంభ్రమః ||

5

యస్యా మదభిషేకార్థే మానసం పరితప్యతే |
మాతా మే సా యథా న స్యాత్సవిశంకా తథా కురు ||

6

తస్యాః శంకామయం దుఃఖం ముహూర్తమపి నోత్సహే |
మనసి ప్రతిసంజాతం సౌమిత్రేఽహముపేక్షితుమ్ ||

7

న బుద్ధిపూర్వం నాబుద్ధం స్మరామీహ కదాచన |
మాతౄణాం వా పితుర్వాఽహం కృతమల్పం చ విప్రియమ్ ||

8

సత్యః సత్యాభిసంధశ్చ నిత్యం సత్యపరాక్రమః |
పరలోకభయాద్భీతో నిర్భయోఽస్తు పితా మమ ||

9

తస్యాపి హి భవేదస్మిన్కర్మణ్యప్రతిసంహృతే |
సత్యం నేతి మనస్తాపస్తస్య తాపస్తపేచ్చ మామ్ ||

10

అభిషేకవిధానం తు తస్మాత్సంహృత్య లక్ష్మణ |
అన్వగేవాహమిచ్ఛామి వనం గంతుమితః పునః ||

11

మమ ప్రవ్రాజనాదద్య కృతకృత్యా నృపాత్మజ |
సుతం భరతమవ్యగ్రమభిషేచయితా తతః ||

12

మయి చీరాజినధరే జటామండలధారిణి |
గతేఽరణ్యం చ కైకేయ్యా భవిష్యతి మనఃసుఖమ్ ||

13

బుద్ధిః ప్రణీతా యేనేయం మనశ్చ సుసమాహితమ్ |
తం తు నార్హామి సంక్లేష్టుం ప్రవ్రజిష్యామి మాచిరమ్ ||

14

కృతాంతస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే |
రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తనే ||

15

కైకేయ్యాః ప్రతిపత్తిర్హి కథం స్యాన్మమ పీడనే |
యది భావో న దైవోఽయం కృతాంతవిహితో భవేత్ ||

16

జానాసి హి యథా సౌమ్య న మాతృషు మమాంతరమ్ |
భూతపూర్వం విశేషో వా తస్యా మయి సుతేఽపి వా ||

17

సోఽభిషేకనివృత్త్యర్థైః ప్రవాసార్థైశ్చ దుర్వచైః |
ఉగ్రైర్వాక్యైరహం తస్యాః నాన్యద్దైవాత్సమర్థయే ||

18

కథం ప్రకృతిసంపన్నా రాజపుత్రీ తథాగుణా |
బ్రూయాత్సా ప్రాకృతేవ స్త్రీ మత్పీడాం భర్తృసన్నిధౌ ||

19

యదచింత్యం తు తద్దైవం భూతేష్వపి న హన్యతే |
వ్యక్తం మయి చ తస్యాం చ పతితో హి విపర్యయః ||

20

కశ్చ దైవేన సౌమిత్రే యోద్ధుముత్సహతే పుమాన్ |
యస్య న గ్రహణం కించిత్కర్మణోఽన్యత్ర దృశ్యతే ||

21

సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ |
యచ్చ కించిత్తథాభూతం నను దైవస్య కర్మ తత్ ||

21

ఋషయోఽప్యుగ్రతపసో దైవేనాభిప్రపీడితాః |
ఉత్సృజ్య నియమాంస్తీవ్రాన్ భ్రశ్యంతే కామమన్యుభిః ||

22

అసంకల్పితమేవేహ యదకస్మాత్ప్రవర్తతే |
నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్ ||

23

ఏతయా తత్త్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మనా |
వ్యాహతేఽప్యభిషేకే మే పరితాపో న విద్యతే ||

24

తస్మాదపరితాపః సంస్త్వమప్యనువిధాయ మామ్ |
ప్రతిసంహారయ క్షిప్రమాభిషేచనికీం క్రియామ్ ||

25

ఏభిరేవ ఘటైః సర్వైరభిషేచనసంభృతైః |
మమ లక్ష్మణ తాపస్యే వ్రతస్నానం భవిష్యతి ||

26

అథవా కిం మమైతేన రాజద్రవ్యమతేన తు |
ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి ||

27

మా చ లక్ష్మణ సంతాపం కార్షిర్లక్ష్మ్యా విపర్యయే |
రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయః ||

28

న లక్ష్మణాస్మిన్ఖలు కర్మవిఘ్నే
మాతా యవీయస్యతిశంకనీయా |
దైవాభిపన్నా హి వదత్యనిష్టం
జానాసి దైవం చ తథాప్రభావమ్ ||

29

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వావింశః సర్గః

Ayodhya Kanda Sarga 22 Meaning In Telugu

రాముడు ధృఢచిత్తంతో ఉన్నాడు. తనకు కావలసిన -పట్టాభిషేకము అర్ధాంతరంగా ఆగిపోయినా చలించలేదు. తన లోపల ఉన్న భావాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్న లక్ష్మణునితో ఇలా అన్నాడు.
“తమ్ముడా లక్ష్మణా! నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపము -ప్రదర్శించడానికి ఇది సమయము కాదు. ధైర్యంగా ఉండు.

