మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు బాలోపనిషత్ గురించి తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. జబాలోపనిషత్ హిందూ ధర్మంలో ప్రముఖమైన వేదాంత శాస్త్రాలలో ఒకటి. ఇది మహాభారత గ్రంథంలో ఉపరిష్టాన పర్వములో కాపాలాయన ఉపనిషత్తో కలిగిన జబల్ ఆనంద గురువు ధౌమ్యులు ద్వారా చేతనం చేయబడింది. ఈ ఉపనిషత్తు ఆధ్యాత్మిక అన్వేషణలను, మార్గదర్శనను మరియు బ్రహ్మ జ్ఞానాన్ని ప్రస్తుతం చేస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు జాబాలోపనిషత్ గురించి తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు బిల్వోపనిషత్ గురించి తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. రాజశ్యామలారహస్యోపనిషత్ ఒక ముఖ్యమైన తాంత్రిక గ్రంథం, ఇది రాజశ్యామలా (మాతంగి దేవి)కి అంకితం చేయబడింది. ఇందులో ఆమెకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు, మూల మంత్రం, పూజ విధానం మరియు తంత్ర మంత్రాలు ఉంటాయి. ఈ ఉపనిషత్తు ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అభ్యుదయం, సృజనాత్మకత మరియు మానసిక శక్తులను పొందగలరు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు రాజశ్యామలారహస్యోపనిషత్ గురించి తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ ఉపనిషత్తు ప్రారంభం అయినప్పుడు “ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్” అని మంత్రం వచ్చుతుంది. అందువలన ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. ఇతర ఉపనిషత్తుల లాగా కాకుండా, ఇది మంత్ర భాగంలో చేరినది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు ఈశావాస్యోపనిషత్ గురించి తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు పంచబ్రహ్మోపనిషత్ గురించి తెలుసుకుందాం.
Pancha Brahma Upanishad In Telugu
పంచబ్రహ్మోపనిషత్
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్యా దీక్ష నీతికథ.
విద్యా దీక్ష
(ఈ కథ ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో యితర వ్యవహారాల మీద మనసు పోనివ్వకుండా దీక్షగా చదివితే మంచి ఫలితాలు సాధించగలం అనికదా ఈ కథ ద్వారా భారతం చేసిన హితబోధ)
చాలా రోజుల క్రితం మాట !
కశ్యపుడు అనేముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు. అదితి పిల్లలు దేవతలు.
ఈ అన్నదమ్ములు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూనే ఉండే వారు. ఒకప్పుడు వారు, ఒకప్పుడు వీరు గెలిచేవారు.
అలా సాగుతోంది.
అందులో రాక్షసులకు గురువు శుక్రాచార్యులు. దేవతల గురువు బృహస్పతి. ఆ రాక్షసగురువు చాలాకాలం తపస్సు చేసి మృతసంజీవనీ అనే విద్య సాధించాడు. దానివల్ల యుద్ధంలో చచ్చిన రాక్షసులందరినీ మళ్ళీ బ్రతికించేవాడు.
అప్పటికింకా దేవతలు అమృతపానం చెయ్యలేదు. కనుక వారు చచ్చిపోయేవారు. అది చూచి బృహస్పతి తనకుమారుడయిన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవనీ విద్య నేర్చుకురమ్మని పంపాడు.
కచుడు శుక్రాచార్యుల దగ్గరకు వచ్చి:
‘శ్రీగురుభ్యోనమః ‘ అని పాదాలమీద వ్రాలి:
‘నేను అంగీరస వంశ్యడను, బృహస్పతి తనయుడను. నన్ను కచుడు అని పిలుస్తారు. మీ వద్ద విద్యాత్యాసానికి వచ్చాను’ అన్నాడు.
శుక్రాచార్యులు ఆ కుర్రవాని వివయానికి చాలా సంతోషించి: ‘నాయనా! చాలా ఆనందం’ అని ఆశీర్వదించి తన ఆశ్రమంలో ఉండమన్నాడు.’
కచుడు రోజూ సూర్యోదయంకాకుండా లేచి కాలకృత్యాలు ముగించి సంధ్యావందనాలు యథావిధిగా సాగించి గురుశుశ్రూష చేస్తున్నాడు.
శుక్రాచార్యులవారికి దేవయాని అనే కూతురుంది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అందులోనూ వయస్సు వదహారు దాటింది.
ఆ పిల్లకి కచుడు మీద మనసు పడింది. అనేకవిధాల తన ప్రేమను వ్యక్తంచేసేది. కచుడికి తవ విద్యాత్యాసం తప్ప మరోదృష్టి లేదు. పయిగా గురువుగారి కూతురు కమక సోదరభావంతోనే చూపేవాడు.
