Balakanda Sarga 62 In Telugu – బాలకాండ ద్విషష్టితమః సర్గః

Balakanda Sarga 62 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. రామాయణంలోని బాలకాండలో 62వ సర్గ, ద్విషష్టితమః సర్గగా పిలవబడుతుంది. ఈ సర్గలో రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి కలిసి జనక మహారాజు రాజధాని మిథిలాకి చేరుకుంటారు. జనక మహారాజు రాముడు అహల్య శాప విమోచనం చేసిన విషయాన్ని విని, అతడిని ప్రశంసిస్తాడు. రాజ్యంలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది.

|| అంబరీషయజ్ఞః ||

శునఃశేపం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః |
వ్యశ్రామ్యత్పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన ||

1

తస్య విశ్రమమాణస్య శునఃశేపో మహాయశాః |
పుష్కరక్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శ హ ||

2

తప్యంతమృషిభిః సార్ధం మాతులం పరమాతురః |
వివర్ణవదనో దీనస్తృష్ణయా చ శ్రమేణ చ ||

3

పపాతాంకే మునౌ రామ వాక్యం చేదమువాచ హ | [మునేరాశు]
న మేఽస్తి మాతా న పితా జ్ఞాతయో బాంధవాః కుతః ||

4

త్రాతుమర్హసి మాం సౌమ్య ధర్మేణ మునిపుంగవః |
త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః ||

5

రాజా చ కృతకార్యః స్యాదహం దీర్ఘాయురవ్యయః |
స్వర్గలోకముపాశ్నీయాం తపస్తప్త్వా హ్యనుత్తమమ్ ||

6

త్వం మే నాథో హ్యనాథస్య భవ భవ్యేన చేతసా |
పితేవ పుత్రం ధర్మాత్మంస్త్రాతుమర్హసి కిల్బిషాత్ ||

7

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః |
సాంత్వయిత్వా బహువిధం పుత్రానిదమువాచ హ ||

8

యత్కృతే పితరః పుత్రాంజనయంతి శుభార్థినః |
పరలోకహితార్థాయ తస్య కాలోఽయమాగతః ||

9

అయం మునిసుతో బాలో మత్తః శరణమిచ్ఛతి |
అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాః ||

10

సర్వే సుకృతకర్మాణః సర్వే ధర్మపరాయణాః |
పశుభూతా నరేంద్రస్య తృప్తిమగ్నేః ప్రయచ్ఛత ||

11

నాథవాంశ్చ శునఃశేపో యజ్ఞశ్చావిఘ్నితో భవేత్ |
దేవతాస్తర్పితాశ్చ స్యుర్మమ చాపి కృతం వచః ||

12

మునేస్తు వచనం శ్రుత్వా మధుష్యందాదయః సుతాః |
సాభిమానం నరశ్రేష్ఠ సలీలమిదమబ్రువన్ ||

13

కథమాత్మసుతాన్హిత్వా త్రాయసేఽన్యసుతం విభో |
అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే ||

14

తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం మునిపుంగవః |
క్రోధసంరక్తనయనో వ్యాహర్తుముపచక్రమే ||

15

నిఃసాధ్వసమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్హితమ్ |
అతిక్రమ్య తు మద్వాక్యం దారుణం రోమహర్షణమ్ ||

16

శ్వమాంసభోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణం వర్షసహస్రం తు పృథివ్యామనువత్స్యథ ||

17

కృత్వా శాపసమాయుక్తాన్పుత్రాన్మునివరస్తదా |
శునఃశేపమువాచార్తం కృత్వా రక్షాం నిరామయామ్ ||

18

పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపనః |
వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్నిముదాహర ||

19

ఇమే తు గాథే ద్వే దివ్యే గాయేథా మునిపుత్రక |
అంబరీషస్య యజ్ఞేఽస్మింస్తతః సిద్ధిమవాప్స్యసి ||

20

శునఃశేపో గృహీత్వా తే ద్వే గాథే సుసమాహితః |
త్వరయా రాజసింహం తమంబరీషమువాచ హ ||

21

రాజసింహ మహాసత్త్వ శీఘ్రం గచ్ఛావహే సదః |
నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాం చ సముపావిశ ||

22

తద్వాక్యమృషిపుత్రస్య శ్రుత్వా హర్షసముత్సుకః |
జగామ నృపతిః శీఘ్రం యజ్ఞవాటమతంద్రితః ||

23

సదస్యానుమతే రాజా పవిత్రకృతలక్షణమ్ |
పశుం రక్తాంబరం కృత్వా యూపే తం సమబంధయత్ ||

24

స బద్ధో వాగ్భిరగ్ర్యాభిరభితుష్టావ వై సురౌ |
ఇంద్రమింద్రానుజం చైవ యథావన్మునిపుత్రకః ||

25

తతః ప్రీతః సహస్రాక్షో రహస్యస్తుతితర్పితః |
దీర్ఘమాయుస్తదా ప్రాదాచ్ఛునఃశేపాయ రాఘవ ||

26

స చ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్యాంతమవాప్తవాన్ |
ఫలం బహుగుణం రామ సహస్రాక్షప్రసాదజమ్ ||

27

విశ్వామిత్రోఽపి ధర్మాత్మా భూయస్తేపే మహాతపాః |
పుష్కరేషు నరశ్రేష్ఠ దశవర్షశతాని చ ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విషష్ఠితమః సర్గః ||

Balakanda Sarga 62 Meaning In Telugu

ఋచీకుని వద్దనుండి అతని కుమారుడైన శునశేపుని లక్షగోవులు ఇచ్చి కొనుక్నున్న అంబరీషుడు, అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు. మార్గ మధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈ శునశేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శునశేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. వారందరూ శునశేవుని విశ్వామిత్రుని వద్దకు తీసుకొని వెళ్లారు. శునశేపుడు మేనమామ ఒడిలో తల పెట్టుకొని ఏడిచాడు.

“ఓ మహర్షీ! నాకు తల్లి లేదు. తండ్రిలేడు. ఇద్దరూ నన్ను వదిలేసారు. బంధువులు లేరు. కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు, నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రివంటివారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి. ” అని వేడుకున్నాడు.

శునశేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు. “కుమారులారా! పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయము వచ్చినది. ఈ బాలుడు తనకు ప్రాణదానము చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానము చెయ్యండి. అతనికి సాయం చెయ్యండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేసారు. అంబరీషునికి యజ్ఞపశువుగా వెళ్లడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు శునశేపునికి ప్రాణదానం చేసిన వారు అవుతారు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నముగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను శునశేపునికి ఇచ్చిన మాట నిలబడుతుంది.” అని అన్నాడు.

తండ్రి మాటలు విన్న మధుష్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు. “తండ్రీ! మీరు శునశేపుని రక్షించుటకు మమ్ములను అంబరీషునికి బలిపశువుగా వెళ్లమం టున్నారు. అలా చెయ్యడం కుక్కమాంసము తినడంతో సమానం. కాబట్టి మేము ఎవరమూ వెళ్లము.” అని చెప్పారు.

కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. “ఏమన్నారు. పరులకు సాయం చెయ్యడం కుక్కమాంసం తినడంతో సమానమా! అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్కమాంసము తింటూ వేయి సంవత్సరములు భూమి మీద బతకండి. ఇదే నా శాపము.” అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు.

ఇదంతా చూచిన శున శేపునకు దుఃఖము ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యము చెప్పాడు. అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు.

“ఓ శునశేవా! యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాలలు వేసి, ఊపస్తంభమునకు కడతారు. అపుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్తుతించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

శునశేపునకు రెండు మంత్రములను ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన శునశేపుడు అంబరీషుని వెంట వెళ్లాడు. అందరూ యజ్ఞవాటిక చేరుకున్నారు. శునశేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు. ఎర్రటి పూలమాలలు వేసారు. ఊపస్థంభమునకు కట్టారు. బలిపశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేసారు.

అప్పుడు శునశేపుడు ఇంద్రుని, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. శునశేపునకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేట్టు వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా శునశేపునకు ప్రాణములు రక్షింపబడ్డాయి.

తరువాత విశ్వామిత్రుడు వేయి సంవత్సరములు పుష్కరక్షేత్రములో తపస్సు చేసాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైరెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓ తత్సత్.

బాలకాండ త్రిషష్టితమః సర్గః (63) >>

Ayodhya Kanda Sarga 61 In Telugu – అయోధ్యాకాండ ఏకషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 61

అయోధ్యాకాండ ఏకషష్ఠితమః సర్గః ఋషిపత్ని అహల్యను మునులు, రఘునందనుడైన రాముడు తన పాదస్పర్శతో ఆమెను విముక్తిని ప్రసాదించాడు. రాముడు, లక్ష్మణుడు, సీత, మరియు విశ్వామిత్రుడు మిథిలాపురికి చేరారు. జనక మహారాజు వారికి స్వాగతం పలికాడు. రాముడు పరశురాముని ధనుస్సును విరిచాడు, దాంతో జనకుడు సీతకు రాముని వరం ఇస్తానని ప్రకటించాడు. ఆ దివ్య వివాహాన్ని చూస్తూ మిథిలాపురం సంతోషంలో మునిగిపోయింది. సీతారాముల కల్యాణం వైభవంగా జరగ్గా, జనకుడు సీతను రామునికి ఇచ్చి సంతోషం పొందాడు. దీంతో అయోధ్యాకాండ ఏకషష్ఠితమః సర్గ ముగుస్తుంది.

కౌసల్యోపాలంభః

వనం గతే ధర్మపరే రామే రమయతాం వరే |
కౌసల్యా రుదతీ స్వార్తా భర్తారమిదమబ్రవీత్ || ౧ ||

యద్యపి త్రిషు లోకేషు ప్రథితం తే మయద్యశః |
సానుక్రోశో వదాన్యశ్చ ప్రియవాదీ చ రాఘవః || ౨ ||

కథం నరవరశ్రేష్ఠ పుత్రౌ తౌ సహ సీతయా |
దుఃఖితౌ సుఖసంవృద్ధౌ వనే దుఃఖం సహిష్యతః || ౩ ||

సా నూనం తరుణీ శ్యామా సుకుమారీ సుఖోచితా |
కథముష్ణం చ శీతం చ మైథిలీ ప్రసహిష్యతే || ౪ ||

భుక్త్వాఽశనం విశాలాక్షీ సూపదం శాన్వితం శుభమ్ |
వన్యం నైవారమాహారం కథం సీతోపభోక్ష్యతే || ౫ ||

గీతవాదిత్రనిర్ఘోషం శ్రుత్వా శుభమనిందితా |
కథం క్రవ్యాదసింహానాం శబ్దం శ్రోష్యత్యశోభనమ్ || ౬ ||

మహేంద్రధ్వజసంకాశః క్వ ను శేతే మహాభుజః |
భుజం పరిఘసంకాశముపధాయ మహాబలః || ౭ ||

పద్మవర్ణం సుకేశాంతం పద్మ నిశ్శ్వాసముత్తమమ్ |
కదా ద్రక్ష్యామి రామస్య వదనం పుష్కరేక్షణమ్ || ౮ ||

వజ్రసారమయం నూనం హృదయం మే న సంశయః |
అపశ్యంత్యా న తం యద్వై ఫలతీదం సహస్రధా || ౯ ||

యత్త్వయాఽకరుణం కర్మ వ్యపోహ్య మమ బాంధవాః |
నిరస్తాః పరిధావంతి సుఖార్హః కృపణా వనే || ౧౦ ||

యది పంచదశే వర్షే రాఘవః పునరేష్యతి |
జహ్యాద్రాజ్యం చ కోశం చ భరతో నోపలక్షయతే || ౧౧ ||

భోజయంతి కిల శ్రాద్ధే కేచిత్స్వానేవ బాంధవాన్ |
తతః పశ్చాత్సమీక్షంతే కృతకార్యా ద్విజర్షభాన్ || ౧౨ ||

తత్ర యే గుణవంతశ్చ విద్వాంసశ్చ ద్విజాతయః |
న పశ్చాత్తేఽభిమన్యంతే సుధామపి సురోపమాః || ౧౩ ||

బ్రాహ్మణేష్వపి తృప్తేషు పశ్చాద్భోక్తుం ద్విజర్షభాః |
నాభ్యుపైతుమలం ప్రాజ్ఞాః శృంగచ్ఛేదమివర్షభాః || ౧౪ ||

ఏవం కనీయసా భ్రాత్రా భుక్తం రాజ్యం విశాంపతే |
భ్రాతా జ్యేష్ఠో వరిష్ఠశ్చ కిమర్థం నావమంస్యతే || ౧౫ ||

న పరేణాహృతం భక్ష్యం వ్యాఘ్రః ఖాదితుమిచ్చతి |
ఏవమేతన్నరవ్యాఘ్రః పరలీఢం న మన్యతే || ౧౬ ||

హవిరాజ్యం పురోడాశాః కుశా యూపాశ్చ ఖాదిరాః |
నైతాని యాతయామాని కుర్వంతి పునరధ్వరే || ౧౭ ||

తథా హ్యాత్తమిదం రాజ్యం హృతసారాం సురామివ |
నాభిమంతుమలం రామర్నష్ట సోమమివాధ్వరమ్ || ౧౮ ||

నైవం విధమసత్కారం రాఘవో మర్షయిష్యతి |
బలవానివ శార్దూలో వాలధేరభిమర్శనమ్ || ౧౯ ||

నైతస్య సహితా లోకాః భయం కుర్యుర్మహామృధే |
అధర్మం త్విహ ధర్మాత్మా లోకం ధర్మేణ యోజయేత్ || ౨౦ ||

నన్వసౌ కాంచనైర్బాణైర్మహావీర్యో మహాభుజః |
యుగాంత ఇవ భూతాని సాగరానపి నిర్దహేత్ || ౨౧ ||

స తాదృశః సింహబలో వృషభాక్షో నరర్షభః |
స్వయమేవ హతః పిత్రా జలజేనాత్మజో యథా || ౨౨ ||

ద్విజాతిచరితో ధర్మః శాస్త్రదృష్టః సనాతనః |
యది తే ధర్మనిరతే త్వయా పుత్రే వివాసితే || ౨౩ ||