ఆనందంగా ఉండు. ఈరోజు నాకు పట్టాభిషేకము అన్న విషయము -మరిచిపో. నా పట్టాభిషేకమునకు సేకరించిన వస్తువులు అన్నీ పక్కన పెట్టు. పాపము నా తల్లి కైక నాకు పట్టాభిషేకము జరుగబోవుచున్నది అని బాధపడిపోతూ ఉంది. ఆమె బాధను మనము పోగొట్టాలి. -పట్టాభిషేకము ఆగిపోయింది అని ఆమెకు తెలియజెయ్యాలి.

ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ, అనుమానము ఉంటే నేను -సహించలేను. నేను పుట్టిన తరువాత నా తల్లులకు గానీ నా తండ్రికి గానీ మనసు బాధపెట్టలేదు. నా తండ్రి సత్యమునే పలుకుతాడు. ఆడిన మాట తప్పడు. ఆయన నా తల్లి కైకకు ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యము.

మీరు అనుకున్నట్టు నాకు పట్టాభిషేకము జరిగితే నా తండ్రి నా తల్లి కైకకు ఇచ్చిన మాట తప్పిన వాడు అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి, నా పట్టాభిషేక కార్యక్రమమును ఇంతటితో నిలిపివేసి వెంటనే అరణ్యములకు వెళ్లే పనిలో ఉంటాను. అదే నా ప్రస్తుత కర్తవ్యము. నేను అడవులకు వెళితే నా తల్లి కైక మనస్సు శాంతిస్తుంది. ఆమె పరిపూర్ణంగా సంతోషిస్తుంది. తన కుమారుడు భరతునికి నిర్విఘ్నంగా పట్టాభిషేకము జరిపించు కుంటుంది.

లక్ష్మణా! నీకు తెలుసో లేదో. మన తండ్రిగారు కూడా ఈ నిర్ణయాన్ని చాలా బాధతో తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం అమలు పరచడం మన బాధ్యత. మనం ఇంకొక విషయం మరిచి పోకూడదు. నేను కోరుకోకుండానే నా పట్టాభిషేకము నిర్ణయం అయింది. కాని అది అర్థాంతరంగా ఆగిపోయింది. ఇది కూడా నా ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ విచిత్ర పరిణామాలకు ఎవరూ కారణం కాదు. ఎవరినీ తప్పుపట్టనవసరం లేదు. ఇది అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోవాలి.

మన తల్లి కైకకు నా పట్టాభిషేకము ఆపించవలెనని ఆ దైవమే బుద్ధిపుట్టించి ఉంటుంది. లేకపోతే ఇదివరలో ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాటకూడా అనని మన తల్లి కైక, నాకు ఎందుకు ఈ రకమైన బాధ, కష్టం కలిగిస్తుంది. నన్ను అడవులకు పొమ్మని శాసిస్తుంది. నేను నా తల్లి కైకకు ఎన్నడూ మనసుకు కష్టం కలిగించి ఎరుగను. అలాగే నా తల్లి కైక నన్ను, తన కుమారుడు భరతుని ఎన్నడూ బేధబుద్ధితో చూడలేదు. మాఇద్దరినీ సమానంగా చూచింది. ఇవన్నీ నీకూ తెలుసు.

కాబట్టి లక్ష్మణా! కైక నా గురించి పరుషంగా మాట్లాడటంగానీ, నా పట్టాభిషేకమును నిలిపివేయడం గానీ, ఆమె స్వతాహాగా చేసినది కాదు. అంతా దైవ నిర్ణయం. లేకపోతే ఉత్తమ రాజవంశము లో పుట్టిన కైక, ఒక సామాన్య స్త్రీ వలె, తన భర్తముందు, పట్టాభిషేకము చేసుకోబోవు తన కుమారుని తూలనాడుతుందా! అతని పట్టాభి షేకమును ఆపిస్తుందా! ఆ మె విపరీత ప్రవర్తనకు దైవమే కారణము కానీ వేరుకాదు.

దైవ నిర్ణయములు చాలా కఠినంగా ఉంటాయి. దైవ నిర్ణయాన్ని అడ్డుకోడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమని కోరింది. ఆ దైవనిర్ణయాన్ని అమలు పరచడం నా కర్తవ్యం. దైవము ఎలా నడిపిస్తే అలా నడవడం మన కర్తవ్యం. అలాంటి దైవ నిర్ణయానికి ఎవడు ఎదురీదగలడు?

లక్ష్మణా! మనము ఏదో చేస్తున్నాము ఏదో సాధిస్తున్నాము అని అనుకుంటాము. అది పొరపాటు. మనకు అనుదినమూ కలిగే సుఖదు:ఖాలు, భయము, క్రోధమూ, లాభనష్టాలూ, ఉండటం, లేకపోవడం, ఇవి అన్నీ దైవ నిర్ణయంబట్టి జరుగుతూ ఉంటాయి. మానవుల ప్రమేయము ఏమీ లేదు.

