Chyavana Maharshi – Jalarulu In Telugu | చ్యవన మహర్షి – జాలరులు

chyavanamaharshi-jalarulu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చ్యవన మహర్షి – జాలరులు నీతికథ.

చ్యవన మహర్షి – జాలరులు

భృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చ్యవనుడు దివ్య తేజోసంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు. ఆ చ్యవనుడి అర్థాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి. వారి సంతానము దధీచి మహర్షి ప్రమతి ఆప్రవానుడు. ఒకసారి గంగాయమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా ౧౨ యేండ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతోబాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కినాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు.

“ఓ జాలరులారా! భయపడకండి. మీరేతప్పూ చేయలేదు. మీ విధినిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి” అని అన్నాడు. చ్యవనుడి ఉదార స్వభావానికి అశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపఱచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు.

జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి “మహానుభావా! ఈ బెస్తలు తెలియక తప్పుచేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయ్యండి” అని అన్నాడు. దయామయుడైన చ్యవనుడు “రాజా! ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడు” అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కానీ చ్యవనుడు అది తనకు సరైన వెలకాదన్నాడు. రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తానన్నా అది తనకు సరైన ధరకాదన్నాడు చ్యవనుడు. నహుషుడు “అయితే అర్ధరాజ్యమిస్తాను” అని అన్నాడు. “నీ మంత్రులతో సంప్రదించి చూడు” అన్నాడు చ్యవనుడు. “ఆలోచించడానికేమున్నది? నా రాజ్యసర్వస్వమూ ఇస్తాను” అని అన్నాడు నహుషుడు! చ్యవనుడు అయినా అది సరిపోదన్నాడు.

ఏమి చేయాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని “గోవు త్రిలోక పూజ్యమైనది. సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెల కట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవునివ్వు”. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని అన్నాడు.

ఆ జాలరులు కూడా సామాన్యులా? ఇలా అనుకున్నారు “ధనధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఒక మంచి పని చేశే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. ఇలా అనుకుని మహర్షి కడకేగి “అయ్యా! బ్రహ్మ తుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి” అని అన్నారు. వాళ్ళ మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకీ మీకూ సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరం కోరుకో మన్నారు. వినయముతో నహుషుడు “స్వామీ! మీరు తృప్తిపొందితే అదే చాలు. నాకింకేదీ అక్కరలేదు” అన్నాడు. అతని వినయవిధేయతలకు ఆనందించి ఇంద్రపదవిని అనుగ్ర హించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచముకూడా కోపించకుండా చ్యవనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు.
  2. జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి. చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్ళారు జాలరులు.
  3. సత్కర్మలు చేశే అవకాశం అరుదుగా వస్తుందని. వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులు.
  4. గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి..
  5. ధర్మపాలనకై తన సర్వస్వమునూ త్యాగం చేయటానికి సిద్ధపడ్డ నహుషుడు మనకు ఆదర్శము కావాలి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Vatapi Jeernam In Telugu – వాతాపి జీర్ణం

Vatapi Jeernam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వాతాపి జీర్ణం నీతికథ.

వాతాపి జీర్ణం

(ఈ కథ ఆరణ్యపర్వంలో ఉంది.)

చాలా రోజులక్రితం మాట.
అగస్త్యుడనే పేరుగల బ్రహ్మచారి ఉండేవారు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వ ప్రాణి కోటినీ దయాహృదయంతో చూసే వాడు.
ఆయన తపోదీక్ష మహామహులెందరికో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతూండగా – పితృ పితామహులు కనిపించి:
‘నాయనా, యోగ్యురాలయిన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు ‘ అన్నారు.
కులవృద్ధుల మాట శిరసావహించి అగస్త్యుడు తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు.
తిరిగి తిరిగి విదర్భదేశం చేరాడు.
ఆరాజుగారి యింట మెరపు తీగెవంటి లావణ్యంతో, నిర్మల సరో వరంలోని నల్ల కలువ వలె పెరుగుతున్న లోపాముదము చూశాడు.
అందచందాలలోనే కాదు వినయగుణ శీలాలలో కూడా ఆమె యోగ్యురాలని గ్రహించాడు.
ఆ మహారాజు అగస్త్య మహర్షి రాగానే ఆయనకు స్వాగతం పలికి, అర్ఘ్యపాద్యాలతో పూజించాడు.

వారి పరిచర్యలకు సంతోషించి ఆ మునిచంద్రుడు :
‘మహారాజా! మా వంశాన్ని ఉద్దరించే ఉత్తమ సంతానం కోసం కుమార్తెను నా భార్యగా కోరుతున్నాము’ అన్నాడు. మహారాజు గుండె దడ దడ లాడింది. మనస్సు ఆందోళనలో పడింది. చీని చీనాంబ రాలతో మణిరత్న భూషణాలతో, హంసతూలికా తల్పాల మీద రాజభవనంలో వందలాది దాసీజనాం సేవలందుకుంటూ ఇంద్రభోగం అనుభవించవలసిన తన కూతురు, ఈ మునీశ్వరుడి భార్యగా వనవాసం చేస్తూ పటకుటీరాలలో నార చీరలు ధరించి, కందమూల ఫలాలు తింటూ జీవించగలదా? అనే సందేహంలో పడ్డాడు.

ఈ వార్త విని మహారాణి విదార సాగరంలో మునిగింది.
అది చూసి లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి :
నా వల్ల మీరు కష్టాలపాలు కానవసరం లేదు. నేను సంతో షంతో ఈ మునీశ్వరుని భార్యగా, ఆయన సేవచేసి వారి అనుగ్రహం పొందుతాము’ అంది.

విధి విహితంగా లోపాముద్రా వరిణయం జరిపించాడు మహారాజు.
లోపాముద్ర తన ఆభరణాలు, చీని చీనాంబరాలు విడిచి నార చీరలతో సామాన్య మునిపత్నీ వేషంతో ఆయన వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతిసేవలో ఆయన హృదయాన్ని చూరగొన్నది.
గంగానదీ తీరాన రమణీయ వనంలో పట కుటీరంలో రాజపుత్రిక వార చీరలతో చలిగాలులూ, వేడిగాడ్పులూ లెక్కచెయ్యకుండా ఎంతో ఓరిమితో సేవలు చెయ్యడం ఆ మునిని ఎంతగానో అలరించింది.
అయినా ఆయన తన ఋషిధర్మాన్ని విడువకుండా వేదవిహిత కర్మలే కొనసాగిస్తున్నాడు. రోజులు సాగిపోతున్నాయి. కాలచక్రం తిరుగుతున్నది.
ఆ విధంగా కొంతకాలం గడిచాక ఒకనాడు లోపాముద్ర ఋతు స్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడయాడు. చుండగా మహర్షి మనస్సు చలించింది.

