Balakanda Sarga 30 In Telugu – బాలకాండ త్రింశః సర్గః

Balakanda Sarga 30 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ త్రింశః సర్గలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యకు తిరిగి రావడం వివరించబడింది. సీతా కల్యాణం అనంతరం, వారు విశ్వామిత్రుడితో కలిసి స్వస్థలానికి చేరుకుంటారు. అయోధ్య ప్రజలు మరియు దశరథ మహారాజు వారిని సంతోషంగా స్వాగతించేందుకు ఎదురుచూస్తారు. తమ కుమారులను, వారి భార్యలను చూసి దశరథుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు.

యజ్ఞరక్షణమ్

అథ తౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రావరిందమౌ |
దేశే కాలే చ వాక్యజ్ఞావబ్రూతాం కౌశికం వచః ||

1

భగవన్ శ్రోతుమిచ్ఛావో యస్మిన్కాలే నిశాచరౌ |
సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్నాతివర్తేత తత్ క్షణమ్ ||

2

ఏవం బ్రువాణౌ కాకుత్స్థౌ త్వరమాణౌ యుయుత్సయా |
సర్వే తే మునయః ప్రీతాః ప్రశశంసుర్నృపాత్మజౌ ||

3

అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువామ్ |
దీక్షాం గతో హ్యేష మునిర్మౌనిత్వం చ గమిష్యతి ||

4

తౌ చ తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ |
అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతామ్ ||

5

ఉపాసాం‍చక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ |
రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిందమౌ ||

6

అథ కాలే గతే తస్మిన్షష్ఠేఽహని సమాగతే |
సౌమిత్రిమబ్రవీద్రామో యత్తో భవ సమాహితః ||

7

రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయా |
ప్రజజ్వాల తతో వేదిః సోపాధ్యాయపురోహితా ||

8

సదర్భచమసస్రుక్కా ససమిత్కుసుమోచ్చయా |
విశ్వామిత్రేణ సహితా వేదిర్జజ్వాల సర్త్విజా ||

9

మంత్రవచ్చ యథాన్యాయం యజ్ఞోఽసౌ సంప్రవర్తతే |
ఆకాశే చ మహాన్ శబ్దః ప్రాదురాసీద్భయానకః ||

10

ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషి నిర్గతః |
తథా మాయాం వికుర్వాణౌ రాక్షసావభ్యధావతామ్ ||

11

మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చ యే |
ఆగమ్య భీమసంకాశా రుధిరౌఘమవాసృజన్ ||

12

సా తేన రుధిరౌఘేణ వేదీం తామభ్యవర్షతామ్ |
దృష్ట్వా వేదిం తథాభూతాం సానుజః క్రోధసంయుతః ||

13

సహసాఽభిద్రుతో రామస్తానపశ్యత్తతో దివి |
తావాపతంతౌ సహసా దృష్ట్వా రాజీవలోచనః ||

14

లక్ష్మణం త్వాథ సంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్ |
పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్రాక్షసాన్పిశితాశనాన్ ||

15

మానవాస్త్రసమాధూతాననిలేన యథా ఘనాన్ |
[* అధికపాఠః – కరిష్యామి న సందేహో నోత్సహే హంతుం ఈదృశాన్ | ఇత్యుక్త్వా వచనం రామశ్చాపే సంధాయ వేగవాన్ | *]
మానవం పరమోదారమస్త్రం పరమభాస్వరమ్ ||

16

చిక్షేప పరమ క్రుద్ధో మారీచోరసి రాఘవః |
స తేన పరమాస్త్రేణ మానవేన సమాహితః ||

17

సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగరసంప్లవే |
విచేతనం విఘూర్ణంతం శీతేషుబలపీడితమ్ ||

18

నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్ |
పశ్య లక్ష్మణశీతేషుం మానవం మనుసంహితమ్ ||

19

మోహయిత్వా నయత్యేనం న చ ప్రాణైర్వియుజ్యతే |
ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్దుష్టచారిణః ||

20

రాక్షసాన్పాపకర్మస్థాన్యజ్ఞఘ్నాన్పిశితాశనాన్ |
[* ఇత్యుక్త్వా లక్ష్మణం చాశు లాఘవం దర్శయన్ ఇవ | *]
సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతమ్ ||

21

సుబాహూరసి చిక్షేప స విద్ధః ప్రాపతద్భువి |
శేషాన్వాయవ్యమాదాయ నిజఘాన మహాయశాః ||

22

రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్ |
స హత్వా రక్షసాన్సర్వాన్యజ్ఞఘ్నాన్రఘునందనః ||

23

ఋషిభిః పూజితస్తత్ర యథేంద్రో విజయే పురా |
అథ యజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునిః |
నిరీతికా దిశో దృష్ట్వా కాకుత్స్థమిదమబ్రవీత్ ||

24

కృతార్థోఽస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా |
సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః ||

25
[* స హి రామం ప్రశస్యైవం తాభ్యాం సంధ్యాముపాగమత్ | *]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రింశః సర్గః ||

మరునాడు రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా అన్నారు.

“ఓ మహర్షీ! మీ యాగము భగ్నము చేయుటకు రాక్షసులు ఎప్పుడు వస్తారు. మేము ఎప్పుడు వారిని ఎదుర్కొనవలెను. ఎందుకంటే రాక్షసులు వచ్చిన తక్షణం మేము వారిని ఎదుర్కోవాలి కదా!” అని అడిగారు.

ఆసమయములో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు రామలక్ష్మణులతో ఇలా అన్నారు.

“మహర్షుల వారు మౌనదీక్షలో ఉన్నారు. నేటి నుండి ఆరు రాత్రులు మీరు యాగమును రక్షించవలెను.” అని పలికారు.

వారి ఆజ్ఞను శిరసావహించారు రామలక్ష్మణులు. నిరంతరమూ ధనస్సును చేత బూని రామ లక్ష్మణులు ఆరు పగళ్లు ఆరు రాత్రులు యాగమును రక్షించారు. వారు విశ్వామిత్రుని పక్కను ఉండి ఆయనకు ఎలాంటి ఆపదా రాకుండా రక్షించారు.

ఆరవ దినము గడుచు చున్నది. రాముడు లక్ష్మణుని చూచి “లక్ష్మణా! ఇది ఆరవ రోజు. చాలా అప్రమత్తంగా ఉండు.రాక్షసులు ఏ క్షణమునైనా దాడి చేయవచ్చు.” అని లక్ష్మణుని హెచ్చరించాడు.

ఋషులు యజ్ఞము చేస్తున్నారు. అగ్నిహోత్రము మండుచున్నది. ఒక్కసారిగా అగ్నిహోూత్రము లోనుండి మంటలు భగ్గున పైకి లేచాయి. ఏదో జరగబోతోంది అని అనుకున్నాడు రాముడు.

ఇంతలో ఆకాశము నుండి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు మేఘముల రూపములో ఆకాశము అంతా కమ్ముకున్నారు. ఆ రాక్షసులు ఆకాశము నుండి రక్తమును వర్షము వలె కురిపించారు. రక్తము పడిన హెూమ గుండము లో నుండి అగ్ని జ్వాలలు పైకి ఎగిసాయి.

ఇదంతా చూచిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! రాక్షసులు ఆకాశము నుండి రక్త వర్షము కురిపించు చున్నారు. నేను నా బాణములతో ఆ మేఘరూపములో ఉన్న రాక్షసులను తరిమి వేస్తాను.” అని అన్నాడు.

రాముడు కోపంతో మానవాస్త్రమును ఆ రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన మానవాస్త్రము మారీచుని వక్షస్థలము • మీద సూటిగా తగిలింది. ఆ అస్త్రము దెబ్బకు మారీచుడు నూరు యోజనముల దూరములో ఉన్న సముద్రములో పోయి పడ్డాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుని చూచి ఇలాఅన్నాడు. “లక్ష్మణా! నేను సంధించిన మానవాస్త్రము ఎవరినీ చంపదు. కేవలము మూర్ఛపోయేట్టు చేస్తుంది. ఆ రాక్షసుడు కూడా అచేతనుడై సముద్రములో పడ్డాడు. కాని ఈ రాక్షసులను క్షమించరాదు. వీరి ప్రాణములు తీయడమే సరిఅయిన మార్గము” అని అన్నాడు.

వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రమును సుబాహుని మీద సంధించాడు. ఆ అస్త్రము తగిలి సుబాహుడు నేలకూలాడు. వెంటనే గిలా గిలా కొట్టుకొని మరణించాడు. రాముడు మిగిలిన రాక్షసులను వాయవ్యాస్త్రము ప్రయోగించి నాశనం చేసాడు.

ఆ ప్రకారంగా రాముడు విశ్వామిత్రుని యజ్ఞమునకు భంగము కలిగించు రాక్షసుల నందరినీ తన దివ్యాస్త్రములతో సమూలంగా చంపాడు.

యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అయింది. విశ్వామిత్రుడు దీక్ష నుండి లేచాడు. రామ లక్ష్మణులను చూచాడు. ఎంతోసంతోషంతో ఇలా అన్నాడు.

“రామా! నేను సంకల్పించిన యాగము నిర్విఘ్నముగా పూర్తి అయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞప్రకారము యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమముపేరు సార్థకం చేసావు.” అని అన్నాడు.

శ్రీమద్రామాయణము బాల కాండ ముప్పయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకత్రింశః సర్గః (31) >>

Ayodhya Kanda Sarga 20 In Telugu – అయోధ్యాకాండ వింశః సర్గః

Ayodhya Kanda Sarga 20

రామాయణం యొక్క అయోధ్యాకాండలో వింశ సర్గం ప్రధానంగా రాముడు, సీతా, లక్ష్మణులు అరణ్యానికి ప్రయాణమవ్వడాన్ని గురించి వివరిస్తుంది. రాముడు తన తండ్రి దశరథుని ఆజ్ఞను పాటిస్తూ సీతా, లక్ష్మణులతో పాటు దండకారణ్యంలో నివసించేందుకు బయలుదేరుతాడు. వారు గంగానదిని దాటి గుహులను, పర్వతాలను దాటుతూ అరణ్యంలో అడుగుపెడతారు. వారు ఇక్కడ ఉండేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ రిషులు, మూనులతో ఆత్మీయంగా మాట్లాడుతారు. ఈ ప్రయాణం వారి ధైర్యం, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అందరూ ధైర్యంగా ఒకరికొకరు సహాయం చేస్తూ, ధర్మాన్ని కాపాడతారని ప్రగాఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ సర్గ రాముడు తన ధర్మాన్ని పాటించడంలో అతని నిబద్ధతను మరియు అరణ్యంలో వారి ప్రయాణం ప్రారంభాన్ని వివరిస్తుంది.

కౌసల్యాక్రందః

తస్మింస్తు పురుషవ్యాఘ్రే నిష్క్రామతి కృతాంజలౌ |
ఆర్తశబ్దో మహాంజజ్ఞే స్త్రీణామంతఃపురే తదా || ౧ ||

కృత్యేష్వచోదితః పిత్రా సర్వస్యాంతఃపురస్య చ |
గతిర్యః శరణం చాపి స రామోఽద్య ప్రవత్స్యతి || ౨ ||

కౌసల్యాయాం యథా యుక్తో జనన్యాం వర్తతే సదా |
తథైవ వర్తతేఽస్మాసు జన్మప్రభృతి రాఘవః || ౩ ||

న క్రుధ్యత్యభిశప్తోఽపి క్రోధనీయాని వర్జయన్ |
కృద్ధాన్ప్రసాదయన్సర్వాన్స ఇతోఽద్య ప్రవత్స్యతి || ౪ ||

అబుద్ధిర్బత నో రాజా జీవలోకం చరత్యయమ్ |
యో గతిం సర్వలోకానాం పరిత్యజతి రాఘవమ్ || ౫ ||

ఇతి సర్వా మహిష్యస్తాః వివత్సా ఇవ ధేనవః |
పతిమాచుక్రుశుశ్చైవ సస్వరం చాపి చుక్రుశుః || ౬ ||

స హి చాంతః పురే ఘోరమార్తశబ్దం మహీపతిః |
పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా వ్యాలీయతాసనే || ౭ ||

రామస్తు భృశమాయస్తో నిఃశ్వసన్నివ కుంజరః |
జగామ సహితో భ్రాత్రా మాతురంతఃపురం వశీ || ౮ ||

సోఽపశ్యత్పురుషం తత్ర వృద్ధం పరమపూజితమ్ |
ఉపవిష్టం గృహద్వారి తిష్ఠతశ్చాపరాన్బహూన్ || ౯ ||

దృష్ట్వైవ తు తదా రామం తే సర్వే సహసోత్థితాః |
జయేన జయతాం శ్రేష్ఠం వర్ధయంతి స్మ రాఘవమ్ || ౧౦ ||

ప్రవిశ్య ప్రథమాం కక్ష్యాం ద్వితీయాయాం దదర్శ సః |
బ్రాహ్మణాన్వేదసంపన్నాన్వృద్ధాన్రాజ్ఞాఽభిసత్కృతాన్ || ౧౧ ||

ప్రణమ్య రామస్తాన్వృద్ధాంస్తృతీయాయాం దదర్శ సః |
స్త్రియో వృద్ధాశ్చ బాలాశ్చ ద్వారరక్షణతత్పరాః || ౧౨ ||

వర్ధయిత్వా ప్రహృష్టాస్తాః ప్రవిశ్య చ గృహం స్త్రియః |
న్యవేదయంత త్వరితాః రామమాతుః ప్రియం తదా || ౧౩ ||

కౌసల్యాఽపి తదా దేవీ రాత్రిం స్థిత్వా సమాహితా |
ప్రభాతే త్వకరోత్పూజాం విష్ణోః పుత్రహితైషిణీ || ౧౪ ||

సా క్షౌమవసనా హృష్టా నిత్యం వ్రతపరాయణా |
అగ్నిం జుహోతి స్మ తదా మంత్రవత్కృతమంగళా || ౧౫ ||

ప్రవిశ్య చ తదా రామో మాతురంతఃపురం శుభమ్ |
దదర్శ మాతరం తత్ర హావయంతీ హుతాశనమ్ || ౧౬ ||

దేవకార్యనిమిత్తం చ తత్రాపశ్యత్సముద్యతమ్ |
దధ్యక్షతం ఘృతం చైవ మోదకాన్హవిషస్తథా || ౧౭ ||

లాజాన్మాల్యాని శుక్లాని పాయసం కృసరం తథా |
సమిధః పూర్ణకుంభాంశ్చ దదర్శ రఘునందనః || ౧౮ ||

తాం శుక్లక్షౌమసంవీతాం వ్రతయోగేన కర్శితామ్ |
తర్పయంతీం దదర్శాద్భిర్దేవతాం దేవవర్ణినీమ్ || ౧౯ ||

సా చిరస్యాత్మజం దృష్ట్వా మాతృనందనమాగతమ్ |
అభిచక్రామ సంహృష్టాః కిశోరం బడవా యథా || ౨౦ ||

స మాతరమభిక్రాంతాముపసంగృహ్య రాఘవః |
పరిష్వక్తశ్చ బాహుభ్యాముపాఘ్రాతశ్చ మూర్ధని || ౨౧ ||

తమువాచ దురాధర్షం రాఘవం సుతమాత్మనః |
కౌసల్యా పుత్రవాత్సల్యాదిదం ప్రియహితం వచః || ౨౨ ||

వృద్ధానాం ధర్మశీలానాం రాజర్షీణాం మహాత్మనామ్ |
ప్రాప్నుహ్యాయుశ్చ కీర్తిం చ ధర్మం చోపహితం కులే || ౨౩ ||

సత్యప్రతిజ్ఞం పితరం రాజానం పశ్య రాఘవ |
అద్యైవ హి త్వాం ధర్మాత్మా యౌవరాజ్యేఽభిషేక్ష్యతి || ౨౪ ||

దత్తమాసనమాలభ్య భోజనేన నిమంత్రితః |
మాతరం రాఘవః కించిద్వ్రీడాత్ప్రాంజలిరబ్రవీత్ || ౨౫ ||

స స్వభావవినీతశ్చ గౌరవాచ్చ తదాఽఽనతః |
ప్రస్థితో దండకారణ్యమాప్రష్టుముపచక్రమే || ౨౬ ||

దేవి నూనం న జానీషే మహద్భయముపస్థితమ్ |
ఇదం తవ చ దుఃఖాయ వైదేహ్యా లక్ష్మణస్య చ || ౨౭ ||

గమిష్యే దండకారణ్యం కిమనేనాసనేన మే |
విష్టరాసనయోగ్యో హి కాలోఽయం మాముపస్థితః || ౨౮ ||