పూర్వము ఇంద్రియములను జయించాము అని చెప్పుకొన్న మహాఋషులు కూడా దైవప్రేరితులై, కామ కోరికలకు లోబడి, తమ తపస్సులను నాశనం చేసుకున్నారు. ఏదైనా ఒక పని మనము సంకల్పించినపుడు. ఆ పని పూర్తి కావచ్చే సమయంలో ఏదైనా అడ్డు తగిలితే దానిని దైవనిర్ణయంగానే భావించాలి.

కాబట్టి ఇంకొంచెం సేపటిలో జరుగబోవు నా పట్టాభి షేకము, ఏ కారణం చేతనైనా, ఆగిపోయింది అంటే అది దైవనిర్ణయమే గాని వేరు కాదు. నా పట్టాభిషేకము అగిపోయినందుకు నాకు ఎలాంటి దుఃఖము లేదు. నేను బాధపడటం లేదు. నీవు కూడా నీ మనసులో ఉన్న బాధను తీసి వెయ్యి. వెంటనే పట్టాభిషేకమునకు జరుగుచున్న పనులను నిలిపివెయ్యి.

లక్ష్మణా! నా పట్టాభిషేకము కొరకు సముద్రముల నుండి పవిత్ర పుణ్య నదీనదముల నుండి తెచ్చిన నీటితో నేను రేపటినుండి గడపబోవు తాపస వ్రతమునకు దీక్షా స్నానం చేస్తాను. అయినా వద్దులే. ఎక్కడెక్కడి నుంచో అతి కష్టం మీద తెచ్చిన ఈ పుణ్య నదీజలములు నాకు ఎందుకు. నేను బావిలో నుండి నీరు తోడుకొని స్నానం చేస్తాను. రేపటి నుండి నేను అలా చెయ్యాలి కదా!

తమ్ముడూ! నాకు రాజ్యలక్ష్మి లభించలేదని బాధ పడకు. దానికి బదులు నాకు వనలక్ష్మి లభించిందని సంతోషించు. నా దృష్టిలో రెండూ ఒకటే.” అని అని లక్ష్మణుని అనునయించాడు రాముడు.

అయోధ్యాకాండ త్రయోవింశః సర్గః (౨౩) >>

Ayodhya Kanda Sarga 6 In Telugu – అయోధ్యాకాండ షష్ఠః సర్గః

Ayodhya Kanda Sarga 6 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. షష్ఠః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.

పౌరోత్సేకః

గతే పురోహితే రామః స్నాతో నియతమానసః |
సహ పత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాగమత్ ||

1

ప్రగృహ్య శిరసా పాత్రీం హవిషో విధివత్తదా |
మహతే దైవతాయాజ్యం జుహావ జ్వలితేఽనలే ||

2

శేషం చ హవిషస్తస్య ప్రాశ్యాశాస్యాత్మనః ప్రియమ్ |
ధ్యాయన్నారాయణం దేవం స్వాస్తీర్ణే కుశసంస్తరే ||

3

వాగ్యతః సహ వైదేహ్యా భూత్వా నియతమానసః |
శ్రీమత్యాయతనే విష్ణోః శిశ్యే నరవరాత్మజః ||

4

ఏకయామావశిష్టాయాం రాత్ర్యాం ప్రతివిబుధ్య సః |
అలంకారవిధిం కృత్స్నం కారయామాస వేశ్మనః ||

5

తత్ర శృణ్వన్సుఖా వాచః సూతమాగధవందినామ్ |
పూర్వాం సంధ్యాముపాసీనో జజాప యతమానసః ||

6

తుష్టావ ప్రణతశ్చైవ శిరసా మధుసూదనమ్ |
విమలక్షౌమసంవీతో వాచయామాస చ ద్విజాన్ ||

7

తేషాం పుణ్యాహఘోషోఽథ గంభీరమధురస్తదా |
అయోధ్యాం పూరయామాస తూర్యఘోషానునాదితః ||

8

కృతోపవాసం తు తదా వైదేహ్యా సహ రాఘవమ్ |
అయోధ్యానిలయః శ్రుత్వా సర్వః ప్రముదితో జనః ||

9

తతః పౌరజనః సర్వః శ్రుత్వా రామాభిషేచనమ్ |
ప్రభాతాం రజనీం దృష్ట్వా చక్రే శోభయితుం పురీమ్ ||

10

సితాభ్రశిఖరాభేషు దేవతాయతనేషు చ |
చతుష్పథేషు రథ్యాసు చైత్యేష్వట్టాలకేషు చ ||

11

నానాపణ్యసమృద్ధేషు వణిజామాపణేషు చ |
కుటుంబినాం సమృద్ధేషు శ్రీమత్సు భవనేషు చ ||

12

సభాసు చైవ సర్వాసు వృక్షేష్వాలక్షితేషు చ |
ధ్వజాః సముచ్ఛ్రితాశ్చిత్రాః పతాకాశ్చాభవంస్తదా ||