ఆమెను చేరబిలిచి, చెయ్యిపుచ్చుకుని; బుగ్గ ముద్దాడబోగా ఆమె మందహాసంతో వెనుదిరిగి !
‘స్వామీ! ఆశ్రమ ధర్మాన సారం మనం ఈ పట కుటీరంలో దర్భ శయ్యలమీద జీవితం గడుపుతున్నాం. ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే, నేను మానాన్న గారింట ఏ భోగభాగ్యాలతో ఉండే దానినో అవి సమకూర్చగలిగితే, సుఖంగా ఆ సంతోషం మీకు అందివ్వ గలను’ అని క్షణం ఆగి, మీ వంటి మహా తపస్వికి అవి సమకూర్చడం నిమిషాలలో పని. నా ఋతుకాలం పూర్తి కాకుండా అవి సమకూర్చండి’ అంది.
ఆలోచించాడు, ఆ మునీశ్వరుడు. ఈ సాంసారిక సుఖంకోసం తపశ్శక్తిని వ్యయం చేరడం యిష్టం లేకపోయింది.
ఏ మహారాజు నయినా ఆర్థించాలని బయలుదేరాడు. వెళ్ళి ముగ్గురు మహారాజులను దర్శించి.
‘ఎవరికి కష్టం కలగకుండా మీ ఆదాయంలో నా కెంక దానం చెయ్యగలరు’, అని అడిగాడు.
వారందరూ తమ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నా యన్నారు.
వారి సూచనానుసారం ఇల్వలుడనే దానవరాజు దగ్గర కావలసిన సంపవలన్నీ ఉన్నాయన్నారు. ఆయన ఈ రాజులను వెంటబెట్టుకుని అదే బయలుదేరాడు.
ఈ ఇల్వలుడు వాతాపిసోదరుడు. వారిద్దరూ ఒక అరణ్యంలో ఉంటూ ఆ దారిని వచ్చేవారిని భోజనానికి పిలుస్తారు. వారు రాగానే వాతాపి మేకలా మారిపోతాడు.
ఆ మేకను చంపి వండి పెడతాడు, ఇల్వలుడు. వారు హాయిగా భుజించాక ఇల్వలుడు:
“సోవరా, వాతాపీ’ అని పిలవగానే వాడు పొట్ట చీల్పుకుని బయటపడగానే అన్న దమ్ములిద్దరూ ఆ అతిథిని వండుకు తింటారు.

అది వారి జీవన విధానం.
అగస్త్యుడు తనతో రాజులను వెంటబెట్టుకుని రాగానే వివయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆశ్రమానికి తీసుకు వెళ్ళారు.
వారి ఎదురుగానే మేకను వండిపెట్టబోగా ఆ రాజులు భయంతో మునివైపు చూశారు.
ఆయన వారికి అభయమిచ్చి వండినదంతా ముందు నాకు వడ్డించు. మిగిలితే వారి విషయం చూద్దాం’ అన్నాడు.

సరిగ్గా అదే సమయానికి ఇల్వలుడు –
సోదరా ! వాతాపీ’ అని అరిచాడు.
అదివిని అగస్త్యుడు: ‘ఇంకా ఎక్కడ వాతాపి వాడింక తిరిగి రాడు’, అని నవ్వగా ఇల్వలుడు భయపడి :

‘స్వామిః క్షమించండి’ మీకు నా సర్వ సంపదలూ యిస్తాను, అని తన వద్ద నున్న మణిరత్న సువర్ణ రాసులు రథంమీద ఉంచి ఆయనకు అర్పించాడు.
ఆయన కదలబోతుండగా ఆయనను సంహరించబోగా మహర్షి వెను తిరిగి హుంకరించాడు. ఇల్వలుని దేహం గుప్పెడు బూడిద
మహాముని ఆ సంపదతో ఆశ్రమానికి వచ్చి !
‘ధర్మచారిణీ లోకంలో అందరిలా ఉండే పుత్రులు, అసంఖ్యా
కంగా కావాలా? గుణశీల వంతుడయిన కుమారుడు ఒకడు కావాలా? అని ఆడిగారు.
ఆవిడ గుణవంతు డొకడు చాలునంది.
అనంతరం ఆ దంపతుల సంసార యాత్రా ఫలంగా దృఢదస్యుడనే మహాతపస్వి ప్రభవించాడు.
వాతాపిజీర్ణం జీర్ణం జీర్ణం వాతాపితీర్థం అనే నానుడి ఈ కథ వల్ల పుట్టింది. ఇది భోజనానంతరం ఉచ్చరిస్తే తిన్నది బాగ జీర్ణమవుతుందని పెద్ద అంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Kakabhusundi Purvajanma Vrttantamu In Telugu – కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము

Kakabhusundi Purvajanma Vrttantamu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీతులసీదాస కృత రామచరితమానసము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము నీతికథ.

కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము

నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించెను. శ్రీరాముని మాయావశుడైన గరుడుడు ఇలా ఆలోచించసాగెను “సర్వవ్యాపకుడు నిర్వికారుడు వాగాధిపతి మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించెనని విన్నాను. శ్రీరామ నామమును జపించినంత మాత్రముననే మానవులు భవబంధవిముక్తులు అగుదురనీ విన్నాను. కానీ అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాశముచే బంధింపబడుట ఏమి”? ఇలా మాయామోహితుడై వ్యాకులచిత్తుడైన గరుడుడు బ్రహ్మర్షి అగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపఱచి కాపాడమని ప్రార్థించెను.

నారదుడు గరుడుని సందేహనివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికడకు పంపెను. తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు “ఓ విహగేశ్వరా! పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎఱుగును. కావున నీవు ఆ శంకరునే శరణువేడుము”. కుబేరుని కడకు వెళుతున్న మహాదేవుని కలిసి గరుడుడు తన సందేహమును చెప్పెను. “ఓ పక్షీంద్రా! ఎంతో కాలము సజ్జనుల సేవను చేసిగానీ జ్ఞానమును పొందలేము. నిన్ను నిరంతర రామకథాప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుశుండి ఆశ్రమమునకు పంపెదను” అని పార్వతీనాథుడు ఆనతిచ్చెను.

వేయి మందిలో ఒక్కడే ధర్మపథమును సర్వకాల సర్వావస్థలయందూ అనుసరించును. అట్టి కోటి ధర్మాత్ములలో ఒక్కడు పేరాశకు లోనుకాక విరాగి వలె ఉండును. అట్టి కోటి విరాగులలో ఒక్కడు జ్ఞాని అగును. అలాంటి జ్ఞానులలో కోటికొక్కడే జీవన్ముక్తుడగును. అట్టి వేయిమంది జీవన్ముక్తులలో అరుదుగా ఒక్కడు బ్రహ్మైక్యమును పొందును. అలా బ్రహ్మైక్యమును పొందినవారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణ ముగా మాయావిముక్తుడై శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును. అట్టి దుర్లభమైన నిష్కల్మష రామభక్తి ఉన్న కాకభుశుండి కడకు గరుడుడు వచ్చెను. వచ్చిన గరుడుని తగిన రీతిలో గౌరవించి కుశలమడిగి సముచిత ఆసనముపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలగు ఎన్నెన్నో అతిరహస్యములైన తత్త్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకభుశుండి.

“పూర్వము ఒకానొక కల్పములో కలియుగము ఆరంభమైనది. కలికాలము మిక్కిలి కలుషితమైనది. స్త్రీ పురుషులందఱూ పాపకర్మనిరతులై వేదవిరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలము కలిగియూ కల్పాంతములు దాటే గర్వము దంభము అహంకారమును కలిగియుందురు. పాషండులు తమవిపరీత బుద్ధులతో క్రొత్తక్రొత్త సాంప్రదాయాలను ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు. ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందురు. ఒక వైపు బ్రహ్మజ్ఞానము గూర్చి మాట్లాడుతూ మఱోక వైపు లోభముచే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు. తాము స్వయముగా భష్టమగుటే కాక సన్మార్గమున నడచువారినికూడా భృష్ణుపఱచెదరు. వర్ణాశ్రమధర్మాలు అడుగంటుతాయి. ప్రజలలో సామరస్యం సమైక్యభావం నశిస్తుంది. నిష్కారణ వైరములతో కక్షలతో ఉండెదరు. వేదశాస్త్ర పురాణములను గౌరవించరు. కుతర్కములతో వేదశాస్త్రపురాణ నిందచేసి అనంతపాపరాశిని సొంతం చేసుకుంటారు.