ఇలా ఉండగా –
రాక్షసులందరూ సమావేశమై ఆలోచించారు.
‘ దేవతల గురువయిన బృహస్పతి కొడుకు మన గురువులవద్ద విద్యా భ్యాసానికి వచ్చాడు? శత్రువర్గం వారి దగ్గర ఏం చదువుదామని వచ్చాడు? ఓహో! మన గురువుగారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది.
అది వీడు నేర్చుకు వెడితే మన వంశానికే ప్రమాదం. కనక వీట్టి అడవిలో చంపి పారేద్దాం’ అని నిశ్చయించారు.
గురు సేవాభావంతో అడవిలో అవులను మేపి వస్తున్న కచుడిని చంపేశారు.
ప్రొద్దు గ్రుంకింది.
చీకటి ముదురుతోంది.
రోజూ సాయం సంధ్యావేళకు ఆశ్రమంచేరే కచుడు అప్పటికీ రాక పోవడంతో దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. కూతురు దుఃఖం చూడలేక శుక్రాచార్యులు దివ్య దృష్టితోచూచి, జరిగిన సంగతి గ్రహించి మృత సంజీవనితో కచుని బ్రతికించాడు.
అది విన్న రాక్షసులకు కడుపు మండి పోయింది. బాగా ఆలో చించారు. కచుని సంహరించి కాల్చి ఆ బూడిద కలిపిన కల్లు తెచ్చి శుక్రాచార్యులకు వివయంగా అందించారు.
ఆయన వెనుక ముందు ఆలోచించకుండా ఆ సురాపానం చేశాడు. వాడు వెళ్ళారు.
మళ్ళీ చీకటి పడింది.
ప్రేమపాశంలో ఉన్న దేవయాని తండ్రి దగ్గరకు వచ్చి ఏడ్చింది.
ఆయన జాలివడి దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది.
‘అమ్మా! ఈ రాక్షసులు వరమ కిరాతకం చేశారు. ఆ బాలుని చితాభస్మం కలిపిన కల్లు నా చేత త్రాగించారు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడు కచుడు. వాడు జీవించాలంటే నా పొట్ట చీల్బుకు రావాలి. వచ్చాక నన్ను బ్రతికించాలి. అంటే లోపం సూక్ష్మ అణువుగా ఉన్న ఆ ప్రాణికి నా విద్య బోధించాలి.
వివేకహీనులైన రాక్షసులు ఈ విధంగా వాడికి మేలు చేశారు, అని పద్మాసనం వేసి, లోపల ఉన్న కచుని ప్రబోధించి మృత సంజీవనీ మంత్రం ఉపదేశించాడు.
కచుడు ఆయన ఉదరం చీల్చుకు వచ్చాడు.
వస్తూనే తాను నేర్పిన విద్యతో గురువుగారిని జీవింపజేసి ఆయన వద్ద సెలవు తీసుకు వెడుతున్నాడు.
వెను వెంట వచ్చి దేవయాని :
‘ఏమయ్యా ః ఇంతకాలం నిన్నే ప్రేమించే నన్ను విడిచి పెడ కావా’ అంది.
‘ సోదరి గురువు తండ్రితో సమానం. ఆ ప్రకారం నువ్వు నాకు చెల్లిలివి ‘, ‘ అన్నాడు.
దేవయానికి కోపం వచ్చి :
‘ఇలా నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపయోగ పడదు బా’ అంది,
‘ సోదరీ ! విద్య ఎప్పుడూ నిరుపయోగం కాదమ్మా! ఈ మృత సంజీవని నీ శాపం ప్రకారం నాకు ఉపయోగపడక పోయినా నేను బోధిం చిన వారికి ఉపయోగపడుతుంది వెళ్ళు’, అని దేవలోకం చేరాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. కఠోపనిషత్ భారతీయ దర్శన సాహిత్యంలో ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటి. ఇది యాజ్ఞవల్క్య శాఖలో ఉన్నది. వేదాంత దర్శనంలో ముఖ్యమైన ప్రమాణ గ్రంథంగా కనిపిస్తుంది. యోగ మార్గం, ఆధ్యాత్మిక జ్ఞానం, మరణం, మరణానంతర జీవితం మొదలు చేస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు కఠోపనిషత్తు గురించి తెలుసుకుందాం.