13

నటనర్తకసంఘానాం గాయకానాం చ గాయతామ్ |
మనఃకర్ణసుఖా వాచః శుశ్రువుశ్చ తతస్తతః ||

14

రామాభిషేకయుక్తాశ్చ కథాశ్చక్రుర్మిథో జనాః |
రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ ||

15

బాలా అపి క్రీడమానాః గృహద్వారేషు సంఘశః |
రామాభిషేకసంయుక్తాశ్చక్రురేవ మిథః కథాః ||

16

కృతపుష్పోపహారశ్చ ధూపగంధాధివాసితః |
రాజమార్గః కృతః శ్రీమాన్పౌరై రామాభిషేచనే ||

17

ప్రకాశీకరణార్థం చ నిశాగమనశంకయా |
దీపవృక్షాంస్తథా చక్రురనురథ్యాసు సర్వశః ||

18

అలంకారం పురస్యైవం కృత్వా తత్పురవాసినః |
ఆకాంక్షమాణా రామస్య యౌవరాజ్యాభిషేచనమ్ ||

19

సమేత్య సంఘశః సర్వే చత్వరేషు సభాసు చ |
కథయంతో మిథస్తత్ర ప్రశశంసుర్జనాధిపమ్ ||

20

అహో మహాత్మా రాజాయమిక్ష్వాకుకులనందనః |
జ్ఞాత్వా యో వృద్ధమాత్మానం రామం రాజ్యేఽభిషేక్ష్యతి ||

21

సర్వే హ్యనుగృహీతాః స్మ యన్నో రామో మహీపతిః | [సర్వేప్య]
చిరాయ భవితా గోప్తా దృష్టలోకపరావరః ||

22

అనుద్ధతమనా విద్వాన్ధర్మాత్మా భ్రాతృవత్సలః |
యథా చ భ్రాతృషు స్నిగ్ధస్తథాస్మాస్వపి రాఘవః ||

23

చిరం జీవతు ధర్మాత్మా రాజా దశరథోఽనఘః |
యత్ప్రసాదేనాభిషిక్తం రామం ద్రక్ష్యామహే వయమ్ ||

24

ఏవం‍విధం కథయతాం పౌరాణాం శుశ్రువుస్తదా |
దిగ్భ్యో విశ్రుతవృత్తాంతాః ప్రాప్తా జానపదా జనాః || [దిగ్భ్యోఽపి]

25

తే తు దిగ్భ్యః పురీం ప్రాప్తాః ద్రష్టుం రామాభిషేచనమ్ |
రామస్య పూరయామాసుః పురీం జానపదా జనాః ||

26

జనౌఘైస్తైర్విసర్పద్భిః శుశ్రువే తత్ర నిస్వనః |
పర్వసూదీర్ణవేగస్య సాగరస్యేవ నిస్వనః ||

27

తతస్తదింద్రక్షయసన్నిభం పురం
దిదృక్షుభిర్జానపదైరుపాగతైః |
సమంతతః సస్వనమాకులం బభౌ
సముద్రయాదోభిరివార్ణవోదకమ్ ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠః సర్గః ||

Ayodhya Kanda Sarga 6 Meaning In Telugu

వసిష్ఠుడు తన మందిరము నుండి వెళ్లిపోయిన తరువాత రాముడు, సీతతో కలిసి మంగళ స్నానము చేసి, భక్తితో శ్రీ మహా విష్ణువును పూజించాడు. తరువాత అగ్నికార్యము నిర్వర్తించాడు. శ్రీ మహావిష్ణు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హెూమం చేసాడు. అగ్నిలో వేల్చగా మిగిలిన హవిస్సును తాను భుజించాడు. తరువాత తన భార్య సీతతో కూడా దర్భలతో చేసిన చాప మీద పడుకున్నాడు.

మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు. తన మందిరమును చక్కగా అలంకరింపచేసాడు. ఇంతలో వంది మాగధులు వచ్చి స్తోత్రపాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు. రాముడు ప్రాతఃకాల సంధ్యావందనము నిర్వర్తించాడు. గాయత్రీ మాతను ఉపాసించాడు. బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేసారు.

రామపట్టాభిషేకము జరుగబోవుచున్నదని అయోధ్యా నగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు. పురమును అంతా అలంకరించారు. రాజ ప్రాసాదముల మీద, కార్యాలయముల మీద, దేవాలయముల మీద పతాకములను ఎగురవేసారు. గాయకులు పాటలు పాడుతున్నారు. నర్తకులు చక్కగా తయారయి రాజభవనమునకు వెళ్లుటకు సిద్ధమవుతున్నారు. నర్తకులు నర్తిస్తున్నారు. అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడు కుంటున్నారు. ఎవరి నోట విన్నా రాముని గుణగణములు, రామ పట్టాభిషేకము గురించి మాటలు వినబడుతున్నాయి. రామ పట్టాభిషేకం గురించి తప్ప ఎవరూ మరొక మాట మాట్లాడుకోవడం లేదు. రామ పట్టాభిషేక మహోత్సవము ఎంతసేపు జరుగుతుందో, చీకటి పడుతుందేమో అని పట్ట పగలే చిత్ర విచిత్రములైన దీపములు వీధులలో వెలిగించి పెట్టారు.