గతిరేకా పతిర్నార్యా ద్వితీయా గతిరాత్మజః |
తృతీయా జ్ఞాతయో రాజన్ చతుర్థీ నేహ విద్యతే || ౨౪ ||

తత్ర త్వం చైవ మే నాస్తి రామశ్చ వనమాశ్రితః |
న వనం గంతుమిచ్ఛామి సర్వథా నిహతా త్వయా || ౨౫ ||

హతం త్వయా రాజ్యమిదం సరాష్ట్రమ్
హతస్తథాఽఽత్మా సహ మంత్రిభిశ్చ |
హతా సపుత్రాఽస్మి హతాశ్చ పౌరాః
సుతశ్చ భార్యా చ తవ ప్రహృష్టౌ || ౨౬ ||

ఇమాం గిరం దారుణశబ్దసంశ్రితామ్
నిశమ్య రాజాఽపి ముమోహ దుఃఖితః |
తతః స శోకం ప్రవివేశ పార్థివః
స్వదుష్కృతం చాపి పునస్తదా స్మరన్ || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకషష్ఠితమః సర్గః || ౬౧ ||

Ayodhya Kanda Sarga 61 Meaning In Telugu

తరువాత కౌసల్య, మహారాజు దశరథుని చూచి ఇలా పలికింది. “మహారాజా! తమరు దయగలవారని ముల్లోకములలో అనుకుంటారు కదా! కాని కన్నకుమారుని, కోడలిని, ఎలా అడవులకు పంపగలిగావు. నీ దయాగుణము అంతా ఏమయింది? అది సరే! ఏ పాపమూ ఎరుగని సీతను కూడా అడవులకు పంపావు కదా! ఆమె అడవులలో ఎలా తిరుగ గలదు? ఆ కందమూలములు ఎలా తినగలదు అని ఆలోచించావా! పొద్దుటే మంగళవాద్యములను వినడానికి అలవాటు పడిన సీత క్రూరమృగముల అరుపులు ఎలా వినగలదు అని ఎన్నడైనా ఆలోచించారా! తమరి కన్న కుమారుడు అడవులలో ఎటువంటి బాధలు పడుతున్నాడో మీకు తెలుసా! రాముని చూడకుండా ఉండటానికి మీది హృదయమా లేక బండరాయా!
మహారాజా! రాముడు పదునాలుగు సంవత్సరములు వనవాసము ముగించుకొనితిరిగి అయోధ్యకు వచ్చిన నాడు భరతుడు తిరిగి రాజ్యమును రామునికి ఇస్తాడంటారా! ఒక వేళ భరతుడు ఇచ్చినా రాముడు తిరిగి రాజ్యము స్వీకరిస్తాడా!

ఏమో నాకు మాత్రం ఊహకు కూడా అందటం లేదు. ఎందుకంటే మరొక మృగము తిన్న ఆహారమును పెద్దపులి తినదు. అలాగే భరతుడుకి ఇవ్వబడిన రాజ్యమును రాముడు తిరిగి స్వీకరించడు. రాముడు ఆత్మాభిమానము కలవాడు కదా! యుద్ధము చేసి అన్నా రాజ్యము తీసుకుంటాడు కానీ భరతుని దయాధర్మభిక్ష కిందతీసుకోడు. రామునికి జరిగిన అవమానానికి ఆరోజే రాముడు తమరిని నరికి వేసి ఉండేవాడు. కానీ తండ్రి అనే గౌరవంతో విడిచి పెట్టాడు అని అనుకుంటాను. లేకపోతే రాముని పరాక్రమునకు ముల్లోకములలో తిరుగులేదు కదా! తన తోకతొక్కిన వాడిని వ్యాఘ్రము ఎలా క్షమించదో అలాగే తనకు అపకారము చేసిన వాడిని రాముడు కూడా క్షమించడు. అటువంటి రాముని పరాక్రమాన్ని వీరత్వాన్నీ నీవు నాశనం చేసావు. దేశం నుండి వెళ్లగొట్టావు. ఇది ధర్మాత్ములు చెయ్యదగిన పనేనా!

ధర్మ శాస్త్రము ప్రకారము స్త్రీకి మొదటి రక్షకుడు భర్త. రెండవ రక్షకుడు కుమారుడు. మూడవ రక్షకుడు జ్ఞాతి. నాకు భర్తగా నువ్వు ఉండీ లేనట్టే. నాకు నా కుమారుని దూరం చేసావు. నన్ను గతిలేని దానిని చేసావు. అధోగతి పాలు చేసావు. నన్నే కాదు ఈదేశాన్నే నాశనం చేసావు. దిక్కులేకుండా చేసావు. నీవు చేసిన పనుల వలన నీ భార్య కైక నీ కుమారుడు భరతుడు మాత్రమే ఆనందిస్తారు. తక్కినవాళ్లు దుఃఖములో మునిగితేలుతున్నారు. కేవలం ఇద్దరి సుఖం కోసం ఇంతమందిని క్షోభపెట్టడం ధర్మమా!” అని కౌసల్య దశరథుని అనరాని మాటలు అంటూ ఉంటే దశరథుడు కిమ్మనకుండా అన్నీ భరిస్తున్నాడు. తాను చేసిన తప్పుకు ఇదే సరైన శిక్ష అని అనుకుంటూ అన్నింటినీ భరిస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్విషష్ఠితమః సర్గః (62) >>

Balakanda Sarga 49 In Telugu – బాలకాండ ఏకోనపంచాశః సర్గః

Balakanda Sarga 49 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనపంచాశః సర్గలో, రాముడు వారి ఆశ్రమంలోకి ప్రవేశించినప్పుడు అహల్య తన శాపం నుండి విముక్తి పొందింది. విశ్వామిత్రుడు అహల్య పురాణం యొక్క కథనాన్ని కొనసాగిస్తూ, అహల్య ఎవరికీ కనిపించకుండా నివసిస్తున్న ఆమె ఆశ్రమంలోకి రామని అడుగుతాడు. ఒకసారి రాముడు ఆ ఆశ్రమంలోకి అడుగుపెట్టినప్పుడు, ఆమె తన శపించబడిన అదృశ్య స్థితి నుండి వ్యక్తమవుతుంది. ఆమె తన దివ్య రూపంతో ఉద్భవించింది మరియు రామ మరియు లక్ష్మణులకు అతిథిగా ఉంటుంది. గౌతమ మహర్షి కూడా తన నిష్క్రమించిన భార్య అహల్యను అంగీకరించడానికి ఈ తరుణంలో వస్తాడు.

అహల్యాశాపమోక్షః

అఫలస్తు తతః శక్రో దేవానగ్నిపురోగమన్ |
అబ్రవీత్ త్రస్తవదనః సర్షిసంఘాన్ సచారణాన్ ||

1

కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః |
క్రోధముత్పాద్య హి మయా సురకార్యమిదం కృతమ్ ||

2

అఫలోఽస్మి కృతస్తేన క్రోధాత్సా చ నిరాకృతా |
శాపమోక్షేణ మహతా తపోస్యాపహృతం మయా ||

3

తస్మాత్సురవరాః సర్వే సర్షిసంఘాః సచారణాః |
సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హథ ||

4

శతక్రతోర్వచః శ్రుత్వా దేవాః సాగ్నిపురోగమాః |
పితృదేవానుపేత్యాహుః సర్వే సహ మరుద్గణైః ||

5

అయం మేషః సవృషణః శక్రో హ్యవృషణః కృతః |
మేషస్య వృషణౌ గృహ్య శక్రాయాశు ప్రయచ్ఛత ||

6

అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి |
భవతాం హర్షణార్థే చ యే చ దాస్యంతి మానవాః ||

7

అక్షయం హి ఫలం తేషాం యూయం దాస్యథ పుష్కలమ్ |
అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాః సమాగతాః ||

8

ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేశయన్ |
తదాప్రభృతి కాకుత్స్థ పితృదేవాః సమాగతాః ||

9

అఫలాన్భుంజతే మేషాన్ఫలైస్తేషామయోజయన్ |
ఇంద్రస్తు మేషవృషణస్తదాప్రభృతి రాఘవ ||

10

గౌతమస్య ప్రభావేన తపసశ్చ మహాత్మనః |
తదాగచ్ఛ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః ||

11

తారయైనాం మహాభాగామహల్యాం దేవరూపిణీమ్ |
విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః ||

12

విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమమథావిశత్ |
దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్ ||

13

లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః |
ప్రయత్నాన్నిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ ||

14

స తుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్రప్రభామివ |
మధ్యేఽమ్భసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ ||

15

ధూమేనాపి పరీతాంగీం దీప్తామగ్నిశిఖామివ |
సా హి గౌతమవాక్యేన దుర్నిరీక్ష్యా బభూవ హ ||

16

త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనమ్ |
శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగతా ||

17

రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా |
స్మరంతీ గౌతమవచః ప్రతిజగ్రాహ సా చ తౌ ||

18

పాద్యమర్ఘ్యం తథాఽఽతిథ్యం చకార సుసమాహితా |
ప్రతిజగ్రాహ కాకుత్స్థో విధిదృష్టేన కర్మణా ||

19

పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవదుందుభినిఃస్వనైః |
గంధర్వాప్సరసాం చైవ మహానాసీత్సమాగమః ||

20

సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్ |
తపోబలవిశుద్ధాంగీం గౌతమస్య వశానుగామ్ ||

21

గౌతమోఽపి మహాతేజా అహల్యాసహితః సుఖీ | [హి]
రామం సంపూజ్య విధివత్తపస్తేపే మహాతపాః ||

22

రామోఽపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః |
సకాశాద్విధివత్ప్రాప్య జగామ మిథిలాం తతః ||

23

Balakanda Sarga 49 In Telugu Pdf With Meaning

ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇంద్రుని వృషణములు కిందపడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని, మొదలగు దేవతలతోనూ, ఋషులతోనూ ఇలా అన్నాడు.

“నేను మీ కోసం ఇదంతా చేసాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేసాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేసాను. తద్వారా దేవ కార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీ కోసం ఇదంతా చేసాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేట్టు చెయ్యాలి.” అని అన్నాడు దేవేంద్రుడు.

దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్లారు.

“ఓ పితృ దేవతలారా! మానవుడు యజ్ఞములు చేయునపుడు మేషములను(మేకలు, గొర్రెలు) బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయములో మీకు ఇవ్వబడిన మేషము యొక్క వృషణములను మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి.” అని అన్నాడు.

అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషము యొక్క వృషణము లను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములలో లభించిన వృషణములను దేవేంద్రుడికి ఇచ్చారు కాబట్టి, అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారముగా తీసుకొంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు.

రామా! మనము ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమములో ప్రవేశించి ఆమెకు శాపవిమోచన కలిగిద్దాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

తరువాత విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమములోనికి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూచాడు. అప్పటి దాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవరికి కనపడటం లేదు. కేవలం రామునికి మాత్రమే కనపడింది. రాముని దర్శనంతో ఆమె శాపం అంతం అయింది. ఆమె అందరికి కనపడింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు.

అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి. రాముని గుర్తించింది. అహల్య రామ లక్ష్మణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. వారికి అతిథి మర్యాదలు చేసింది. ఈ అపూర్వ దృశ్యమును చూచి దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేసారు. దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు.

ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్య గౌతములు రాముని పూజించారు. రాముడు వారి పూజలందు కున్నాడు.

గౌతముడు అహల్యతో కూడి తపస్సుకు వెళ్లిపోయాడు. రాముడు, లక్ష్మణునితో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథిలకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ పంచాశః సర్గః (50) >>

Ayodhya Kanda Sarga 40 In Telugu – అయోధ్యాకాండ చత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 40

అయోధ్యాకాండ చత్వారింశః సర్గలో, భరతుడు కేకయదేశం నుండి తిరిగి వచ్చి తన తల్లి కైకేయితో మాట్లాడతాడు. తండ్రి దశరథుని మరణం, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్లిన విషయాలు తెలిసి, భరతుడు దిగ్భ్రాంతి చెందుతాడు. కైకేయి చేసిన ఈ పాపకార్యాల పట్ల భరతుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తల్లి చర్యలను తిడతాడు, ఆమెకు దుర్వచనాలు పలుకుతాడు. భరతుడు రాముని రాజ్యం తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. తన తల్లి కైకేయిని క్షమించలేడని, రాముడిని రాజ్యానికి తీసుకురావాలని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, సోదర ప్రేమను, తల్లి చర్యల పట్ల అతని ప్రతిస్పందనను చూపిస్తుంది.