చతుర్దశ హి వర్షాణి వత్స్యామి విజనే వనే |
మధుమూలఫలైర్జీవన్హిత్వా మునివదామిషమ్ || ౨౯ ||

భరతాయ మహారాజో యౌవరాజ్యం ప్రయచ్ఛతి |
మాం పునర్దండకారణ్యే వివాసయతి తాపసమ్ || ౩౦ ||

స షట్ చాష్టౌ చ వర్షాణి వత్స్యామి విజనే వనే |
ఆసేవమానో వన్యాని ఫలమూలైశ్చ వర్తయన్ || ౩౧ ||

సా నికృత్తేవ సాలస్య యష్టిః పరశునా వనే |
పపాత సహసా దేవీ దేవతేవ దివశ్చ్యుతా || ౩౨ ||

తామదుఃఖోచితాం దృష్ట్వా పతితాం కదలీమివ |
రామస్తూత్థాపయామాస మాతరం గతచేతసమ్ || ౩౩ ||

ఉపావృత్యోత్థితాం దీనాం బడబామివ వాహితామ్ |
పాంసుకుంఠితసర్వాంగీం విమమర్శ చ పాణినా || ౩౪ ||

సా రాఘవముపాసీనమసుఖార్తా సుఖోచితా |
ఉవాచ పురుషవ్యాఘ్రముపశృణ్వతి లక్ష్మణే || ౩౫ ||

యది పుత్ర న జాయేథాః మమ శోకాయ రాఘవ |
న స్మ దుఃఖమతో భూయః పశ్యేయమహమప్రజాః || ౩౬ ||

ఏక ఏవ హి వంధ్యాయాః శోకో భవతి మానసః |
అప్రజాఽస్మీతి సంతాపో న హ్యన్యః పుత్ర విద్యతే || ౩౭ ||

న దృష్టపూర్వం కళ్యాణం సుఖం వా పతిపౌరుషే |
అపి పుత్రే తు పశ్యేయమితి రామస్థితం మయా || ౩౮ ||

సా బహూన్యమనోజ్ఞాని వాక్యాని హృదయచ్ఛిదామ్ |
అహం శ్రోష్యే సపత్నీనామవరాణాం వరా సతీ || ౩౯ ||

అతో దుఃఖతరం కిం ను ప్రమదానాం భవిష్యతి |
మమ శోకో విలాపశ్చ యాదృశోఽయమనంతకః || ౪౦ ||

త్వయి సన్నిహితేఽప్యేవమహమాసం నిరాకృతా |
కిం పునః ప్రోషితే తాత ధ్రువం మరణమేవ మే || ౪౧ ||

అత్యంతం నిగృహీతాఽస్మి భర్తుర్నిత్యమతంత్రితా |
పరివారేణ కైకేయ్యాః సమా వాఽప్యథవావరా || ౪౨ ||

యో హి మాం సేవతే కశ్చిదథవాఽప్యనువర్తతే |
కైకేయ్యాః పుత్రమన్వీక్ష్య స జనో నాభిభాషతే || ౪౩ ||

నిత్యక్రోధతయా తస్యాః కథం ను ఖరవాది తత్ |
కైకేయ్యా వదనం ద్రష్టుం పుత్ర శక్ష్యామి దుర్గతా || ౪౪ ||

దశ సప్త చ వర్షాణి తవ జాతస్య రాఘవ |
ఆసితాని ప్రకాంక్షంత్యా మయా దుఃఖపరిక్షయమ్ || ౪౫ ||

తదక్షయమహం దుఃఖం నోత్సహే సహితుం చిరమ్ |
విప్రకారం సపత్నీనామేవం జీర్ణాఽపి రాఘవ || ౪౬ ||

అపశ్యంతీ తవ ముఖం పరిపూర్ణశశిప్రభమ్ |
కృపణా వర్తయిష్యామి కథం కృపణజీవికామ్ || ౪౭ ||

ఉపవాసైశ్చ యోగైశ్చ బహుభిశ్చ పరిశ్రమైః |
దుఃఖసంవర్ధితో మోఘం త్వం హి దుర్గతయా మయా || ౪౮ ||

స్థిరం తు హృదయం మన్యే మమేదం యన్న దీర్యతే |
ప్రావృషీవ మహానద్యాః స్పృష్టం కూలం నవాంభసా || ౪౯ ||

మమైవ నూనం మరణం న విద్యతే
న చావకాశోఽస్తి యమక్షయే మమ |
యదంతకోఽద్యైవ న మాం జిహీర్షతి
ప్రసహ్య సింహో రుదతీం మృగీమివ || ౫౦ ||

స్థిరం హి నూనం హృదయం మమాయసం
న భిద్యతే యద్భువి నావదీర్యతే |
అనేన దుఃఖేన చ దేహమర్పితం
ధ్రువం హ్యకాలే మరణం న విద్యతే || ౫౧ ||

ఇదం తు దుఃఖం యదనర్థకాని మే
వ్రతాని దానాని చ సంయమాశ్చ హి |
తపశ్చ తప్తం యదపత్యకారణాత్
సునిష్ఫలం బీజమివోప్తమూషరే || ౫౨ ||

యది హ్యకాలే మరణం స్వయేచ్ఛయా
లభేత కశ్చిద్గురుదుఃఖకర్శితః |
గతాఽహమద్యైవ పరేతసంసదం
వినా త్వయా ధేనురివాత్మజేన వై || ౫౩ ||

అథాపి కిం జీవితమద్య మే వృథా
త్వయా వినా చంద్రనిభాననప్రభ |
అనువ్రజిష్యామి వనం త్వయైవ గౌః
సుదుర్బలా వత్సమివానుకాంక్షయా || ౫౪ ||

భృశమసుఖమమర్షితా తదా
బహు విలలాప సమీక్ష్య రాఘవమ్ |
వ్యసనముపనిశామ్య సా మహత్
సుతమివ బద్ధమవేక్ష్య కిన్నరీ || ౫౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే వింశః సర్గః || ౨౦ ||

Ayodhya Kanda Sarga 20 Meaning In Telugu

(ఇంతకు ముందు సర్గలో వాల్మీకి మహర్షి రాముడు కౌసల్య మందిరము ప్రవేశించాడు అని చెప్పాడు. కాని ఈ సర్గలో కొంచెం వెనక్కు వెళ్లాడు. ఇప్పుడు మనము ఇంకా దశరథుని అంతఃపురము లోనే ఉన్నాము. ఇంక చదవండి.)

కైక మాటలను మన్నించి రాముడు అక్కడనుండి బయటకు వచ్చిన తరువాత కైక అంతఃపురములోని స్త్రీలు, దశరథుని ఇతర భార్యలు భోరున ఏడ్చారు. అయ్యో రాముడు అడవులకు వెళ్లిపోతున్నాడా అని దు:ఖించారు. (దశరథునికి కైసల్యా, సుమిత్ర,కైకేయీ కాక ఇంకా మూడువందలయాభై మంది భార్యలు ఉన్నట్టు ప్రతీతి.)

“తండ్రి నోటి నుండి మాట వెలుపలికి వచ్చీ రాకముందే ఆ కార్యములను చక్కబెట్టే రాముడు, అంత:పురములోని వారికి ఏ లోటూరాకుండా అన్ని అమర్చేరాముడు అరణ్యములకు పోతున్నాడు. తన తల్లి పట్ల ఎటువంటి భక్తి, ప్రేమ చూపుతున్నాడో, మన యందు కూడా అలాంటి భక్తి వినయము ప్రేమ చూపిన రాముడు అరణ్యము లకు పోతున్నాడు. కోపమంటే ఎరుగని రాముడు, ఎవరైనా తన మీద కోపగించినా వారి మీద కోపించని రాముడు ఇప్పుడు అరణ్యములకు పోతున్నాడు. ఇన్నాళ్లు దశరథుడు ఏదో తెలివిగల రాజు అనుకున్నాము, కాని ఇంత తెలివితక్కువగా కన్నకొడుకును కారడవులకు పంపే మూర్ఖుడు అనేకోలేదు.” ఈ ప్రకారంగా అంత:పుర స్త్రీలందరూ తలొక మాటా అనుకుంటూ దు:ఖిస్తున్నారు.

వారి మాటలు విన్న దశరథునికి శోకము ఇంకా ఎక్కువ అయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అంతలోనే స్పృహ తప్పుతున్నాడు. మరలా తేరుకుంటున్నాడు. రాముని కోసం చుట్టు వెర్రి చూపులు చూస్తున్నాడు. రాముడు కనపడక మరలా హతాశుడవుతున్నాడు.
కౌసల్య అంతఃపురము బయట ద్వారముల వద్ద అనేక మంది బ్రాహ్మణులు నిలబడి ఉన్నారు. రాముని చూడగానే వారందరూ లేచి నిలబడ్డారు. అందులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు “రామా! నీకు జయమగు గాక” అని ఆశీర్వదించాడు. రాముడు అక్కడ నిలబడి ఉన్న బ్రాహ్మణులకు అందరికీ భక్తితో నమస్కరించాడు.

తరువాత ద్వారము వద్ద బ్రాహ్మణులు, ముత్తయిదువలు నిలబడి ఉన్నారు. రాముని రావడం చూచి వారందరూ లేచి నిలబడ్డారు. వారందరూ జయజయ ధ్వానములతో రాముని కౌసల్యా మందిరమునకు స్వాగతించారు.

మరి కొంత మంది లోపలకు పరుగు పరుగున వెళ్లి కౌసల్యకు రాముడు వస్తున్నాడు అన్న వార్తను అందించారు. కౌసల్య రాత్రి అంతా జాగారము చేసి పొద్దుటే లేచి, స్నానాదికములు ఆచరించి, తెల్లని పట్టుచీర కట్టుకొని రాముని క్షేమం కోరుతూ విష్ణు పూజ చేసింది. తరువాత అగ్నిలో మంగళ ద్రవ్యములు హెూమం చేస్తూ ఉంది. రాముడు అంతఃపురములో ప్రవేశించి హెూమము చేస్తూ ఉన్న తల్లిని చూచాడు.

రాముడు రావడం చూచి కౌసల్య లేచి రాముని దగ్గరగా వచ్చింది. రాముడు తల్లి పాదములకు నమస్కరించాడు. కౌసల్య రాముని ఆశీర్వదించింది. తరువాత రాముని రెండు చేతలతో లేపి గట్టిగా కౌగలించుకొని తలమీద ముద్దు పెట్టుకొంది. “నాయనా రామా! నీవు కూడా నీపూర్వీకుల వలె కీర్తి ప్రతిష్టలు పొందుదువు గాక! నీవు నీ వంశకర్తలు ఆచరించిన ధర్మములను పాటించెదవు గాక! నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను ఈ రోజు యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాను అన్నాడు. నీ తండ్రి మాట తప్పడు. నీకు ఈ రోజే యౌవరాజ్య పట్టాభిషేకము జరగ గలదు.

రామా! రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో. రా నాయనా భోజనము చేద్దువు గానీ.” అని ఆప్యాయంగా రాముని భోజనానికి పిలిచింది. రాముడు మరలా తన తల్లి కౌసల్యకు నమస్కరించి ఇలా అన్నాడు. “అమ్మా! ఇప్పుడు మనకు ఒక అనుకోని ఆపద ఒకటి వచ్చి పడినది. నేను ఇప్పుడు అత్యవసరంగా దండకారణ్యము పోవలెను. దీని వలన నీవు, సీత, లక్ష్మణుడు దు:ఖిస్తారు అని నాకు తెలుసు. కాని ఇది తప్పదు. నేను వెళ్లి తీరాలి. కాబట్టి నాకు నేటి నుండి ఈ రాజభోగము లు, రాజ భోజనములు, సింహాసనములు నిషిద్ధములు. నేను కందమూలములు తింటూ, దర్భాసనము మీద పడుకోవాలి. ఈ విధముగా నేను పదునాలుగేళ్లు వనవాసము చెయ్యాలి. నాకు బదులుగా భరతుడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది తండ్రి గారి నిర్ణయము. నాకు శిరోధార్యము.” అని అన్నాడు.

రాముడు ఈ మాటలు అంటూ ఉండగానే కౌసల్య నిట్టనిలువునా కూలిపోయింది. రాముడు వెంటనే తల్లిని పైకి లేపి పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చో పెట్టాడు. పరిచారికలు చల్లని నీళ్లు ఆమె మొహం మీద చల్లి సేదదీర్చారు. కౌసల్యకు దుఃఖము ఆగటం లేదు. కళ్లనుండి నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంది. నోటమాట పెగలడంలేదు.

“రామా! నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావయ్యా! నాకు ఈ వార్త చెప్పడానికేనా! అసలు నాకు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది. పిల్లలు లేరు అని ఒకే దిగులు ఉండేది. కాని ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగి ప్రయోజకుడవు అయి నాకు ఎనలేని దుఃఖము కలిగిస్తున్నావు. ఇది నీకు న్యాయమా రామా!

రామా! నేను పెళ్లి చేసుకొని ఇక్కడకు వచ్చిన తరువాత సుఖము అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా భర్త రాజుగా ఉ న్న రోజుల్లో నాకు ఏనాడూ సుఖము లేదు. కనీసము నువ్వు పట్టాభిషిక్తుడవు అయిన తరువాత అన్నా సుఖపడదామనుకున్నాను. ఆ ఆశకూడా అడియాస చేసావు రామా!

రామా! నేను అందరి కంటే పెద్ద భార్యను అయి ఉండి కూడా, నీ వనవాసముతో అందరి ముందూ తలదించుకోవాల్సిన పరిస్థితి, వారి సూటీ పోటీ మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు దాపురించింది. ఇంతకు మించి స్త్రీలకు దు:ఖము ఏముంటుంది. రామా! నీవు ఇక్కడ ఉండగానే నా సవతులు నన్ను నిరాదరిస్తున్నారు. ఇంక నీవు లేకపోతే చెప్పవలెనా. నా బతుకు దుర్భరము అవుతుంది. అందుకే నాకు మరణమే శరణ్యము.
రామా! నా భర్త నన్ను ఏనాడూ అందరితో పాటు ఆదరించలేదు. ముఖ్యంగా ఆ కైక, ఆమె దాస దాసీల పాటి కూడా నేను చెయ్యలేదు. నా భర్త వారి కన్నా హీనంగా నన్ను చూచాడు. పేరుకు పెద్దభార్యనే కానీ స్వతంత్రించి ఏ పనీ చెయ్యలేను. నాది ఒక బానిసబతుకు. నువ్వు చెప్పినట్టు రేపు భరతుడు రాజైతే. ఈరోజు నన్ను పలకరించే వాళ్లు కూడా రేపు నా మొహం చూడరు. నాతో మాట్లాడరు. ఇంక కైక సంగతి చెప్ప పనిలేదు. రేపటి నుండి నన్ను ఒక మనిషిగా కూడా చూడదు. చీటికీ మాటికీ నన్ను నిందిస్తూ ఉంటుంది. అసలు ఆమె మొహం చూడటానికే నాకు భయంగా ఉంటుంది.

రామా! నిన్ను చూచుకొని, ఇన్నాళ్లు ఈ దుర్భరమైన బాధలు భరించాను. నీకు ఉపనయనము అయిన నాటి నుండి దాదాపు పదిహేడు సంవత్సరములు నువ్వు రాజ్యాభిషిక్తుడవు అవుతావనీ, నా కష్టములు తీరుస్తావని ఆశతో ఎదురు చూచాను. నీ మాటలతో ఆ ఆశ నిరాశ అయింది. ఈ వృద్ధాప్యంలో నేను, నా సవతుల సూటీ పోటీ మాటలు, వారు చేయు అవమానములు భరించలేను.

ఇన్నాళ్లు నీ ముద్దులొలికే మొహం చూస్తూ ఈ బాధలన్నీ దిగమింగుకున్నాను. ఇంక నువ్వు నాకు కనపడవు. నేను ఈ బాధలు భరించలేను. నేను ఎంతో దురదృష్టవంతురాలను. లేకపోతే నీ క్షేమం గురించి, నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలనీ, నీవు రాజ్యాభిషిక్తుడివికావాలనీ ఎన్నో పూజలు వ్రతాలూ ఉపవాసాలు చేసాను. ఏ దేవుడూ నన్ను కరుణించలేదు. నా బాధలను తీర్చలేదు. అవన్నీ వ్యర్ధమైపోయాయి.

రామా! నా గుండె చాలా కఠినమయింది లేకపోతే నీవు చెప్పిన ఈ దుర్వార్త విని నా గుండెలు ఈ పాటికి పగిలిపోవాల్సింది. కాని అలా జరగలేదు.. నాగుండెలు రాతి బండలు. అవి పగలవు. నాకు మరణము రాదు.