తాను వృద్ధుడైన సంగతి ఎరింగి దశరథుడు తగిన నిర్ణయం తీసుకొన్నాడని, ఇంక నుంచి రాముని పాలనలో తాము సుఖ సంతోషాలు అనుభవిస్తామని అయోధ్యావాసులు పొంగిపోతున్నారు. రాముడు తామందరినీ తన సోదరుల మాదిరి వాత్సల్యముతో ఆదరిస్తాడని జనులంతా ఆనంద పరవశులౌతున్నారు. రాముని పట్టాభిషేక వార్త విన్న చుట్టుపక్కల జనపదములలో నివసించు జానపదులు తండోప తండములుగా అయోధ్యకు తరలి వస్తున్నారు. వారందరితోటీ అయోధ్యానగరము క్రిక్కింరిసిపోయింది. వారందరూ మాట్లాడుకుంటూ కేరింతలు కొడుతుంటే వారి ఘోష సముద్రఘోషను మరిపిస్తూ ఉంది. ఆ రోజు అయోధ్యానగరము మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

వాల్మీకి రామాయణంలో ఈ విధంగా ఉంటే వ్యాసుడు రచించిన బ్రహ్మాండపురాణంలో భాగమయిన ఆధ్యాత్మ రామాయణంలో ఒక కొత్త విషయం ఉంది. అదేమి టంటే…..

ఒక రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. రాముని తో ఇలా అన్నాడు. “ఓ రామా! నన్ను బ్రహ్మ నీవద్దకుపంపాడు. నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకము చేయవలెనని నిశ్చయించాడు. కాని నీ జననము రావణ సంహారము కొరకు జరిగినది కదా! నీవు రాజ్యపాలన చేస్తుంటే, రావణ సంహారము మాటేమిటి? భూభారము తగ్గించుటకు నీకు రాక్షస సంహారము చేయవలయును కదా! రామా! నీవు దేని కొరకు అవతరించితివో ఆ విషయము మరిచిపోవద్దు” అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు. “నారదమహర్షీ! నాకు తెలియని విషయము ఏమున్నది. నేను ఆడిన మాట తప్పను. రాక్షస సంహారము చేసెదను. కాలము తీరిన దైత్యులను సంహరించెదను. రేపే దండకారణ్య ప్రయాణము. పదునాలుగు సంవత్సరములు అరణ్య వాసము చేసెదను. సీతాపహరణము మిషతో రావణుని సంహరించెదను.. ఇది సత్యము.” అని రాముడు నారదునితో అన్నాడు. రాముని మాటలకు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. (ఇక్కడ రాముడు సామాన్య మానవుడు కాదు. కారణ జన్ముడు. సాక్షాత్తు విష్ణు అవతారము, భూత, భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు అని చెప్పబడింది.)

తరువాత వసిష్ఠుడు రామునితో ఉపవాసవ్రతము చేయించిన తరువాత వెళ్లిపోయాడు. ఆ సమయంలో దేవలోకంలో దేవతలు సరస్వతీదేవి వద్దకు వెళ్లారు. “అమ్మా సరస్వతీ దేవీ! నీవు ఇప్పుడు వెంటనే భూలోకమునకు వెళ్లాలి. నీవు రామునికి జరుగబోవు పట్టాభిషేకమునకు విఘ్నము కలిగించాలి. ఇది బ్రహ్మదేవుని ఆదేశము. అమ్మా! నీవు ముందుగా మంధర అనే దాసి వాక్కులో ప్రవేశించాలి. తరువాత కైకేయి వాక్కులో ప్రవేశించాలి. శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నము భగ్నము అయిన తరువాత మరలా తిరిగిరావాలి.” అని ప్రార్థించారు. సరస్వతీ దేవి దేవతల ప్రార్థన మన్నించి అయోధ్యా నగరమునకు వచ్చి మంధర వాక్కులో ప్రవేశించింది.

(ఈ సంఘటనలు మనకు ఆధ్యాత్మ రామాయణంలో కనపడతాయి. ఇంక ఈ సందర్భంలో తులసీరామాయణం లో ఏముందో తెలుసుకుందాము.)

అయోధ్యలో పౌరులందరూ రామపట్టాభిషేక సందర్భములో ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకములో దేవతలు విచారంగా ఉ న్నారు. వారందరూ సరస్వతీదేవి వద్దకు పోయి ఇలా అన్నారు.