పూజలు దానధర్మాలు స్వార్థబుద్ధితో తామసముతో చేసెదరు. విద్యను అన్నమును అమ్ముకొనెదరు. ధనవంతులకే గౌరవమివ్వబడును. గురుశిష్య భార్యభర్త మాతాపితభ్రాత అను సంబధములకు విలులేకుండును. ఆడంబరముగా జీవించుచూ వేదమార్గమును త్యజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకమూ కపటత్వముతో నిండియున్న వారు గురువులై అధర్మబోధలు చేశాదరు. అమంగళకరమైన వేషభూషణాదులను ధరించి శిరోజములను విరియబోసుకొనెదరు. తినదగినది తినగూడనిది అను విచక్షణ తినుటకు సమయం అసమయం అను విచక్షణ చేయక అన్నింటిని అన్ని వేళలా తినెదరు. అలా పాపకూపములో పడి ఇహములో పరములో బహు క్లేశాలను అనుభవించెదరు.

కానీ ఈ కలియుగమున ఒక గొప్పగుణము కలదు. “కలౌ సంకీర్తనాన్ముక్తిః” యొగ యజ్ఞ పూజాదులకు ఆస్కారములేని ఈ యుగములో భగన్నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు. ఓ పన్నగాసనా! ఇంద్రజాలికుడు ప్రదర్శించుమాయ చూచువారిపైనే ప్రభావమును చూపును. కానీ అతనిసేవకులను అది ఏమీ చేయదు. అట్లే మాయకు మూలమైన భగంపంతుని శరణుజొచ్చిన వానికి ఆ అనూహ్యమైన మాయ అంటదు.

అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్యానగరములో ఒక శూద్రునిగా జన్మించినాను. మనోవాక్కర్మలచే నేను అఖండ శివభక్తుడను. కానీ నా బుద్ధిమాన్యముచే ఇతరదేవతలను దూషించుచుండెడి వాడను. అతిగర్వముతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కఱవు వచ్చింది. దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయినీ నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమ శివుని ఆరాధన కొనసాగించితిని. ఒక్కడ అతిదయాళువు నీతిమంతుడు పరమసాధువైన ఒక విప్రోత్తముడు వైదిక పద్ధితిలో అహర్నిశలూ శివుని ఏకాగ్రచిత్తముతో నిష్కల్మషముగా పూజించుచుండెను. అతడు ఎన్నడునూ విష్ణు నింద చేయలేదు.

కపటబుద్ధితో నేనతనికి సేవ చేయుచుండెడివాడను. ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యముతో చూచుచూ బోధించుచుండెను. శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నాకతడు బోధించెను. నేను ప్రతి దినమూ దేవాలయమునకు పోయి శివనామస్మరణము చేసెడివాడను కానీ నా అహంకారమును నేను విడువలేదు. హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించెడివాడను.

నా గురువు నా ప్రవర్తన చూసి చాల బాధపడి నిత్యమూ ఎన్నో సదుపదేశములిచ్చెడివాడు. ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచూ నాలోని కోపాగ్నిని ప్రజ్వలింప చేయుచూ జీవించుచుంటిని. ఇలా ఉండగా ఒక రోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వము బోధించి “పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మ శివుడు నమస్కరించెదరు. అట్టిది నీవు ద్వేషించుట తగదు” అని అనెను. అది వినడంతో నా కోపాగ్ని మింటికెగసెను. అనర్హుడనైన నాకు విద్యనొసగిన నా గురువునకే ద్రోహము తలపెట్టాను. అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రమూ కోపపడలేదు.

ఒక రోజు నేను శివాలయములో శివనామము జపించుచుండగా నా గురూత్తముడు అచటికి వచ్చెను. నా గర్వము వలన లేచి ఆయనకు నమస్కరించలేదు. దయానిధి అయిన నా గురువుకు నా దౌష్ట్యము చూచియు కొంచెముకూడా కోపమురాలేదు! కాని గురువును నిరాదరించుట మహాపాపము. పరమశివుడు ఇది చూసి సహింపలేక “ఓరీ మూర్ఖుడా! పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించినావు. నీవు క్షమార్హుడవు కాదు. సద్గురువుపై ఈర్షగొన్నవాడు కోట్లాది యుగములు రౌరవాది నరకములలో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపై వేలకొలది జన్మలు క్లేశములభవించును. నీ విప్పుడే అజగరముపై ఒక చెట్టుతొఱ్ఱలో పడివుండు” అని నన్ను శపించెను. భయకంపితుడనైన నన్ను చూసి నా గురువర్యుడు రుద్రాష్టకముతో శివుని ప్రసన్నుని చేసుకుని పశ్చాత్తాపముతో దుఃఖిస్తున్న నాకు శాపావశానము ప్రసాదించమని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు

“ఓ కృపానిధీ! మహాపకారికైనా మహోపకారము చేయు నిన్ను మెచ్చితిని. నీ శిష్యునికి శాపావశానమిచ్చెద” అని నన్ను చూసి “చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. నీవు దుర్భరమైన వేయి జన్మలెత్తుతావు. కానీ నీ గురువు మహిమవల్ల దివ్యమైన అయోధ్యానగరమున పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది. ప్రతి జన్మలో నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వత్సా! ఇంకెప్పుడూ సాధుసజ్జనవిపులను నిరాదరింపవద్దు.

ఇంద్రుని వజ్రాయుధముతో నాత్రిశూలముతో యముని దండముతో శ్రీహరి చక్రముతో చంపబడనివాడు సజ్జనద్రోహమనెడి అగ్నిలో పడి మాడిపోతాడు” అని చెప్పి నాపై కృపావర్షం కురిపించినాడు ఉమానాథుడు. అప్పటినుంచీ ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మఱువక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమశ మహర్షి వద్ద శ్రీరామచరితమానసము విని కాకభుశుండినై శ్రీరామునికి ప్రియుడనైనాను”.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. గురుద్రోహం శివకేశవులను భేదబుద్ధితో చూడడం సాధుసజ్జనులను అవమానించడం ఘోరపాపములని మహాశివుడు కాకభుశుండి తో చెప్పాడు. కావున మనము గర్వముతో ఇట్టి తప్పులెన్నడునూ చేయరాదు.
  2. కాకభుశుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి. శిష్యుడెన్ని అవమానాలుచేసినా తను చెప్పిన హితవాక్యాలను పెడచెవిన పెట్టినా ఏ మాత్రమూ కోపగించుకోలేదు.
  3. రామభక్తుడైన కాకభుశుండి కలియుగ వర్ణనము వలన మనకు చేయకూడనివి ఎన్నో తెలిసినాయి. ఇట్టి దుష్కృతాలకు దూరముగా ఉండి ధర్మమార్గములో నడచుచూ నిత్యం భగవన్నామస్మరణ చేయడమే మన కర్తవ్యము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Annadana Mahima Goppadi In Telugu – అన్నదాన మహిమ గొప్పది

Annadana Mahima Goppadi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అన్నదాన మహిమ గొప్పది నీతికథ.

అన్నదాన మహిమ గొప్పది

(ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనునిచే జనమేజయునికి చెప్పబడింది.)

ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షోహిణులసేనలో కురుపక్షంలో అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులయిదుగురు, కృష్ణుడూ, సాత్యకీ మిగిలారు.

ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్యమీద ఉన్న భీష్మపితామహుడు సర్వధర్మవిషయాలూ బోధించి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించగానే యోగమార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులూ అందరూ మరణిం చారనే బాధ ధర్మరాజు మనస్సుని వికలంచేస్తూనే ఉంది. ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించ మని విద్వాంసులు సలహా యిచ్చారు.

వారి ఆదేశానుసారం అశ్వమేధయాగం ఆరంభించాడు. దేశ దేశాలనుంచి చక్రవర్తులూ, విద్వాంసులూ ఎందరో వచ్చారు. వివిధ నగరాలనుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిల కించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతోపాటు నిర్విరామంగా అన్న దానం గూడా జరిపించాడు. యోగ్యులై నవారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు. అక్కడకు వచ్చినవారిలో సంతృప్తిపడకుండా ఉన్నవాడు ఒకడూ లేడు. అలా సర్వజన సంతృ ప్తికలిగించిన అశ్వమేధయాగం చూచిన దేవ తలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు.

అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిన వచ్చింది. వారందరూ ఈ శాలలోకి ముంగిన ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యంతో చూస్తున్నారు.

అప్పుడా ముంగిస నవ్వుతూ ‘దేవతలు కూడా అభినందించే యాగమా యిది’ అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒకభాగం బంగారు కాంతులీనుతోంది. రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది.

‘సక్తుప్రస్థుడి ధర్మ బుద్ధితో పోలిస్తే యీ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం’? అంది.

అందరూ తెల్లబోయారు. దానినిచూస్తూ : ‘ఎవరా మహనీయుడు । ఏవిటాయన కథ’ అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా : ‘సావధానంగా వినండి’ అని ఇలా చెప్పింది ముంగిస.

‘ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలాకాలం క్రితం సత్తు ప్రస్థుడనే పేరుగల గృహయజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారు డుండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయింది. వారు నలుగురూ సర్వభూత కోటిని దయతోచూస్తూ, కామ క్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకూ, కోడలూ ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవ్వరికీ హానిచేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికినదాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు.

పరబ్రహ్మమీదనే మనస్సునిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితంకూడా వరమేశ్వరధ్యానానికే అర్పించేవారు.
అలా ఉండగా ఒకనాడు :
వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి, అక్కడ రాలిన ధాన్యపుగింజలు ఏరి తెచ్చుకుని, దంచి, పండిచేసి, వండుకుని నలుగురూ సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో, ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయనకళ్ళు లోతుకు పోయాయి. ఎముకలు బయట పడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి, ఆకలి అని నీరసంగా అడిగాడు.

ఆయనను ఆదరంగా తీసుకునివచ్చి, తన పక్క కూర్చో పెట్టుకుని ఆర్యా ! తమరు కుశలమే కవ! మా ఆతిథ్యం స్వీకరించి, అనుగ్ర హించండి. ఏ ప్రాణికీ హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేంతెచ్చుకున్న ధాన్యపుగింజల పిండితో వండిన ఆహారం యిది. దీనితో మీ ఆకలిబాధ నివారించుకోండి అని గృహయజమాని తపభాగం ఆయ ఐకు వడ్డించాడు.

అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే ఆయనభార్య తనభాగం యిచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలిబాధ తీరలేదని తెలిసి కొడుకూ, కోడలూ కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి, ఆయన ఆనందంతో ‘నాయనా మీ అతిథిసత్కారం, అన్నదానం నాకు తృప్తి కలి గించాయి. నీతోపాటు నీకుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధ పడుతూకూడా మీరు తినబోయే ఆహారం దానంచేసి, పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి.

ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడి గడతాడు. అన్నంకోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు దయగలగుండె కలవారే ఆశకు దూరం అవుతారు. ఈ రెండూవున్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి యింత అన్నం పెట్టడంకంటే ఏ దానమూ గొప్పదికాదు. అటువంటి అన్న దానం చేసిన పుణ్యాత్ములు మీరు ‘ అంటూండగా దేవవిమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు.

ఇదంతా వింటూ చూసిననేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంత ములో ఆ అతిథిపాదాలు కడిగినచోట తిరిగాను. తిరిగినప్రక్క ఆ పాదాలు కడిగిన నీటితడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారు మయమయింది.
అనంతరం ఎన్నెన్నో దాన, ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండపప్రక్క దేహం యిలానే ఉండిపోయింది. ఇక్కడకూడా అంతే. నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగివ.

మరిన్ని నీతికథలు మీకోసం:

Dharmavarulanu Varabhavincha Vaddu In Telugu – ధర్మవరులను వరాభవించ వద్దు

Dharmavarulanu Varabhavincha Vaddu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మవరులను వరాభవించ వద్దు నీతికథ.

ధర్మవరులను రాభవించ వద్దు

(ఈ కథ అరణ్యపర్వంలో ఉంది)

పాండవులు జూదంలో ఓడిపోయి, అడవులకు వచ్చారు. వారితో పాటు ఎందరో వేదవిదులు కూడా అనుపరించి రాగా, వీరందరి పోషణ భారం ఎలా నిర్వహించగలనా అని ధర్మరాజు విచారంలో మునిగాడు.

అప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుడు:

‘ధర్మనందనా ! రాజవంశీయుడు తనను ఆశ్రయించిన వారికి అన్నపానాలు సమకూర్చి వారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. మీ ప్రాచీను అందరూ ఈ ధర్మ నిర్వహణ సాగించారు. తపస్సుతో, యోగశక్తితో వారు తమ ప్రజలకు ఈ రక్షణ సాగించారు.

అంతకంటే ముఖ్యాంశం ఉంది :

ఈ సృష్టి ప్రారంభం వేళ జీవకోటి అంతా ఆకలి బాధతో కటకట లాడుతుంటే అది చూసిన సూర్యభగవానుడు తాము ఉత్తరంగా వయ నించి భూమిలోని సారాన్ని గ్రహించి, అనంతరం దక్షిణంగా తిరుగుతూ ఆ సారాన్ని మళ్ళీ భూమికి అందిచ్చేవాడు. అదే సమయంలో చంద్రుడు మేఘ రూపంలో ఉన్న సూర్యతేజస్సును వర్షంగా మార్పి, ఆ జలధార లతో ఓషధులను అందించేవాడు. ఆ ఓషధులలోని ఆరు రసాలూ షడ్రు చులుగా జీవకోటికి ఆహారం ఆయాయి.

అంటే సర్వ జీవకోటికి వెలుగునిచ్చే సూర్యుడే అన్న దాత. ఆయ నను ప్రార్థించి నీ కోరిక నెరవేర్చుకో ‘ అన్నాడు.

పురోహితులు ఆదేశమపారం ధర్మరాజు అరుణోదయానికి లేచి గంగాతీరానికి వెళ్లి స్నానం చేసి పవిత్ర హృదయంతో సూర్యుని ఆరాధించాడు.
ఆ నిర్మల హృదయుని తపోదీక్షకు సంతోషించి మార్యుడు ప్రస మడై వాని కోరిక ప్రకారం ఒక శామ్ పాత్ర యిచ్చి:

‘ధర్మనందనా! ఇది అక్షయ పాత్ర. ఎండరి కయినా ఇది అన్న పానాలు సమకూరుస్తుంది. అయితే, నీ భార్య పాంచాలి భోజనం చేసి, ఈ పాత్రను పరిశుద్ధం చేసిన అనంతరం ఆ పూటకు మరి భోజనం రాదు. అంటే అతిథి పూజలు పూర్తి చేసే వరకూ, ఆవిడ భుజించదు కదా! అందు చేత నీ కోరిక తీరింది. ఇది తీసుకు వెళ్లు’ అన్నాడు.

అపరిమితానందంతో ధర్మరాజు తిరిగి వచ్చి, ఆనాటి నుండి తనతో వచ్చిన వారికే కాక, అతిథి అభ్యాగతులకు కూడా అన్నదానం చేసి కీర్తి పొందుతున్నాడు.

ఈ కబురు విన్నాడు దుర్యోధనుడు.

ఆ సమయానికే అక్కడకు చేరిన దుర్వాసమహర్షిని ఆరాధించి పాండవులను ఏ విధంగా నయినా పరాభవించాలని కోరాడు.

దుర్వాస మునీంద్రుడు అంగీకరించి బయలుదేరి వచ్చాడు.
విషయం తెలిసిన వాడు కనుక పాండవులూ, పాంచాలీ కూడా భోజనం చేశాక వారిని చేరి, కుశల ప్రశ్నలు ముగించి

‘నా శిష్యులతో పాటు నాకు ఆతిథ్యం యివ్వాలి అన్నాడు.
ధర్మరాజు సంతోషంతో ఆ వార్త పాంచాలికి చెప్పాడు.
వంట యిల్లు కడుగుతున్న ఆ ఇల్లాలి గుండె గతుక్కుమంది,

‘ నదీస్నానం చేసి రాగలం. ఈ లోపున సర్వం సన్నద్ధం కావాలి ‘ అని పలికి మునీంద్రుడు వెళ్ళాడు.