రామా! నాకు పుత్ర సంతానము కావాలని ఎన్నో పూజలు, ఎన్నెన్నో వ్రతాలూ యజ్ఞాలు యాగాలు చేసాను. నీవు పుట్టావు. కానీ ఏం లాభం. అవి ఫలించలేదు. నీకు వనవాసము ప్రాప్తించింది.

రామా! మానవులకు తమ ఇష్టం వచ్చినప్పుడు మరణించే అవకాశము లేదు కదా! లేకపోతే నీవు ఈ మాట చెప్పగానే హాయిగా మరణించి ఉండేదాన్ని. ఎందుకంటే రామా! ఇంక నేను ఎందుకు బతకాలి. ఎవరి కోసం బతకాలి. ఏం అనుభవించడానికి బతకాలి. వ్యర్ధంగా కలకాలం బతకడం కంటే మరణించడం మేలు కదా!

లేకపోతే రామా! ఒకపని చెయ్యి. నన్నుకూడా నీ వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లు. నీ యోగక్షేమాలు చూసుకుంటూ నీ వెంటే ఉంటాను.” అని కౌసల్య రాముని చూచి తన మనసులో ఉన్న బాధను ఆవేశాన్ని అంతా వెళ్లగక్కింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకవింశః సర్గః (21) >>

Balakanda Sarga 28 In Telugu – బాలకాండ అష్టావింశః సర్గః

Balakanda Sarga 28 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టావింశః సర్గలో పరశురాముడు శ్రీరాముడిని పరీక్షించడానికి వచ్చాడు. శివధనస్సు విరగడం విని, తన విష్ణు ధనస్సుతో శ్రీరాముడిని పరీక్షించాలని అనుకుంటాడు. శ్రీరాముడు ఆ ధనస్సును సునాయాసంగా ఎత్తి, తన శక్తిని ప్రదర్శిస్తాడు. పరశురాముడు శ్రీరాముని పరాక్రమాన్ని తెలుసుకుని, తన అహంకారాన్ని విడిచి వేస్తాడు. ఆ తర్వాత, శ్రీరాముడు నిజమైన విష్ణువు అవతారమని గుర్తించి, పరశురాముడు తన శస్త్రాలను సమర్పించి, అక్కడి నుండి నిష్క్రమిస్తాడు.

అస్త్రసంహారగ్రహణమ్

ప్రతిగృహ్య తతోఽస్త్రాణి ప్రహృష్టవదనః శుచిః |
గచ్ఛన్నేవ చ కాకుత్స్థో విశ్వామిత్రమథాబ్రవీత్ ||

1

గృహీతాస్త్రోఽస్మి భగవన్దురాధర్షః సురాసురైః |
అస్త్రాణాం త్వహమిచ్ఛామి సంహారం మునిపుంగవ ||

2

ఏవం బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రో మహామతిః |
సంహారం వ్యాజహారాథ ధృతిమాన్సువ్రతః శుచిః ||

3

సత్యవంతం సత్యకీర్తిం ధృష్టం రభసమేవ చ |
ప్రతిహారతరం నామ పరాఙ్ముఖమవాఙ్ముఖమ్ ||

4

లక్షాక్షవిషమౌ చైవ దృఢనాభ సునాభకౌ |
దశాక్షశతవక్త్రౌ చ దశశీర్షశతోదరౌ ||

5

పద్మనాభమహానాభౌ దుందునాభసునాభకౌ |
జ్యోతిషం కృశనం చైవ నైరాశ్యవిమలావుభౌ ||

6 [శకునం]

యోగంధరహరిద్రౌ చ దైత్యప్రమథనం తథా |
శుచిర్బాహుర్మహాబాహుర్నిష్కులిర్విరుచిస్తథా ||

7

సార్చిర్మాలీ ధృతిర్మాలీ వృత్తిమాన్రుచిరస్తథా |
పిత్ర్యం సౌమనసం చైవ విధూతమకరావుభౌ ||

8

కరవీరకరం చైవ ధనధాన్యౌ చ రాఘవ |
కామరూపం కామరుచిం మోహమావరణం తథా ||

9

జృంభకం సర్వనాభం చ సంతానవరణౌ తథా |
కృశాశ్వతనయాన్రామ భాస్వరాన్కామరూపిణః ||

10

ప్రతీచ్ఛ మమ భద్రం తే పాత్రభూతోఽసి రాఘవ |
బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రహృష్టేనాంతరాత్మనా ||

11

దివ్యభాస్వరదేహాశ్చ మూర్తిమంతః సుఖప్రదాః |
కేచిదంగారసదృశాః కేచిద్ధూమోపమాస్తథా ||

12

చంద్రార్కసదృశాః కేచిత్ప్రహ్వాంజలిపుటాస్తథా |
రామం ప్రాంజలయో భూత్వాబ్రువన్మధురభాషిణః ||

13

ఇమే స్మ నరశార్దూల శాధి కిం కరవామ తే |
మానసాః కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యథ ||

14

గమ్యతామితి తానాహ యథేష్టం రఘునందనః |
అథ తే రామమామంత్ర్య కృత్వా చాపి ప్రదక్షిణమ్ ||

15

ఏవమస్త్వితి కాకుత్స్థముక్త్వా జగ్ముర్యథాగతమ్ |
స చ తాన్రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునిమ్ ||

16

గచ్ఛన్నేవాథ మధురం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ |
కిం న్వేతన్మేఘసంకాశం పర్వతస్యావిదూరతః ||

17

వృక్షషండమితో భాతి పరం కౌతూహలం హి మే |
దర్శనీయం మృగాకీర్ణం మనోహరమతీవ చ ||

18

నానాప్రకారైః శకునైర్వల్గునాదైరలంకృతమ్ |
నిఃసృతాః స్మ మునిశ్రేష్ఠ కాంతారాద్రోమహర్షణాత్ ||

19

అనయా త్వవగచ్ఛామి దేశస్య సుఖవత్తయా |
సర్వం మే శంస భగవన్కస్యాశ్రమపదం త్విదమ్ ||

20

సంప్రాప్తా యత్ర తే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణః |
తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే ||

21

భగవంస్తస్య కో దేశః సా యత్ర తవ యాజ్ఞికీ |
రక్షితవ్యా క్రియా బ్రహ్మన్మయా వధ్యాశ్చ రాక్షసాః |
ఏతత్సర్వం మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ||

22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టావింశః సర్గః ||

Balakanda Sarga 28 Meaning In Telugu

ఆ ప్రకారంగా విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గ మధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు, రాక్షసులకు అజేయుడనయ్యాను. కాని వాటికి ఉపసంహారము కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా!” అని అడిగాడు.

అస్త్రములను ఉపసంహరించడం అంటే ఒక సారి వేసిన అస్త్రమును, టార్గెట్ ను ఢీకొట్టక ముందే వెనుకకు తీసుకోడం. ఆ రోజుల్లో అస్త్రము వేసే శక్తి దానిని ఉపసంహరించే శక్తి రెండూ ఉండేవి. నేటి రోజుల్లో తుపాకీ గానీ, పిస్టల్ గానీ, పెద్ద పెద్ద మిసైల్సు కానీ ఒకసారి ప్రయోగిస్తే, ఇంతే సంగతులు… ఇంక వెనకకు తిరిగి రావు. టార్గెట్ను ధ్వంసంచేస్తాయి. అదీ నేటి అస్త్ర శక్తి.).

ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు. రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారము కూడా ఉపదేశించాడు.

అంతే కాకుండా, పూర్వము భృశాశ్వుని చే సృష్టింపబడిన అస్త్రములు అన్నిటినీ రామునికి ఉపదేశించాడు. ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి 7 శ్లోకములలో చెప్పాడు. ఆ అస్త్రముల పేర్లు ఏవంటే……

సత్యవంతము, సత్యకీర్తి, ధృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాఙ్ముఖము, అవాఙ్ముఖము, లక్షాక్షము, విషమము, ధృఢనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కృశనము, నైరాశ్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము.

(వీటి పేర్లు చూస్తుంటే ఇవి మానవుల లక్షణములు, ఉదాహరణకు… మోహము, రుచిరము, విమలము; ఇంకా మానవులకు ఉన్న సంపదలు ఉదా: సంతానము, కొన్ని శాస్త్రములు ఉదా: జ్యోతిషము. ఇలాగా అస్త్రములు అంటే కేవలము ఆయుధములు అనే కాదు శాస్త్రములు, లక్షణములు వాటి ఆవశ్యకత అని అర్థం స్ఫురిస్తూ ఉంది.)

రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసరం ఎదురు చూచారు. రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినపుడు రమ్మని పంపివేసాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రామునికి ప్రదక్షిణ పూర్వక నమస్వారము చేసి వెళ్లిపోయారు.

తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు. వారికి ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమము మంచి ఫలవృక్షములతోనూ, పూల తీగలతోనూ, అత్యంత మనోరంజకంగా ఉంది. విశ్వామిత్రుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! ఈ ప్రదేశము చాలా మనోహరముగా ఉంది. మనము ఆ రాక్షస ప్రాంతము వదిలి పెట్టినాము అనుకుంటాను. ఇంత మనోహరముగా ఉన్న ఈ ఆశ్రమము ఎవరిది? వివరించండి. ఇంతకూ తమరి ఆశ్రమము ఎక్కడ ఉంది. మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు. రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడుచేస్తున్నారు. నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి. నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి. వీటి గురించి నాకు వివరంగా చెప్పండి” అని అడిగాడు రాముడు.

(ఇప్పటి దాకా రాముడు చెప్పిన పని చేస్తున్నాడు, ఇచ్చినవి (అస్త్రములు) పుచ్చుకుంటున్నాడు. కానీ నోరు మెదప లేదు. ఇప్పుడు ఒక ఆర్మీ మేజర్ అడిగినట్టు తాను నెరవేర్చవలసిన మిషన్ గురించి వివరాలు అడుగుతున్నాడు. గమనించండి.)

అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా చెప్పసాగాడు.

వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ ఏకోనత్రింశః సర్గః (29) >>

Ayodhya Kanda Sarga 7 In Telugu – అయోధ్యాకాండ సప్తమః సర్గః

Ayodhya Kanda Sarga 7 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. సప్తమః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.

మంథరాపరిదేవనమ్

జ్ఞాతిదాసీ యతోజాతా కైకేయ్యాస్తు సహోషితా |
ప్రాసాదం చంద్రసంకాశమారురోహ యదృచ్ఛయా ||

1

సిక్తరాజపథాం రమ్యాం ప్రకీర్ణకుసుమోత్కరామ్ |
అయోధ్యాం మంథరా తస్మాత్ప్రాసాదాదన్వవైక్షత ||

2

పతాకాభిర్వరార్హాభిర్ధ్వజైశ్చ సమలంకృతామ్ |
వృతాం ఛన్నపథైశ్చాపి శిరఃస్నాతజనైర్వృతామ్ ||

3

మాల్యమోదకహస్తైశ్చ ద్విజేంద్రైరభినాదితామ్ |
శుక్లదేవగృహద్వారాం సర్వవాదిత్రనిస్వనామ్ ||

4

సంప్రహృష్టజనాకీర్ణాం బ్రహ్మఘోషాభినాదితామ్ |
ప్రహృష్టవరహస్త్యశ్వాం సంప్రణర్దితగోవృషామ్ ||

5

ప్రహృష్టముదితైః పౌరైరుచ్ఛ్రితధ్వజమాలినీమ్ |
అయోధ్యాం మంథరా దృష్ట్వా పరం విస్మయమాగతా ||

6

ప్రహర్షోత్ఫుల్లనయనాం పాండురక్షౌమవాసినీమ్ |
అవిదూరే స్థితాం దృష్ట్వా ధాత్రీం పప్రచ్ఛ మంథరా ||

7

ఉత్తమేనాభిసంయుక్తా హర్షేణార్థపరా సతీ |
రామమాతా ధనం కిం ను జనేభ్యః సంప్రయచ్ఛతి ||

8

అతిమాత్రప్రహర్షోఽయం కిం జనస్య చ శంస మే |
కారయిష్యతి కిం వాపి సంప్రహృష్టో మహీపతిః ||

9

విదీర్యమాణా హర్షేణ ధాత్రీ తు పరయా ముదా |
ఆచచక్షేఽథ కుబ్జాయై భూయసీం రాఘవశ్రియమ్ ||

10

శ్వః పుష్యేణ జితక్రోధం యౌవరాజ్యేన రాఘవమ్ |
రాజా దశరథో రామమభిషేచయితానఘమ్ ||

11

ధాత్ర్యాస్తు వచనం శ్రుత్వా కుబ్జా క్షిప్రమమర్షితా |
కైలాసశిఖరాకారాత్ప్రాసాదాదవరోహత ||

12

సా దహ్యమానా కోపేన మంథరా పాపదర్శినీ |
శయానామేత్య కైకేయీమిదం వచనమబ్రవీత్ ||

13

ఉత్తిష్ఠ మూఢే కిం శేషే భయం త్వామభివర్తతే |
ఉపప్లుతమఘౌఘేన కిమాత్మానం న బుధ్యసే ||

14

అనిష్టే సుభగాకారే సౌభాగ్యేన వికత్థసే |
చలం హి తవ సౌభాగ్యం నద్యాః స్రోత ఇవోష్ణగే ||

15

ఏవముక్తా తు కైకేయీ రుష్టయా పరుషం వచః |
కుబ్జయా పాపదర్శిన్యా విషాదమగమత్పరమ్ ||

16

కైకేయీ త్వబ్రవీత్కుబ్జాం కచ్చిత్క్షేమం న మంథరే |
విషణ్ణవదనాం హి త్వాం లక్షయే భృశదుఃఖితామ్ ||

17

మంథరా తు వచః శ్రుత్వా కైకేయ్యా మధురాక్షరమ్ |
ఉవాచ క్రోధసంయుక్తా వాక్యం వాక్యవిశారదా ||

18

సా విషణ్ణతరా భూత్వా కుబ్జా తస్యా హితైషిణీ |
విషాదయంతీ ప్రోవాచ భేదయంతీ చ రాఘవమ్ ||

19

అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం త్వద్వినాశనమ్ |
రామం దశరథో రాజా యౌవరాజ్యేఽభిషేక్ష్యతి ||

20

సాస్మ్యగాధే భయే మగ్నా దుఃఖశోకసమన్వితా |
దహ్యమానాఽనలేనేవ త్వద్ధితార్థమిహాగతా ||

21

తవ దుఃఖేన కైకేయి మమ దుఃఖం మహద్భవేత్ |
త్వద్వృద్ధౌ మమ వృద్ధిశ్చ భవేదత్ర న సంశయః ||

22

నరాధిపకులే జాతా మహిషీ త్వం మహీపతేః |
ఉగ్రత్వం రాజధర్మాణాం కథం దేవి న బుధ్యసే ||

23

ధర్మవాదీ శఠో భర్తా శ్లక్ష్ణవాదీ చ దారుణః |
శుద్ధభావేన జానీషే తేనైవమతిసంధితా ||

24

ఉపస్థితం ప్రయుంజానస్త్వయి సాంత్వమనర్థకమ్ |
అర్థేనైవాద్య తే భర్తా కౌసల్యాం యోజయిష్యతి ||

25

అపవాహ్య స దుష్టాత్మా భరతం తవ బంధుషు |
కాల్యే స్థాపయితా రామం రాజ్యే నిహతకంటకే ||

26

శత్రుః పతిప్రవాదేన మాత్రేవ హితకామ్యయా |
ఆశీవిష ఇవాంకేన బాలే పరిహృతస్త్వయా ||

27

యథా హి కుర్యాత్సర్పో వా శత్రుర్వా ప్రత్యుపేక్షితః |
రాజ్ఞా దశరథేనాద్య సపుత్రా త్వం తథా కృతా ||

28

పాపేనానృతసాంత్వేన బాలే నిత్యసుఖోచితే |
రామం స్థాపయతా రాజ్యే సానుబంధా హతా హ్యసి ||

29

సా ప్రాప్తకాలం కైకేయి క్షిప్రం కురు హితం తవ |
త్రాయస్వ పుత్రమాత్మానం మాం చ విస్మయదర్శనే ||

30

మంథరాయా వచః శ్రుత్వా శయనాత్సా శుభాననా |
ఉత్తస్థౌ హర్షసంపూర్ణా చంద్రలేఖేవ శారదీ ||

31

అతీవ సా తు సంహృష్టా కైకేయీ విస్మయాన్వితా |
ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభమ్ ||

32

దత్త్వా త్వాభరణం తస్యై కుబ్జాయై ప్రమదోత్తమా |
కైకేయీ మంథరాం దృష్ట్వా పునరేవాబ్రవీదిదమ్ ||

33

ఇదం తు మంథరే మహ్యమాఖ్యాసి పరమం ప్రియమ్ |
ఏతన్మే ప్రియమాఖ్యాతం భూయః కిం వా కరోమి తే ||

34

రామే వా భరతే వాఽహం విశేషం నోపలక్షయే |
తస్మాత్తుష్టాఽస్మి యద్రాజా రామం రాజ్యేఽభిషేక్ష్యతి ||

35

న మే పరం కించిదితస్త్వయా పునః
ప్రియం ప్రియార్హే సువచం వచో వరమ్ |
తథా హ్యవోచస్త్వమతః ప్రియోత్తరం
పరం వరం తే ప్రదదామి తం వృణు ||

36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తమః సర్గః ||

Ayodhya Kanda Sarga 7 Meaning In Telugu

దశరథుని ముగ్గురు భార్యలలో మూడవ భార్య కైక. కేకయ రాజ కుమార్తె. ఆమెకు దశరథునితో వివాహం అయిన తరువాత ఆమెకు తోడుగా మంథర అనే దాసి ఆమె వెంట అయోధ్యకు వచ్చింది. మంధర కైకేయికి ఆంతరంగిక దాసి. సలహాదారు. అటువంటి మంధర ఆ రోజు మేడమీదికి ఎక్కి అయోధ్యానగరాన్ని చూచింది. అయోధ్య అంతా కోలాహలంగా కనపడింది. రాజమార్గములు అన్నీ తోరణముల తోనూ పతాకములతోనూ అలంకరింపబడి ఉన్నాయి. పౌరులందరూ హడావిడిగా రాచ నగరుకు వస్తున్నారు.

ఇదంతా చూచిన మంథరకు ఏమి జరుగుతూ ఉందో అర్ధం కాలేదు. పక్కను ఉన్న ఒక దాసీని పిలిచి “అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంది? ఆ కౌసల్య ఒట్టి పిసినారి కదా. ఆమె కూడా దానధర్మములు చేస్తూ ఉందా? ఏమి కారణం? దశరథుడు ఏమైనా ఘనకార్యం చేసాడా!” అని అడిగింది.

ఆ దాసి మంథరతో ఇలా అంది. ” అవును. దశరథమహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామునికి యువరాజుగా పట్టాభిషేకము జరిపిస్తున్నాడు.” అని చెప్పి హడావిడిగా వెళ్లిపోయింది.

ఎదుటి వారి ఉన్నతిని చూచి ఓర్వలేని మంథర లో కోపము, అసూయ ప్రవేశించాయి. వెంటనే విసా విసా కైకేయి మందిరమునకు వెళ్లింది. ఆ సమయంలో కైకేయి మెత్తటి పరుపు మీద పడుకొని ఉంది.

కైకను చూచి మంథర కోపంతో “ఓసి తెలివితక్కువదానా! బయట కొంపలు మునుగుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా పడుకొని ఉన్నావా! నీకు రాబోయే ఆపదలు నీకు తెలియడం లేదు.” అని అంది మంథర

కైకకు ఏమీ అర్థం కాలేదు. మంథర వంక ఏమి జరిగింది అన్నట్టు చూచింది.

“అయ్యో నీకు ఇంకా ఏమీ అర్థం కాలేదా! నీ భర్తకు నీవు అత్యంత ప్రియమైన భార్యవు అని అనుకుంటున్నావా! కాదమ్మా కాదు. ఎన్నటికీ కాదు. అదంతా నీ భ్రమ. నీ సౌభాగ్యం అంతా ఎండాకాలంలో నీటి మడుగు వలె ఎంది పోయిందే తల్లీ” అని పరుషంగా మాట్లాడింది మంథర.

ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది. “మంథరా! ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు! అసలు నీకు ఇంత కోపం దుఃఖం ఎలా కలిగింది. ఎందుకు కలిగింది. కాస్త వివరంగా చెప్పవే” అంది కైక. ఆమాటలకు ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మంథర.

‘ఏం చెప్పమంటావే తల్లీ! నీ కొంప నట్టేట మునిగింది. నీకు అంతులేని కష్టం వచ్చి పడింది. నీకు ఈ విషయం తెలుసా. దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేస్తున్నాడట. నీతో ఒక మాటన్నా అన్నాడు. నీ అనుమతి తీసుకున్నాడా.” అని సన్న సన్నగా నొక్కుతూ అంది.

“అసలు ఆ విషయం తెలియగానే నాకు ఒళ్లంతా మండి పోయింది అనుకో! పట్టరాని దు:ఖంలో మునిగిపోయాను. నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నీవేమో తీరుబడిగా పడుకొని ఉన్నావు. నీకు చీమ కుట్టినట్టయినా లేదు.

అమ్మ కైకా! నేను నీ వెంట ఇంత దూరం వచ్చాను కదా. నీ సుఖం నా సుఖం అనీ, నీ కష్టం నా కష్టం అనుకొని ఇన్నాళ్లు నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాను కదా! అయ్యో! రాజ వంశంలో పుట్టి దశరథమహారాజు గారికి ముద్దుల భార్య వు అయి ఉండీ రాచనగరులో జరిగే కుట్రలు తెలుసుకోలేకపోతే ఎలాగా! నీ భర్త నీతో పైపైన ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూ ప్రేమగా మాట్లాడుతున్నా, లోలోపల నీకు తీరని అపకారం చేస్తున్నాడమ్మా. అది నీవు గ్రహించలేక పోతున్నావు.

అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. నీవు అసలే అమాయకురాలివి. తెల్లనివి అన్నీ పాలు నల్లనివి అన్నీ నీళ్లు అని నమ్ముతావు. అందుకే నీ భర్త నీకు ఇంత ద్రోహం, మోసం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నావు. పైపై ఇచ్చకపు మాటలు నీకు, ప్రయోజనాలన్నీ కౌసల్యకు. ఇదమ్మా నీ భర్త వరస. అందుకే కాస్త నా మాట విను. నీ భర్త, నీ కుమారుడు భరతుని, శత్రుఘ్నుని వాళ్ల మేనమామ గారి ఇంటికి పంపాడా. ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు. భరతుని అడ్డు తొలగించుకొని రాజ్యం అంతా రామునికి కట్టబెడుతున్నాడు.

ఏమోనమ్మా! పామును పక్కలో పెట్టుకొని పడుకుంటున్నావు. అది అదునుచూచి కాటేసింది. నీ విషయంలో దశరథుడు అదే చేసాడు. నీకేమో కోరినవి అన్నీ తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్టు నటిస్తూ, నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు. రామునికి పట్టాభిషేకం చేసి నీకూ నీ కుమారునికీ తీరని అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఓ కైకా! ఇప్పటి కన్నా మేలుకో. ఏదో ఒకటి చెయ్యి ఈ పట్టాభిషేకమును ఆపు. నిన్ను నీ కుమారుడు భరతుని రక్షించుకో అంది మంథర కైకను ఓరగా చూస్తూ.

కైక “మంథరా!” అని అరిచింది. కైకకు రామ పట్టాభిషేకము అని మాత్రం వినబడింది. మిగిలిన మాటలు ఏమీ వినబడలేదు. “ఏమన్నావే! నా రామునికి పట్టాభిషేకమా! ఎంతటి శుభవార్త చెప్పావే. ఇదుగో ఈ ఆభరణం కానుకగా తీసుకో. ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు ఇది చాలా ఇంకా ఏమన్నా కావాలా” అంటూ తనమెడలోని హారాన్ని మంథరకు కానుకగా ఇచ్చింది. కైక మనస్సు ఆనంద డోలికలలో తేలిపోతూ ఉంది.

“మంథరా! నాకు రాముడన్నా భరతుడన్నా ఒకటేనే. ఇద్దరూ నాకు సమానమే. అందుకే నా భర్త రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు అని తెలిసి నా హృదయం ఆనందంతో ఊగిపోతూ ఉంది. అబ్బా! నీవు కూడా ఆనందంగా ఉండవే. మనకు ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు. అడగవే. నీకే కావాలో అడుగు. కాదనకుండా ఇస్తాను.” అని సంతోషంతో మంథరను పట్టుకొని ఊపుతూ కేరింతలు కొట్టింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టమః సర్గః (8) >>

Ayodhya Kanda Sarga 22 In Telugu | అయోధ్యాకాండ ద్వావింశః సర్గః

Ayodhya Kanda Sarga 22 In Telugu

అయోధ్యా కాండ మహాకావ్యం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ కాండలో రాముడికి జరిగే పలు సంఘటనలు వివరించబడినాయి. సర్గ 22లో, దశరథ మహారాజు రాముడిని అరణ్యవాసం చేయడానికి ప్రస్తుతిస్తారు. ఈ పరిణామం కారణంగా కౌసల్య మరియు సుమిత్ర విపరీతంగా బాధపడుతారు. రాముడు తండ్రి ఆజ్ఞను పాటిస్తూ, సీత మరియు లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి వెళ్లే నిర్ణయం తీసుకుంటాడు. ఈ భాగంలో కథానాయికలు వారి భావోద్వేగాలను మరియు కఠిన సమయాలను ఎలా ఎదుర్కొంటారో వివరిస్తారు.

దైవప్రాబల్యమ్

అథ తం వ్యథయా దీనం సవిశేషమమర్షితమ్ |
శ్వసంతమివ నాగేంద్రం రోషవిస్ఫారితేక్షణమ్ ||

1

ఆసాద్య రామః సౌమిత్రిం సుహృదం భ్రాతరం ప్రియమ్ |
ఉవాచేదం స ధైర్యేణ ధారయన్సత్త్వమాత్మవాన్ ||

2

నిగృహ్య రోషం శోకం చ ధైర్యమాశ్రిత్య కేవలమ్ |
అవమానం నిరస్యేమం గృహీత్వా హర్షముత్తమమ్ ||

3

ఉపక్లుప్తం హి యత్కించిదభిషేకార్థమద్య మే |
సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయమ్ ||

4

సౌమిత్రే యోఽభిషేకార్థే మమ సంభారసంభ్రమః |
అభిషేకనివృత్త్యర్థే సోఽస్తు సంభారసంభ్రమః ||

5

యస్యా మదభిషేకార్థే మానసం పరితప్యతే |
మాతా మే సా యథా న స్యాత్సవిశంకా తథా కురు ||

6

తస్యాః శంకామయం దుఃఖం ముహూర్తమపి నోత్సహే |
మనసి ప్రతిసంజాతం సౌమిత్రేఽహముపేక్షితుమ్ ||

7

న బుద్ధిపూర్వం నాబుద్ధం స్మరామీహ కదాచన |
మాతౄణాం వా పితుర్వాఽహం కృతమల్పం చ విప్రియమ్ ||

8

సత్యః సత్యాభిసంధశ్చ నిత్యం సత్యపరాక్రమః |
పరలోకభయాద్భీతో నిర్భయోఽస్తు పితా మమ ||

9

తస్యాపి హి భవేదస్మిన్కర్మణ్యప్రతిసంహృతే |
సత్యం నేతి మనస్తాపస్తస్య తాపస్తపేచ్చ మామ్ ||

10

అభిషేకవిధానం తు తస్మాత్సంహృత్య లక్ష్మణ |
అన్వగేవాహమిచ్ఛామి వనం గంతుమితః పునః ||

11

మమ ప్రవ్రాజనాదద్య కృతకృత్యా నృపాత్మజ |
సుతం భరతమవ్యగ్రమభిషేచయితా తతః ||

12

మయి చీరాజినధరే జటామండలధారిణి |
గతేఽరణ్యం చ కైకేయ్యా భవిష్యతి మనఃసుఖమ్ ||

13

బుద్ధిః ప్రణీతా యేనేయం మనశ్చ సుసమాహితమ్ |
తం తు నార్హామి సంక్లేష్టుం ప్రవ్రజిష్యామి మాచిరమ్ ||

14

కృతాంతస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే |
రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తనే ||

15

కైకేయ్యాః ప్రతిపత్తిర్హి కథం స్యాన్మమ పీడనే |
యది భావో న దైవోఽయం కృతాంతవిహితో భవేత్ ||

16

జానాసి హి యథా సౌమ్య న మాతృషు మమాంతరమ్ |
భూతపూర్వం విశేషో వా తస్యా మయి సుతేఽపి వా ||

17

సోఽభిషేకనివృత్త్యర్థైః ప్రవాసార్థైశ్చ దుర్వచైః |
ఉగ్రైర్వాక్యైరహం తస్యాః నాన్యద్దైవాత్సమర్థయే ||

18

కథం ప్రకృతిసంపన్నా రాజపుత్రీ తథాగుణా |
బ్రూయాత్సా ప్రాకృతేవ స్త్రీ మత్పీడాం భర్తృసన్నిధౌ ||

19

యదచింత్యం తు తద్దైవం భూతేష్వపి న హన్యతే |
వ్యక్తం మయి చ తస్యాం చ పతితో హి విపర్యయః ||

20

కశ్చ దైవేన సౌమిత్రే యోద్ధుముత్సహతే పుమాన్ |
యస్య న గ్రహణం కించిత్కర్మణోఽన్యత్ర దృశ్యతే ||

21

సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ |
యచ్చ కించిత్తథాభూతం నను దైవస్య కర్మ తత్ ||

21

ఋషయోఽప్యుగ్రతపసో దైవేనాభిప్రపీడితాః |
ఉత్సృజ్య నియమాంస్తీవ్రాన్ భ్రశ్యంతే కామమన్యుభిః ||

22

అసంకల్పితమేవేహ యదకస్మాత్ప్రవర్తతే |
నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్ ||

23

ఏతయా తత్త్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మనా |
వ్యాహతేఽప్యభిషేకే మే పరితాపో న విద్యతే ||

24

తస్మాదపరితాపః సంస్త్వమప్యనువిధాయ మామ్ |
ప్రతిసంహారయ క్షిప్రమాభిషేచనికీం క్రియామ్ ||

25

ఏభిరేవ ఘటైః సర్వైరభిషేచనసంభృతైః |
మమ లక్ష్మణ తాపస్యే వ్రతస్నానం భవిష్యతి ||

26

అథవా కిం మమైతేన రాజద్రవ్యమతేన తు |
ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి ||

27

మా చ లక్ష్మణ సంతాపం కార్షిర్లక్ష్మ్యా విపర్యయే |
రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయః ||

28

న లక్ష్మణాస్మిన్ఖలు కర్మవిఘ్నే
మాతా యవీయస్యతిశంకనీయా |
దైవాభిపన్నా హి వదత్యనిష్టం
జానాసి దైవం చ తథాప్రభావమ్ ||

29

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వావింశః సర్గః

Ayodhya Kanda Sarga 22 Meaning In Telugu

రాముడు ధృఢచిత్తంతో ఉన్నాడు. తనకు కావలసిన -పట్టాభిషేకము అర్ధాంతరంగా ఆగిపోయినా చలించలేదు. తన లోపల ఉన్న భావాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్న లక్ష్మణునితో ఇలా అన్నాడు.
“తమ్ముడా లక్ష్మణా! నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపము -ప్రదర్శించడానికి ఇది సమయము కాదు. ధైర్యంగా ఉండు.

ఆనందంగా ఉండు. ఈరోజు నాకు పట్టాభిషేకము అన్న విషయము -మరిచిపో. నా పట్టాభిషేకమునకు సేకరించిన వస్తువులు అన్నీ పక్కన పెట్టు. పాపము నా తల్లి కైక నాకు పట్టాభిషేకము జరుగబోవుచున్నది అని బాధపడిపోతూ ఉంది. ఆమె బాధను మనము పోగొట్టాలి. -పట్టాభిషేకము ఆగిపోయింది అని ఆమెకు తెలియజెయ్యాలి.

ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ, అనుమానము ఉంటే నేను -సహించలేను. నేను పుట్టిన తరువాత నా తల్లులకు గానీ నా తండ్రికి గానీ మనసు బాధపెట్టలేదు. నా తండ్రి సత్యమునే పలుకుతాడు. ఆడిన మాట తప్పడు. ఆయన నా తల్లి కైకకు ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యము.

మీరు అనుకున్నట్టు నాకు పట్టాభిషేకము జరిగితే నా తండ్రి నా తల్లి కైకకు ఇచ్చిన మాట తప్పిన వాడు అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి, నా పట్టాభిషేక కార్యక్రమమును ఇంతటితో నిలిపివేసి వెంటనే అరణ్యములకు వెళ్లే పనిలో ఉంటాను. అదే నా ప్రస్తుత కర్తవ్యము. నేను అడవులకు వెళితే నా తల్లి కైక మనస్సు శాంతిస్తుంది. ఆమె పరిపూర్ణంగా సంతోషిస్తుంది. తన కుమారుడు భరతునికి నిర్విఘ్నంగా పట్టాభిషేకము జరిపించు కుంటుంది.