“అమ్మా! రామ పట్టాభిషేకము జరుగబోవుచున్నది. నీవు ఎలాగైనా దానిని భగ్నము చేసి, రాముని అరణ్యములకు పంపాలి. దాని వలన దేవతల కార్యము సఫలమవుతుంది.” అని అన్నారు. ఆ మాటలకు సరస్వతీ దేవి నేను ఇటువంటి పాడు పని చెయ్యాలా అని చింతించింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అప్పుడు దేవతలు ఇలా అన్నారు.

“అమ్మ తమరు ఈ పని చేసినందువలన తమరికి ఏ దోషమూ అంటదు. ఇది దేవ కార్యము. రాముడు సామాన్య మానవుడు కాడు. భేదమోదములకు అతీతుడు. సుఖము దుఃఖము సామాన్య మానవులకు కానీ రామునికి అంటవు. కాబట్టి తమరు అయోధ్యకు వెళ్లాలి.” అని ప్రార్థించారు.

అప్పుడు సరస్వతీ దేవి తనలో తాను ఇలా అనుకొన్నది.

“ఆహా! ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు. వీరు ఉండేచోటు అత్యున్నత స్థానమైన స్వర్గము. కానీ వీరి బుద్ధులు మాత్రము పరమ నీచములు. ఇతరులు బాగుపడుతుంటే చూచి సహించలేరు. పోనీ. ఇదీ ఒకందుకు మంచిదే… రాముడు వనవాసము వెళితే రాక్షససంహారము జరుగుతుంది. రామాయణ కధ లోకంలో ప్రచారం అవుతుంది. ఎంతో మంది కవులు గాయకులు రామ కథను గానం చేస్తారు. నేను ఆ కవులు గాయకుల నాలుకల మీద నాట్యం చేస్తుంటాను. రామ కథను గానం చేస్తుంటాను. దీనివలన భూలోకంలో నా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.” అని అనుకొన్నది సరస్వతీ దేవి. దేవతల కోరిక ప్రకారము అయోధ్యకు వచ్చింది. ఇదీ తులసీరామాయణంలో ఉన్నకధ.

పై చెప్పిన కధా సంఘటనలు వాల్మీకి రామాయణంలో లేవు. రాముడు వనవాసమునకు పోవడంలో దేవరహస్యాలు ఏమీ లేవు. మామూలు మానవుల్లో ఎలా జరుగుతుందో అలా జరిగింది.

దశరథుడు భరతుడు ఇంటలేని సమయంలో కావాలనే రామ పట్టాభిషేకమునకు ముహూర్తము నిర్ణయించాడు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.

యుగధర్మము ప్రకారము రాజ్యము జ్యేష్టునికి చెందుతుంది. దశరథుని కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రామునికి పట్టాభిషేకం చెయ్యడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని భరతుడు ఏమైనా పేచీ పెడతాడేమో అని దశరథుడు సందేహించాడు. అందుకని భరతుడు లేని వేళ పట్టాభిషేకము నిర్ణయించాడు.

వాల్మీకి రామాయణము ప్రకారము ఇందులో దేవతల ప్రసక్తికానీ, దేవరహస్యము కానీ ఏమీలేవు.

అయోధ్యాకాండ సప్తమః సర్గః (7) >>

Balakanda Sarga 26 In Telugu – బాలకాండ షడ్వింశః సర్గః

Balakanda Sarga 26 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షడ్వింశః సర్గలో సీతాస్వయంవరంలోని ప్రధాన సంఘటనలు వివరించబడ్డాయి. జనక మహారాజు తన కుమార్తె సీతకు తగిన వరుడిని కనుగొనేందుకు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. అనేకమంది మహారథులు మరియు రాజులు శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలమవుతారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమవగా, శ్రీరాముడు ధనస్సును తూటాలకు విరచి తన శక్తిని ప్రదర్శిస్తాడు.

తాటకావధః

మునేర్వచనమక్లీబం శ్రుత్వా నరవరాత్మజః |
రాఘవః ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః ||

1

పితుర్వచననిర్దేశాత్పితుర్వచనగౌరవాత్ |
వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశంకయా ||

2

అనుశిష్టోఽస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా |
పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం చ తద్వచః ||

3

సోఽహం పితుర్వచః శ్రుత్వా శాసనాద్బ్రహ్మవాదినః |
కరిష్యామి న సందేహస్తాటకావధముత్తమమ్ ||

4

గోబ్రాహ్మణహితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ |
తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః ||

5

ఏవముక్త్వా ధనుర్మధ్యే బద్ధ్వా ముష్టిమరిందమః |
జ్యాఘోషమకరోత్తీవ్రం దిశః శబ్దేన నాదయన్ ||

6

తేన శబ్దేన విత్రస్తాస్తాటకావనవాసినః |
తాటకా చ సుసంక్రుద్ధా తేన శబ్దేన మోహితా ||

7

తం శబ్దమభినిధ్యాయ రాక్షసీ క్రోధమూర్ఛితా |
శ్రుత్వా చాభ్యద్రవద్వేగాద్యతః శబ్దో వినిఃసృతః ||