రాజనందన రెండు చేతులూ జోడించి వాసుదేవుని ప్రార్థించింది. నిర్మల చి త్తంతో ఆమె ధ్యానించే వారికి దీనజన శరణ్యు డైన వాసుదేవుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై

‘ అమ్మాయీ ! ఈ నాటి శాక పాఠాలలో ఏ లేశమైనా ఉంటే నా చేతిలో వెయ్యి’ అన్నాడు.
‘అక్షయ పాత్ర కూడా శుద్ధి చేశాను. కృష్ణా: ఎందుకీ పరీక్ష ! ‘ అంది.

‘కాదమ్మా ! నా మాట విని ఒక్క మారు ఆ పాత్రలోకి చూడు, అన్నాడు.

ఆయన మాట కాదనలేక, అక్షయ పాత్రలో చెయ్యి పెట్టింది.

దాని అంచున ఒక అవిశ ఆకు దొరికింది. అది తీసి కృష్ణుని చేతిలోన దానిని నోట ఉంచుకొని :

‘ముల్లోకాలకూ తృప్తి!’ అని వెళ్ళిపోయాడు.
ద్రుపద రాజనందన అతిథుల కోసం ఎదురు చూస్తున్నది. ఎంత సేపయినా వారు రావడం లేదని భీముని పంపారు.

ఇక్కడ వాసుదేవుడు ‘ముల్లోకాలకూ తృప్తి’ అన్న క్షణంలో దుర్వాసునికి, ఆయన శిష్యులకూ, కడుపు నిండుగా భుజించిన ఆయాసం కలిగి వారు ఆటే వెళ్ళిపోయారు.

నదీ తీరానికి వచ్చిన భీమునికి అక్కడి మునులు:
“నాయనా! దుర్వాసుల వారు శిష్య సమేతం స్నానం చేస్తూనే సుష్టుగా భుజించిన తృప్తితో తేస్బుకుంటూ వెళ్ళిపోయారు’ అని చెప్పారు.

భీముడు తిరిగి వచ్చి ఆ వార్త చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు.
(‘ ధర్మపరులను పరాభవించడానికి ప్రయత్నిస్తే ధర్మ రక్షకుడు వారినే పరాభవం పాలుచేస్తాడు, అని మాతుడు భారతకథను వివి పించాడు.)

మరిన్ని నీతికథలు మీకోసం:

Brahmaraksasuni Vimukti In Telugu – బ్రహ్మరాక్షసుని విముక్తి

Brahmaraksasuni Vimukti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… బ్రహ్మరాక్షసుని విముక్తి నీతికథ.

బ్రహ్మరాక్షసుని విముక్తి

అది దండకారణ్యమ్. మహా దట్టమైన అడవీ ప్రాంతమ్. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టంగా వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి. ఆ భీకరారణ్యంలో ఓ మఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగా వచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “ఓ వ్యాఘేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?

“పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్భాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రేయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది” అని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “జంతు వై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాం” అని పులి అన్నది.

సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు “ఒక ౧౦౦ వర హాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. ఆ రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. “రాజకుమారిని పెళ్ళాడాలి” అన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా “ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చాను” అన్నాడు బాటసారి.

“ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో “అవును. నీకెలా తెలుసు” అని అన్నాడు బాటసారి. “అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది ౫ం రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. “వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకో” అన్నాడు బాటసారి.

ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై “మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రా” అంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. దుష్కర్మలెన్నడునూ చేయరాదు. నేర్చిన విద్య యొక్క సారమును ఎవ్వరికీ పంచకుండా బ్రహ్మరాక్షసుడు సద్గురు దూషణ వలన శిష్యుని కి దుఃఖములు తప్పలేదు.
  2. పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకు తెలిపింది. కేవలం పరోపకారం ఒక్కటే తమని కాపాడగలదని తెలిసి బ్రహ్మరాక్షసుడు పులి ధృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలచినారు.
  3. దేశద్రోహం చాలా పాపకార్యం. అట్టి దేశద్రోహిని సంహరించి బ్రహ్మరాక్షసుడు ఊరికి ఉపకారం చేశాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Durasa Dukhamulaku Chetu In Telugu – దురాశ దుఃఖములకు చేటు

Durasa Dukhamulaku Chetu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీరామచరిత మానసము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దురాశ దుఃఖములకు చేటు నీతికథ.

దురాశ దుఃఖములకు చేటు

కైకయ రాజైన ప్రతాపభానుడు సద్గుణసంపన్నుడు మరియు గొప్పయోధుడు. అతని ప్రియసోదరుడు అరిమర్దనుడు. అరి మర్దనుడు మహాబలశాలి వీరుడు. ప్రతాపభానుని మంత్రి ధర్మరుచి. అతడు నీతజ్ఞుడు బుద్ధిమంతుడు రాజనీతిలో శుక్రుని తోటివాడు శ్రీహరి భక్తుడు రాజుకు హితైషి. దిగ్విజయయాత్రలో ఆ రాజు సప్తద్వీపాలనూ జయించి సమస్త భూమండలమునకు ఏకైకచక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి ప్రభావమువలన ఆ రాజు గురువులను దేవతలను సాధుసజ్జనులను పితరులను భూసురులను భక్తివిశ్వాసాలతో సేవించుచుండెడివాడు. రాజధర్మములను వేదోక్తముగా పాటిస్తూ నిత్యమూ అనేక దానధర్మాలు చేసేవాడు. పురాణేతిహాసములను భక్తిశ్రద్ధలతో వినేవాడు. ఎన్నో బావులు చెఱువులు ఉద్యానవనాలు దేవతా మందిరాలు కట్టించి ప్రజారంజకముగా రాజ్యపాలన చేసేవాడు.

వనాలలో ఆశ్రమములను నిర్మించుకొన్న మహర్షులు తమ తపశ్శక్తిలో ఆఱవభాగము రాజులకు ధారపోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధ ముగా రాజ్యపాలన చేయుచుందురు. కావున లోకహితైషులైన మహర్షులను క్రూరమృగములనుండి కాపాడంటం రాజుల విధి. ఒకసారి ప్రతాపభానుడు వింధ్యాటవికి శాస్త్రప్రకారము చంపదగిన మృగములను వేటాడుటకై వెళ్ళెను. ఆ సుందరారణ్యములో ఒక పెద్ద అడవిపందిని చూసి దానివెంటబడ్డాడు రాజు. ఆ వనవరాహము ఎంత ప్రయత్నించినా తనకి చిక్కలేదు. ఎంతో దూరం పరుగెత్తి ప్రవేశించుటకే దుర్గమమైన ఘనారణ్యములోకి వెళ్ళిపోయింది ఆ వరాహము. ధీరుడైన ప్రతాపభానుడు తనప్రయత్నం మానక ఆ దట్టమైన అడివిలోకి ఏకాకిగా ప్రవేశించాడు. చివరికి ఆ వరాహం ఒక గుహలోకి దూరింది. గుహలోకి వెళ్ళుటకు వీలులేక నిరాశతో ప్రతాపభానుడు వెనుకకు మఱలాడు. కాని ఆ ఘోరారణ్యములో దారితప్పిపోయాడు.