లక్ష్మణా! నీకు తెలుసో లేదో. మన తండ్రిగారు కూడా ఈ నిర్ణయాన్ని చాలా బాధతో తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం అమలు పరచడం మన బాధ్యత. మనం ఇంకొక విషయం మరిచి పోకూడదు. నేను కోరుకోకుండానే నా పట్టాభిషేకము నిర్ణయం అయింది. కాని అది అర్థాంతరంగా ఆగిపోయింది. ఇది కూడా నా ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ విచిత్ర పరిణామాలకు ఎవరూ కారణం కాదు. ఎవరినీ తప్పుపట్టనవసరం లేదు. ఇది అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోవాలి.

మన తల్లి కైకకు నా పట్టాభిషేకము ఆపించవలెనని ఆ దైవమే బుద్ధిపుట్టించి ఉంటుంది. లేకపోతే ఇదివరలో ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాటకూడా అనని మన తల్లి కైక, నాకు ఎందుకు ఈ రకమైన బాధ, కష్టం కలిగిస్తుంది. నన్ను అడవులకు పొమ్మని శాసిస్తుంది. నేను నా తల్లి కైకకు ఎన్నడూ మనసుకు కష్టం కలిగించి ఎరుగను. అలాగే నా తల్లి కైక నన్ను, తన కుమారుడు భరతుని ఎన్నడూ బేధబుద్ధితో చూడలేదు. మాఇద్దరినీ సమానంగా చూచింది. ఇవన్నీ నీకూ తెలుసు.

కాబట్టి లక్ష్మణా! కైక నా గురించి పరుషంగా మాట్లాడటంగానీ, నా పట్టాభిషేకమును నిలిపివేయడం గానీ, ఆమె స్వతాహాగా చేసినది కాదు. అంతా దైవ నిర్ణయం. లేకపోతే ఉత్తమ రాజవంశము లో పుట్టిన కైక, ఒక సామాన్య స్త్రీ వలె, తన భర్తముందు, పట్టాభిషేకము చేసుకోబోవు తన కుమారుని తూలనాడుతుందా! అతని పట్టాభి షేకమును ఆపిస్తుందా! ఆ మె విపరీత ప్రవర్తనకు దైవమే కారణము కానీ వేరుకాదు.

దైవ నిర్ణయములు చాలా కఠినంగా ఉంటాయి. దైవ నిర్ణయాన్ని అడ్డుకోడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమని కోరింది. ఆ దైవనిర్ణయాన్ని అమలు పరచడం నా కర్తవ్యం. దైవము ఎలా నడిపిస్తే అలా నడవడం మన కర్తవ్యం. అలాంటి దైవ నిర్ణయానికి ఎవడు ఎదురీదగలడు?

లక్ష్మణా! మనము ఏదో చేస్తున్నాము ఏదో సాధిస్తున్నాము అని అనుకుంటాము. అది పొరపాటు. మనకు అనుదినమూ కలిగే సుఖదు:ఖాలు, భయము, క్రోధమూ, లాభనష్టాలూ, ఉండటం, లేకపోవడం, ఇవి అన్నీ దైవ నిర్ణయంబట్టి జరుగుతూ ఉంటాయి. మానవుల ప్రమేయము ఏమీ లేదు.

పూర్వము ఇంద్రియములను జయించాము అని చెప్పుకొన్న మహాఋషులు కూడా దైవప్రేరితులై, కామ కోరికలకు లోబడి, తమ తపస్సులను నాశనం చేసుకున్నారు. ఏదైనా ఒక పని మనము సంకల్పించినపుడు. ఆ పని పూర్తి కావచ్చే సమయంలో ఏదైనా అడ్డు తగిలితే దానిని దైవనిర్ణయంగానే భావించాలి.

కాబట్టి ఇంకొంచెం సేపటిలో జరుగబోవు నా పట్టాభి షేకము, ఏ కారణం చేతనైనా, ఆగిపోయింది అంటే అది దైవనిర్ణయమే గాని వేరు కాదు. నా పట్టాభిషేకము అగిపోయినందుకు నాకు ఎలాంటి దుఃఖము లేదు. నేను బాధపడటం లేదు. నీవు కూడా నీ మనసులో ఉన్న బాధను తీసి వెయ్యి. వెంటనే పట్టాభిషేకమునకు జరుగుచున్న పనులను నిలిపివెయ్యి.

లక్ష్మణా! నా పట్టాభిషేకము కొరకు సముద్రముల నుండి పవిత్ర పుణ్య నదీనదముల నుండి తెచ్చిన నీటితో నేను రేపటినుండి గడపబోవు తాపస వ్రతమునకు దీక్షా స్నానం చేస్తాను. అయినా వద్దులే. ఎక్కడెక్కడి నుంచో అతి కష్టం మీద తెచ్చిన ఈ పుణ్య నదీజలములు నాకు ఎందుకు. నేను బావిలో నుండి నీరు తోడుకొని స్నానం చేస్తాను. రేపటి నుండి నేను అలా చెయ్యాలి కదా!

తమ్ముడూ! నాకు రాజ్యలక్ష్మి లభించలేదని బాధ పడకు. దానికి బదులు నాకు వనలక్ష్మి లభించిందని సంతోషించు. నా దృష్టిలో రెండూ ఒకటే.” అని అని లక్ష్మణుని అనునయించాడు రాముడు.

అయోధ్యాకాండ త్రయోవింశః సర్గః (౨౩) >>

Ayodhya Kanda Sarga 6 In Telugu – అయోధ్యాకాండ షష్ఠః సర్గః

Ayodhya Kanda Sarga 6 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. షష్ఠః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.

పౌరోత్సేకః

గతే పురోహితే రామః స్నాతో నియతమానసః |
సహ పత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాగమత్ ||

1

ప్రగృహ్య శిరసా పాత్రీం హవిషో విధివత్తదా |
మహతే దైవతాయాజ్యం జుహావ జ్వలితేఽనలే ||

2

శేషం చ హవిషస్తస్య ప్రాశ్యాశాస్యాత్మనః ప్రియమ్ |
ధ్యాయన్నారాయణం దేవం స్వాస్తీర్ణే కుశసంస్తరే ||

3

వాగ్యతః సహ వైదేహ్యా భూత్వా నియతమానసః |
శ్రీమత్యాయతనే విష్ణోః శిశ్యే నరవరాత్మజః ||

4

ఏకయామావశిష్టాయాం రాత్ర్యాం ప్రతివిబుధ్య సః |
అలంకారవిధిం కృత్స్నం కారయామాస వేశ్మనః ||

5

తత్ర శృణ్వన్సుఖా వాచః సూతమాగధవందినామ్ |
పూర్వాం సంధ్యాముపాసీనో జజాప యతమానసః ||

6

తుష్టావ ప్రణతశ్చైవ శిరసా మధుసూదనమ్ |
విమలక్షౌమసంవీతో వాచయామాస చ ద్విజాన్ ||

7

తేషాం పుణ్యాహఘోషోఽథ గంభీరమధురస్తదా |
అయోధ్యాం పూరయామాస తూర్యఘోషానునాదితః ||

8

కృతోపవాసం తు తదా వైదేహ్యా సహ రాఘవమ్ |
అయోధ్యానిలయః శ్రుత్వా సర్వః ప్రముదితో జనః ||

9

తతః పౌరజనః సర్వః శ్రుత్వా రామాభిషేచనమ్ |
ప్రభాతాం రజనీం దృష్ట్వా చక్రే శోభయితుం పురీమ్ ||

10

సితాభ్రశిఖరాభేషు దేవతాయతనేషు చ |
చతుష్పథేషు రథ్యాసు చైత్యేష్వట్టాలకేషు చ ||

11

నానాపణ్యసమృద్ధేషు వణిజామాపణేషు చ |
కుటుంబినాం సమృద్ధేషు శ్రీమత్సు భవనేషు చ ||

12

సభాసు చైవ సర్వాసు వృక్షేష్వాలక్షితేషు చ |
ధ్వజాః సముచ్ఛ్రితాశ్చిత్రాః పతాకాశ్చాభవంస్తదా ||

13

నటనర్తకసంఘానాం గాయకానాం చ గాయతామ్ |
మనఃకర్ణసుఖా వాచః శుశ్రువుశ్చ తతస్తతః ||

14

రామాభిషేకయుక్తాశ్చ కథాశ్చక్రుర్మిథో జనాః |
రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ ||

15

బాలా అపి క్రీడమానాః గృహద్వారేషు సంఘశః |
రామాభిషేకసంయుక్తాశ్చక్రురేవ మిథః కథాః ||

16

కృతపుష్పోపహారశ్చ ధూపగంధాధివాసితః |
రాజమార్గః కృతః శ్రీమాన్పౌరై రామాభిషేచనే ||

17

ప్రకాశీకరణార్థం చ నిశాగమనశంకయా |
దీపవృక్షాంస్తథా చక్రురనురథ్యాసు సర్వశః ||

18

అలంకారం పురస్యైవం కృత్వా తత్పురవాసినః |
ఆకాంక్షమాణా రామస్య యౌవరాజ్యాభిషేచనమ్ ||

19

సమేత్య సంఘశః సర్వే చత్వరేషు సభాసు చ |
కథయంతో మిథస్తత్ర ప్రశశంసుర్జనాధిపమ్ ||

20

అహో మహాత్మా రాజాయమిక్ష్వాకుకులనందనః |
జ్ఞాత్వా యో వృద్ధమాత్మానం రామం రాజ్యేఽభిషేక్ష్యతి ||

21

సర్వే హ్యనుగృహీతాః స్మ యన్నో రామో మహీపతిః | [సర్వేప్య]
చిరాయ భవితా గోప్తా దృష్టలోకపరావరః ||

22

అనుద్ధతమనా విద్వాన్ధర్మాత్మా భ్రాతృవత్సలః |
యథా చ భ్రాతృషు స్నిగ్ధస్తథాస్మాస్వపి రాఘవః ||

23

చిరం జీవతు ధర్మాత్మా రాజా దశరథోఽనఘః |
యత్ప్రసాదేనాభిషిక్తం రామం ద్రక్ష్యామహే వయమ్ ||

24

ఏవం‍విధం కథయతాం పౌరాణాం శుశ్రువుస్తదా |
దిగ్భ్యో విశ్రుతవృత్తాంతాః ప్రాప్తా జానపదా జనాః || [దిగ్భ్యోఽపి]

25

తే తు దిగ్భ్యః పురీం ప్రాప్తాః ద్రష్టుం రామాభిషేచనమ్ |
రామస్య పూరయామాసుః పురీం జానపదా జనాః ||

26

జనౌఘైస్తైర్విసర్పద్భిః శుశ్రువే తత్ర నిస్వనః |
పర్వసూదీర్ణవేగస్య సాగరస్యేవ నిస్వనః ||

27

తతస్తదింద్రక్షయసన్నిభం పురం
దిదృక్షుభిర్జానపదైరుపాగతైః |
సమంతతః సస్వనమాకులం బభౌ
సముద్రయాదోభిరివార్ణవోదకమ్ ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠః సర్గః ||

Ayodhya Kanda Sarga 6 Meaning In Telugu

వసిష్ఠుడు తన మందిరము నుండి వెళ్లిపోయిన తరువాత రాముడు, సీతతో కలిసి మంగళ స్నానము చేసి, భక్తితో శ్రీ మహా విష్ణువును పూజించాడు. తరువాత అగ్నికార్యము నిర్వర్తించాడు. శ్రీ మహావిష్ణు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హెూమం చేసాడు. అగ్నిలో వేల్చగా మిగిలిన హవిస్సును తాను భుజించాడు. తరువాత తన భార్య సీతతో కూడా దర్భలతో చేసిన చాప మీద పడుకున్నాడు.

మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు. తన మందిరమును చక్కగా అలంకరింపచేసాడు. ఇంతలో వంది మాగధులు వచ్చి స్తోత్రపాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు. రాముడు ప్రాతఃకాల సంధ్యావందనము నిర్వర్తించాడు. గాయత్రీ మాతను ఉపాసించాడు. బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేసారు.

రామపట్టాభిషేకము జరుగబోవుచున్నదని అయోధ్యా నగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు. పురమును అంతా అలంకరించారు. రాజ ప్రాసాదముల మీద, కార్యాలయముల మీద, దేవాలయముల మీద పతాకములను ఎగురవేసారు. గాయకులు పాటలు పాడుతున్నారు. నర్తకులు చక్కగా తయారయి రాజభవనమునకు వెళ్లుటకు సిద్ధమవుతున్నారు. నర్తకులు నర్తిస్తున్నారు. అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడు కుంటున్నారు. ఎవరి నోట విన్నా రాముని గుణగణములు, రామ పట్టాభిషేకము గురించి మాటలు వినబడుతున్నాయి. రామ పట్టాభిషేకం గురించి తప్ప ఎవరూ మరొక మాట మాట్లాడుకోవడం లేదు. రామ పట్టాభిషేక మహోత్సవము ఎంతసేపు జరుగుతుందో, చీకటి పడుతుందేమో అని పట్ట పగలే చిత్ర విచిత్రములైన దీపములు వీధులలో వెలిగించి పెట్టారు.

తాను వృద్ధుడైన సంగతి ఎరింగి దశరథుడు తగిన నిర్ణయం తీసుకొన్నాడని, ఇంక నుంచి రాముని పాలనలో తాము సుఖ సంతోషాలు అనుభవిస్తామని అయోధ్యావాసులు పొంగిపోతున్నారు. రాముడు తామందరినీ తన సోదరుల మాదిరి వాత్సల్యముతో ఆదరిస్తాడని జనులంతా ఆనంద పరవశులౌతున్నారు. రాముని పట్టాభిషేక వార్త విన్న చుట్టుపక్కల జనపదములలో నివసించు జానపదులు తండోప తండములుగా అయోధ్యకు తరలి వస్తున్నారు. వారందరితోటీ అయోధ్యానగరము క్రిక్కింరిసిపోయింది. వారందరూ మాట్లాడుకుంటూ కేరింతలు కొడుతుంటే వారి ఘోష సముద్రఘోషను మరిపిస్తూ ఉంది. ఆ రోజు అయోధ్యానగరము మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

వాల్మీకి రామాయణంలో ఈ విధంగా ఉంటే వ్యాసుడు రచించిన బ్రహ్మాండపురాణంలో భాగమయిన ఆధ్యాత్మ రామాయణంలో ఒక కొత్త విషయం ఉంది. అదేమి టంటే…..

ఒక రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. రాముని తో ఇలా అన్నాడు. “ఓ రామా! నన్ను బ్రహ్మ నీవద్దకుపంపాడు. నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకము చేయవలెనని నిశ్చయించాడు. కాని నీ జననము రావణ సంహారము కొరకు జరిగినది కదా! నీవు రాజ్యపాలన చేస్తుంటే, రావణ సంహారము మాటేమిటి? భూభారము తగ్గించుటకు నీకు రాక్షస సంహారము చేయవలయును కదా! రామా! నీవు దేని కొరకు అవతరించితివో ఆ విషయము మరిచిపోవద్దు” అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు. “నారదమహర్షీ! నాకు తెలియని విషయము ఏమున్నది. నేను ఆడిన మాట తప్పను. రాక్షస సంహారము చేసెదను. కాలము తీరిన దైత్యులను సంహరించెదను. రేపే దండకారణ్య ప్రయాణము. పదునాలుగు సంవత్సరములు అరణ్య వాసము చేసెదను. సీతాపహరణము మిషతో రావణుని సంహరించెదను.. ఇది సత్యము.” అని రాముడు నారదునితో అన్నాడు. రాముని మాటలకు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. (ఇక్కడ రాముడు సామాన్య మానవుడు కాదు. కారణ జన్ముడు. సాక్షాత్తు విష్ణు అవతారము, భూత, భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు అని చెప్పబడింది.)

తరువాత వసిష్ఠుడు రామునితో ఉపవాసవ్రతము చేయించిన తరువాత వెళ్లిపోయాడు. ఆ సమయంలో దేవలోకంలో దేవతలు సరస్వతీదేవి వద్దకు వెళ్లారు. “అమ్మా సరస్వతీ దేవీ! నీవు ఇప్పుడు వెంటనే భూలోకమునకు వెళ్లాలి. నీవు రామునికి జరుగబోవు పట్టాభిషేకమునకు విఘ్నము కలిగించాలి. ఇది బ్రహ్మదేవుని ఆదేశము. అమ్మా! నీవు ముందుగా మంధర అనే దాసి వాక్కులో ప్రవేశించాలి. తరువాత కైకేయి వాక్కులో ప్రవేశించాలి. శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నము భగ్నము అయిన తరువాత మరలా తిరిగిరావాలి.” అని ప్రార్థించారు. సరస్వతీ దేవి దేవతల ప్రార్థన మన్నించి అయోధ్యా నగరమునకు వచ్చి మంధర వాక్కులో ప్రవేశించింది.

(ఈ సంఘటనలు మనకు ఆధ్యాత్మ రామాయణంలో కనపడతాయి. ఇంక ఈ సందర్భంలో తులసీరామాయణం లో ఏముందో తెలుసుకుందాము.)

అయోధ్యలో పౌరులందరూ రామపట్టాభిషేక సందర్భములో ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకములో దేవతలు విచారంగా ఉ న్నారు. వారందరూ సరస్వతీదేవి వద్దకు పోయి ఇలా అన్నారు.

“అమ్మా! రామ పట్టాభిషేకము జరుగబోవుచున్నది. నీవు ఎలాగైనా దానిని భగ్నము చేసి, రాముని అరణ్యములకు పంపాలి. దాని వలన దేవతల కార్యము సఫలమవుతుంది.” అని అన్నారు. ఆ మాటలకు సరస్వతీ దేవి నేను ఇటువంటి పాడు పని చెయ్యాలా అని చింతించింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అప్పుడు దేవతలు ఇలా అన్నారు.

“అమ్మ తమరు ఈ పని చేసినందువలన తమరికి ఏ దోషమూ అంటదు. ఇది దేవ కార్యము. రాముడు సామాన్య మానవుడు కాడు. భేదమోదములకు అతీతుడు. సుఖము దుఃఖము సామాన్య మానవులకు కానీ రామునికి అంటవు. కాబట్టి తమరు అయోధ్యకు వెళ్లాలి.” అని ప్రార్థించారు.

అప్పుడు సరస్వతీ దేవి తనలో తాను ఇలా అనుకొన్నది.

“ఆహా! ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు. వీరు ఉండేచోటు అత్యున్నత స్థానమైన స్వర్గము. కానీ వీరి బుద్ధులు మాత్రము పరమ నీచములు. ఇతరులు బాగుపడుతుంటే చూచి సహించలేరు. పోనీ. ఇదీ ఒకందుకు మంచిదే… రాముడు వనవాసము వెళితే రాక్షససంహారము జరుగుతుంది. రామాయణ కధ లోకంలో ప్రచారం అవుతుంది. ఎంతో మంది కవులు గాయకులు రామ కథను గానం చేస్తారు. నేను ఆ కవులు గాయకుల నాలుకల మీద నాట్యం చేస్తుంటాను. రామ కథను గానం చేస్తుంటాను. దీనివలన భూలోకంలో నా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.” అని అనుకొన్నది సరస్వతీ దేవి. దేవతల కోరిక ప్రకారము అయోధ్యకు వచ్చింది. ఇదీ తులసీరామాయణంలో ఉన్నకధ.

పై చెప్పిన కధా సంఘటనలు వాల్మీకి రామాయణంలో లేవు. రాముడు వనవాసమునకు పోవడంలో దేవరహస్యాలు ఏమీ లేవు. మామూలు మానవుల్లో ఎలా జరుగుతుందో అలా జరిగింది.

దశరథుడు భరతుడు ఇంటలేని సమయంలో కావాలనే రామ పట్టాభిషేకమునకు ముహూర్తము నిర్ణయించాడు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.

యుగధర్మము ప్రకారము రాజ్యము జ్యేష్టునికి చెందుతుంది. దశరథుని కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రామునికి పట్టాభిషేకం చెయ్యడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని భరతుడు ఏమైనా పేచీ పెడతాడేమో అని దశరథుడు సందేహించాడు. అందుకని భరతుడు లేని వేళ పట్టాభిషేకము నిర్ణయించాడు.

వాల్మీకి రామాయణము ప్రకారము ఇందులో దేవతల ప్రసక్తికానీ, దేవరహస్యము కానీ ఏమీలేవు.

అయోధ్యాకాండ సప్తమః సర్గః (7) >>

Balakanda Sarga 26 In Telugu – బాలకాండ షడ్వింశః సర్గః

Balakanda Sarga 26 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షడ్వింశః సర్గలో సీతాస్వయంవరంలోని ప్రధాన సంఘటనలు వివరించబడ్డాయి. జనక మహారాజు తన కుమార్తె సీతకు తగిన వరుడిని కనుగొనేందుకు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. అనేకమంది మహారథులు మరియు రాజులు శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలమవుతారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమవగా, శ్రీరాముడు ధనస్సును తూటాలకు విరచి తన శక్తిని ప్రదర్శిస్తాడు.

తాటకావధః

మునేర్వచనమక్లీబం శ్రుత్వా నరవరాత్మజః |
రాఘవః ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః ||

1

పితుర్వచననిర్దేశాత్పితుర్వచనగౌరవాత్ |
వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశంకయా ||

2

అనుశిష్టోఽస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా |
పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం చ తద్వచః ||

3

సోఽహం పితుర్వచః శ్రుత్వా శాసనాద్బ్రహ్మవాదినః |
కరిష్యామి న సందేహస్తాటకావధముత్తమమ్ ||

4

గోబ్రాహ్మణహితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ |
తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః ||

5

ఏవముక్త్వా ధనుర్మధ్యే బద్ధ్వా ముష్టిమరిందమః |
జ్యాఘోషమకరోత్తీవ్రం దిశః శబ్దేన నాదయన్ ||

6

తేన శబ్దేన విత్రస్తాస్తాటకావనవాసినః |
తాటకా చ సుసంక్రుద్ధా తేన శబ్దేన మోహితా ||

7

తం శబ్దమభినిధ్యాయ రాక్షసీ క్రోధమూర్ఛితా |
శ్రుత్వా చాభ్యద్రవద్వేగాద్యతః శబ్దో వినిఃసృతః ||

8

తాం దృష్ట్వా రాఘవః క్రుద్ధాం వికృతాం వికృతాననామ్ |
ప్రమాణేనాతివృద్ధాం చ లక్ష్మణం సోఽభ్యభాషత ||

9

పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః |
భిద్యేరన్దర్శనాదస్యా భీరూణాం హృదయాని చ ||

10

ఏనాం పశ్య దురాధర్షాం మాయాబలసమన్వితామ్ |
వినివృత్తాం కరోమ్యద్య హృతకర్ణాగ్రనాసికామ్ ||

11

న హ్యేనాముత్సహే హంతుం స్త్రీస్వభావేన రక్షితామ్ |
వీర్యం చాస్యా గతిం చాపి హనిష్యామీతి మే మతిః ||

12

ఏవం బ్రువాణే రామే తు తాటకా క్రోధమూర్ఛితా |
ఉద్యమ్య బాహూ గర్జంతీ రామమేవాభ్యధావత ||

13

విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిర్హుంకారేణాభిభర్త్స్య తామ్ |
స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత ||

14

ఉద్ధూన్వానా రజో ఘోరం తాటకా రాఘవావుభౌ |
రజోమోహేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్ ||

15

తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ |
అవాకిరత్సుమహతా తతశ్చుక్రోధ రాఘవః ||

16

శిలావర్షం మహత్తస్యాః శరవర్షేణ రాఘవః |
ప్రతిహత్యోపధావంత్యాః కరౌ చిచ్ఛేద పత్రిభిః ||

17

తతశ్ఛిన్నభుజాం శ్రాంతామభ్యాశే పరిగర్జతీమ్ |
సౌమిత్రిరకరోత్క్రోధాద్ధృతకర్ణాగ్రనాసికామ్ ||

18

కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః |
అంతర్ధానం గతా యక్షీ మోహయంతి చ మాయయా ||

19 [స్వమాయయా]

అశ్మవర్షం విముంచంతీ భైరవం విచచార సా |
తతస్తావశ్మవర్షేణ కీర్యమాణౌ సమంతతః ||

20

దృష్ట్వా గాధిసుతః శ్రీమానిదం వచనమబ్రవీత్ |
అలం తే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణీ ||

21

యజ్ఞవిఘ్నకరీ యక్షీ పురా వర్ధేత మాయయా |
వధ్యతాం తావదేవైషా పురా సంధ్యా ప్రవర్తతే ||

22

రక్షాంసి సంధ్యాకాలేషు దుర్ధర్షాణి భవంతి హి |
ఇత్యుక్తస్తు తదా యక్షీమశ్మవృష్ట్యాభివర్షతీమ్ ||

23

దర్శయన్ శబ్దవేధిత్వం తాం రురోధ స సాయకైః |
సా రుద్ధా శరజాలేన మాయాబలసమన్వితా ||

24

అభిదుద్రావ కాకుత్స్థం లక్ష్మణం చ వినేషుదీ |
తామాపతంతీం వేగేన విక్రాంతామశనీమివ ||

25

శరేణోరసి వివ్యాధ సా పపాత మమార చ |
తాం హతాం భీమసంకాశాం దృష్ట్వా సురపతిస్తదా ||

26

సాధు సాధ్వితి కాకుత్స్థం సురాశ్చ సమపూజయన్ |
ఉవాచ పరమప్రీతః సహస్రాక్షః పురందరః ||

27

సురాశ్చ సర్వే సంహృష్టా విశ్వామిత్రమథాబ్రువన్ |
మునే కౌశిక భద్రం తే సేంద్రాః సర్వే మరుద్గణాః ||

28

తోషితాః కర్మణా తేన స్నేహం దర్శయ రాఘవే |
ప్రజాపతేః కృశాశ్వస్య పుత్రాన్సత్యపరాక్రమాన్ ||

29

తపోబలభృతాన్బ్రహ్మన్రాఘవాయ నివేదయ |
పాత్రభూతశ్చ తే బ్రహ్మంస్తవానుగమనే ధృతః ||

30

కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా |
ఏవముక్త్వా సురాః సర్వే జగ్ముర్హృష్టా యథాగతమ్ ||

31

విశ్వామిత్రం పురస్కృత్య తతః సంధ్యా ప్రవర్తతే |
తతో మునివరః ప్రీతస్తాటకావధతోషితః ||

32

మూర్ధ్ని రామముపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్ |
ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన ||

33

శ్వః ప్రభాతే గమిష్యామస్తదాశ్రమపదం మమ |
విశ్వామిత్రవచః శ్రుత్వా హృష్టో దశరథాత్మజః ||

34

ఉవాస రజనీం తత్ర తాటకాయా వనే సుఖమ్ |
ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని |
రమణీయం విబభ్రాజ యథా చైత్రరథం వనమ్ ||

35

నిహత్య తాం యక్షసుతాం స రామః
ప్రశస్యమానః సురసిద్ధసంఘైః |
ఉవాస తస్మిన్మునినా సహైవ
ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానః ||

36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షడ్వింశః సర్గః ||

Balakanda Sarga 26 Meaning In Telugu

విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు. ” ఓ మహర్షి! మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు. తమరు ఏమి చెబితే అలా చెయ్యమన్నాడు. నా తండ్రి గారి మాటను జవదాటలేను. అందుకే తమరి మాట నాకు శిరోధార్యము. తమరు ఏం చెబితే అలా చేస్తాను. గోవులు, బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, లోక క్షేమము కొరకు తమరు చెప్పినట్టే చేస్తాను.” అని పలికాడు రాముడు.

వెంటనే తన ధనుస్సు చేతిలోకి తీసుకున్నాడు. వింటి నారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటకా వనములోని వారందరి గుండెలు అదిరిపోయాయి. భయంతో గడా గడా వణికిపోయారు. ఆ శబ్దము విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దము వచ్చిన వైపుకు వచ్చింది.

వికారంగా ఉన్న తాటకిని చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణిని చూడు. పిరికి వాళ్లు అయితే ఆమెను చూచి గుండె ఆగి చనిపోతారు కదా! ఆమె మాయావి. అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాము. ఎందుకంటే ఈమె స్త్రీ. అదే ఈమెను రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమును నశింప చేస్తాను.” అని అన్నాడు రాముడు.

రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉండగానే తాటకి రాముని మీదికి గర్జిస్తూ దూకింది. ఇంతలో విశ్వామిత్రుడు కోపంతో హుంకరించాడు. తాటకిని అదిలించాడు. రామలక్ష్మణులకు స్వస్తి వాచకం పలికాడు. రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు.

విశ్వామిత్రుని హుంకారమునకు తాటకి భయపడలేదు. తన మాయా శక్తిచేత వారి మీద రాళ్ల వర్షము కురిపించింది. రాముడికి కోపం వచ్చింది. వెంటనే తాటకి మీద శరవర్షము కురిపించి ఆ రాళ్ల వర్షమును ఆపు చేసాడు.

తాటకి ఊరుకోలేదు. తన చేతులుచాచి రాముని మీదికి వచ్చింది. రాముడు తన బాణములతో తాటకి రెండు చేతులు ఖండించాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకొని తాటకి ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేసాడు. అయినా తాటకి ఊరుకోలేదు. తన మాయా శక్తితో వివిధము లైన ఆకారములను ధరించి మరలా రామ లక్ష్మణుల మీద రాళ్ల వర్షము కురిపించింది. రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూచాడు.

అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఆమె మీద జాలి చూపకు. ఈమె పాపాత్మురాలు. దుర్మార్గురాలు. ఈమె మాయావి. వివిధములైన రూపములను ధరించగలదు. రాత్రి సమీపించుచున్నది. ఈ లోపలే ఈమెను చంపి వెయ్యి సంధ్యాకాలములో రాక్షసుల బలం పెరుగుతుంది. త్వరపడు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేధి బాణాన్ని ఎక్కుపెట్టాడు.

(శబ్ద వేధి అంటే, టార్గెట్ కనిపించనపుడు, కేవలం శబ్దం ఆధారంగా, శబ్దమును విని టార్గెట్ ను కొట్టడం).

తాటక నుండి వచ్చు శబ్దమును బట్టి రాముడు బాణాన్ని విడిచాడు. ఆ బాణం సూటిగా తాటకిని తాకింది. రామ బాణం తగిలిన తాటకి రెట్టించిన కోపంతో రాముని మీదికి ఉరికింది. రాముడు మరొక బాణంతో తాటకి వక్షస్థలము మీద కొట్టాడు. ఆ బాణము సరిగా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది. తాటకి కిందపడి మరణించింది.

తాటకి మరణించడం చూచి దేవతలు అంతా సంతోషించారు. దేవతల అందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రుని తో ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! నీవు రాముని యందుఎక్కువ వాత్సల్యము చూపుము. భృశాశ్వునిచే సృష్టింప బడిన అస్త్ర శస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశింపుము. ఎందు కంటే రాముడు భవిష్యత్తులో లోక కంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది. ” అని పలికాడు.

తరువాత దేవేంద్రుడు దేవతలు వెళ్లిపోయారు. ఇంతలో సంధ్యాసమయము అయింది. తాటకను చంపిన రాముని సంతోషంతో చూచాడు విశ్వామిత్రుడు. వాత్సల్యంలో అతని తల నిమిరాడు.

‘ ఓ రామా! సంధ్యాసమయము అయినది. మనము ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయము మన ప్రయాణము కొన సాగిద్దాము” అని అన్నాడు. రామ లక్ష్మణులు దానికి అంగీకరించారు.

అందరూ ఆరాత్రికి తాటకా వనములో విశ్రమించారు. మరునాడు ఉదయము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొలిపాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ సప్తవింశః సర్గః (27) >>

Ayodhya Kanda Sarga 19 In Telugu – అయోధ్యాకాండ ఏకోనవింశః సర్గః

Ayodhya Kanda Sarga 19

అయోధ్యాకాండ ఏకోనవింశః సర్గంలో, దశరథుడు రాముని వనవాసానికి పంపడానికి నిర్ణయించుకుంటాడు. కౌసల్య, సుమిత్రలు శోకంతో విలపిస్తారు. రాముడు, సీత, లక్ష్మణులు వనానికి వెళ్లడానికి సిద్ధపడతారు. ప్రజలు రాముని వెంబడిస్తారు. వదినీతో పాటు అనుసరించేందుకు సుమిత్రతో మాట్లాడతారు. రాముడు ధైర్యంగా ఉండి కైకేయితో మాట్లాడుతూ తండ్రి ఆజ్ఞను పాటించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. ఈ సర్గలో, రాముని ధైర్యం, దశరథుడి వేదన, కుటుంబం, ప్రజల దుఃఖం ప్రాముఖ్యత వహిస్తాయి. రాముడు తన ధర్మం కోసం వనవాసం కోసం సిద్ధపడడం, కుటుంబం, ప్రజల పట్ల తన బాధ్యతలను నిర్దేశించడం ఈ సర్గలో ప్రాముఖ్యత వహిస్తుంది.