పౌరాద్యనువ్రజ్యా

అథ రామశ్చ సీతా చ లక్ష్మణశ్చ కృతాంజలిః |
ఉపసంగృహ్య రాజానం చక్రుర్దీనాః ప్రదక్షిణమ్ || ౧ ||

తం చాపి సమనుజ్ఞాప్య ధర్మజ్ఞః సీతయా సహ |
రాఘవః శోకసమ్మూఢో జననీమభ్యవాదయత్ || ౨ ||

అన్వక్షం లక్ష్మణో భ్రాతుః కౌసల్యామభ్యవాదయత్ |
అథ మాతుః సుమిత్రాయా జగ్రాహ చరణౌ పునః || ౩ ||

తం వందమానం రుదతీ మాతా సౌమిత్రిమబ్రవీత్ |
హితకామా మహాబాహుం మూర్ధ్న్యుపాఘ్రాయ లక్ష్మణమ్ || ౪ ||

సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్తః సుహృజ్జనే |
రామే ప్రమాదం మా కార్షీః పుత్ర భ్రాతరి గచ్ఛతి || ౫ ||

వ్యసనీ వా సమృద్ధో వా గతిరేష తవానఘ |
ఏష లోకే సతాం ధర్మో యజ్జ్యేష్ఠవశగో భవేత్ || ౬ ||

ఇదం హి వృత్తముచితం కులస్యాస్య సనాతనమ్ |
దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు చ || ౭ ||

లక్ష్మణం త్వేవముక్త్వా సా సంసిద్ధం ప్రియరాఘవమ్ |
సుమిత్రా గచ్ఛ గచ్ఛేతి పునః పునరువాచ తమ్ || ౮ ||

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్ |
అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్ || ౯ ||

తతః సుమంత్రః కాకుత్స్థం ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ |
వినీతో వినయజ్ఞశ్చ మాతలిర్వాసవం యథా || ౧౦ ||

రథమారోహ భద్రం తే రాజపుత్ర మహాయశః |
క్షిప్రం త్వాం ప్రాపయిష్యామి యత్ర మాం రామ వక్ష్యసి || ౧౧ ||

చతుర్దశ హి వర్షాణి వస్తవ్యాని వనే త్వయా |
తాన్యుపక్రమితవ్యాని యాని దేవ్యాఽసి చోదితః || ౧౨ ||

తం రథం సూర్యసంకాశం సీతా హృష్టేన చేతసా |
ఆరురోహ వరారోహా కృత్వాలంఽకారమాత్మనః || ౧౩ ||

అథో జ్వలనసంకాశం చామీకరవిభూషితమ్ |
తమారురుహతుస్తూర్ణం భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౧౪ ||

వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ |
భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దదౌ || ౧౫ ||

తథైవాయుధజాలాని భ్రాతృభ్యాం కవచాని చ |
రథోపస్థే ప్రతిన్యస్య సచర్మ కఠినం చ తత్ || ౧౬ ||

సీతాతృతీయానారూఢాన్దృష్ట్వా ధృష్టమచోదయత్ |
సుమంత్రః సమ్మతానశ్వాన్వాయువేగసమాంజవే || ౧౭ ||

ప్రతియాతే మహారణ్యం చిరరాత్రాయ రాఘవే |
బభూవ నగరే మూర్ఛా బలమూర్ఛా జనస్య చ || ౧౮ ||

తత్సమాకులసంభ్రాంతం మత్తసంకుపితద్విపమ్ |
హయశింజితనిర్ఘోషం పురమాసీన్మహాస్వనమ్ || ౧౯ ||

తతః సబాలవృద్ధా సా పురీ పరమపీడితా |
రామమేవాభిదుద్రావ ఘర్మార్తా సలిలం యథా || ౨౦ ||

పార్శ్వతః పృష్ఠతశ్చాపి లంబమానాస్తదున్ముఖాః |
బాష్పపూర్ణముఖాః సర్వే తమూచుర్భృశనిస్వనాః || ౨౧ ||

సంయచ్ఛ వాజినాం రశ్మీన్సూత యాహి శనైః శనైః |
ముఖం ద్రక్ష్యామ రామస్య దుర్దర్శం నో భవిష్యతి || ౨౨ ||

ఆయసం హృదయం నూనం రామమాతురసంశయమ్ |
యద్దేవగర్భప్రతిమే వనం యాతి న భిద్యతే || ౨౩ ||

కృతకృత్యా హి వైదేహీ ఛాయేవానుగతా పతిమ్ |
న జహాతి రతా ధర్మే మేరుమర్కప్రభా యథా || ౨౪ ||

అహో లక్ష్మణ సిద్ధార్థః సతతాం ప్రియవాదినమ్ |
భ్రాతరం దేవసంకాశం యస్త్వం పరిచరిష్యసి || ౨౫ ||

మహత్యేషా హి తే సిద్ధిరేష చాభ్యుదయో మహాన్ |
ఏష స్వర్గస్య మార్గశ్చ యదేనమనుగచ్ఛసి || ౨౬ ||

ఏవం వదంతస్తే సోఢుం న శేకుర్బాష్పమాగతమ్ |
నరాస్తమనుగచ్ఛంతః ప్రియమిక్ష్వాకునందనమ్ || ౨౭ ||

అథ రాజా వృతః స్త్రీభిర్దీనాభిర్దీనచేతనః |
నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్గృహాత్ || ౨౮ ||

శుశ్రువే చాగ్రతః స్త్రీణాం రుదంతీనాం మహాస్వనః |
యథా నాదః కరేణూనాం బద్ధే మహతి కుంజరే || ౨౯ ||

పితా హి రాజా కాకుత్స్థః శ్రీమాన్సన్నస్తదాఽభవత్ |
పరిపూర్ణః శశీ కాలే గ్రహేణోపప్లుతో యథా || ౩౦ ||

స చ శ్రీమానచింత్యాత్మా రామో దశరథాత్మజః |
సూతం సంచోదయామాస త్వరితం వాహ్యతామితి || ౩౧ ||

రామో యాహీతి సూతం తం తిష్ఠేతి స జనస్తదా |
ఉభయం నాశకత్సూతః కర్తుమధ్వని చోదితః || ౩౨ ||

నిర్గచ్ఛతి మహాబాహౌ రామే పౌరజనాశ్రుభిః |
పతితైరభ్యవహితం ప్రశశామ మహీరజః || ౩౩ ||

రుదితాశ్రుపరిద్యూనం హాహాకృతమచేతనమ్ |
ప్రయాణే రాఘవస్యాసీత్పురం పరమపీడితమ్ || ౩౪ ||

సుస్రావ నయనైః స్త్రీణామాస్రమాయాససంభవమ్ |
మీనసంక్షోభచలితైః సలిలం పంకజైరివ || ౩౫ ||

దృష్ట్వా తు నృపతిః శ్రీమానేకచిత్తగతం పురమ్ |
నిపపాతైవ దుఃఖేన హతమూల ఇవ ద్రుమః || ౩౬ ||

తతో హలహలాశబ్దో జజ్ఞే రామస్య పృష్ఠతః |
నరాణాం ప్రేక్ష్య రాజానం సీదంతం భృశదుఃఖితమ్ || ౩౭ ||

హా రామేతి జనాః కేచిద్రామమాతేతి చాపరే |
అంతఃపురం సమృద్ధం చ క్రోశంతః పర్యదేవయన్ || ౩౮ ||

అన్వీక్షమాణో రామస్తు విషణ్ణం భ్రాంతచేతసమ్ |
రాజానం మాతరం చైవ దదర్శానుగతౌ పథి || ౩౯ ||

స బద్ధ ఇవ పాశేన కిశోరో మాతరం యథా |
ధర్మపాశేన సంక్షిప్తః ప్రకాశం నాభ్యుదైక్షత || ౪౦ ||

పదాతినౌ చ యానార్హావదుఃఖార్హౌ సుఖోచితౌ |
దృష్ట్వా సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిమ్ || ౪౧ ||

న హి తత్పురుషవ్యాఘ్రో దుఃఖదం దర్శనం పితుః |
మాతుశ్చ సహితుం శక్తస్తోత్రార్దిత ఇవ ద్విపః || ౪౨ ||

ప్రత్యగారమివాయాంతీ వత్సలా వత్సకారణాత్ |
బద్ధవత్సా యథా ధేనుః రామమాతాఽభ్యాధావత || ౪౩ ||

తథా రుదంతీం కౌసల్యాం రథం తమనుధావతీమ్ |
క్రోశంతీం రామ రామేతి హా సీతే లక్ష్మణేతి చ || ౪౪ ||

రామలక్ష్మణసీతార్థం స్రవంతీం వారి నేత్రజమ్ |
అసకృత్ప్రైక్షత స తాం నృత్యంతీమివ మాతరమ్ || ౪౫ ||

తిష్ఠేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవః |
సుమంత్రస్య బభూవాత్మా చక్రయోరివ చాంతరా || ౪౬ ||

నాశ్రౌషమితి రాజానముపాలబ్ధోఽపి వక్ష్యసి |
చిరం దుఃఖస్య పాపిష్ఠమితి రామస్తమబ్రవీత్ || ౪౭ ||

రామస్య స వచః కుర్వన్ననుజ్ఞాప్య చ తం జనమ్ |
వ్రజతోఽపి హయాన్ శీఘ్రం చోదయామాస సారథిః || ౪౮ ||

న్యవర్తత జనో రాజ్ఞో రామం కృత్వా ప్రదక్షిణమ్ |
మనసాప్యశ్రువేగైశ్చ న న్యవర్తత మానుషమ్ || ౪౯ ||

యమిచ్ఛేత్పునరాయాంతం నైనం దూరమనువ్రజేత్ |
ఇత్యమాత్యా మహారాజమూచుర్దశరథం వచః || ౫౦ ||

తేషాం వచః సర్వగుణోపపన్నం
ప్రస్విన్నగాత్రః ప్రవిషణ్ణరూపః |
నిశమ్య రాజా కృపణః సభార్యో
వ్యవస్థితస్తం సుతమీక్షమాణః || ౫౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చత్వారింశః సర్గః || ౪౦ ||

Ayodhya Kanda Sarga 40 Meaning In Telugu

సీతారామలక్ష్మణులు వనవాసమునకు పోవడానికి సర్వం సిద్ధం అయింది. వారు దశరథునికి నమస్కరించి ఆయనకు ప్రదక్షిణం చేసారు. సాష్టాంగ పడ్డారు. ఆయన పాదములు తాకారు. దశరథుడు మౌనంగా వారిని ఆశీర్వదించాడు. వనవాసానికి అనుమతి ఇచ్చాడు. తరువాత వారు కౌసల్యకు నమస్కరించారు. ఆమె ఆశీర్వాదము తీసుకున్నారు. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకు నమస్కరించి ఆమె ఆశీర్వాదముతీసుకున్నాడు. సుమిత్ర లక్ష్మణుని తలను నిమిరి ఇలా అంది.

“నాయనా లక్ష్మణా! రాముడు నీ అన్న వనవాస సమయము లో రాముని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. ఎందుకంటే సుఖదు:ఖము లలో రాముడే నీకు దిక్కు. రాముని నీ తండ్రి దశరథుని గా భావించు. ఇంక నీ వదిన సీతను నీ తల్లి అంటే నేనుగా భావించు. నీ తల్లి తండ్రులకు సేవ చేసినట్టు వారికి కూడా సేవలు చెయ్యి. జాగ్రత్తగా వెళ్లిరా!” అనిపలికింది సుమిత్ర.

అందరూ రథము దగ్గరకు వచ్చారు. సుమంత్రుడు రథమువద్ద నిలబడి ఉన్నాడు. రాముని చూచి “రామా! రథము సిద్ధముగా ఉన్నది.
మీరు రథము ఎక్కండి. మనము ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడకు తీసుకొని వెళుతాను.” అని అన్నాడు సుమంత్రుడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథం ఎక్కారు. రథములో దశరథుని ఆదేశము మేరకు సీత కొరకు అనేకమైన విలువైన వస్త్రములు, ఆభరణములు పెట్టబడి ఉన్నాయి. రామలక్ష్మణులు ఉపయోగించుటకు అనేక రకములైన ఆయుధములు, కత్తులు, డాలులు మొదలగునవి రథములో పెట్టించాడు దశరథుడు.
రథము బయలు దేరింది. రాముడు అరణ్యములకో పోవడం చూచి అయోధ్యప్రజలు విలపిస్తున్నారు. అయోధ్య అంతా శోక సముద్రములో మునిగిపోయింది. అందరూ రాముని రథము వెంట పరుగెత్తుతున్నారు. వెనక నుండి అరుస్తున్నారు.

“ఓ సుమంత్రా! రథము కొంచెం నెమ్మదిగా పోనీయవయ్యా. మేము రాముని ఆఖరుసారిగా చూడాలి.” అని అరుస్తున్నారు. ఇంకొంతమంది అక్కడక్కడా నిలబడి “కన్నకొడుకు అడవులకు వెళుతుంటే ఆ కౌసల్య ఎలా భరించింది.” అని అనుకుంటున్నారు. ఇంకొంత మంది “ఆహా! ఆ సీతది ఏమి అదృష్టము. రాముని వెన్నంటి అడవులకు వెళుతూ ఉంది. లక్ష్మణుడుకూడా ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఈ పధ్నాలుగేళ్లు రాముని వెంట ఉండే భాగ్యానికి నోచుకున్నాడు.” అని వారి అదృష్టానికి పొంగిపోతున్నారు.

ఆ ప్రకారంగా అయోధ్యా ప్రజలు రకరకాలుగా అనుకుంటూ కన్నీరు కారుస్తున్నారు. భవనముల పైన ఉన్న కిటికీల దగ్గర నిలబడి స్త్రీలు రాముని చూచి “పట్టాభిషేకము చేసుకోవాల్సినవాడు, అడవులకు వెళుతున్నాడు. ఏం విచిత్రము” అని శోకిస్తున్నారు.

అయోధ్యావాసుల శోకమును చూడలేక రాముడు “సుమంత్రా! రథమును తొందరగా తోలు. వీరి బాధ చూడలేకున్నాను.” అని అన్నాడు. కాని వెనక నుండి పౌరులు రథము ఆపమని అరుస్తున్నారు. ఎవరి మాట వినాలో తెలియక సుమంత్రుడు అయోమయంలో పడ్డాడు. రథము వేగమును అందుకోలేక చాలా మంది కిందపడి పోయారు. కొంతమంది మూర్ఛపోయారు. ఇంకొంతమంది పట్టువిడవకుండా రథము వెంట పరుగెత్తుతున్నారు.

రాముడు రథము మీద పోతూ ఉంటే, దశరథుడు, కౌసల్య ఇంకా కొంతమంది దశరథుని భార్యలు రాముని రధము వెంట కొంత దూరం వచ్చారు. ఇంక ముందుకు సాగలేక అక్కడే నిలబడ్డారు. తన రథము వెంట నడిచివస్తున్న వారిని చూచి రాముడు కళ్లనిండా నీళ్లు పెట్టుకున్నాడు. కాని బైటికి గంభీరంగా ఉన్నాడు. వారి బాధ చూడలేక రధమును తొందరగా పోనివ్వమన్నాడు.

కాని కౌసల్యమాత్రమూ రథము వెంట పరుగెత్తు తూనే ఉంది. “రామా రామా ఆగు రామా ఆగు” అంటూ అరుస్తూ ఉంది. రాముడు వెనక్కుతిరిగి తల్లిని చూచాడు. మనసు ఆగలేదు. కాని నిగ్రహించు కున్నాడు. వెనకనుండి కౌసల్యఅరుపులు సుమంత్రునికి వినిపిస్తున్నాయి. కాని రాముడు రథాన్ని ముందుకు పోనివ్వ మంటున్నాడు. సందిగ్ధంలో పడ్డాడు సుమంత్రుడు. రథం సాగిపోతూనే ఉంది. ఇంక రాముని వెంట నడవలేక, పరుగెత్తలేక కొంత మంది అయోధ్యా ప్రజలువెనుకకు తిరిగి వెళ్లిపోయారు. కాని మధ్యలో ఆగిపోయిన దశరథుడు ఉండ బట్టలేక మరలా రథం వెంట నడుస్తున్నాడు. అప్పుడు మంత్రులు ఆయనతో ఇలా అన్నాడు.