ఆ వనములో తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని నిర్మానుష్యమైన అడవిలో ఒక ఆశ్రమాన్ని కనుగొన్నాడు. ఆ ఆశ్రమము ఒక కపటసన్యాసిది. ఆ కపటవేషధారి పూర్వం ప్రతాపభానునిచే యుద్ధములో ఓడిపోయి పాఱిపోయిన శత్రురాజు. హృదయములో ప్రతాపభానునిపై ద్వేషమును నింపుకొని ఆ అడవిలో ఉంటున్నాడు. ప్రతాపభానుని చూడగానే అతనిని గుర్తు పట్టాడు. కానీ అలసిపోయి ఉన్న ప్రతాపభానుడు వాడిని గుర్తించలేదు! దాహముతో బాధపడుతున్న రాజుకు ఒక సరోవరం చూపించాడు. ప్రతాపభానుడు సరోవరములో స్నానముచేసి శుచి అయ్యి నీరు త్రాగినాడు. ప్రతాపభానుని ఆశ్రమములోపలికి ఆహ్వానించాడు ఆ కుహనాసన్యాసి.

“నాయనా! నీవెవఱు? ప్రాణాలకు తెగించి ఈ ఘోరాటవిలోకి ఎందులకు వచ్చావు”? అని అడిగినాడు కపటసన్యాసి. రాజనీతి తెలిసిన ప్రతాపభానుడిలా సమాధానమిచ్చినాడు “ఓ మహాత్మా! మీ సహాయమునకు కృతజ్ఞుడను. నేను ప్రతాపభానుడనే రాజు యొక్క మంత్రిని. వేటకై వచ్చి తప్పిపోయాను. నీ దర్శభాగ్యము కలుగుట నా అదృష్టము”. “ఓ సజ్జనుడా! బాగా చీకటి పడినది. నీ రాజ్యము ఇక్కడికి డెబ్బది యోజనములున్నది. కావున నీవు ఈ రాత్రికి నా ఆశ్రమములో విశ్రాంతి తీసుకుని తేపు వెళ్ళు” అని చెప్పాడు ఆ కపటుడు. సన్యాసి దయాగుణాలను ఎన్నో విధాల పొగిడి ఆ రాత్రికి అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు రాజు.

మాయమాటలతో రాజును తనను నమ్మేలా చేసి ఈర్షాగ్నితో కాలిపోతున్న ఆ కపట సన్యాసి నిర్మలుడైన ప్రతాపభానుడు ఆర్థించుటచే తన వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు “సోదరా! వినుము. నేనిచట చాలా కాలముగా ఉంటున్నాను. ఇంతవఱకూ నా వద్దకు ఎవరూ రాలేదు. నా గురించి నేనెవరికీ చెప్పుకోలేదు. లోపప్రతిష్ఠ తపస్సును దగ్ధముచేసే అగ్నివంటిది కాదా! అందుకనే ప్రపంచానికి దూరముగా ఉంటున్నాను. శ్రీహరితో తప్ప నాకింకెవరితోను పనిలేదు”. వైరాగ్యబుద్ధి కలిగి శ్రీహరిభక్తుడై ఉన్నాడని తెలియగానే ప్రతాపభానునికి ఆ బకధ్యానిమీద గౌరవం పెరిగిపోయింది. ప్రతాపభానుడు పూర్తిగా తన వశుడైనాడని తెలుసుకొని “పుత్రా! నా పేరు ఏకతనుడు.

సృష్టిప్రారంభములో నేను జన్మించాను. తరువాత మఱియొక దేహము దాల్చలేదు అందుకే నన్ను ఏకతనుడంటారు”. ఆశ్చర్యముగా వింటున్న ప్రతాపభానునికి అప్పుడు కపట సన్యాసి ఎన్నో ప్రాచీనగాథలు పురాణేతిహాసములు సృష్టిస్థితిలయములను గూర్చిన వింత వింత కథలెన్నో చెప్పాడు. జ్ఞానవైరాగ్యాల మీద వ్యాఖ్యానాలిచ్చాడు. ఇవన్నీ విని పరవశుడై రాజు “స్వామీ! నేను ప్రతాపభానుడను” అని చెప్పాడు. “రాజా! గురుకృపవల్ల నాకు అంతా తెలుసు. మీ తండ్రి పేరు సత్యకేతువు. నీ రాజనీతి మెచ్చుకుంటున్నాను. తెలియని వానితో పేరు చెప్పిన రాజ్యమునకే అపాయము అని తెలిసి నీవు ఇందాక నీ పేరు చెప్పలేదు. నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకొక వరమిస్తాను కోరుకో” అని అన్నాడు ఆ కపటసన్యాసి.

సద్గుణ సంపన్నుడైనా ప్రతాపభానునకు ఒక తీరనికోరిక ఉండేది. దురాశ అనే హాలాహలముచే బాధింపబడుతున్న ఆ రాజు ఇలా కోరాడు “ఓ దయాసాగరా! నా శరీరము జరామరణదుఃఖ రహితమగుగాక. యుద్ధములో నన్నెవరూ జయింపకుండు కాక. భూమిపై నూఱుకల్పములు నా ఏకచ్ఛత్రాధిపత్యము నిలిచియుండుగాక”. ధర్మరుచి ప్రభావము వలన తాను చేసే కర్మ అంతా శ్రీహరికి అర్పించి “సర్వం కృష్ణార్పణమ్” అని అంటున్నా ప్రతాపభానుడు ఆ సూక్తిలోని ఆంతర్యమును అర్థంచేసుకోలేదు. పూర్వం హరణ్యకసిపుడు కోరిన వరము వెలెనున్న ఈ దురాశాభూయిష్టమైన వరమును కోరినాడు. నిజమైన సన్యాసి అయితే ఈ కోరిక విని “నాయనా! ఈ శరీరము శాశ్వతము కాదు.

ఎందులకు దీనిమీద ఇంత మక్కువ? భగవద్భక్తి ఒక్కటే శాశ్వతము శ్రీహరిని శరణు వేడు” అని హితవు చెప్పేవాడు. కానీ కపటుడగుటచే ఆ సన్యాసి “తథాస్తు. నిన్ను సర్వప్రాణులనుండి కాపాడతాను. నా ప్రభావం వల్ల యముడు కూడా నీ దగ్గరకు రాలేడు. కానీ ఒక్క విప్రశాపం నుండి నేను నిన్ను రక్షించలేను” అని అన్నాడు. “గురూత్తమా! విపులను ప్రసన్నము చేసుకునే ఉపాయము దయతో నాకు నెలవీయ్యండి” అని ప్రార్థించాడు రాజు. “సరే. కానీ నీవీ విషయము చాలా రహస్యముగా ఉంచాలి. నన్ను కలుసుకున్నట్టు ఎవరితో నైనా చెపితే నీకు బహుదుఃఖములు కలుగుతాయి. నీ మంచి కోరే చెపుతున్నాను. మూడోకంటికి ఈ విషయము తెలిసిందా నీవు నశిస్తావు” అని అన్నాడు సన్యాసి.

“గురువర్య! త్రిమూర్తులు కోపగించినా గురు రక్షిస్తాడు కానీ గురువే కోపిస్తే రక్షించేవాడుండడు. మీ ఆజ్ఞ అతిక్రమించను. ఆజ్ఞ ఇప్పండి. శిరసావహిస్తాను” అని అన్నాడు ప్రతాపభానుడు. ఆహా! ఆశ ఎంత దారుణమైనది! ఇన్ని ఏండ్లుగా విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారాన్ని ప్రసాదించిన తన నిజగురువును ఒక్క నిమిషములో వదిలేసి కపట సన్యాసి గురించి ఏమీ తెలియకుండానే వాడిని నమ్మి “గురూత్తమా!” అని సంబోధించేలా చేసింది. అప్పుడు ఆ బకధ్యాని “విపులను స్వాధీనపఱచుటకు అనేక మార్గములు కలవు. నీకు అన్నిటికన్నా సులభ మార్గము చెప్పెదను. ఒక సంవత్సరముపాటూ ప్రతిరోజు లక్షమంది ఉత్తములైన విపులను కుటుంబసహితముగా అహ్వానించు. నేను నా తపశ్శక్తిచే మీ పురోహితుని వేషముదాల్చి వారికి వండిపెట్టెదను. ఇప్పుడు నీవు విశ్రాంతి తీసుకో. నా తపశ్శక్తిచే నిన్ను నీ అంతఃపురములో చేరుస్తాను. సరిగ్గా మూడు రోజుల తరువాత నీ పురోహితుని రూపములో నీకు దర్శనమిస్తాను. అన్ని ఏర్పాట్లు చేసివుంచు” అని అన్నాడు. రాజు ఎంతో సంతోషించి బాగా అలసిపోయినందు వలన గాఢనిద్రపోయాడు.