రామప్రతిజ్ఞా

తదప్రియమమిత్రఘ్నో వచనం మరణోపమమ్ |
శ్రుత్వా న వివ్యథే రామః కైకేయీం చేదమబ్రవీత్ || ౧ ||

ఏవమస్తు గమిష్యామి వనం వస్తుమహం త్వితః |
జటాఽజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్ || ౨ ||

ఇదం తు జ్ఞాతుమిచ్ఛామి కిమర్థం మాం మహీపతిః |
నాభినందతి దుర్ధర్షో యథాపురమరిందమః || ౩ ||

మన్యుర్న చ త్వయా కార్యో దేవి బ్రూమి తవాగ్రతః |
యాస్యామి భవ సుప్రీతా వనం చీరజటాధరః || ౪ ||

హితేన గురుణా పిత్రా కృతజ్ఞేన నృపేణ చ |
నియుజ్యమానో విస్రబ్ధః కిం న కుర్యామహం ప్రియమ్ || ౫ ||

అలీకం మానసం త్వేకం హృదయం దహతీవ మే |
స్వయం యన్నాహ మాం రాజా భరతస్యాభిషేచనమ్ || ౬ ||

అహం హి సీతాం రాజ్యం చ ప్రాణానిష్టాన్ధనాని చ |
హృష్టో భ్రాత్రే స్వయం దద్యాం భరతాయాప్రచోదితః || ౭ ||

కిం పునర్మనుజేంద్రేణ స్వయం పిత్రా ప్రచోదితః |
తవ చ ప్రియకామార్థం ప్రతిజ్ఞామనుపాలయన్ || ౮ ||

తదాశ్వాసయ హీమం త్వం కిం న్విదం యన్మహీపతిః |
వసుధాసక్తనయనో మందమశ్రూణి ముంచతి || ౯ ||

గచ్ఛంతు చైవానయితుం దూతాః శీఘ్రజవైర్హయైః |
భరతం మాతులకులాదద్యైవ నృపశాసనాత్ || ౧౦ ||

దండకారణ్యమేషోఽహమితో గచ్ఛామి సత్వరః |
అవిచార్య పితుర్వాక్యం సమా వస్తుం చతుర్దశ || ౧౧ ||

సా హృష్టా తస్య తద్వాక్యం శ్రుత్వా రామస్య కైకయీ |
ప్రస్థానం శ్రద్దధానా హి త్వరయామాస రాఘవమ్ || ౧౨ ||

ఏవం భవతు యాస్యంతి దూతాః శీఘ్రజవైర్హయైః |
భరతం మాతులకులాదుపావర్తయితుం నరాః || ౧౩ ||

తవ త్వహం క్షమం మన్యే నోత్సుకస్య విలంబనమ్ |
రామ తస్మాదితః శీఘ్రం వనం త్వం గంతుమర్హసి || ౧౪ ||

వ్రీడాఽన్వితః స్వయం యచ్చ నృపస్త్వాం నాభిభాషతే |
నైతత్కించిన్నరశ్రేష్ఠ మన్యురేషోఽపనీయతామ్ || ౧౫ ||

యావత్త్వం న వనం యాతః పురాదస్మాదభిత్వరన్ |
పితా తావన్న తే రామ స్నాస్యతే భోక్ష్యతేఽపి వా || ౧౬ ||

ధిక్కష్టమితి నిశ్వస్య రాజా శోకపరిప్లుతః |
మూర్ఛితో న్యపతత్తస్మిన్పర్యంకే హేమభూషితే || ౧౭ ||

రామోఽప్యుత్థాప్య రాజానం కైకేయ్యాఽభిప్రచోదితః |
కశయేవాహతో వాజీ వనం గంతుం కృతత్వరః || ౧౮ ||

తదప్రియమనార్యాయాః వచనం దారుణోదయమ్ |
శ్రుత్వా గతవ్యథో రామః కైకేయీం వాక్యమబ్రవీత్ || ౧౯ ||

నాహమర్థపరో దేవి లోకమావస్తుముత్సహే |
విద్ధి మామృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమ్ || ౨౦ ||

యదత్రభవతః కించిచ్ఛక్యం కర్తుం ప్రియం మయా |
ప్రాణానపి పరిత్యజ్య సర్వథా కృతమేవ తత్ || ౨౧ ||

న హ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరమ్ |
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రియా || ౨౨ ||

అనుక్తోఽప్యత్రభవతా భవత్యా వచనాదహమ్ |
వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ || ౨౩ ||

న నూనం మయి కైకేయి కించిదాశంససే గుణమ్ |
యద్రాజానమవోచస్త్వం మమేశ్వరతరా సతీ || ౨౪ ||

యావన్మాతరమాపృచ్ఛే సీతాం చానునయామ్యహమ్ |
తతోఽద్యైవ గమిష్యామి దండకానాం మహద్వనమ్ || ౨౫ ||

భరతః పాలయేద్రాజ్యం శుశ్రూషేచ్చ పితుర్యథా |
తథా భవత్యా కర్తవ్యం స హి ధర్మః సనాతనః || ౨౬ ||

స రామస్య వచః శ్రుత్వా భృశం దుఃఖహతః పితా |
శోకాదశక్నువన్బాష్పం ప్రరురోద మహాస్వనమ్ || ౨౭ ||

వందిత్వా చరణౌ రామో విసంజ్ఞస్య పితుస్తదా |
కైకేయ్యాశ్చాప్యనార్యాయాః నిష్పపాత మహాద్యుతిః || ౨౮ ||

స రామః పితరం కృత్వా కైకేయీం చ ప్రదక్షిణమ్ |
నిష్క్రమ్యాంతఃపురాత్తస్మాత్స్వం దదర్శ సుహృజ్జనమ్ || ౨౯ ||

తం బాష్పపరిపూర్ణాక్షః పృష్ఠతోఽనుజగామ హ |
లక్ష్మణః పరమక్రుద్ధః సుమిత్రాఽఽనందవర్ధనః || ౩౦ ||

ఆభిషేచనికం భాండం కృత్వా రామః ప్రదక్షిణమ్ |
శనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్రావిచాలయన్ || ౩౧ ||

న చాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశోఽపకర్షతి |
లోకకాంతస్య కాంతత్వాచ్ఛీతరశ్మేరివ క్షపా || ౩౨ ||

న వనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరామ్ |
సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్తవిక్రియా || ౩౩ ||

ప్రతిషిధ్య శుభం ఛత్రం వ్యజనే చ స్వలంకృతే |
విసర్జయిత్వా స్వజనం రథం పౌరాంస్తథా జనాన్ || ౩౪ ||

ధారయన్మనసా దుఃఖమింద్రియాణి నిగృహ్య చ |
ప్రవివేశాత్మవాన్వేశ్మ మాతురప్రియశంసివాన్ || ౩౫ ||

సర్వో హ్యభిజనః శ్రీమాన్ శ్రీమతః సత్యవాదినః |
నాలక్షయత రామస్య కించిదాకారమాననే || ౩౬ ||

ఉచితం చ మహాబాహుర్న జహౌ హర్షమాత్మనః |
శారదః సముదీర్ణాంశుశ్చంద్రస్తేజ ఇవాత్మజమ్ || ౩౭ ||

వాచా మధురయా రామః సర్వం సమ్మానయఞ్జనమ్ |
మాతుః సమీపం ధర్మాత్మా ప్రవివేశ మహాయశాః || ౩౮ ||

తం గుణైః సమతాం ప్రాప్తో భ్రాతా విపులవిక్రమః |
సౌమిత్రిరనువవ్రాజ ధారయన్దుఃఖమాత్మజమ్ || ౩౯ ||

ప్రవిశ్య వేశ్మాతిభృశం ముదాఽన్వితం
సమీక్ష్య తాం చార్థవిపత్తిమాగతామ్ |
న చైవ రామోఽత్ర జగామ విక్రియాం
సుహృజ్జనస్యాత్మవిపత్తిశంకయా || ౪౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనవింశః సర్గః || ౧౯ ||

Ayodhya Kanda Sarga 19 Meaning In Telugu

తన తల్లి కైక మాటలు విన్న రాముడు ఏ మాత్రం బాధ పడలేదు. “అమ్మా! కైకా! అన్నీ నీవు చెప్పినట్లే జరుగుతాయమ్మా. నేను తండ్రి గారి మాట ప్రకారము జటలు, నార చీరలు ధరించి అరణ్యవాసము చేస్తాను. ఈ చిన్న విషయానికి తండ్రి గారు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తండ్రిగారి మాట నేను ఎప్పుడు కాదన్నాను. ఆయన మాట నేను కాదు అని అంటే కదా వారు బాధ పడాలి. వారి మాట నాకు శిరోధార్యము.

అమ్మా! నాకు జన్మనిచ్చిన వాడు నా తండ్రి. నన్ను పెంచి, పెద్దచేసి, నాకు విద్యాబుద్ధులు చెప్పించాడు. అటువంటి తండ్రి మాటను నేను కాదంటానా అమ్మా! కాని తండ్రిగారు ఈ విషయము నాకు స్వయంగా చెప్పిఉంటే బాగుండేది. తండ్రిగారు “రామా! నేను భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేయదలిచాను” అని ఒక్కమాట నాతో అంటే నేను రాజ్యమును భరతునికి అప్పగించి ఉండేవాడిని. ఒక్క రాజ్యమే కాదు తండ్రిగారు కోరితే నా సర్వస్వమును భరతునికి అర్పిస్తాను. ఇందులో సందేహము లేదు.

అమ్మా! నీవు తండ్రి గారిని ఓదార్చు. అమ్మా! అమ్మా! చూడమ్మా. తండ్రి గారు నా మొహం లోకి చూడలేక నేల చూపులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. నేను తండ్రిగారి మాటలను పాటిస్తాను అని చెప్పమ్మా. వెంటనే నేను భరతుని తీసుకొని వచ్చుటకు దూతలను కేకయ దేశమునకు పంపుతాను.

అమ్మా! నా తండ్రిగారి మాటలు మంచివా, మంచివి కావా అని నేను తర్కించను. తండ్రి గారి నిర్ణయం నాకు అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించను. తండ్రిగారి మాటలను తప్పకుండా పాటిస్తాను. పదునాలుగేళ్లు వనవాసము చేస్తాను. నా మాట నమ్మండి.”అని నిశ్చయంగా అన్నాడు రాముడు.

అప్పుడు రాముని మాటలలో నమ్మకం కుదిరింది కైకకు. కైక మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది. కాని పైకి మాత్రం ఆ సంతోషమును బహిర్గతము చేయలేదు. రాముని తొందరపెట్టసాగింది.

“రామా! వెంటనే వేగముగా పరుగెత్తే గుర్రముల మీద దూతలను భరతుని మేనమామ ఇంటికి పంపు. భరతుడు వెంటనే ఇక్కడకు రావాలి. భరతుడు వచ్చువరకు నీవు ఆగనవసరం లేదు. నీవు వెంటనే అరణ్యములకు ప్రయాణమై వెళ్లు. నీ తండ్రి గారు స్వయంగా నీతో చెప్పలేదని సందేహించకు. పాపం మీ తండ్రిగారు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని తనలో తనే మధనపడుతున్నాడు. నీవు ఇక్కడ ఉంటే ఆ బాధతో నీ తండ్రి ఆహారము కానీ, నీరు కానీ ముట్టడు. కాబట్టి నీవు తక్షణం వనములకు వెళితేనే ఆయన ఆహారం తీసుకుంటాడు.” అని పలికిన కైక వంక అసహ్యంగా చూచాడు దశరథుడు.

రాముని మొహంలోకి చూడలేక మరలా తల దించుకున్నాడు. రామునికి విషయం అర్థం అయింది. తన తల్లి కైకతో ఇలా అన్నాడు. “అమ్మా! నేను ఎల్లప్పుడూ ధర్మమును తప్పను. తండ్రి మాటలను పాటిస్తాను. నా తండ్రి మాట ముందు ఈ రాజ్యము, భోగములు నాకు గడ్డిపరక తో సమానము. అమ్మా! నీకు ఇందాకే చెప్పాను. నా తండ్రి గారి మాటను నెరవేర్చడానికి నేను నా ప్రాణములను కూడా లెక్కచెయ్యను. ఇంక ఈ వనవాసము ఒక లెక్కలోది కాదు.

అమ్మా! తమరికి తెలియనిది ఏమున్నది. పుత్రునికి తండ్రికి సేవచెయ్యడం, తండ్రి మాటను పాటించడం కన్నా వేరే ధర్మము ఏముంటుంది. తండ్రి గారి నోటివెంట నా వనవాసము గురించి ఒక మాట కూడా రాక పోయినా, నీవు చెప్పావు కాబట్టి ఆ మాటలు నా తండ్రి గారు చెప్పినట్టే భావిస్తాను.

అదికాదమ్మా! నేను నీ పుత్రుడను. నాపై నీకు సర్వాధి కారములు ఉన్నాయి. భరతుని రాజ్యాభిషేకము గురించి నాతో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా. దీనికి తండ్రి గారిని ఇంత బాధపెట్ట వలెనా! అంటే ఈ రాముడి మీద తమరికి నమ్మకం లేదా అమ్మా! నాకు తమరు ఒకటీ, మా తండ్రి ఒకటి కాదు. మీ ఇద్దరి మాటా ఒకటే. ఇంక నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్లి మా తల్లి కౌసల్య దగ్గర అనుమతి తీసుకొని, నా భార్య సీతను ఊరడించి, తరువాత అరణ్యవాసమునకు వెళతాను. అమ్మా! తండ్రిగారిని జాగ్రత్తగా చూచుకొనమని భరతునికి చెప్పమ్మా! ఎందుకంటే తండ్రికి సేవచెయ్యడం మన సనాతన ధర్మం.” అని అన్నాడు రాముడు.

రాముని ఒక్కొక్క మాటా వింటుంటే దశరథుననికి దు:ఖము పొర్లుకొని వస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నోటమాట రావడం లేదు. శరీరం వశం తప్పుతూ ఉంది. తూలిపోతున్నాడు. అయినా నిలదొక్కు ఉంటున్నాడు. రాముడు తండ్రి పాదములకు, కైక పాదము లకు నమస్కరించాడు. తరువాత రాజ మందిరము నుండి బయటకు వచ్చాడు.

ఇదంతా ద్వారము వద్ద వేచి ఉన్న లక్ష్మణుడు వింటూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతున్నాడు. కాని అన్నగారి మొహం చూచి కోపాన్ని అణుచుకుంటున్నాడు. రాముడు బయటకు రాగానే రాముని వెనకగా వెళ్లాడు. రాముడు అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యములకు నమస్కరించాడు. సమస్తము త్యజించిన యోగివలె అక్కడి నుండి వెళుతున్నాడు. ఛత్రమును చామరమును వద్దన్నాడు. తన వెంట వచ్చిన స్నేహితులను వెళ్లిపొమ్మన్నాడు. రథమును కూడా వద్దన్నాడు. పాదచారియై తన తల్లి కౌసల్య మందిరమునకు వెళ్లాడు.

ఇంతజరిగినా రాముని మొహం మీద ఉన్న చిరునవ్వు చెరగలేదు. అందరినీ చిరునవ్వుతూ పలకరిస్తున్నాడు. రాముని వెంట ఉన్న లక్ష్మణుడు మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. కోపం ఆపుకోలేకపోతున్నాడు. లక్ష్మణుని కోపం అతని మొహంలో స్పష్టంగా కనపడుతూ ఉంది. రాముడు కౌసల్యాభవనములో ప్రవేశించేటప్పటికి ఆమె భవనమంతా ఆనందోత్సాహాలతో నిండి ఉంది. రాముడు తన మొహంలో ఏ మాత్రం వికారము కనపడ్డా ఆ ఆనందంఅంతా విషాదంగా మారుతుందని గ్రహించి, తన పెదవుల మీద చిరునవ్వు చెరగనీయకుండా తల్లివద్దకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ వింశః సర్గః (20) >>

Balakanda Sarga 24 In Telugu – బాలకాండ చతుర్వింశః సర్గః

Balakanda Sarga 24 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండలోని 24వ సర్గ. ఈ సర్గలో, రాముడు శివధనుస్సును సమర్థంగా తేగలగడం చూసి, జనక మహారాజు ఆశ్చర్యానికి గురవుతాడు. వెంటనే, సీతాదేవిని రాముడికి వరించాలనే నిర్ణయం తీసుకుంటాడు. జనక మహారాజు తన దూతలను అయోధ్యకు పంపించి, రాముడి తండ్రి దశరథ మహారాజుకు ఈ శుభవార్తను తెలియజేస్తాడు. దశరథుడు ఈ విషయం విని, సంతోషంతో మిథిలాపురికి బయలుదేరతాడు.