“మహారాజా! మనము ఎవరినైతే తిరిగి రావాలని కోరుకుంటామో, వారిని ఎక్కువ దూరము సాగనంపకూడదు. కాబట్టి వెనకుకు పోదాముపదండి.” అని అన్నారు. మంత్రులమాటలను మన్నించాడు దశరథుడు. ఆగిపోయాడు. రాముడువెళ్లిన దారివెంట చూస్తున్నాడు. రథము ధూళి కనపడ్డమేరా చూస్తున్నాడు. రాముని రథము కనుచూపుమేర దాటిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలభైయవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకచత్వారింశః సర్గః (41) >>

Balakanda Sarga 60 In Telugu – బాలకాండ షష్టితమః సర్గః

Balakanda Sarga 60 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. రామాయణంలోని బాలకాండలో 60వ సర్గ, షష్టితమః సర్గగా పిలవబడుతుంది. ఈ సర్గలో విశ్వామిత్ర మహర్షి, రాముడు, లక్ష్మణుడు మిథిలా నగరానికి ప్రయాణిస్తారు. మార్గంలో వారు గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రాముడు అహల్యను శాప విమోచనం చేస్తాడు. గౌతముడి శాపం వల్ల అహల్య పర్వత రూపంలో ఉంటూ, రాముడి స్పర్శతో మానవ రూపంలోకి మారుతుంది.

త్రిశంకుస్వర్గః

తపోబలహతాన్కృత్వా వాసిష్ఠాన్సమహోదయాన్ |
ఋషిమధ్యే మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత ||

1

అయమిక్ష్వాకుదాయాదస్త్రిశంకురితి విశ్రుతః |
ధర్మిష్ఠశ్చ వదాన్యశ్చ మాం చైవ శరణం గతః ||

2

తేనానేన శరీరేణ దేవలోకజిగీషయా |
యథాయం స్వశరీరేణ స్వర్గలోకం గమిష్యతి ||

3

తథా ప్రవర్త్యతాం యజ్ఞో భవద్భిశ్చ మయా సహ |
విశ్వామిత్రవచః శ్రుత్వా సర్వ ఏవ మహర్షయః ||

4

ఊచుః సమేత్య సహితా ధర్మజ్ఞా ధర్మసంహితమ్ |
అయం కుశికదాయాదో మునిః పరమకోపనః ||

5

యదాహ వచనం సమ్యగేతత్కార్యం న సంశయః |
అగ్నికల్పో హి భగవాన్ శాపం దాస్యతి రోషితః ||

6

తస్మాత్ప్రవర్త్యతాం యజ్ఞః సశరీరో యథా దివమ్ |
గచ్ఛేదిక్ష్వాకుదాయాదో విశ్వామిత్రస్య తేజసా ||

7

తథా ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్ఠత |
ఏవముక్త్వా మహర్షయశ్చక్రుస్తాస్తాః క్రియాస్తదా ||

8

యాజకశ్చ మహాతేజా విశ్వామిత్రోఽభవత్క్రతౌ |
ఋత్విజశ్చానుపూర్వ్యేణ మంత్రవన్మంత్రకోవిదాః ||

9

చక్రుః సర్వాణి కర్మాణి యథాకల్పం యథావిధి |
తతః కాలేన మహతా విశ్వామిత్రో మహాతపాః ||

10

చకారావాహనం తత్ర భాగార్థం సర్వదేవతాః |
నాభ్యాగమంస్తదాహూతా భాగార్థం సర్వదేవతాః ||

11

తతః క్రోధసమావిష్టో విశ్వమిత్రో మహామునిః |
స్రువముద్యమ్య సక్రోధస్త్రిశంకుమిదమబ్రవీత్ ||

12

పశ్య మే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర |
ఏష త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజసా ||

13

దుష్ప్రాపం స్వశరీరేణ దివం గచ్ఛ నరాధిప |
స్వార్జితం కించిదప్యస్తి మయా హి తపసః ఫలమ్ ||

14

రాజన్స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ |
ఉక్తవాక్యే మునౌ తస్మిన్సశరీరో నరేశ్వరః ||

15

దివం జగామ కాకుత్స్థ మునీనాం పశ్యతాం తదా |
దేవలోకగతం దృష్ట్వా త్రిశంకుం పాకశాసనః ||

16

సహ సర్వైః సురగణైరిదం వచనమబ్రవీత్ |
త్రిశంకో గచ్ఛ భూయస్త్వం నాసి స్వర్గకృతాలయః ||

17

గురుశాపహతో మూఢ పత భూమిమవాక్శిరాః |
ఏవముక్తో మహేంద్రేణ త్రిశంకురపతత్పునః ||

18

విక్రోశమానస్త్రాహీతి విశ్వామిత్రం తపోధనమ్ |
తచ్ఛ్రుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌశికః ||

19

క్రోధమాహారయత్తీవ్రం తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ | [రోష]
ఋషిమధ్యే స తేజస్వీ ప్రజాపతిరివాపరః ||

20

సృజన్దక్షిణమార్గస్థాన్సప్తర్షీనపరాన్పునః |
నక్షత్రమాలామపరామసృజత్క్రోధమూర్ఛితః ||

21

దక్షిణాం దిశమాస్థాయ మునిమధ్యే మహాతపాః |
సృష్ట్వా నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృతః ||

22

అన్యమింద్రం కరిష్యామి లోకో వా స్యాదనింద్రకః |
దైవతాన్యపి స క్రోధాత్స్రష్టుం సముపచక్రమే ||

23

తతః పరమసంభ్రాంతాః సర్షిసంఘాః సురాసురాః |
సకిన్నరమహాయక్షాః సహసిద్ధాః సచారణాః ||

24

విశ్వామిత్రం మహాత్మానమూచుః సానునయం వచః |
అయం రాజా మహాభాగ గురుశాపపరిక్షతః ||

25

సశరీరో దివం యాతుం నార్హత్యేవ తపోధన |
తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం మునిపుంగవః ||

26

అబ్రవీత్సుమహద్వాక్యం కౌశికః సర్వదేవతాః |
సశరీరస్య భద్రం వస్త్రిశంకోరస్య భూపతేః ||

27

ఆరోహణం ప్రతిజ్ఞాయ నానృతం కర్తుముత్సహే |
స్వర్గోఽస్తు సశరీరస్య త్రిశంకోరస్య శాశ్వతః ||

28

నక్షత్రాణి చ సర్వాణి మామకాని ధ్రువాణ్యథ |
యావల్లోకా ధరిష్యంతి తిష్ఠంత్వేతాని సర్వశః ||

29

మత్కృతాని సురాః సర్వే తదనుజ్ఞాతుమర్హథ |
ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుర్మునిపుంగవమ్ ||

30

ఏవం భవతు భద్రం తే తిష్ఠంత్వేతాని సర్వశః |
గగనే తాన్యనేకాని వైశ్వానరపథాద్బహిః ||

31

నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిఃషు జాజ్వలన్ |
అవాక్శిరాస్త్రిశంకుశ్చ తిష్ఠత్వమరసన్నిభః ||

32

అనుయాస్యంతి చైతాని జ్యోతీంషి నృపసత్తమమ్ |
కృతార్థం కీర్తిమంతం చ స్వర్గలోకగతం యథా ||

33

విశ్వామిత్రస్తు ధర్మాత్మా సర్వదేవైరభిష్టుతః |
ఋషిభిశ్చ మహాతేజా బాఢమిత్యాహ దేవతాః ||

34

తతో దేవా మహాత్మానో మునయశ్చ తపోధనాః |
జగ్ముర్యథాగతం సర్వే యజ్ఞస్యాంతే నరోత్తమ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షష్టితమః సర్గః ||

Balakanda Sarga 60 Meaning In Telugu

ఆ ప్రకారంగా వసిష్ఠకుమారులను, మహోదయుని శపించిన తరువాత అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, బ్రాహ్మణులను, ఋషులను చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు.

” ఇక్ష్వాకు వంశ రాజు, పరమ ధార్మికుడు అయిన త్రిశంకు నా వద్దకు తనను సశరీరంగా స్వర్గమునకు పంపేటందుకు ఒక యజ్ఞము చేయించమని నా సహాయము కోరాడు. ఆయన కోరికను నేను మన్నించాను. త్రిశంకును ఈ శరీరంతో స్వర్గమునకు పంపడానికి నేను ఒక యజ్ఞము చేస్తున్నాను. ఆ యజ్ఞమునకు మీరందరూ సాయపడాలి.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

ఆ మాటలు విన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, ఋషులు తమలో తమరు ఇలా అనుకున్నారు. “ఈ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. మన కళ్ల ముందే వసిష్ఠకుమారులను దారుణంగా శపించాడు. ఆయన మాట వినక పోతే మనలకు కూడా శపించగలడు. అందుకని ఆయన చెప్పినట్టు చెయ్యడమే ప్రస్తుత కర్తవ్యము” అని అనుకున్నారు.

తరువాత విశ్వామిత్రునితో ఇలా అన్నారు. “ఓ విశ్వామిత్ర మహర్షీ ! నీవు చెప్పినట్లే మేము చేస్తాము. యజ్ఞమును ప్రారంభం చేస్తాము.”అని అన్నారు. తరువాత అందరూ కలిసి యజ్ఞము ఆరంభించారు. యజ్ఞమునకు యాజకుడుగా విశ్వామిత్రుడు ఉన్నాడు. ఋత్విక్కులు వేద మంత్రములు చదువుతున్నారు. వేదోక్తంగా యజ్ఞము చేస్తున్నారు.

విశ్వామిత్రుడు ఆయా దేవతలను వారి వారి యజ్ఞ భాగములను స్వీకరించుటకు మంత్రపూతంగా ఆహ్వానించాడు. కాని విశ్వామిత్రుని ఆహ్వానమును మన్నించి దేవతలు ఎవరూ వారి వారి హవిర్భాగము లను స్వీకరించుటకు రాలేదు. విశ్వామిత్రునకు కోపం వచ్చింది. యజ్ఞము చేసే స్రువను చేతిలోకి తీసుకున్నాడు. త్రిశంకుని చూచి ఇలా అన్నాడు.

“ఓ త్రిశంకూ! నా తపః ప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపిస్తాను. ఇప్పటిదాకా సశరీరంగా ఎవ్వరూ వెళ్లలేని స్వర్గానికి నీవు వెళుతున్నావు. నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను. వెళ్లు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్లు.” అని అన్నాడు.

విశ్వామిత్రుని తపఃశక్తిలో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్లాడు. మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును దేవతలు చూచారు. దేవేంద్రునికి చెప్పారు. త్రిశంకును చూచి దేవేంద్రుడు ఇలా అన్నాడు.

“ఓరి త్రిశంకూ! నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగుపెట్టలేవు. నీవు మూఢుడవు. సశరీరంగా స్వర్గములో ఉండలేవని నీకు తెలియదా! అందుకని తల్లక్రిందులుగా భూమి మీద పడు.” అని శపించాడు దేవేంద్రుడు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ ! నన్ను రక్షించు నన్ను రక్షించు” అని పెద్దగా అరుస్తూ త్రిశంకు తల్లక్రిందులుగా భూమి మీదకు వస్తున్నాడు.

అది చూచాడు విశ్వామిత్రుడు. “ఆగు త్రిశంకూ ఆగు. అక్కడే ఉండు” అని పెద్దగా అరిచాడు.

వెంటనే విశ్వామిత్రుడు అపర బ్రహ్మగా మారిపోయాడు ఆకాశంలో దక్షిణ దిక్కున, ఒక నక్షత్ర మండలాన్ని ఒక సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. “ఓ దేవేంద్రా! చూడు. నేను మరొక స్వర్గాన్ని, మరొక దేవేంద్రుడిని సృష్టిస్తున్నాను. అది సాధ్యం కాకపోతే నిన్ను నీ దేవేంద్రలోకాన్ని నాశనం చేస్తాను.” అని అన్నాడు.

ఆ మాటలకు దేవతలు గడగడలాడిపోయారు. దేవతలు, రాక్షసులు, సప్తఋషులు, గంధర్వులు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! నీకు తెలియనిది ఏమున్నది. ఇతడు మానవుడు. పైగా ఛండాలుడు. ఇతడు శరీరంతో స్వర్గ ప్రవేశమునకు అర్హుడు కాడు కదా!” అని అన్నారు.

దేవతల మాటలతో విశ్వామిత్రుడు శాంతించాడు. “మీరు చెప్పినది నిజమే. కాని నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఇతనిని స్వర్గానికి పంపకపోతే నేను ఇచ్చిన మాట తప్పివాడను అవుతాను కదా! నాకు అసత్య దోషము అంటుతుంది కదా! కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలము శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేట్టు నాకు అనుమతి ఇవ్వండి. ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగాఉంటాడు.” అని అన్నాడు.

దానికి దేవతలు అంగీకరించారు. “ఓ విశ్వామిత్రా! నీవు చెప్పినట్లే జరుగుతుంది. కాని నీవు సృష్టించిన నక్షత్రమండలము జ్యోతిశ్చక్రము వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నక్షత్ర మండలములో త్రిశంకు ఇప్పుడు ఉన్నట్టు తల్లక్రిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. నీవు సృష్టించిన నక్షత్ర మండలములోని నక్షత్రములు త్రిశంకు చుట్టు తిరుగుతూ అతనిని సేవిస్తూ ఉంటాయి. “అని అన్నారు.