Kathopanishad In Telugu Book
కఠోపనిషత్
ఓం సహ నావవతు |
సహ నౌ భునక్తు |
సహవీర్యం కరవావహై |
తేజస్వి నావధీతమస్తు |
మా విద్విషావహై |
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు చాక్షుషోపనిషత్ గురించి తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్య వివేక హేతువు నీతికథ.
విద్య వివేక హేతువు:
(ఈ కథ ఆరణ్య పర్వంలో ఉంది)
విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉండేవాడు.
ఎంతటి మహా విద్వాంసుడై నా వందితో వాదించి గెలవలేక పోతు న్నాడు. అందరినీ ఓడించిన అహంకారంతో ఉన్న నంది:
“నాతో వాదించి ఓడినవారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను’, అని ప్రకటించాడు.
అలా ఎందరినో నదిలో తోయించి సగర్వంగా ఉన్నాడు వంది..
ఆ రోజులలో
ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతులలో ఓడిపోయి ప్రాణాలు విడిచాడు.
అప్పటికి గర్భవతిగా ఉంది కహోడుని భార్య సుజాత, భర్త మరణవార్త విని ఎంతో దుఃఖించింది. గర్భంలో ఉన్న శిశువు మీద మమకారాన్ని చంపుకో లేక విచారాన్ని విడనాడి జీవితం గడుపుతూ కొంత కాలానికి కుమారుని కన్నది.
ఆ బాలుడు తండ్రి శాపంవల్ల ఎనిమిది వంకరలతో పుట్టాడు. అందువల్ల అందరూ వానిని ‘అష్టావక్రుడు’ అని పిలిచేవారు.
పన్నెండు సంవత్సరాలు గడిచాయి. అప్పటికి అష్టావక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి, వందితో వాదనకు బయలుదేరి విదేహ రాజ్యానికి వచ్చాడు.
‘నిండా పన్నెండేళ్ళు రాని బాలుడు వంటివంటి మహా విద్వాంసు నితో వాదించడమా !’ అని ద్వారపాలకుడు నిరోధించాడు.
‘ద్వారపాలక విద్యకు వయస్సుతో నిమిత్తం లేదు. జుట్టు నెరసి వయస్సు ముదిరినవాడు మహా విద్వాంసుడని అనుకోకు”, అని వాదిస్తుండగా అటు వచ్చిన జనక మహారాజు:
‘ఆర్యా! మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్య సముడు. ఆయన ముందు మిగిలిన విద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాలవలె వెల వెల బోతుంటారు’ అనగా అష్టావక్రుడు :
‘ మహారాజా ! నా వంటి వాడెవరూ మీ సభా భవనానికి వచ్చి ఉండరు, అన్నాడు.
‘ అయితే ముప్పది అవయవాలతో, పన్నెండు అంశలతో ఇరువది నాలుగు పర్వాలతో మూడు వందల అరువది రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివా నువ్వుః ‘ అని జనకుడు ప్రశ్నించాడు.
“మహారాజా ! ముప్పది దినాలు అవయవాలు, అమావాస్యలు పన్నెండు, పూర్ణిమలు పన్నెండు, ఈ ఇరువది నాలుగు పర్వాలు, పన్నెండు నెలలు అంశలు, మూడు వందల అరువది రోజులు రేకులు, అటువంటి సంవత్సర రూపమయిన కాలచక్రం మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక’, అన్నాడు.
జనకుడు: అడు గుర్రాలజంటవలె కనిపిస్తూ, హఠాత్తుగా డేగలా మీద పడే ఆ రెండిటినీ ధరించే దెవరు ?
అష్టా : మహారాజా ! అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ రెండు తత్వాలవల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది.
జన: కన్ను మూయకుండా నిద్రించేది ఏది?
అష్టా: నిరంతరం నీటిలో ఉండే చేప.
జన: జన్మించినా చైతన్యం లేనిది ఏది?
అష్టా: పక్షులు పెట్టే గ్రుడ్డు.
జన: హృదయం లేనిదేది?
అషా : బండరాయి.
జన: ఓవేదవేత్తా! ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా తీసుకు వెళ్ళాడు.
చూశాడు మహావిద్వాంసుడు వంది. అష్టావక్రుడు ఆయనను సమీపించాడు.
వంది: బాలకా! నిద్రపోయే సింహాన్ని లేవకు. కాలకూట విషభరిత మయిన పాము పడగ మీద కాలు పెట్టకు,
అష్టా: : మహారాజా ! పర్వతాలన్నీ మైనం కంటె చిన్నవి. లేగదూడలు ఆంబోతుకంటే చిన్నవి. రాజులందరూ జనకునికంటె అల్పులు. దేవతలలో యింద్రుని వలె, నరులలో ఉత్తముడుగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదానికి రమ్మనండి. ప్రారంభిస్తున్నాను నా వాదం.
అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశం ఇస్తుంది. సూర్యుడొక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృ దేవరావతి, యముడొక్కడే, అని ప్రారంభించాడు, వంది.
అష్టా: నంది ! ఇంద్రుడు- అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు, అలానే పర్వత నారదులు. అశ్వనీ దేవత లిద్దరు. రథా నికి చక్రాలు రెండు. సతీపతులు ఇద్దరు..
వంది: ప్రాణికోటి అంతా దేవమానవ తిర్యగ్రూపాలు మూడు ధరి స్తుంది. ఋగ్యజుస్సామాలు మూడే వేదాలు. ప్రాతర్మాధ్యా హ్నిక సాయం సవనాలు మూడు. స్వర్గ మర్త్య నరకాలు మూడే లోకాలు, అగ్ని, సూర్య చంద్రులు ముగ్గురే జ్యోతి స్వరూపులు.
అష్టా: బ్రహ్మచర్య, గార్హస్థ్య, వావవస్థ, సన్న్యాశ్రమాలు నాలుగు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు నాలుగు, దిక్కులూ నాలుగే హ్రస్వ, దీర్ఘ, ప్లత, హల్లు భేదాలతో శబ్దం నాలుగు రకాలు. వేరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ అని వాక్కు నాలుగు రగాలు.
అష్టా : బాలకా! అగ్ని స్థాపన వేళ ఆరు ఆవులను దక్షిణ ఇవ్వాలి. ఆరుఋతువులే సంవత్సర కాల చక్రాన్ని నడుపుతాయి. మన స్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు ఆరు. కృత్తికలు ఆరు. యజ్ఞలు ఆర
అష్టా: తులాదండాన్ని బంధించే సూత్రాలు ఎనిమిది. సింహాన్ని సంహరించే శరభ మృగానికి ఎనిమిది పాదాలు. యజ్ఞశాల సమీ పంలో యూవస్థంభానికి రోజులు ఎనిమిది. వసువులు ఎవ మండుగురు.
వంది: పితృయజ్ఞవేళ అగ్నిని ఉపాసించే సామిధేను మంత్రాలు తొమ్మిది. ప్రకృతి, పురుష, అహంకార, మహత్తత్త్వ, పంచతన్మా త్రలు తొమ్మిది. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతీ ఛందస్సుకు ప్రతిపాదంలోనూ తొమ్మిదే అక్షరాలు. గణితశాస్త్రం యావత్తూ తొమ్మిది అంకెలమీద ఆధారపడి ఉంది.
అష్టా: దిక్కులువది. గర్భంలో శివుడు పది మాసాలుంచాడు. రోగి, దరిద్రుడు శోకార్హుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయిన వాడు, పిచ్చివాడు, కాముకుడు, అనూయాపరుడు, మూర్ఖుడు మొండివాడు ఈ పదిమంది నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్నగారు, ప్రభువు, మాతామహి, పితామహులు, మేనమామ, మామగారు, తండ్రిసోదరులు, కుటుంబంలో వృద్ధులు ఈ పది మంది పూజింప దగినవారు.
అష్టా: పసివాడా। మాసాలు పన్నెండు. జగతీ ఛందస్సుకి అక్షరాలు పన్నెండు. ప్రాకృతయజ్ఞం పన్నెండు రోజులు సాగుతుంది. ఆదిత్యులు పన్నెండుగురు.
వంది: తిథులలో త్రయోదశి మంచిది. భూమిమీద పదమూడు ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ఆరంభించగా,
అహ్జైాన్నకుడు: మహారాజా! మీ విద్వాంసుడు శ్లోకం సగం చదివి విర మించాడు. మిగిలింది నేను చెబుతా.
కేశి దానవునితో మహావిష్ణువు పదమూడు రోజులు యుద్ధం చేసాడు. వేదంలోని అతిజగతి ఛందస్సు పదమూడక్షరాల పరిమితితో నడుస్తుంది. అనగా, పంది తల వంచేశాడు.
నియమానుసారం పంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకు ఎంత విద్య ఉన్నా, వయస్సు మీరినా, వివేకాన్ని దిగమ్రింగే అహంకారంతో నడుచుకునే వారు వంది వలెనే పసివారి ప్రజ్ఞముందు పతనమయిపోతారు.
విద్య వినయాన్ని కలిగించాలికాని గర్వ హేతువు కారాదు.