తాటకావనప్రవేశః 

తతః ప్రభాతే విమలే కృతాఽఽహ్నికమరిందమౌ |
విశ్వామిత్రం పురస్కృత్య నద్యాస్తీరముపాగతౌ ||

1

తే చ సర్వే మహాత్మానో మునయః సంశ్రితవ్రతాః |
ఉపస్థాప్య శుభాం నావం విశ్వామిత్రమథాబ్రువన్ ||

2

ఆరోహతు భవాన్నావం రాజపుత్రపురస్కృతః |
అరిష్ఠం గచ్ఛ పంథానం మా భూత్కాలస్య పర్యయః ||

3

విశ్వామిత్రస్తథేత్యుక్త్వా తానృషీనభిపూజ్య చ |
తతార సహితస్తాభ్యాం సరితం సాగరం‍గమామ్ ||

4

తతః శుశ్రావ తం శబ్దమతిసంరంభవర్ధనమ్ |
మధ్యమాగమ్య తోయస్య సహ రామః కనీయసా ||

5

అథ రామః సరిన్మధ్యే పప్రచ్ఛ మునిపుంగవమ్ |
వారిణో భిద్యమానస్య కిమయం తుములో ధ్వనిః ||

6

రాఘవస్య వచః శ్రుత్వా కౌతూహలసమన్వితమ్ |
కథయామాస ధర్మాత్మా తస్య శబ్దస్య నిశ్చయమ్ ||

7

కైలాసపర్వతే రామ మనసా నిర్మితం సరః |
బ్రహ్మణా నరశార్దూల తేన ఇదం మానసం సరః ||

8

తస్మాత్సుస్రావ సరసః సాఽయోధ్యాముపగూహతే |
సరఃప్రవృత్తా సరయూః పుణ్యా బ్రహ్మసరశ్చ్యుతా ||

9

తస్యాయమతులః శబ్దో జాహ్నవీమభివర్తతే |
వారిసంక్షోభజో రామ ప్రణామం నియతః కురు ||

10

తాభ్యాం తు తావుభౌ కృత్వా ప్రణామమతిధార్మికౌ |
తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్లఘువిక్రమౌ ||

11

స వనం ఘోరసంకాశం దృష్ట్వా నృపవరాత్మజః |
అవిప్రహతమైక్ష్వాకః పప్రచ్ఛ మునిపుంగవమ్ ||

12

అహో వనమిదం దుర్గం ఝిల్లికాగణనాదితమ్ |
భైరవైః శ్వాపదైః కీర్ణం శకుంతైర్దారుణారుతైః ||

13

నానాప్రకారైః శకునైర్వాశ్యద్భిర్భైరవైఃస్వనైః |
సింహవ్యాఘ్రవరాహైశ్చ వారణైశ్చోపశోభితమ్ ||

14

ధవాశ్వకర్ణకకుభైర్బిల్వతిందుకపాటలైః |
సంకీర్ణం బదరీభిశ్చ కిం న్వేతద్దారుణం వనమ్ ||

15

తమువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
శ్రూయతాం వత్స కాకుత్స్థ యస్యైతద్దారుణం వనమ్ ||

16

ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం నరోత్తమ |
మలదాశ్చ కరూశాశ్చ దేవనిర్మాణనిర్మితౌ ||

17

పురా వృత్రవధే రామ మలేన సమభిప్లుతమ్ |
క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్ ||

18

తమింద్రం స్నాపయన్దేవా ఋషయశ్చ తపోధనాః |
కలశైః స్నాపయామాసుర్మలం చాస్య ప్రమోచయన్ ||

19

ఇహ భూమ్యాం మలం దత్త్వా దత్త్వా కారూశమేవ చ |
శరీరజం మహేంద్రస్య తతో హర్షం ప్రపేదిరే ||

20

నిర్మలో నిష్కరూశశ్చ శుచిరింద్రో యదాఽభవత్ |
దదౌ దేశస్య సుప్రీతో వరం ప్రభురనుత్తమమ్ ||

21

ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే గమిష్యతః |
మలదాశ్చ కరూశాశ్చ మమాంగమలధారిణౌ ||

22

సాధు సాధ్వితి తం దేవాః పాకశాసనమబ్రువన్ |
దేశస్య పూజాం తాం దృష్ట్వా కృతాం శక్రేణ ధీమతా ||

23

ఏతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాలమరిందమ |
మలదాశ్చ కరూశాశ్చ ముదితౌ ధనధాన్యతః ||

24

కస్యచిత్వథ కాలస్య యక్షీ వై కామరూపిణీ |
బలం నాగసహస్రస్య ధారయంతీ తదా హ్యభూత్ ||

25

తాటకా నామ భద్రం తే భార్యా సుందస్య ధీమతః |
మారీచో రాక్షసః పుత్రో యస్యాః శక్రపరాక్రమః ||

26

వృత్తబాహుర్మహావీర్యో విపులాస్యతనుర్మహాన్ |
రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజాః ||

27

ఇమౌ జనపదౌ నిత్యం వినాశయతి రాఘవ |
మలదాంశ్చ కరూశాంశ్చ తాటకా దుష్టచారిణీ ||

28

సేయం పంథానమావృత్య వసత్యధ్యర్ధయోజనే |
అత ఏవ చ గంతవ్యం తాటకాయా వనం యతః ||

29

స్వబాహుబలమాశ్రిత్య జహీమాం దుష్టచారిణీమ్ |
మన్నియోగాదిమం దేశం కురు నిష్కంటకం పునః ||

30

న హి కశ్చిదిమం దేశం శక్నోత్యాగంతుమీదృశమ్ |
యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాదితమసహ్యయా ||

31

ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్దారుణం వనమ్ |
యక్ష్యా చోత్సాదితం సర్వమద్యాపి న నివర్తతే ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుర్వింశః సర్గః ||

Balakanda Sarga 24 Meaning In telugu

మరునాడు ఉదయమే రామ లక్ష్మణులు, విశ్వామిత్రుడు ప్రాతః కాలము లో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రములు ముగించుకొని ప్రయాణము సాగించారు. గంగానదీ తీరమునకు వచ్చారు.

అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకొని వచ్చారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగా నదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రద్దలగుతున్నట్టు పెద్దగా శబ్దం వచ్చింది. “మహర్షీ! ఆ శబ్దము ఏమిటి?” అని రామ లక్ష్మణులు విశ్వామిత్రుని అడిగారు. దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.

” ఓ రామా! పూర్వము బ్రహ్మ దేవుడు తన సంకల్ప మాత్రం చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరయూ నది మానస సరోవరమునుండి పుట్టుటచే పవిత్రమైనది. ఆ సరయూ నది ఈ ప్రదేశములో గంగానదిలో కలియుచున్నది. ఆ రెండు నదుల సంగమము వలననే ఈ ధ్వని పుట్టింది.” అని చెప్పాడు విశ్వామిత్రుడు.

రామ లక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారు గంగానది ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. త్వర త్వరగా ప్రయాణము చేస్తున్నారు. మార్గ మధ్యంలో వారికి ఒక మానవ సంచారము లేని నిర్జనమైన అడవి కనపడింది. ఆ అడవి చాలా భయంకరంగా లోపలకు పోవడానికి వీలులేకుండా ఉంది. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ వనము గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

” ఓ రామలక్ష్మణులారా! పూర్వము ఈ ప్రదేశములో రెండు రాజ్యములు ఉండేవి. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. దాని వలన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాతకము చుట్టుకుంది. ఆ పాతకము వలన ఇంద్రునికి ఆకలి వేయసాగింది. అప్పుడు దేవతలు, ఋషులు దేవేంద్రునికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు. దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని, బ్రహ్మ హత్య వలన కలిగిన మయలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు.

ఇంద్రుడు ఈ రెండు దేశములు మలదము కరూశము అనే పేర్లతో పిలువ బడుతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఈ రెండు దేశములు ధనధాన్యములతో కళ కళ లాడుతున్నాయి.

కొంత కాలము తర్వాత ఒక యక్షిణి ఇక్కడకు వచ్చింది. ఆ యక్షిణి మహా బలశాలి. ఆ యక్షిణి సుందు అనే రాక్షసుని భార్య. ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. ఆ మారీచుడు గొప్ప బలవంతుడు. మాయావి. ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు.

తాటక అనే రాక్షసి ఈ రెండు దేశములను నాశనం చేసింది. ఇలా అరణ్యములుగా మార్చింది. ఆ అరణ్యములలో తన నివాసము ఏర్పరచు కున్నది. అందుకే దీనిని తాటక వనము అని అంటారు. ఈ అరణ్యము లోనికి ఎవరూ పోవడానికి సాహసించరు. ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి. అది ఈ రెండు రాజ్యములను సర్వ నాశనము చేసింది. దానిని చంపితే గానీ ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు.” అని విశ్వామిత్రుడు రాముడితో ఆ తాటక వృ త్తాంతము వివరంగా చెప్పాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ పంచవింశః సర్గః (25) >>

Ayodhya Kanda Sarga 17 In Telugu – అయోధ్యాకాండ సప్తదశః సర్గ

Ayodhya Kanda Sarga 17

“రామాయణం” లో అయోధ్యాకాండ సప్తదశః సర్గం (17వ సర్గ)లో, దశరథుడు రాముని వలసపంపిన బాధతో మరణిస్తాడు. భరతుడు, కైకేయి చేసిన దుష్టపనులను తెలుసుకొని, రాముని కోసం బయలుదేరతాడు. తన తండ్రి మరణం విన్న రాముడు, సీత మరియు లక్ష్మణులతో కలిసి సంతాపం వ్యక్తం చేస్తాడు. భరతుడు రాముని వనవాసం నుంచి తిరిగి రావాలని అభ్యర్థిస్తాడు, కానీ రాముడు తన ధర్మాన్ని పాటించి, వనవాసం కొనసాగించాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గలో రాముడి ధైర్యం, విధేయత మరియు భరతుడి ప్రేమ, వాత్సల్యం ప్రధానాంశాలు. అతి క్లిష్ట సమయాల్లో కూడా రాముడు తన ధర్మపరమైన కట్టుబాట్లను పాటించడంలో నిలుస్తాడు.

రామాగమనమ్

స రామో రథమాస్థాయ సంప్రహృష్టసుహృజ్జనః |
పతాకాధ్వజసంపన్నం మహార్హాగరుధూపితమ్ || ౧ ||

అపశ్యన్నగరం శ్రీమాన్నానాజనసమాకులమ్ |
స గృహైరభ్రసంకాశైః పాండురైరుపశోభితమ్ || ౨ ||

రాజమార్గం యయౌ రామః మధ్యేనాగరుధూపితమ్ |
చందనానాం చ ముఖ్యానామగరూణాం చ సంచయైః || ౩ ||

ఉత్తమానాం చ గంధానాం క్షౌమకౌశాంబరస్య చ |
అవిద్ధాభిశ్చ ముక్తాభిరుత్తమైః స్ఫాటికైరపి || ౪ ||

శోభమానమసంబాధైస్తం రాజపథముత్తమమ్ |
సంవృతం వివిధైః పణ్యైర్భక్ష్యైరుచ్చావచైరపి || ౫ ||

దదర్శ తం రాజపథం దివి దేవపథం యథా |
దధ్యక్షతహవిర్లాజైర్ధూపైరగరుచందనైః || ౬ ||

నానామాల్యోపగంధైశ్చ సదాఽభ్యర్చితచత్వరమ్ |
ఆశీర్వాదాన్బహూన్ శృణ్వన్సుహృద్భిః సముదీరితాన్ || ౭ ||

యథాఽర్హం చాపి సంపూజ్య సర్వానేవ నరాన్యయౌ |
పితామహైరాచరితం తథైవ ప్రపితామహైః || ౮ ||

అద్యోపాదాయ తం మార్గమభిషిక్తోఽనుపాలయ |
యథా స్మ లాలితాః పిత్రా యథా పూర్వైః పితామహైః || ౯ ||

తతః సుఖతరం రామే వత్స్యామః సతి రాజని |
అలమద్య హి భుక్తేన పరమార్థైరలం చ నః || ౧౦ ||

యథా పశ్యామ నిర్యాంతం రామం రాజ్యే ప్రతిష్ఠితమ్ |
తతో హి నః ప్రియతరం నాన్యత్కించిద్భవిష్యతి || ౧౧ ||

యథాభిషేకో రామస్య రాజ్యేనామితతేజసః |
ఏతాశ్చాన్యాశ్చ సుహృదాముదాసీనః కథాః శుభాః || ౧౨ ||

ఆత్మసంపూజనీః శృణ్వన్యయౌ రామో మహాపథమ్ |
న హి తస్మాన్మనః కశ్చిచ్చక్షుషీ వా నరోత్తమాత్ || ౧౩ ||

నరః శక్నోత్యపాక్రష్టుమతిక్రాంతేఽపి రాఘవే |
యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి || ౧౪ ||

నిందితః స వసేల్లోకే స్వాత్మాఽప్యేనం విగర్హతే |
సర్వేషాం హి స ధర్మాత్మా వర్ణానాం కురుతే దయామ్ || ౧౫ ||

చతుర్ణాం హి వయస్థానాం తేన తే తమనువ్రతాః |
చతుష్పథాన్దేవపథాంశ్చైత్యాన్యాయతనాని చ || ౧౬ ||

ప్రదక్షిణం పరిహరన్జగామ నృపతేః సుతః |
స రాజకులమాసాద్య మేఘసంఘోపమైః శుభైః || ౧౭ ||

ప్రాసాదశృంగైర్వివిధైః కైలాసశిఖరోపమైః |
ఆవారయద్భిర్గగనం విమానైరివ పాండరైః || ౧౮ ||

వర్ధమానగృహైశ్చాపి రత్నజాలపరిష్కృతైః |
తత్పృథివ్యాం గృహవరం మహేంద్రభవనోపమమ్ || ౧౯ ||

రాజపుత్రః పితుర్వేశ్మ ప్రవివేశ శ్రియా జ్వలన్ |
స కక్ష్యా ధన్విభిర్గుప్తాస్తిస్రోఽతిక్రమ్య వాజిభిః || ౨౦ ||

పదాతిరపరే కక్ష్యే ద్వే జగామ నరోత్తమః |
స సర్వాః సమతిక్రమ్య కక్ష్యా దశరథాత్మజః |
సన్నివర్త్య జనం సర్వం శుద్ధాంతం పునరభ్యగాత్ || ౨౧ ||

తతః ప్రవిష్టే పితురంతికం తదా
జనః స సర్వో ముదితో నృపాత్మజే |
ప్రతీక్షతే తస్య పునర్వినిర్గమం
యథోదయం చంద్రమసః సరిత్పతిః || ౨౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తదశః సర్గః || ౧౭ ||

Ayodhya Kanda Sarga 17 Meaning In Telugu

రాముడు అయోధ్యా పురవీధుల గుండా వెళుతున్నాడు. శోభాయమానంగా అలంకరించిన అయోధ్యానగరాన్ని తనివిదీరా చూస్తున్నాడు. రాజమార్గములో అటు ఇటా నిలబడ్డ పౌరులు రాముని దీవిస్తున్నారు.

“ఓ రామా! నీవు అయోధ్యానగరమునక పట్టాభిషిక్తుడవై నీ తాత ముత్తాతలు అనుసరించిన ధర్మమార్గమును అనుసరించి ప్రజలను పాలింపుము. నీ పాలనలో ప్రజలు నీ తండ్రిపాలనలో కన్నా ఎక్కువగా సుఖిస్తారు.” అని మనసారా దీవిస్తున్నారు. ఇంకొంతమంది. “ఆహా! పట్టాభిషేకము చేసుకోబోతున్న రాముని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. ఇంక మనకు అన్నపానీయాలు అక్కరలేదు.” అని అనుకొంటున్నారు.

ఇంకొంత మంది రాముడు వెళ్లినంత సేపూ అలాగే చూస్తున్నారు. ఈ రోజు రాముని చూడని జన్మ కూడా ఒక జన్మేనా అని అనుకొంటున్నారు.
ఆ ప్రకారంగా రాముడు అయోధ్యాపురవీధుల గుండా వెళు తున్నాడు. తుదకు దశరథమహారాజు మందిరము చేరుకున్నాడు. రాముడు మహారాజు మందిరము బయట రథము దిగి నడుచుకుంటూ అంతఃపురములోనికి వెళ్లాడు. రామునితో వచ్చిన వాళ్లందరూ రాజ మందిరము బయటనే నిలబడ్డారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టాదశః సర్గః (18) >>