దానికి విశ్వామిత్రుడు సమ్మతించాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞమును పూర్తి చేసాడు. యజ్ఞమునకు వచ్చిన ఋత్విక్కులు, ఋషులు బ్రాహ్మణులు క్షేమంగా తమ తమ స్థానములకు తిరిగి వెళ్లారు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకషష్టితమః సర్గః (61) >>

Balakanda Sarga 58 In Telugu – బాలకాండ అష్టపంచాశః సర్గః

Balakanda Sarga 58 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని బాలకాండలో 48వ సర్గ, అష్టపంచాశః సర్గగా పిలవబడుతుంది. ఈ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు, సుమంత్రుడు కలిసి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. విశ్వామిత్రుడు సీతారాములను తన శిష్యులుగా స్వీకరిస్తాడు మరియు రాముడిని రాక్షసుల బాధలను తొలగించమని ఆదేశిస్తాడు.

|| త్రిశంకుశాపః ||

తతస్త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితమ్ |
ఋషిపుత్రశతం రామ రాజానమిదమబ్రవీత్ ||

1

ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదినా |
తం కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయివాన్ ||

2

ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమో గురుః |
న చాతిక్రమితుం శక్యం వచనం సత్యవాదినః ||

3

అశక్యమితి చోవాచ వసిష్ఠో భగవానృషిః |
తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః కథం తవ ||

4

బాలిశస్త్వం నరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః |
యాజనే భగవాన్ శక్తస్త్రైలోక్యస్యాపి పార్థివ ||

5

అవమానం చ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథమ్ |
తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధపర్యాకులాక్షరమ్ ||

6

స రాజా పునరేవైతానిదం వచనమబ్రవీత్ |
ప్రత్యాఖ్యాతోఽస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ ||

7

అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వోఽస్తు తపోధనాః |
ఋషిపుత్రాస్తు తచ్ఛ్రుత్వా వాక్యం ఘోరాభిసంహితమ్ ||

8

శేపుః పరమసంక్రుద్ధాశ్చండాలత్వం గమిష్యసి |
ఏవముక్త్వా మహాత్మానో వివిశుస్తే స్వమాశ్రమమ్ ||

9

అథ రాత్ర్యాం వ్యతీతాయాం రాజా చండాలతాం గతః |
నీలవస్త్రధరో నీలః పరుషో ధ్వస్తమూర్ధజః ||

10

చిత్యమాల్యానులేపశ్చ ఆయసాభరణోఽభవత్ |
తం దృష్ట్వా మంత్రిణః సర్వే త్యజ్య చండాలరూపిణమ్ ||

11

ప్రాద్రవన్సహితా రామ పౌరా యేఽస్యానుగామినః |
ఏకో హి రాజా కాకుత్స్థ జగామ పరమాత్మవాన్ ||

12

దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోధనమ్ |
విశ్వామిత్రస్తు తం దృష్ట్వా రాజానం విఫలీకృతమ్ ||

13

చండాలరూపిణం రామ మునిః కారుణ్యమాగతః |
కారుణ్యాత్స మహాతేజా వాక్యం పరమధార్మికః ||

14

ఇదం జగాద భద్రం తే రాజానం ఘోరరూపిణమ్ |
కిమాగమనకార్యం తే రాజపుత్ర మహాబల ||

15

అయోధ్యాధిపతే వీర శాపాచ్చండాలతాం గతః |
అథ తద్వాక్యమాకర్ణ్య రాజా చండాలతాం గతః ||

16

అబ్రవీత్ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్ |
ప్రత్యాఖ్యాతోఽస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ ||

17

అనవాప్యైవ తం కామం మయా ప్రాప్తో విపర్యయః |
సశరీరో దివం యాయామితి మే సౌమ్యదర్శనమ్ ||

18

మయా చేష్టం క్రతుశతం తచ్చ నావాప్యతే ఫలమ్ |
అనృతం నోక్తపూర్వం మే న చ వక్ష్యే కదాచన ||

19

కృచ్ఛ్రేష్వపి గతః సౌమ్య క్షత్రధర్మేణ తే శపే |
యజ్ఞైర్బహువిధైరిష్టం ప్రజా ధర్మేణ పాలితాః ||

20

గురవశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితాః |
ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్ఛతః ||

21

పరితోషం న గచ్ఛంతి గురవో మునిపుంగవ |
దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్థకమ్ ||

22

దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమా గతిః |
తస్య మే పరమార్తస్య ప్రసాదమభికాంక్షతః ||

23

కర్తుమర్హసి భద్రం తే దైవోపహతకర్మణః |
నాన్యాం గతిం గమిష్యామి నాన్యః శరణమస్తి మే |
దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టపంచాశః సర్గః ||

Balakanda Sarga 58 Meaning In Telugu

త్రిశంకు ఆ మాటలు అంటున్నంత సేపూ వసిష్ఠుని కుమారులు కోపంతో ఊగి పోతున్నారు. వారి కోపము కట్టలు తెంచుకొంది.

” ఓ త్రిశంకూ! నీవు దుర్బుద్ధివి. చెడ్డవాడివి. నీ కుల గురువు వసిష్ఠుడు. ఆయన సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ల గలవు? నీకే కాదు… వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకే పురోహితుడు. గురువు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమి స్తున్నావు? మా తండ్రిగారు, నీ కులగురువు అయిన వసిష్ఠుడు తన వల్లకాదు అని చెప్పిన యజ్ఞమును మేము ఎలా చేయిస్తాము అని అనుకున్నావు?

నీవు మూర్ఖుడవు. లేకపోతే సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేక పోతున్నావు. వసిష్ఠుడు మూడు లోకములలో ఎవరిచేతనైనా ఎటువంటి యాగము నైనా చేయించగల సమర్థులు. అటువంటి వసిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో. ఆయన కాదు అన్న యాగమును మేము చేయించి ఆయనను అవమానించలేము. కాబట్టి, వెంటనే నీవు తిరిగినీ నగరమునకు వెళ్లు. ఈ దుష్ట ఆలోచన మానుకో. ” అని కోపంతో పలికారు వసిష్ఠుని కుమారులు.

ఆ మాటలు విన్న త్రిశంకు వినయంతో వారితో ఇలా అన్నాడు. “ముని కుమారులారా! మీ తండ్రిగారు నా చేత సశరీరంగా స్వర్గమునకు పోవుటకు తగిన యజ్ఞము చేయించుటకు సమ్మతించలేదు. మీ వద్దకు వచ్చాను మీరూ నిరాకరించారు. ఏం చేస్తాను. వేరేవాళ్లదగ్గరకు పోయి నా కోరికను నెరవేర్చుకుంటాను. నాకు సెలవు ఇప్పించండి.” అని అన్నాడు త్రిశంకు.

తాము ఇన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టు వీడని త్రిశంకుని చూచి వసిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు.

“ఓ త్రిశంకు! నీవు క్షత్రియుడుగా ఉండ తగవు. నీవు ఛండాలుడివిగా మారిపో!” అని శపించారు.

ఆ మునికుమారుల శాపము ప్రకారము ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు ఛండాలుడిగా మారి పోయాడు. నల్లని వస్త్రములు, నల్లని శరీరము, చింపిరి జుట్టు, కపాల మాలికలు, ఇనుముతో చేసిన ఆభరణములు, వీటితో వికృతంగా మారిపోయాడు త్రిశంకు.

అతని ఆకారమును చూచి అతని వెంట ఉన్న రాజబంధువులు, మంత్రులు, సేనలు అందరూ భయపడి పారిపోయారు.

త్రిశంకు ఒంటరి వాడయ్యాడు. అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. అతనిని చూచి విశ్వామిత్రుడు జాలి పడ్డాడు.

“నీవు త్రిశంకు మహారాజువు కదూ! ఇక్ష్వాకు వంశ రాజువు కదూ. నీవు నీ కులగురువు వసిష్ఠుని చేత నిరాకరింపబడ్డావు. అతని కుమారులచేత శపించబడ్డావు. నీకు ఏం భయం లేదు. నీ కోరిక నేను తీరుస్తాను. నీకు ఏంకావాలో అడుగు.” అని పలికాడు విశ్వామిత్రుడు.

అప్పుడు త్రిశంకు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓమహర్షీ! నాకు ఈ శరీరంతోనే స్వర్గమునకు వెళ్లవలెనని కోరిక. దాని కొరకు నూరు యజ్ఞములు చేసాను. నా కోరిక తీరలేదు. నా పురోహితుడు వసిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన కుమారులు నా కోరిక తీర్చకపోగా నన్ను ఛండాలుడివి కమ్మని శపించారు. దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను. మీరే నా కోరిక తీర్చాలి.

ఓ మహర్షీ! నా గురించి మీకు తెలుసు కదా! నేను అసత్యమాడను. ధర్మపరుడను. ఎన్నో యజ్ఞములు చేసాను. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాను. పెద్దలను గౌరవించాను. ఎవరికీ ఎటువంటి అపకారము చేయలేదు. కాని నా కోరిక తీరలేదు. దైవము నా యందు అనుకూలముగా లేనపుడు పురుష ప్రయత్నము కూడా ఫలించదు కదా! దైవోపహతుడనైన నేను ఇప్పుడు మిమ్ములను ఆశ్రయించాను. ఇంక మీ దయ. మీరు కాదంటే నాకు వేరు గతి లేదు.” అని ప్రార్థించాడు త్రిశంకు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభై ఎనిమిదవ సర్గ
సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకోనషష్ఠితమః సర్గః (59) >>

Balakanda Sarga 47 In Telugu – బాలకాండ సప్తచత్వారింశః సర్గః

Balakanda Sarga 47 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తచత్వారింశః సర్గలో సప్తమరుత్తుల పురాణం, సప్తవాయువుల పురాణం మరియు విశాల రాజుల పురాణం రాముడు మరియు లక్ష్మణులకు చెప్పగా, విశ్వామిత్రుడు విశాల పురాణాన్ని వివరిస్తున్నాడు. దితి యొక్క అభ్యర్థన మేరకు, ఇంద్రుడు ఆమె పిండంలోని ఏడు భాగాలను సప్త మరుత్ గణాలుగా , సప్తమరుత్ గణాలుగా, ఏడు వాయుదేవతలుగా మారమని ఆశీర్వదిస్తాడు మరియు ఇంద్ర-దితి పురాణం జరిగిన ప్రదేశం, ఆ ప్రాంతం తరువాత విశాల నగరంగా మారింది.

విశాలాగమనమ్

సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా |
సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయోఽబ్రవీత్ ||

1

మమాపరాధాద్గర్భోఽయం సప్తధా విఫలీకృతః |
నాపరాధోఽస్తి దేవేశ తవాత్ర బలసూదన ||

2

ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భవిపర్యయే |
మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంత్విమే ||

3

వాతస్కంధా ఇమే సప్త చరంతు దివి పుత్రక |
మారుతా ఇతి విఖ్యాతా దివ్యరూపా మమాత్మజాః ||

4

బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథాఽపరః |
దివి వాయురితి ఖ్యాతస్తృతీయోఽపి మహాయశాః ||

5

చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్ |
సంచరిష్యంతి భద్రం తే దేవభూతా మమాత్మజాః ||

6

త్వత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః |
తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః ||

7

ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషూదనః |
సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః ||

8

విచరిష్యంతి భద్రం తే దేవభూతాస్తవాత్మజాః |
ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే ||

9

జగ్ముతుస్త్రిదివం రామ కృతార్థావితి నః శ్రుతమ్ |
ఏష దేశః స కాకుత్స్థ మహేంద్రాధ్యుషితః పురా ||

10

దితిం యత్ర తపః సిద్ధామేవం పరిచచార సః |
ఇక్ష్వాకోఽస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః ||

11

అలంబుసాయాముత్పన్నో విశాల ఇతి విశ్రుతః |
తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీ కృతా ||

12

విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబలః |
సుచంద్ర ఇతి విఖ్యాతో హేమచంద్రాదనంతరః ||

13

సుచంద్రతనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః |
ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయః సమపద్యత ||

14

సృంజయస్య సుతః శ్రీమాన్సహదేవః ప్రతాపవాన్ |
కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః ||

15

కుశాశ్వస్య మహాతేజాః సోమదత్తః ప్రతాపవాన్ |
సోమదత్తస్య పుత్రస్తు కాకుత్స్థ ఇతి విశ్రుతః ||

16

తస్య పుత్రో మహాతేజాః సంప్రత్యేష పురీమిమామ్ |
ఆవసత్పరమప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః ||

17 [అమర]

ఇక్ష్వాకోఽస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః |
దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంతః సుధార్మికాః ||

18

ఇహాద్య రజనీం రామ సుఖం వత్స్యామహే వయమ్ |
శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి ||

19

సుమతిస్తు మహాతేజా విశ్వామిత్రముపాగతమ్ |
శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుద్గచ్ఛన్మహాయశాః ||

20

పూజాం చ పరమాం కృత్వా సోపాధ్యాయః సబాంధవః |
ప్రాంజలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రమథాబ్రవీత్ ||

21

ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే విషయం మునిః |
సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మమ ||

22

Balakanda Sarga 47 In Telugu Pdf With Meaning

తన గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండింప బడిన తన కుమారుని తలుచుకొని దితి ఎంతో దు:ఖించింది. కాసేపటికి తేరుకుంది. దేవేంద్రుని చూచి ఇలా అంది.

“కుమారా! తప్పు నాది. నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూచుకున్నావు. నా గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా ఖండించావు. ఎటూ నా గర్భము విచ్ఛిన్నము అయింది. కానీ నీవు నాకు ఒక ఉ పకారము చెయ్యి. ఈ ఏడు ఖండములను ఏడు మరుత్తుస్థానములకు పాలకులుగా నియమించు.

నా ఏడుగురు కుమారులు దివ్య రూపములతో వాతస్కంధములకు స్థాన పాలకులు అగుదురు గాక! వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగును గాక! ఈ మరుత్తులలో ఒకరు బ్రహ్మ లోకములోనూ, ఒకరు ఇంద్రలోకములోనూ, మూడవ వాడు వాయు లోకములోనూ నిత్యమూ తిరుగుతూ ఉండుదురుగాక! మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞకు లోబడి నాలుగు నా దిక్కులను పరిపాలించుదురు గాక!

నీవు నా కుమారుని ఖండించు నప్పుడు ఏడవకు ఏడవకు (మా రుత మా రుత) అని అనునయించావు. నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువ బడతారు.” అని పలికింది దితి.

ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారము చేసాడు. ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. “అమ్మా నీవు చెప్పినట్లే జరుగుతుంది. నీకు శుభం జరుగుతుంది.” అని అన్నాడు. తరువాత దితి, దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్లిపోయారు.

ఓ రామా! దితి ఇదే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచార ములు చేసాడు.

తరువాతి కాలంలో ఇక్ష్వాకునకు ఆలంబుస అను ఆయన భార్యకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది.

ఆ విశాలుని కుమారుడు హేమ చంద్రుడు. హేమ చంద్రుని కుమారుడు సుచంద్రుడు. సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు. ధూమ్రాశ్వుని కుమారుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు కుశాశ్వుడు. కుశాశ్వుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు కాకుత్సుడు
.
ఆ కాకుత్తుని కుమారుడు ప్రస్తుతము విశాల నగరము పరిపాలిస్తున్న సుమతి. మనకు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలానగరమునకు ప్రయాణము కొనసాగిస్తాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతికి వర్తమానము పంపారు. వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురు వచ్చి ఆయనకు, ఆయన వెంట వచ్చినవారిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్య పాద్యములను ఇచ్చి సత్కరించాడు. విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు.

“మహాత్మా! తమరు మా నగరానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేసారు. మేము ధన్యులము అయ్యాము. నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు.” అని పలికాడు సుమతి.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ అష్టచత్వారింశః సర్గః (48) >>

Ayodhya Kanda Sarga 39 In Telugu – అయోధ్యాకాండ ఏకోనచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 39

అయోధ్యాకాండ ఏకోనచత్వారింశః సర్గలో, దశరథ మహారాజు మరణం తరువాత, ఐక్య రాజ్యం తీవ్ర దుఃఖంలో మునిగిపోతుంది. మరణం తరువాత, వసిష్ఠుడు, సుమంతుడు మరియు ఇతర మంత్రులు, భార్యలు కౌసల్య మరియు సుమిత్రలతో కలిసి దశరథుని అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ తరువాత, దశరథుని మరణ వార్తను భారతుని వద్దకు పంపే ప్రయత్నం చేస్తారు, భారతుడు తన తల్లి కైకేయితో కలిసి కేకయ దేశంలో ఉంటున్నాడు. ఇందులో, వసిష్ఠ మహర్షి వేద విద్యాసంపన్నుడిగా, రాజ్య నిర్వహణలో కీలకంగా ఉంటాడు. అతను రాజ్యంలోని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు మరియు భరతుని వెంటనే అయోధ్యకు రావలసిందిగా సందేశం పంపిస్తాడు. ఈ సందేశం ద్వారా భరతుడు తండ్రి మరణం మరియు అయోధ్యలో నెలకొన్న విషాదం గురించి తెలుసుకుంటాడు.

వనగమనాపృచ్ఛా

రామస్య తు వచః శృత్వా మునివేషధరం చ తమ్ |
సమీక్ష్య సహ భార్యాభిః రాజా విగతచేతనః || ౧ ||

నైనం దుఃఖేన సంతప్తః ప్రత్యవైక్షత రాఘవమ్ |
న చైనమభిసంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాః || ౨ ||

స ముహూర్తమివాసంజ్ఞో దుఃఖితశ్చ మహీపతిః |
విలలాప మహాబాహుః రామమేవానుచింతయన్ || ౩ ||

మన్యే ఖలు మయా పూర్వం వివత్సా బహవః కృతాః |
ప్రాణినో హింసితా వాఽపి తస్మాదిదముపస్థితమ్ || ౪ ||

న త్వేవానాగతే కాలే దేహాచ్చ్యవతి జీవితమ్ |
కైకేయ్యా క్లిశ్యమానస్య మృత్యుర్మమ న విద్యతే || ౫ ||

యోఽహం పావకసంకాశం పశ్యామి పురతః స్థితమ్ |
విహాయ వసనే సూక్ష్మే తాపసాచ్ఛాదమాత్మజమ్ || ౬ ||

ఏకస్యాః ఖలు కైకేయ్యాః కృతేఽయం క్లిశ్యతే జనః |
స్వార్థే ప్రయతమానాయాః సంశ్రిత్య నికృతిం త్విమామ్ || ౭ ||

ఏవముక్త్వా తు వచనం బాష్పేణ పిహితేంద్రియః |
రామేతి సకృదేవోక్త్వా వ్యాహర్తుం న శశాక హ || ౮ ||

సంజ్ఞాం తు ప్రతిలభ్యైవ ముహూర్తాత్స మహీపతిః |
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం సుమంత్రమిదమబ్రవీత్ || ౯ ||

ఔపవాహ్యం రథం యుక్త్వా త్వమాయాహి హయోత్తమైః |
ప్రాపయైనం మహాభాగమితో జనపదాత్పరమ్ || ౧౦ ||

ఏవం మన్యే గుణవతాం గుణానాం ఫలముచ్యతే |
పిత్రా మాత్రా చ యత్సాధుర్వీరో నిర్వాస్యతే వనమ్ || ౧౧ ||

రాజ్ఞో వచనమాజ్ఞాయ సుమంత్రః శీఘ్రవిక్రమః |
యోజయిత్వాఽఽయయౌ తత్ర రథమశ్వైరలంకృతమ్ || ౧౨ ||

తం రథం రాజపుత్రాయ సూతః కనకభూషితమ్ |
ఆచచక్షేఽంజలిం కృత్వా యుక్తం పరమవాజిభిః || ౧౩ ||

రాజా సత్వరమాహూయ వ్యాపృతం విత్తసంచయే |
ఉవాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వతః శుచిమ్ || ౧౪ ||

వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ |
వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాః క్షిప్రమానయ || ౧౫ ||

నరేంద్రేణైవముక్తస్తు గత్వా కోశగృహం తతః |
ప్రాయచ్ఛత్సర్వమాహృత్య సీతాయై సమమేవ తత్ || ౧౬ ||

సా సుజాతా సుజాతాని వైదేహీ ప్రస్థితా వనమ్ |
భూషయామాస గాత్రాణి తైర్విచిత్రైర్విభూషణైః || ౧౭ ||

వ్యరాజయత వైదేహీ వేశ్మ తత్సువిభూషితా |
ఉద్యతోంశుమతః కాలే ఖం ప్రభేవ వివస్వతః || ౧౮ ||

తాం భుజాభ్యాం పరిష్వజ్య శ్వశ్రూర్వచనమబ్రవీత్ |
అనాచరంతీం కృపణం మూర్ధ్న్యుపాఘ్రాయ మైథిలీమ్ || ౧౯ ||

అసత్యః సర్వలోకేఽస్మిన్సతతం సత్కృతాః ప్రియైః |
భర్తారం నానుమన్యంతే వినిపాతగతం స్త్రియః || ౨౦ ||

ఏష స్వభావో నారీణామనుభూయ పురా సుఖమ్ |
అల్పామప్యాపదం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి || ౨౧ ||

అసత్యశీలా వికృతా దుర్గ్రాహ్యహృదయాః సదా |
యువత్యః పాపసంకల్పాః క్షణమాత్రాద్విరాగిణః || ౨౨ ||

న కులం న కృతం విద్యాం న దత్తం నాపి సంగ్రహమ్ |
స్త్రీణాం గృహ్ణాతి హృదయమనిత్యహృదయా హి తాః || ౨౩ ||

సాధ్వీనాం హి స్థితానాం తు శీలే సత్యే శ్రుతే శమే |
స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే || ౨౪ ||

స త్వయా నావమంతవ్యః పుత్రః ప్రవ్రాజితో మమ |
తవ దైవతమస్త్వేషః నిర్ధనః సధనోఽపి వా || ౨౫ ||

విజ్ఞాయ వచనం సీతా తస్యా ధర్మార్థసంహితమ్ |
కృతాంజలిరువాచేదం శ్వశ్రూమభిముఖే స్థితామ్ || ౨౬ ||

కరిష్యే సర్వమేవాహమార్యా యదనుశాస్తి మామ్ |
అభిజ్ఞాఽస్మి యథా భర్తుః త్వర్తితవ్యం శ్రుతం చ మే || ౨౭ ||

న మామసజ్జనేనార్యా సమానయితుమర్హతి |
ధర్మాద్విచలితుం నాహమలం చంద్రాదివ ప్రభా || ౨౮ ||

నాతంత్రీ వాద్యతే వీణా నాచక్రో వర్తతే రథః |
నాపతిః సుఖమేధేత యా స్యాదపి శతాత్మజా || ౨౯ ||

మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః |
అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్ || ౩౦ ||

సాఽహమేవంగతా శ్రేష్ఠా శ్రుతర్ధర్మపరావరా |
ఆర్యే కిమవమన్యేఽహం స్త్రీణాం భర్తా హి దైవతమ్ || ౩౧ ||

సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమమ్ |
శుద్ధసత్త్వా ముమోచాశ్రు సహసా దుఃఖహర్షజమ్ || ౩౨ ||

తాం ప్రాంజలిరభిక్రమ్య మాతృమధ్యేఽతిసత్కృతామ్ |
రామః పరమధర్మాత్మా మాతరం వాక్యమబ్రవీత్ || ౩౩ ||

అంబ మా దుఃఖితా భూస్త్వం పశ్య త్వం పితరం మమ |
క్షయో హి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి || ౩౪ ||

సుప్తాయాస్తే గమిష్యంతి నవ వర్షాణి పంచ చ |
సా సమగ్రమిహ ప్రాప్తం మాం ద్రక్ష్యసి సుహృద్వృతమ్ || ౩౫ ||

ఏతావదభినీతార్థముక్త్వా స జననీం వచః |
త్రయః శతశతార్ధాశ్చ దదర్శావేక్ష్య మాతరః || ౩౬ ||

తాశ్చాపి స తథైవార్తా మాతౄర్దశరథాత్మజః |
ధర్మయుక్తమిదం వాక్యం నిజగాద కృతాంజలిః || ౩౭ ||

సంవాసాత్పరుషం కించిదజ్ఞానాద్వాఽపి యత్కృతమ్ |
తన్మే సమనుజానీత సర్వాశ్చామంత్రయామి వః || ౩౮ ||

వచనం రాఘవస్యైతద్ధర్మయుక్తం సమాహితమ్ |
శుశ్రువుస్తాః స్త్రియః సర్వాః శోకోపహతచేతసః || ౩౯ ||

జజ్ఞేఽథ తాసాం సన్నాదః క్రౌంచీనామివ నిస్వనః |
మానవేంద్రస్య భార్యాణామేవం వదతి రాఘవే || ౪౦ ||

మురజపణవమేఘఘోషవ-
-ద్దశరథవేశ్మ బభూవ యత్పురా |
విలపితపరిదేవనాకులం
వ్యసనగతం తదభూత్సుదుఃఖితమ్ || ౪౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశః సర్గః || ౩౯ ||

Ayodhya Kanda Sarga 39 Meaning In Telugu

దశరథుడు రాముని వంక చూచాడు. అప్పటికే రాముడు నారచీరలు ధరించాడు. ముని కుమారుని వేషంలో ఉన్నాడు. పట్టాభిషేకము చేసుకుంటూ పట్టు పీతాంబరములు ధరించి సింహాసనము మీద కూర్చుండగా చూడవలసిన రాముని నార చీరలలో మునివేషధారణలో చూడగానే దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది. రామునికి బదులు చెప్పలేకపోయాడు. శరీరం వశం తప్పుతూ ఉంది. నిలదొక్కుకున్నాడు. దుఃఖంతో తలవంచుకొని కూర్చున్నాడు.

“పూర్వము నేను ఎందరినో పిల్లలను తమ తల్లి తండ్రుల వద్దనుండి విడదీసిఉంటాను. అందుకే నాకు ఈనాడు ఈ దుర్గతి దాపురించింది. లేకపోతే నా రాముడు నన్ను విడిచి అడవులకు పోవడం ఏమిటి. రాముని మునివేషధారణలో చూచి కూడా నా ప్రాణములు పోలేదంటే నాకు ఇంకా కాలం ఆసన్నం కాలేదన్నమాట. ఈ నాడు ఒక్క కైక స్వార్థము కొరకు అయోధ్యా ప్రజలందరూ బాధపడు తున్నారు. ఒక్కరి లాభం కోసం ఇంతమంది బాధపడవలెనా!” అని తనలో తనే కుమిలిపోతున్నాడు.

ఇంకతప్పదని సుమంత్రుని చూచి “సుమంత్రా! రాముని ప్రయాణమునకు రథము సిద్ధం చెయ్యి. రాముని అందులో ఎక్కించుకొని ఈ దేశపు సరిహద్దులు దాటించి అవతల ఉన్న అరణ్యములో విడిచిపెట్టు. సుమంత్రా! మనిషి మంచివాడుగా ఉండవచ్చు కానీ అతి మంచి వాడు కాకూడదు. రాముని అతి మంచితనమే అతనికి చేటు తెచ్చింది. ఏమి చేస్తాం. నేను నా భార్య మాట విన్నాను. రాముడు నా మాట విన్నాడు. అయోధ్య కష్టాల పాలయింది” అన్నాడు దశరథుడు.

రాజు ఆజ్ఞమేరకు సుమంత్రుడు ఉత్తమ జాతి అశ్వములను కట్టిన రథమును తీసుకొని వచ్చి రాజమందిర ద్వారము దగ్గర నిలిపాడు. “రామా! రథము సిద్ధము ఉంది” అని చెప్పి ఊరుకున్నాడు సుమంత్రుడు. దశరథుడు తన కోశాధికారిని పిలిపించి అతనితో ఇలా అన్నాడు.
“సీత అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఉండవలెనో, అన్ని సంవత్సరములకూ సరిపడా అమూల్యమైన దుస్తులు, అలంకారములు, ఆభరణములు తీసుకొనిరా. ” అని ఆదేశించాడు. కోశాధికారి అదే ప్రకారము దుస్తులు ఆభరణములు తెచ్చి సీతకు ఇచ్చాడు. సీత మారు మాటాడకుంటా పూర్వము మాదిరి విలువైన దుస్తులు, ఆభరణములు అలంకరించుకొంది. సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ప్రకాశిస్తూ ఉంది. లక్ష్మీకళ ఉట్టిపడుతున్న కోడలిని చూచి కౌసల్య ఆమెను గట్టిగా కౌగలించు కొంది.