8

తాం దృష్ట్వా రాఘవః క్రుద్ధాం వికృతాం వికృతాననామ్ |
ప్రమాణేనాతివృద్ధాం చ లక్ష్మణం సోఽభ్యభాషత ||

9

పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః |
భిద్యేరన్దర్శనాదస్యా భీరూణాం హృదయాని చ ||

10

ఏనాం పశ్య దురాధర్షాం మాయాబలసమన్వితామ్ |
వినివృత్తాం కరోమ్యద్య హృతకర్ణాగ్రనాసికామ్ ||

11

న హ్యేనాముత్సహే హంతుం స్త్రీస్వభావేన రక్షితామ్ |
వీర్యం చాస్యా గతిం చాపి హనిష్యామీతి మే మతిః ||

12

ఏవం బ్రువాణే రామే తు తాటకా క్రోధమూర్ఛితా |
ఉద్యమ్య బాహూ గర్జంతీ రామమేవాభ్యధావత ||

13

విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిర్హుంకారేణాభిభర్త్స్య తామ్ |
స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత ||

14

ఉద్ధూన్వానా రజో ఘోరం తాటకా రాఘవావుభౌ |
రజోమోహేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్ ||

15

తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ |
అవాకిరత్సుమహతా తతశ్చుక్రోధ రాఘవః ||

16

శిలావర్షం మహత్తస్యాః శరవర్షేణ రాఘవః |
ప్రతిహత్యోపధావంత్యాః కరౌ చిచ్ఛేద పత్రిభిః ||

17

తతశ్ఛిన్నభుజాం శ్రాంతామభ్యాశే పరిగర్జతీమ్ |
సౌమిత్రిరకరోత్క్రోధాద్ధృతకర్ణాగ్రనాసికామ్ ||

18

కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః |
అంతర్ధానం గతా యక్షీ మోహయంతి చ మాయయా ||

19 [స్వమాయయా]

అశ్మవర్షం విముంచంతీ భైరవం విచచార సా |
తతస్తావశ్మవర్షేణ కీర్యమాణౌ సమంతతః ||

20

దృష్ట్వా గాధిసుతః శ్రీమానిదం వచనమబ్రవీత్ |
అలం తే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణీ ||

21

యజ్ఞవిఘ్నకరీ యక్షీ పురా వర్ధేత మాయయా |
వధ్యతాం తావదేవైషా పురా సంధ్యా ప్రవర్తతే ||

22

రక్షాంసి సంధ్యాకాలేషు దుర్ధర్షాణి భవంతి హి |
ఇత్యుక్తస్తు తదా యక్షీమశ్మవృష్ట్యాభివర్షతీమ్ ||

23

దర్శయన్ శబ్దవేధిత్వం తాం రురోధ స సాయకైః |
సా రుద్ధా శరజాలేన మాయాబలసమన్వితా ||

24

అభిదుద్రావ కాకుత్స్థం లక్ష్మణం చ వినేషుదీ |
తామాపతంతీం వేగేన విక్రాంతామశనీమివ ||

25

శరేణోరసి వివ్యాధ సా పపాత మమార చ |
తాం హతాం భీమసంకాశాం దృష్ట్వా సురపతిస్తదా ||

26

సాధు సాధ్వితి కాకుత్స్థం సురాశ్చ సమపూజయన్ |
ఉవాచ పరమప్రీతః సహస్రాక్షః పురందరః ||

27

సురాశ్చ సర్వే సంహృష్టా విశ్వామిత్రమథాబ్రువన్ |
మునే కౌశిక భద్రం తే సేంద్రాః సర్వే మరుద్గణాః ||

28

తోషితాః కర్మణా తేన స్నేహం దర్శయ రాఘవే |
ప్రజాపతేః కృశాశ్వస్య పుత్రాన్సత్యపరాక్రమాన్ ||

29

తపోబలభృతాన్బ్రహ్మన్రాఘవాయ నివేదయ |
పాత్రభూతశ్చ తే బ్రహ్మంస్తవానుగమనే ధృతః ||

30

కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా |
ఏవముక్త్వా సురాః సర్వే జగ్ముర్హృష్టా యథాగతమ్ ||

31

విశ్వామిత్రం పురస్కృత్య తతః సంధ్యా ప్రవర్తతే |
తతో మునివరః ప్రీతస్తాటకావధతోషితః ||

32

మూర్ధ్ని రామముపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్ |
ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన ||

33

శ్వః ప్రభాతే గమిష్యామస్తదాశ్రమపదం మమ |
విశ్వామిత్రవచః శ్రుత్వా హృష్టో దశరథాత్మజః ||

34

ఉవాస రజనీం తత్ర తాటకాయా వనే సుఖమ్ |
ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని |
రమణీయం విబభ్రాజ యథా చైత్రరథం వనమ్ ||

35

నిహత్య తాం యక్షసుతాం స రామః
ప్రశస్యమానః సురసిద్ధసంఘైః |
ఉవాస తస్మిన్మునినా సహైవ
ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానః ||

36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షడ్వింశః సర్గః ||

Balakanda Sarga 26 Meaning In Telugu

విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు. ” ఓ మహర్షి! మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు. తమరు ఏమి చెబితే అలా చెయ్యమన్నాడు. నా తండ్రి గారి మాటను జవదాటలేను. అందుకే తమరి మాట నాకు శిరోధార్యము. తమరు ఏం చెబితే అలా చేస్తాను. గోవులు, బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, లోక క్షేమము కొరకు తమరు చెప్పినట్టే చేస్తాను.” అని పలికాడు రాముడు.

వెంటనే తన ధనుస్సు చేతిలోకి తీసుకున్నాడు. వింటి నారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటకా వనములోని వారందరి గుండెలు అదిరిపోయాయి. భయంతో గడా గడా వణికిపోయారు. ఆ శబ్దము విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దము వచ్చిన వైపుకు వచ్చింది.

వికారంగా ఉన్న తాటకిని చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణిని చూడు. పిరికి వాళ్లు అయితే ఆమెను చూచి గుండె ఆగి చనిపోతారు కదా! ఆమె మాయావి. అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాము. ఎందుకంటే ఈమె స్త్రీ. అదే ఈమెను రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమును నశింప చేస్తాను.” అని అన్నాడు రాముడు.

రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉండగానే తాటకి రాముని మీదికి గర్జిస్తూ దూకింది. ఇంతలో విశ్వామిత్రుడు కోపంతో హుంకరించాడు. తాటకిని అదిలించాడు. రామలక్ష్మణులకు స్వస్తి వాచకం పలికాడు. రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు.

విశ్వామిత్రుని హుంకారమునకు తాటకి భయపడలేదు. తన మాయా శక్తిచేత వారి మీద రాళ్ల వర్షము కురిపించింది. రాముడికి కోపం వచ్చింది. వెంటనే తాటకి మీద శరవర్షము కురిపించి ఆ రాళ్ల వర్షమును ఆపు చేసాడు.

తాటకి ఊరుకోలేదు. తన చేతులుచాచి రాముని మీదికి వచ్చింది. రాముడు తన బాణములతో తాటకి రెండు చేతులు ఖండించాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకొని తాటకి ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేసాడు. అయినా తాటకి ఊరుకోలేదు. తన మాయా శక్తితో వివిధము లైన ఆకారములను ధరించి మరలా రామ లక్ష్మణుల మీద రాళ్ల వర్షము కురిపించింది. రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూచాడు.

అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఆమె మీద జాలి చూపకు. ఈమె పాపాత్మురాలు. దుర్మార్గురాలు. ఈమె మాయావి. వివిధములైన రూపములను ధరించగలదు. రాత్రి సమీపించుచున్నది. ఈ లోపలే ఈమెను చంపి వెయ్యి సంధ్యాకాలములో రాక్షసుల బలం పెరుగుతుంది. త్వరపడు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేధి బాణాన్ని ఎక్కుపెట్టాడు.

(శబ్ద వేధి అంటే, టార్గెట్ కనిపించనపుడు, కేవలం శబ్దం ఆధారంగా, శబ్దమును విని టార్గెట్ ను కొట్టడం).

తాటక నుండి వచ్చు శబ్దమును బట్టి రాముడు బాణాన్ని విడిచాడు. ఆ బాణం సూటిగా తాటకిని తాకింది. రామ బాణం తగిలిన తాటకి రెట్టించిన కోపంతో రాముని మీదికి ఉరికింది. రాముడు మరొక బాణంతో తాటకి వక్షస్థలము మీద కొట్టాడు. ఆ బాణము సరిగా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది. తాటకి కిందపడి మరణించింది.

తాటకి మరణించడం చూచి దేవతలు అంతా సంతోషించారు. దేవతల అందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రుని తో ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! నీవు రాముని యందుఎక్కువ వాత్సల్యము చూపుము. భృశాశ్వునిచే సృష్టింప బడిన అస్త్ర శస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశింపుము. ఎందు కంటే రాముడు భవిష్యత్తులో లోక కంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది. ” అని పలికాడు.

తరువాత దేవేంద్రుడు దేవతలు వెళ్లిపోయారు. ఇంతలో సంధ్యాసమయము అయింది. తాటకను చంపిన రాముని సంతోషంతో చూచాడు విశ్వామిత్రుడు. వాత్సల్యంలో అతని తల నిమిరాడు.

‘ ఓ రామా! సంధ్యాసమయము అయినది. మనము ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయము మన ప్రయాణము కొన సాగిద్దాము” అని అన్నాడు. రామ లక్ష్మణులు దానికి అంగీకరించారు.

అందరూ ఆరాత్రికి తాటకా వనములో విశ్రమించారు. మరునాడు ఉదయము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొలిపాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ సప్తవింశః సర్గః (27) >>