ఇంతలో కపటసన్యాసి స్నేహితుడైన కాలకేతు రాక్షసుడు వచ్చాడు. వాడే వరాహవేషము దాల్చి ప్రతాపభానుని దారిమఱల్చినాడు. స్త్రీలను సజ్జనులను దేవతలను హింసిస్తున్న కాలకేతు నూర్గురుకుమారులను పదిమంది సోదరులను యుద్ధములో చంపి దుష్టసంహారం చేశాడు. ప్రతాపభానుడు. దీనిని గుర్తుపెట్టుకుని అతనిపై ద్వేషం పెంచుకున్నాడు కాలకేతువు. కపటసన్యాసి కాలకేతువు కలిసి నాటకమాడి ప్రతాపభానుని నాశనం చేయదలచారు! కాలకేయుడు తన మాయతో ప్రతాపభానుని అంతఃపురంలో చేర్చి పురోహితుని ఒక గుహలో బంధించి తానే పురోహితునిగా కామరూపం ధరించాడు. తరువాతరోజు ప్రతాపభానుడు నిద్రమేల్కొని తాను అంతఃపురములో ఉన్న విషయము గ్రహించి ఆ కపటసన్యాసి శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. మూడురోజులు క్షణమొక యుగముగా గడిపినాడు. శ్రీహరి ధ్యానం వదిలి ప్రతిక్షణం ఆ కుహనాసన్యాసి పాదాలనే ధ్యానించసాగినాడు.

అనుకున్న ప్రకారం లక్షమంది ఉత్తమ విపులను ఆహ్వానించాడు ప్రతాపభానుడు. ఆ కుహనాపురోహితుడు తన మాయచేత లెక్కలేనన్ని వ్యంజనములు నాలుగురకాలైన పంటలను పాకశాస్త్రమును అనుసరించి షడ్రసోపేతముగా సిద్ధంచేసినాడు. కానీ వానిలో అనేకజంతువుల మాంసములేకాక బ్రాహ్మణులమాంసము కూడా కలిపి వడ్డించినాడు. భోజనార్ధము విప్పులు సిద్ధమగుతుండగా కాలకేతుడు ఆకాశవాణిని సృష్టించి “ఓ విప్రోత్తములారా! ఈ భోజనము హానికరము. దీనిలో జంతువిప్రు మాంసమున్నది. దీనిని భుజింపవద్దు” అని పలికించెను. ఆకాశవాణి వినగానే ఆ లక్షమంది విపులు “ఓ క్షత్రియాధమా! మమ్ము సపరివారముగా భృష్టులను చేయ తలచితివి. నీవు కుటుంబ సహితముగా రాక్షసుడవై జన్మించు. ఒక్క సంవత్సరములో నీవు నీవంశంతో సహా నశిస్తావు.

మీకు తిలోదకాలిచ్చెడివారు కూడా ఉండరు” అని ఘోరశాపాన్నిచ్చారు. తమయుక్తి సఫలమైనదని కాలకేతుడు కపటసన్యాసి సంతోషించారు. కపట సన్యాసి శత్రురాజులందఱిని కూడబెట్టుకోని ప్రతాపభానునిపై దండెత్తినాడు. వీరుడైన రాజు అరిమర్దనుడు ఎంతో కాలం వారితో యుద్ధం చేశారు. చివరికి ఒక సంవత్సరం తరువాత తన వంశముతో సహా ప్రతాపభానుడు నశించినాడు. కొలది కాలము తరువాత వారందఱూ రాక్షసులై జన్మించినారు. ప్రతాపభానుడు రావణునిగా అరిమర్దనుడు కుంభకర్ణునిగా ధర్మరుచి విభీషణునిగా జన్మించిరి. ఒకానొక కల్పములో శ్రీరామావతారమునకు ఇదియే నాంది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. మానవునకు ఆశ ఉండవచ్చు. కాని “అతి సర్వత్ర వర్ణతే”. సమస్త భూమండలానికి ఏకచ్ఛత్రాధిపతి అయికూడా ప్రతాపభానుడు కపట సన్యాసిని అడగరాని వరంకోరి చివరికి నాశనమైనాడు.
  2. మన శాస్త్రాలలో గురువుని ఎలా వెతకాలో వివరించారు. ఎంతో అన్వేషించి ఉత్తముడైన వానిని గురువుగా స్వీకరించాలి. ప్రతాపభానుడు తన దురాశ వలన ఒక్క రాత్రి పరిచయంతోనే కపటుని గురువుగా స్వీకరించాడు.
  3. బహిశ్శత్రువులైనా అంతశ్శత్రువులైనా (కామ క్రోధాదులు) హాని చేయకమానవు. కావున ఎల్లప్పుడూ అప్రమత్తులమై ఉండాలి. ప్రతాపభానుడు శత్రువులైన కాలకేతు కపటసన్యాసులను గమనించక వారిచేత మోసగించబడినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Chataka Pakshi Diksha In Telugu – చాతక పక్షి దీక్ష

Chataka Pakshi Diksha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చాతక పక్షి దీక్ష నీతికథ.

చాతక పక్షి దీక్ష

అది గ్రీష్మం. సూర్యుడు నడినెత్తిన ఉండి ఠీవిగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పిల్ల పక్షులతో ఒక తల్లి చాతకం గగనతలంలో ఎగురుతోంది. పసి చాతకాలు వేడిమికి తాళలేకపోతున్నాయి. తల్లి చాతకం నెలవు కోసం గాలిస్తోంది. నేల పై ఒక పెద్ద మఱి వృక్షం కనబడింది. దాని పేరు బొఱియలలో ఎలుకల చీమల పుట్టలు. తొఱఱ్ఱలలో పాములు. కొమ్మలు రెమ్మలు ఆశ్రయించి వందలాది పక్షులు. నేలమీదనున్న ఒక వృక్షమే ఇన్ని వేల ప్రాణులకు ఆశ్రయం ఇస్తే ఇక సాధన దీక్ష లక్ష్యం ఉన్న ఓ సజ్జనుడు ఎన్ని జీవులను తరింపచేయగలడు!

సామాజిక విలువ తేలిసో లేక సహజీవనం అనివార్యం అని గ్రహించో ఏమో ఆ వృక్షాన్ని కాపురమున్న పక్షి జంట పిల్లలు తమ తల్లితో “అయ్యో పాపం! వాటికి ఇల్లు లేదే” అన్నాయి. “ఇన్నాళ్ళకికదా మా జీవనం సార్థకమైనది. మేము పెంచిన పిల్లలు ఎదుటివారి కష్టాన్ని గుర్తించాయి” అన్న ఆనందంతో ఆ పక్షి జంట ఆ చాతక పక్షులను ఆహ్వానించాయి.