“అమ్మా! సీతా! సాధారణంగా శీలవంతులు కాని స్త్రీలు తమ భర్తలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తారు. నీచ స్థితిలో ఉన్నప్పుడు అవమానిస్తారు. . భర్తపట్ల ఏ మాత్రం గౌరవము చూపరు. అవకాశం వస్తే మొగుడిని వదిలేస్తారు. అది ఆడువారి స్వభావము. ఎప్పుడూ చెడ్డ ఆలోచనలు కలవారికి శీలము ఉండదు. అటువంటివారు ఈ క్షణంలో భర్త మీద అనురాగం చూపినా మరుక్షణంలో వారిని ద్వేషిస్తారు. వారు చాలా చంచలంగా ఉంటారు. స్థిరమైన బుద్ధి ఉండదు.

కాని శీలవంతులూ, సత్యవ్రతులూ, స్థిరమైన బుద్ధి కలవారు మాత్రము తమ భర్త ఏ పరిస్థితిలో ఉన్నా వారిని ఆదరిస్తారు. గౌరవిస్తారు. నా కుమారుడు రాముడు ఈ అయోధ్యకు రాజు. ప్రస్తుతము అడవులలో ఉన్నాడని రాముని అగౌరవంగా చూడకు. ధనము లేదని రాముని నిందించకు. భర్తయే పతికి దైవము. నీవు రాముని దైవసమానుడిగా భావించాలి.” అని పలికింది కౌసల్య.

అత్తగారి మాటలలో ఆంతర్యం గ్రహించింది సీత. అత్తగారితో ఇలా అంది. “అత్తగారూ! నన్ను సాధారణ స్త్రీ అనీ, దుష్టస్వభావము కల స్త్రీ అనీ ఎందుకు అనుకుంటున్నారు. నేను అలాంటి దానిని కాను. కష్టసుఖములలో భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. దీని గురించి నేను ఇదివరకే చాలా చదివాను, విన్నాను. భర్త లేనిదే స్త్రీకి సుఖము లేదని నాకు బాగా తెలుసు. తల్లిగానీ, తండ్రి గానీ, కుమారుడు కానీ, కుమార్తె గానీ స్త్రీకి పరిమితమైన సుఖము, ఆనందము కలిగించగలరు. కానీ భర్త మాత్రము జీవితాంతము భార్యము సుఖాన్ని ఆనందాన్ని పంచి ఇస్తాడు. అట్టి భర్తను ఏ భార్య ఆదరించదు? గౌరవించదు? స్త్రీలకు భర్తయే దైవము. ఆవిషయం నాకు బాగా తెలుసు. అట్టి దైవాన్ని నేను ఎందుకు అవమానిస్తాను? ఆ విషయంలో మీరు ఎలాంటి చింతాపెట్టుకోవద్దు.” అని వినయంగా పలికింది సీత. సీత మాటలు విన్న కౌసల్యము మనసులో ఉన్న బాధంతా చేత్తో తీసినట్టు మాయం అయింది. సీతను ఆదరంగా దగ్గరకు తీసుకొంది.

రాముడు తల్లి కౌసల్యకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి ఇలా అన్నాడు. “అమ్మా! నీవు ఎంత మాత్రమూ దు:ఖపడవద్దు. నేను అతి త్వరలో వనవాసము ముగించుకొని నీ ముందు నిలబడతాను. నీవుమాత్రము తండ్రి గారిని జాగ్రత్తగా చూచుకో. అమ్మా! పద్నాలుగు సంవత్సరాలు అంటే ఎంతసేపు. ఇట్టే గడిచిపోతుంది. నువ్వు అలా నిద్రపోయి ఇలా లేచేసరికి నేను అరణ్యవాసము ముగించుకొని నీ కళ్లముందు ఉంటాను.” అని తల్లి కన్నీరు తుడిచాడు రాముడు.

తరువాత అక్కడే ఉన్న తన 350 మంది తల్లుల వంకా చూచాడు. వారందరికీ భక్తి నమస్కరించాడు. “తల్లులారా! నాకు మీతో ఉన్న పరిచయం చేత గానీ, లేక నా అవివేకము వలన గానీ తెలిసో తెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను మీ అందరి దగ్గరా సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించడి.” అని అందరికీ నమస్కరించాడు. రాముని మాటలు విని దశరథుని భార్యలందరూ గట్టిగా రోదించారు. అలాగే రాముని ఆశీర్వదించారు. ఎల్లప్పుడూ మంగళవాద్యములతోనూ వేద మంత్రములతోనూ మార్మోగే దశరథుని గృహము ఇప్పుడు రోదనలతో నిండిపోయింది.

శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము
ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చత్వారింశః సర్గః (40) >>

Ayodhya Kanda Sarga 51 In Telugu | అయోధ్యాకాండ ఏకపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 51 In Telugu

అయోధ్యా కాండ సర్గ 51 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. గుహుడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. “లక్ష్మణకుమారా! వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా! నీకోసరము మెత్తని శయ్య సిద్ధమే చేసాము. నీవు దీని మీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు. నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకొని రామునికి, నీకు కాపలా లక్ష్మణా! అంటూ పలికిన సందర్భం లోనిది…

గుహలక్ష్మణజాగరణమ్

తం జాగ్రతమదంభేన భ్రాతురర్థాయ లక్ష్మణమ్ |
గుహః సంతాపసంతప్తో రాఘవం వాక్యమబ్రవీత్ ||

1

ఇయం తాత సుఖా శయ్యా త్వదర్థముపకల్పితా |
ప్రత్యాశ్వసిహి సాధ్వస్యాం రాజపుత్ర యథాసుఖమ్ ||

2

ఉచితోఽయం జనః సర్వః క్లేశానాం త్వం సుఖోచితః |
గుప్త్యర్థం జాగరిష్యామః కాకుత్స్థస్య వయం నిశామ్ ||

3

న హి రామాత్ప్రియతరో మమాస్తి భువి కశ్చన |
బ్రవీమ్యేతదహం సత్యం సత్యేనైవ చ తే శపే ||

4

అస్య ప్రసాదాదాశంసే లోకేఽస్మిన్సుమహద్యశః |
ధర్మావాప్తిం చ విపులామర్థావాప్తిం చ కేవలామ్ ||

5

సోఽహం ప్రియతమం రామం శయానం సహ సీతయా |
రక్షిష్యామి ధనుష్పాణిః సర్వతః జ్ఞాతిభిః సహ ||

6

న హి మేఽవిదితం కించిద్వనేఽస్మింశ్చరతః సదా |
చతురంగం హ్యపి బలం సుమహత్ప్రసహేమహి ||

7

లక్ష్మణస్తం తదోవాచ రక్ష్యమాణాస్త్వయాఽనఘ |
నాత్ర భీతా వయం సర్వే ధర్మమేవానుపశ్యతా ||

8

కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా ||

9

యో న దేవాసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య సుఖసంవిష్టం తృణేషు సహ సీతయా ||

10

యో మంత్రతపసా లబ్ధో వివిధైశ్చ పరిశ్రమైః |
ఏకో దశరథస్యేష్టః పుత్రః సదృశలక్షణః ||

11

అస్మిన్ప్రవ్రాజితే రాజా న చిరం వర్తయిష్యతి |
విధవా మేదినీ నూనం క్షిప్రమేవ భవిష్యతి ||

11

వినద్య సుమహానాదం శ్రమేణోపరతాః స్త్రియః |
నిర్ఘోషోపరతం చాతః మన్యే రాజనివేశనమ్ ||

12

కౌసల్యా చైవ రాజా చ తథైవ జననీ మమ |
నాశంసే యది జీవంతి సర్వే తే శర్వరీమిమామ్ ||

13

జీవేదపి హి మే మాతా శత్రుఘ్నస్యాన్వవేక్షయా |
తద్దుఃఖం యత్తు కౌసల్యా వీరసూర్వినశిష్యతి ||

14

అనురక్తజనాకీర్ణా సుఖాలోకప్రియావహా |
రాజవ్యసనసంసృష్టా సా పురీ వినశిష్యతి ||

15

కథం పుత్రం మహాత్మానం జ్యేష్ఠం ప్రియమపస్యతః |
శరీరం ధారయిష్యంతి ప్రాణా రాజ్ఞో మహాత్మనః ||

16

వినష్టే నృపతౌ పశ్చాత్కౌసల్యా వినశిష్యతి |
అనంతరం చ మాతాఽపి మమ నాశముపైష్యతి ||

17

అతిక్రాంతమతిక్రాంతమనవాప్య మనోరథమ్ |
రాజ్యే రామమనిక్షిప్య పితా మే వినశిష్యతి ||

18

సిద్ధార్థాః పితరం వృత్తం తస్మిన్కాలేఽప్యుపస్థితే |
ప్రేతకార్యేషు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపమ్ ||

19

రమ్యచత్వరసంస్థానాం సువిభక్తమహాపథామ్ |
హర్మ్యప్రాసాదసంపన్నాం గణికావరశోభితామ్ ||

20

రథాశ్వగజసంబాధాం తూర్యనాదవినాదితామ్ |
సర్వకళ్యాణసంపూర్ణాం హృష్టపుష్టజనాఽకులామ్ ||

21

ఆరామోద్యానసంపన్నాం సమాజోత్సవశాలినీమ్ |
సుఖితా విచరిష్యంతి రాజధానీం పితుర్మమ ||

22

అపి జీవేద్ధశరథో వనవాసాత్పునర్వయమ్ |
ప్రత్యాగమ్య మహాత్మానమపి పశ్యేమ సువ్రతమ్ ||

23

అపి సత్యప్రతిజ్ఞేన సార్ధంకుశలినా వయమ్ |
నివృత్తవనవాసేఽస్మిన్నయోధ్యాం ప్రవిశేమహి ||

24

పరిదేవయమానస్య దుఃఖార్తస్య మహాత్మనః |
తిష్ఠతః రాజపుత్రస్య శర్వరీ సాఽత్యవర్తత ||

25

తథాహి సత్యం బ్రువతి ప్రజాహితే
నరేంద్రపుత్రే గురుసౌహృదాద్గుహః |
ముమోచ బాష్పం వ్యసనాభిపీడితో
జ్వరాతురో నాగ ఇవ వ్యథాఽఽతురః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 51 Meaning In Telugu

గుహుడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. “లక్ష్మణకుమారా! వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా! నీకోసరము మెత్తని శయ్య సిద్ధమే చేసాము. నీవు దీని మీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు. నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకొని రామునికి, నీకు కాపలా లక్ష్మణా!

నాకు ఈ లోకములో రాముని కంటే ఇష్టమైన వాడు ఎవరూ లేరు. అటువంటి రాముడు ఇలా ఒంటరిగా అడవిలో కటికనేల మీద నిరాహారంగా నిద్రించడం బాధాకరంగా ఉంది. నీకు, రామునికి ఈ అరణ్యములో ఎలాంటి భయమూ లేదు. మాకు ఈ అరణ్యము కొత్త కాదు. నీవు సుఖంగా నిద్రించు.” అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇలా అన్నాడు. “మిత్రమా! నీవు మా పక్కన ఉండగా మాకు ఏమి భయము.

అటుచూడు. నా అన్న, నా వదిన అలా కటికనేల మీద పడుకొని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది. అసలు నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుగుతుంది. రాజాంతఃపురములలో పట్టుపరుపుల మీద పవళించిన సీతారాములు నేడు ఆ గడ్డిపానుపు మీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారోచూడు.

రాముడు దశరథునికి, ఎన్నో పూజలు వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే పుట్టిన వాడు. అటువంటి రాముడు అడవులకు వెళితో దశరథుడు జీవించగలడా! ఏమో కొద్ది రోజులలో అయోధ్య అనాధ అవుతుందేమో అని భయంగా ఉంది. రాముని కొరకు ఏడ్చి ఏడ్చి అంత:పుర స్త్రీలు అందరూ ఈ పాటికి మౌనం వహించి ఉంటారు. రాముని తల్లి కౌసల్య, దశరథుడు, రాముడు లేడు అనే శోకంతో ఏమయ్యారో అని దిగులుగా ఉంది.

నా తల్లి సుమిత్ర నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ జీవించి ఉంటుందేమో కానీ, ఒక్కగా నొక్క కొడుకును దూరం చేసుకున్న కౌసల్య జీవించి ఉండలేదు. అదే నాకు బాధగా ఉంది. రాముడు లేని అయోధ్య కూడా నిర్జీవము అయిపోయింది. చిన్నప్పటినుండి ప్రాణానికి ప్రాణంగా చూసుకొన్న రాముడు దూరం కాగానే దశరథుని ప్రాణాలు అతని దేహంలో ఉండటం కష్టమే. రాజు మరణించగానే, కౌసల్య ప్రాణత్యాగము చేస్తుంది. కౌసల్య చనిపోగానే నా తల్లి కూడా ఆమెనే అనుసరిస్తుంది. వారి కందరికీ భరతుడు ఉత్తర క్రియలు నిర్వర్తించాలేమో!

మిత్రమా! నేను ఏమేమో ఊహించుకొనుచున్నాను. అవన్నీ నిజం కావేమో. మేము అయోధ్యకు తిరిగి వచ్చువరకూ దశరథుడు మా కోసరం అయోధ్యానగర ముఖద్వారము వద్ద వేచి ఉండి, మమ్ములను సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుపోతాడేమో! మేమందరమూ మా తల్లులతో ఆనందంగా ఉంటామేమో!

మిత్రమా! ఏదైనా జరగ వచ్చు. దేనినీ మనము కాదనలేము కదా!” అంటూ పరిపరివిధముల మాట్లాడుచున్న లక్ష్మణుని మాటలు వింటూ ఉన్న గుహుని కూడా దు:ఖము ఆగలేదు. రామునికి, అయోధ్యకు పట్టిన దుర్గతి తలుచుకుంటూ బాధపడ్డాడు. వారిరువురి దీనాలాపములతో ఆ రాత్రి గడిచి పోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబదిఒకటవ సర్గసంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ద్విపంచాశః సర్గః (52) >>

Balakanda Sarga 45 In Telugu – బాలకాండ పంచచత్వారింశః సర్గః

Balakanda Sarga 45 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచచత్వారింశః సర్గలో రాముడు మరియు లక్ష్మణులు విశాల అనే నగరానికి చేరుకుని చూసినప్పుడు పాల సముద్రాన్ని మథనం చేసిన పురాణం వారికి వివరించబడింది. క్షీరసాగర మథనం నుండి హాలాహల , ప్రాణాంతక విషం అలాగే అమృతం , అమృత అమృతం ఎలా ఉద్భవించాయి మరియు శివుడు విషాన్ని ఎలా కలిగి ఉన్నాడు మరియు విష్ణువు తాబేలుగా తన అవతారంలో మథనానికి ఎలా సహాయం చేసాడో విశ్వామిత్రుడు వివరిస్తాడు.

అమృతోత్పత్తిః

విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః |
విస్మయం పరమం గత్వా విశ్వామిత్రమథాబ్రవీత్ ||

1

అత్యద్భుతమిదం బ్రహ్మన్కథితం పరమం త్వయా |
గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణమ్ ||

2

తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా |
జగామ చింతయానస్య విశ్వామిత్రకథాం శుభామ్ ||

3

తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిమ్ |
ఉవాచ రాఘవో వాక్యం కృతాహ్నికమరిందమః ||

4

గతా భగవతీ రాత్రిః శ్రోతవ్యం పరమం శ్రుతమ్ |
క్షణభూతేవ నౌ రాత్రిః సంవృత్తేయం మహాతపః ||

5

ఇమాం చింతయతః సర్వాం నిఖిలేన కథాం తవ |
తరామ సరితాం శ్రేష్ఠాం పుణ్యాం త్రిపథగాం నదీమ్ ||

6

నౌరేషా హి సుఖాస్తీర్ణా ఋషీణాం పుణ్యకర్మణామ్ |
భగవంతమిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగతా ||

7

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః |
సంతారం కారయామాస సర్షిసంఘః సరాఘవః ||

8

ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా |
గంగాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీమ్ ||

9

తతో మునివరస్తూర్ణం జగామ సహరాఘవః |
విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా ||

10

అథ రామో మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిమ్ |
పప్రచ్ఛ ప్రాంజలిర్భూత్వా విశాలాముత్తమాం పురీమ్ ||

11

కతరో రాజవంశోఽయం విశాలాయాం మహామునే |
శ్రోతుమిచ్ఛామి భద్రం తే పరం కౌతూహలం హి మే ||

12

తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః |
ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనమ్ ||

13

శ్రూయతాం రామ శక్రస్య కథాం కథయతః శుభామ్ |
అస్మిన్దేశే హి యద్వృత్తం తదాపి శృణు రాఘవ ||

14

పూర్వం కృతయుగే రామ దితేః పుత్రా మహాబలాః |
అదితేశ్చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః ||

15

తతస్తేషాం నరవ్యాఘ్ర బుద్ధిరాసీన్మహాత్మనామ్ |
అమరా అజరాశ్చైవ కథం స్యామ నిరామయాః ||

16

తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్మహాత్మనామ్ |
క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై ||

17

తతో నిశ్చిత్య మథనం యోక్త్రం కృత్వా చ వాసుకిమ్ |
మంథానం మందరం కృత్వా మమంథురమితౌజసః ||

18

అథ వర్ష సహస్రేణ యోక్త్రసర్పశిరాంసి చ |
[* అధికపాఠః –
వమంత్యతి విషం తత్ర దదంశుర్దశనైః శిలాః ||

19

ఉత్పపాతాగ్నిసంకాశం హాలాహలమహావిషమ్ |
తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషమ్ ||

20

అథ దేవా మహాదేవం శంకరం శరణార్థినః |
జగ్ముః పశుపతిం రుద్రం త్రాహిత్రాహీతి తుష్టువుః ||

21

ఏవముక్తస్తతో దేవైర్దేవదేవేశ్వరః ప్రభుః |
ప్రాదురాసీత్తతోఽత్రైవ శంఖచక్రధరో హరిః ||

22

ఉవాచైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః |
దైవతైర్మథ్యమానో తు యత్పూర్వం సముపస్థితమ్ ||

23

తత్త్వదీయం సురశ్రేష్ఠ సురాణామగ్రజోసి యత్ |
అగ్రపూజామిమాం మత్వా గృహాణేదం విషం ప్రభో ||

24

ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠస్తత్రైవాంతరధీయత |
దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం తు శార్ఙ్గిణః ||

25

హాలాహలవిషం ఘోరం స జగ్రాహామృతోపమమ్ |
దేవాన్విసృజ్య దేవేశో జగామ భగవాన్హరః ||

26

తతో దేవాసురాః సర్వే మమంథూ రఘునందన |
ప్రవివేశాథ పాతాలం మంథానః పర్వతోఽనఘ ||

27

తతో దేవాః సగంధర్వాస్తుష్టువుర్మధుసూదనమ్ |
త్వం గతిః సర్వభూతానాం విశేషేణ దివౌకసామ్ ||

28

పాలయాస్మాన్మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి |
ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూపమాస్థితః ||

29

పర్వతం పృష్ఠతః కృత్వా శిశ్యే తత్రోదధౌ హరిః |
పర్వతాగ్రం తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః ||

30

దేవానాం మధ్యతః స్థిత్వా మమంథ పురుషోత్తమ |
అథ వర్షసహస్రేణ ఆయుర్వేదమయః పుమాన్ ||

31 [పున]

ఉదతిష్ఠత్స ధర్మాత్మా సదండం సకమండలుః |
*]
పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చసః ||

32

అప్సు నిర్మథనాదేవ రసస్తస్మాద్వరస్త్రియః |
ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసోఽభవన్ ||

33

షష్టిః కోట్యోఽభవంస్తాసామప్సరాణాం సువర్చసామ్ |
అసంఖ్యేయాస్తు కాకుత్స్థ యాస్తాసాం పరిచారికాః ||

34

న తాః స్మ ప్రతిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః |
అప్రతిగ్రహణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః ||

35

వరుణస్య తతః కన్యా వారుణీ రఘునందన |
ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహమ్ ||

36

దితేః పుత్రా న తాం రామ జగృహుర్వరుణాత్మజామ్ |
అదితేస్తు సుతా వీర జగృహుస్తామనిందితామ్ ||

37

అసురాస్తేన దైతేయాః సురాస్తేనాదితేః సుతాః |
హృష్టాః ప్రముదితాశ్చాసన్వారుణీగ్రహణాత్సురాః ||

38

ఉచ్చైఃశ్రవా హయశ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభమ్ |
ఉదతిష్ఠన్నరశ్రేష్ఠ తథైవామృతముత్తమమ్ ||

39

అథ తస్య కృతే రామ మహానాసీత్కులక్షయః |
అదితేస్తు తతః పుత్రా దితేః పుత్రానసూదయన్ ||

40

ఏకతోఽభ్యాగమన్సర్వే హ్యసురా రాక్షసైః సహ |
యుద్ధమాసీన్మహాఘోరం వీర త్రైలోక్యమోహనమ్ ||

41

యదా క్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబలః |
అమృతం సోఽహరత్తూర్ణం మాయామాస్థాయ మోహినీమ్ ||

42

యే గతాఽభిముఖం విష్ణుమక్షయం పురుషోత్తమమ్ |
సంపిష్టాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా ||

43

అదితేరాత్మజా వీరా దితేః పుత్రాన్నిజఘ్నిరే |
తస్మిన్యుద్ధే మహాఘోరే దైతేయాదిత్యయోర్భృశమ్ ||

44

నిహత్య దితిపుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందరః |
శశాస ముదితో లోకాన్సర్షిసంఘాన్సచారణాన్ ||

45

Balakanda Sarga 45 In Telugu Pdf With Meaning

విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యముతో విన్నారు రామ లక్ష్మణులు. ఆ రాత్రి అంతా గంగావతరణము కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు.

మరునాడు పొద్దుటే లేచారు. సంధ్వావందనాది కార్యములు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! మీరు చెప్పిన గంగావతరణము కథ మాకు ఎంతో సంతోషమును ఆశ్చర్యమును కలిగించింది. గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము. మనము ఇప్పుడు ఆ పవిత్ర గంగానదిని దాటాలి కదా. అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమములో ఉన్న మునికుమారులు చేసారు.” అని వినయంగా చెప్పాడు రాముడు.

తరువాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులు అందర గంగానదిని దాటారు. విశాల నగరము చేరుకున్నారు.

ఆ విశాల నగరము చూచి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ రాజవంశమునకు చెందిన వారు? వారి చరిత్ర ఏమిటి?
మాకు వివరించండి.” అని అడిగాడు.

అప్పుడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మునులకు విశాల నగర వృత్తాంతమును చెప్పడం మొదలు పెట్టాడు.

“ ఓ రామా! ఇప్పుడు నీకు ఈ ప్రదేశములో ఏమి జరిగిందో సవిస్తరంగా చెబుతాను విను. కృతయుగములో దితి పుత్రులు, అదితి పుత్రులు ఉండేవారు. వారు మహా బలవంతులు. పరాక్రమ వంతులు. ధార్మికులు కూడా. వారందరికీ ఒక కోరిక కలిగింది. తమకు రోగములు, ముసలి తనము, మరణము, లేకుండా ఉండాలని కోరుకున్నారు. దానికి తగిన ఉపాయము గురించి ఆలోచింప సాగారు.

వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. క్షీర సాగరమును మధించి అమృతమును పొందాలని అనుకున్నారు. దితి పుత్రులు, అదితి పుత్రులు క్షీరసాగరమును మధించాలని నిశ్చయించుకున్నారు. మంథర పర్వతమును పెకలించి తెచ్చి క్షీరసాగరం లో పడవేసారు. వాసుకిని తాడుగా ఆ పర్వతమునకుచుట్టారు. మంథర పర్వతము కవ్వముగా, వాసుకి తాడుగా క్షీరసాగరమును చిలకసాగారు.

ఒక వెయ్యి సంవత్సరములు గడిచాయి. వాసుకి తన తలల నుండి విషాన్ని కక్కడం మొదలెట్టాడు. ఆ విషంలో నుండి హాలా హలము పుట్టింది. ఆ హాలా హలము జగత్తును అంతటినీ దహించసాగింది. దేవతలందరూ ఆ హాలా హలము నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుడిని ప్రార్ధించారు.

ఇంతలో విష్ణు మూర్తి కూడా అక్కడకు వచ్చాడు. మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితో ఇలా అన్నాడు. “ఓ మహా దేవా! నీవు అందరి కన్నా పెద్ద వాడివి. దేవాసురులు క్షీరసాగరం మధిస్తుంటే ముందు హాలా హలము పుట్టింది. అందరి కన్నా పెద్దవాడికి నువ్వు కాబట్టి, ముందు పుట్టిన హాలా హాలమును గ్రహించుటకు నీవే సమర్థుడివి. కాబట్టి పెద్దవాడిగా ఆ హాలా హలమును తీసుకో.” అని అన్నాడు.

తరువాత మహావిష్ణువు అక్కడి నుండి వెళ్లిపోయాడు. మహా శివుడు హాలా హలమును అమృతము మాదిరి తాగాడు. తరువాత శివుడు కూడా వెళ్లిపోయాడు. మరలా దేవతలు అసురులు క్షీరసాగరమును మధించసాగారు.

ఇంతలో మరొక ఉత్పాతము జరిగింది. కింద ఆధారము ఏమీ లేక పోవడంతో, మంధర పర్వతము క్షీరసాగరం అడుక్కు పోసాగింది. అప్పుడు మరలా దేవతలు, అసురులు విష్ణుమూర్తిని ప్రార్థించారు.

” ఓ మహాబాహోూ! సర్వ భూతములకు నీవే దిక్కు. మా మొర ఆలకించి ఈ మంధర పర్వతమును పైకెత్తు. మాకు సాయం చెయ్యి.” అని ప్రార్థించారు.

దేవతల మొరను విన్న విష్ణువు తాను కూర్మ రూపం (తాబేలురూపం) ధరించి ఆ మంధర పర్వతము కింద చేరాడు. మంథర పర్వతము కుంగి పోకుండా ఎత్తి పట్టుకున్నాడు. తరువాత దేవ దానవులు మరలా క్షీరసాగరమును మథించసాగారు.

మరలా వేయి సంవత్సరములు గడిచిపోయాయి. అప్పుడు ధన్వంతరి, అప్సరసలు క్షీరసాగరంలో నుండి పుట్టారు. “ఓ రామా! నీళ్లను మధించగా వచ్చిన రసము నుండి పుట్టిన వారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది. ఆ అప్సరసలు అరవైకోట్ల మంది పుట్టారు. ఆ అప్సరసలను వివాహం చేసుకోడానికి దేవదానవులలో ఎవరూ ముందుకు రాలేదు. అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు.

తరువాత వరుణుని కుమార్తె వారుణి (మద్యమునకు అధిదేవత) తనను ఎవరు పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటకు వచ్చింది. ఆ వారుణిని దితి పుత్రులు స్వీకరించలేదు. అదితి పుత్రులు స్వీకరించారు. ఆ కారణం చేత అనగా వారుణిని (సురను) స్వీకరించకపోవడం చేత దితి పుత్రులు అసురులు అయ్యారు. సురను స్వీకరించడం చేత అదితి పుత్రులు (దేవతలు) సురులు అయ్యారు.

మరలా క్షీర సాగర మథనం జరిగింది. క్షీర సాగరం లోనుండి ఉచ్చైశ్రవము అనే గుర్రము, కౌస్తుభము అనే మణి, దాని తరువాత అమృతము పుట్టాయి.

ఆ అమృతము కోసరము దేవతలు అసురులు యుద్ధము చేసుకున్నారు. అసురులు నాశనం అయ్యారు. ఆ యుద్ధములో అసురులు, దైత్యులు ఒక పక్షం చేరారు. అదితి పుత్రులైన దేవతలు ఒక పక్షం చేరారు. ఆ యుద్ధంలో అందరూ నాశనం అయ్యారు.

తరువాత శ్రీ మహావిష్ణువు మోహినీ రూపంలో అమృతమును హరించుకు పోయాడు. దానితో దానవులకు కోపం వచ్చింది. దానవులు, దైత్యులు అందరూ విష్ణువు తో యుద్ధానికి దిగారు. శ్రీ మహావిష్ణువు వారి నందరినీ సంహరించాడు. దేవతలకు అధిపతి దేవేంద్రుడు. దేవదానవ యుద్ధంలో అసురులను అందరినీ చంపి, దేవేంద్రుడు ముల్లోకములకు అధిపతి అయ్యాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్చత్వారింశః సర్గః (46) >>