ఆశ్రయం కోసం వెతుకుతున్న చాతకాలకి ఆ ఆహ్వానం పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు. “ఈ వృక్షం మొదటి స్వాతి వాన చినుకులతోనేనా పుట్టినది?” అని అడిగి కాదు అని తెలుసుకోని ముందుకుసాగిపోతున్న ఆ చాతకాల దీక్ష చూసి విభ్రాంతిచెంది “ఔరా!” అని ముక్కున వ్రేలిడికొని చూశారా పిల్లలూ దీక్షా రూపం అని కళ్ళతోనే సైగచేసి బోధించింది తల్లి పక్షి పిల్లలకు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

చాతక పక్షులు మనకి దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను చూపినాయి. చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహమేసినా ఇంకేవీ త్రాగవు. ఈ స్వాభావిక గుణాన్ని విడువక కథలోని చాతకం కూడా మొదటి వాన చినుకులతో మొలకెత్తిన వృక్షం పైనే ఉండాలనుకున్నది.

హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః
కోకః కోకనద ప్రియం ప్రతిదినం చనం చకోరస్తథా |
చేతొ వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదం ॥

జగద్గురువులైన ఆది శంకరాచార్యులు ఒక భక్తుడు శివసాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తున్నాడు. హంస తామర తూళ్ళనే తింటుంది. అందుకనే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది. చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతుంది. అందుకే ఘనమేఘాలకై ఎదురుచూస్తుంది. చక్రవాక పక్షి జంటలు ప్రొద్దులలో జంటగా ఉంటాయి. రాత్రిళ్ళు విరహవేదనను అనుభవిస్తాయి. అందుకని చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షిస్తాయి. చకోర పక్షులకి కేవలం వెన్నెల ఆహారం. అందుకని చకోరాలు చంద్రోదయానికై పరితపిస్తాయి. అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు. అన్యములేవీ అతనికి అక్కరలేదు!

పుత్రోత్సాహం తల్లితండ్రులకు తమ పిల్లలు నలుగురికీ ఉపయోగపడ్డప్పుడు కాని పుట్టినప్పుడు కలుగదు అన్న సూక్తిని గుర్తుచేశాయి పక్షులు. తమ పిల్లలు ఎదుటివారి కష్టాలని చూసి “అయ్యో పాపం!” అని జాలిచూపినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆనందించారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Ranti Devudu In Telugu – రంతిదేవుడు

Ranti Devudu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రంతిదేవుడు నీతికథ.

రంతిదేవుడు

పూర్వం రంతిదేవుడను రాజేంద్రుడుండెడి వాడు. ఆతడు రాజైననూ మహాయోగి వలె విషయ వాంఛలకు లోనుగాక నిరతం హరినామ స్మరణతో కాలంగడిపేవాడు. దైవవశమున లభించిదానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాలపాలైనాడు. నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండెదిటవు కోల్పోలేదు.

ఒకరోజు ప్రాతఃకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వ నీళ్ళు లభించాయి. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనముచేయ సిద్ధపడ్డాడు. భరింపరాని క్షుత్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథియై వచ్చాడు. రంతిదేవుడెంతో ప్రేమతో అతని గౌరవించి హరిసమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్పుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు.

ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి ఆహారంలో ఒకభాగాన్నిచ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడోలేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. “రాజా! నేను ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై యున్నాము. మాకు సరిపోయే ఆహారము ఇమ్ము” అని వాడన్నాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచిమాటలాడి పంపాడు రంతిదేవుడు.

Ranti Devudu Story In Telugu

ఇక రంతిదేవుని వద్ద నీళ్ళొకటి మిగిలాయి. అదీ ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు “అయ్యా! నేను చాలా దీనుడను. చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు”. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుని చూచి “ఓ అన్నా! నావద్ద అన్నంలేదు కాని ఈ తీయ్యని నీళ్ళున్నాయి. దగ్గరకురా. నీ దాహం తీరేటట్లు త్రాగు.

ఆపదకలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు”? అని రంతిదేవుడున్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్కచేయక రంతిదేవుడు “నా జలదానంతో ఈతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు. అంతా ఈశ్వరేచ్ఛ” అని ఆ చండాలుని పాత్రలో నీళ్ళు పోశాడు.

బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు. బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎఱుక కల్గించి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కరించినాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకే కోరికలుండవు కదా! కడకు విష్ణుపదాన్ని పొందాడు. ఆ రాజేకాదు ఆ రాజు కథను బాగా విని అర్థంచేసుకున్న వాళ్ళందరూ ఆతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదించారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

దానము తీసుకొనువానికి హితము కలిగించు దానిని ఫలాపేక్షరహితంగా ప్రేమతో ఇవ్వడం ఉత్తమ దానం. ఇదియేకాక అడిగినవానిలో భగవంతుడిని దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేక పోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ధన్యుడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

వత్సాసుర భంజనమ్ – Vatsasura Bhanjanam | శ్రీ గర్గభాగవతము లోని కథ

Srikrishna Leelalu Vatsasura Bhanjanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – వత్సాసుర భంజనమ్ కథ. 

శ్రీకృష్ణ లీలలు – వత్సాసుర భంజనమ్

బలరామకృష్ణులకు గోవులనుగాచే వయస్సు వచ్చినది. నీలాంబరధారి అయిన బలరాముడు పీతాంబరధారి అయిన శ్రీకృష్ణుడు గోవులను చక్కగా అలంకరించి గోపాలురతో కలిసి పచ్చిక బయళ్ళలో విహరించుచుండేవారు. కాళిందీనదీ తీరము వారికి ప్రియమైన విహారస్థలమయ్యెను. తన మధుర వేణుగానముతో పరమాత్మ జీవులకు సామవేద సారాన్ని బోధించేవాడు. బ్రహ్మానందముతో గోవులు గోపబాలురు పశుపక్షాదులు ఆ వేదవేద్యుని వేణుగానం వినుచుండెడివి. శ్రీకృష్ణుడు గోపాలురు ఎన్నో ఆటాలాడేవారు. వారు పక్షులనీడలలో పఱుగులెట్టేవారు. నెమళ్ళ లేళ్ళ గుంపుల వెంటబడేవారు. కోతికొమ్మంచులు బిళ్ళంగోళ్ళు ఆడేవారు. యమునా నదిలో జలకాలాడేవారు.

ఒకసారి వారు వివిధ జంతువులను అనుకరిస్తూ ఆడుచుండగా కంసప్రేరితుడైన వత్సాసురుడు వచ్చి శ్రీకృష్ణుని ఆలమందలో కలిసి పోయాడు. సర్వజ్ఞుడైన స్వామి అదిగమనించాడు. మెల్లమెల్లగా వచ్చి ఆ వత్సాసురుడు పరమాత్మను తన్నాడు. నందకిశోరుడు వాడి కాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి వెలగచెట్టుకేసి కొట్టాటు. మృతినొందిన ఆ వత్సాసురుడి నుంచి తేజము బయటికి వచ్చి పరమాత్మలో కలిసిపోయింది.

Vatsasura Bhanjanam Story In English

వత్సాసురుని వృత్తాంతము:

మురాసురుడనే రాక్షసుని కుమారుడు ప్రమీలుడు. వాడు దురాశకులోనై కపటవిప్రవేషం ధరించి సర్వాభీష్టఫలదాయిని అయిన నందినీధేనువును తనకు దానమిమ్మని వసిష్ఠుని కోరినాడు. నందినీధేనువు వాడి కుటిలత్వం గ్రహించి అసురస్వభావము గల లేగదూడవు కమ్మని శపించింది. పశ్చాత్తాపముతో శరణువేడిన ప్రమీలుని కరుణించి ఆ నందిని “చేసిన పాపమునకు ఫలమనుభవించక తప్పదు. పాపము తీరిన తరువాత నా అనుగ్రహము వలన నీవు పరమాత్మ చేతిలో మరణిస్తావు. అలా ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించింది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

కుటిలత్వము ఉండరాదని మనకీ కథ ద్వారా తెలిసినది. కపటవేషము వేసి మోసగించబోయిన ప్రమీలుని శపించినది నందినీధేనువు. కావున ఇతరుల నెన్నడూ మోసం చేయరాదు.

మరిన్ని నీతికథలు మీకోసం: