Ayodhya Kanda Sarga 9 In Telugu – అయోధ్యాకాండ నవమః సర్గః

Ayodhya Kanda Sarga 9 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండం లోని నవమ సర్గ, రామాయణంలోని ఒక ప్రధాన భాగం. ఈ సర్గలో రాముడు అయోధ్యను విడిచిపోవడం మరియు ఆ క్రమంలో జరిగిన సంఘటనలు చిత్రీకరించబడ్డాయి. రాముడి పుట్టుక, బాల్యము, మరియు రాజ్యాభిషేకము వరకు జరిగిన సంఘటనలు అయోధ్యాకాండలో ప్రస్తావించబడినవి. నవమ సర్గలో రాముడు, సీత, మరియు లక్ష్మణులు అయోధ్య నుండి వనవాసానికి బయలుదేరుతారు. ఈ సందర్భంలో దశరథ మహారాజు, కౌసల్యా మరియు అయోధ్య ప్రజలు అనుభవించిన దుఃఖాన్ని ఈ సర్గలో వివరించబడింది. కుటుంబబాంధవ్యాలు, విధి, మరియు త్యాగం వంటి ముఖ్యమైన విషయాలు ఈ సర్గలో ప్రధానంగా ఉంటాయి.

రామప్రవాసనోపాయచింతా

ఏవముక్తా తు కైకేయీ క్రోధేన జ్వలితాననా |
దీర్ఘముష్ణం వినిశ్వస్య మంథరామిదమబ్రవీత్ ||

1

అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహమ్ |
యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||

2

ఇదం త్విదానీం సంపశ్యే కేనోపాయేన మంథరే |
భరతః ప్రాప్నుయాద్రాజ్యం న తు రామః కథంచన ||

3

ఏవముక్తా తు సా దేవ్యా మంథరా పాపదర్శినీ |
రామార్థముపహింసంతీ కైకేయీమిదమబ్రవీత్ ||

4

హంతేదానీం ప్రవక్ష్యామి కైకేయి శ్రూయతాం చ మే |
యథా తే భరతో రాజ్యం పుత్రః ప్రాప్స్యతి కేవలమ్ ||

5

కిం న స్మరసి కైకేయి స్మరంతీ వా నిగూహసే |
యదుచ్యమానమాత్మార్థం మత్తస్త్వం శ్రోతుమిచ్ఛసి ||

6

మయోచ్యమానం యది తే శ్రోతుం ఛందో విలాసిని |
శ్రూయతామభిధాస్యామి శ్రుత్వా చాపి విమృశ్యతామ్ ||

7

శ్రుత్వైవం వచనం తస్యాః మంథరాయాస్తు కైకయీ |
కించిదుత్థాయ శయనాత్స్వాస్తీర్ణాదిదమబ్రవీత్ ||

8

కథయ త్వం మమోపాయం కేనోపాయేన మంథరే |
భరతః ప్రాప్నుయాద్రాజ్యం న తు రామః కథంచన ||

9

ఏవముక్తా తయా దేవ్యా మంథరా పాపదర్శినీ |
రామార్థముపహింసంతీ కుబ్జా వచనమబ్రవీత్ ||

10

తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిః పతిః |
అగచ్ఛత్త్వాముపాదాయ దేవరాజస్య సాహ్యకృత్ ||

11

దిశమాస్థాయ వై దేవి దక్షిణాం దండకాన్ప్రతి |
వైజయంతమితి ఖ్యాతం పురం యత్ర తిమిధ్వజః ||

12

స శంబర ఇతి ఖ్యాతః శతమాయో మహాసురః |
దదౌ శక్రస్య సంగ్రామం దేవసంఘైరనిర్జితః ||

13

తస్మిన్ మహతి సంగ్రామే పురుషాన్ క్షతవిక్షతాన్ |
రాత్రౌ ప్రసుప్తాన్ ఘ్నంతి స్మ తరసాఽఽసాద్య రాక్షసాః ||

14

తత్రాకరోన్మహద్యుద్ధం రాజా దశరథస్తదా |
అసురైశ్చ మహాబాహుః శస్త్రైశ్చ శకలీకృతః ||

15

అపవాహ్య త్వయా దేవి సంగ్రామాన్నష్టచేతనః |
తత్రాపి విక్షతః శస్త్రైః పతిస్తే రక్షితస్త్వయా ||

16

తుష్టేన తేన దత్తౌ తే ద్వౌ వరౌ శుభదర్శనే |
స త్వయోక్తః పతిర్దేవి యదేచ్ఛేయం తదా వరౌ ||

17

గృహ్ణీయామితి తత్తేన తథేత్యుక్తం మహాత్మనా |
అనభిజ్ఞా హ్యహం దేవి త్వయైవ కథితా పురా ||

18

కథైషా తవ తు స్నేహాత్ మనసా ధార్యతే మయా |
రామాభిషేకసంభారాన్నిగృహ్య వినివర్తయ ||

19

తౌ వరౌ యాచ భర్తారం భరతస్యాభిషేచనమ్ |
ప్రవ్రాజనం తు రామస్య త్వం వర్షాణి చతుర్దశ ||

20

చతుర్దశ హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనమ్ |
ప్రజాభావగతస్నేహః స్థిరః పుత్రో భవిష్యతి ||

21

క్రోధాగారం ప్రవిశ్యాద్య క్రుద్ధేవాశ్వపతేః సుతే |
శేష్వానంతర్హితాయాం త్వం భూమౌ మలినవాసినీ ||

22

మా స్మైనం ప్రత్యుదీక్షేథా మా చైనమభిభాషథాః |
రుదంతీ చాపి తం దృష్ట్వా జగత్యాం శోకలాలసా ||

23

దయితా త్వం సదా భర్తుః అత్ర మే నాస్తి సంశయః |
త్వత్కృతే స మహారాజో విశేదపి హుతాశనమ్ ||

24

న త్వాం క్రోధయితుం శక్తో న క్రుద్ధాం ప్రత్యుదీక్షితుమ్ |
తవ ప్రియార్థం రాజా హి ప్రాణానపి పరిత్యజేత్ ||

25

న హ్యతిక్రమితుం శక్తస్తవ వాక్యం మహీపతిః |
మందస్వభావే బుద్ధ్యస్వ సౌభాగ్యబలమాత్మనః ||

26

మణిముక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ |
దద్యాద్దశరథో రాజా మాస్మ తేషు మనః కృథాః ||

27

యౌ తౌ దైవాసురే యుద్ధే వరౌ దశరథోఽదదాత్ |
తౌ స్మారయ మహాభాగే సోఽర్థో మా త్వామతిక్రమేత్ ||

28

యదాతు తే వరం దద్యాత్ స్వయముత్థాప్య రాఘవః |
వ్యవస్థాప్య మహారాజం త్వమిమం వృణుయా వరమ్ ||

29

రామం ప్రవ్రాజయారణ్యే నవ వర్షాణి పంచ చ |
భరతః క్రియతాం రాజా పృథివ్యాః పార్థివర్షభః ||

30

చతుర్దశ హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనమ్ |
రూఢశ్చ కృతమూలశ్చ శేషం స్థాస్యతి తే సుతః ||

31

రామప్రవ్రాజనం చైవ దేవి యాచస్వ తం వరమ్ |
ఏవం సిద్ధ్యంతి పుత్రస్య సర్వార్థాస్తవ భామినీ ||

32

ఏవం ప్రవ్రాజితశ్చైవ రామోఽరామో భవిష్యతి |
భరతశ్చ హతామిత్రస్తవ రాజా భవిష్యతి ||

33

యేన కాలేన రామశ్చ వనాత్ప్రత్యాగమిష్యతి |
తేన కాలేన పుత్రస్తే కృతమూలో భవిష్యతి ||

34

సుగృహీతమనుష్యశ్చ సుహృద్భిః సార్ధమాత్మవాన్ |
ప్రాప్తకాలం తు తే మన్యే రాజానం వీతసాధ్వసా ||

35

రామాభిషేకసంభారాన్నిగృహ్య వినివర్తయ |
అనర్థమర్థరూపేణ గ్రాహితా సా తతస్తయా ||

36

హృష్టా ప్రతీతా కైకేయీ మంథరామిదమబ్రవీత్ |
సా హి వాక్యేన కుబ్జాయాః కిశోరీవోత్పథం గతా ||

37

కైకేయీ విస్మయం ప్రాప్తా పరం పరమదర్శనా |
కుబ్జే త్వాం నాభిజానామి శ్రేష్ఠాం శ్రేష్ఠాభిధాయినీమ్ ||

38

పృథివ్యామసి కుబ్జానాముత్తమా బుద్ధినిశ్చయే |
త్వమేవ తు మమాఽర్థేషు నిత్యయుక్తా హితైషిణీ ||

39

నాహం సమవబుధ్యేయం కుబ్జే రాజ్ఞశ్చికీర్షితమ్ |
సంతి దుఃసంస్థితాః కుబ్జా వక్రాః పరమదారుణాః ||

40

త్వం పద్మమివ వాతేన సన్నతా ప్రియదర్శనా |
ఉరస్తేఽభినివిష్టం వై యావత్స్కంధాత్ సమున్నతమ్ ||

41

అధస్తాచ్చోదరం శాతం సునాభమివ లజ్జితమ్ |
పరిపూర్ణం తు జఘనం సుపీనౌ చ పయోధరౌ ||

42

విమలేందుసమం వక్త్రమహో రాజసి మంథరే |
జఘనం తవ నిర్ఘుష్టం రశనాదామశోభితమ్ ||

43

జంఘే భృశముపన్యస్తే పాదౌ చాప్యాయతావుభౌ |
త్వమాయతాభ్యాం సక్థిభ్యాం మంథరే క్షౌమవాసినీ ||

44

అగ్రతో మమ గచ్ఛంతీ రాజహంసీవ రాజసే |
ఆసన్యాః శంబరే మాయాః సహస్రమసురాధిపే ||

45

సర్వాస్త్వయి నివిష్టాస్తా భూయశ్చాన్యాః సహస్రశః |
తవేదం స్థగు యద్దీర్ఘం రథఘోణమివాయతమ్ ||

46

మతయః క్షత్రవిద్యాశ్చ మాయాశ్చాత్ర వసంతి తే |
అత్ర తే ప్రతిమోక్ష్యామి మాలాం కుబ్జే హిరణ్మయీమ్ ||

47

అభిషిక్తే చ భరతే రాఘవే చ వనం గతే |
జాత్యేన చ సువర్ణేన సునిష్టప్తేన మంథరే || [సుందరి]

48

లబ్ధార్థా చ ప్రతీతా చ లేపయిష్యామి తే స్థగు |
ముఖే చ తిలకం చిత్రం జాతరూపమయం శుభమ్ ||

49

కారయిష్యామి తే కుబ్జే శుభాన్యాభరణాని చ |
పరిధాయ శుభే వస్త్రే దేవతేవ చరిష్యసి ||

50

చంద్రమాహ్వయమానేన ముఖేనాప్రతిమాననా |
గమిష్యసి గతిం ముఖ్యాం గర్వయంతీ ద్విషజ్జనమ్ ||

51

తవాపి కుబ్జాః కుబ్జాయాః సర్వాభరణభూషితాః |
పాదౌ పరిచరిష్యంతి యథైవ త్వం సదా మమ ||

52

ఇతి ప్రశస్యమానా సా కైకేయీమిదమబ్రవీత్ |
శయానాం శయనే శుభ్రే వేద్యామగ్నిశిఖామివ ||

53

గతోదకే సేతుబంధో న కళ్యాణి విధీయతే |
ఉత్తిష్ఠ కురు కళ్యాణి రాజానమనుదర్శయ ||

54

తథా ప్రోత్సాహితా దేవీ గత్వా మంథరయా సహ |
క్రోధాగారం విశాలాక్షీ సౌభాగ్యమదగర్వితా ||

55

అనేకశతసాహస్రం ముక్తాహారం వరాంగనా |
అవముచ్య వరార్హాణి శుభాన్యాభరణాని చ ||

56

తతో హేమోపమా తత్ర కుబ్జావాక్యవశం గతా |
సంవిశ్య భూమౌ కైకేయీ మంథరామిదమబ్రవీత్ ||

57

ఇహ వా మాం మృతాం కుబ్జే నృపాయావేదయిష్యసి |
వనం తు రాఘవే ప్రాప్తే భరతః ప్రాప్స్యతి క్షితిమ్ ||

58

న సువర్ణేన మే హ్యర్థో న రత్నైర్న చ భూషణైః |
ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే ||

59

అథో పునస్తాం మహిషీం మహీక్షితో
వచోభిరత్యర్థమహాపరాక్రమైః |
ఉవాచ కుబ్జా భరతస్య మాతరం
హితం వచో రామముపేత్య చాహితమ్ ||

60

ప్రపత్స్యతే రాజ్యమిదం హి రాఘవో
యది ధ్రువం త్వం ససుతా చ తప్స్యసే |
అతో హి కళ్యాణి యతస్వ తత్తథా
యథా సుతస్తే భరతోఽభిషేక్ష్యతే ||

61

తథాఽతివిద్ధా మహిషీ తు కుబ్జయా
సమాహతా వాగిషుభిర్ముహుర్ముహుః |
నిధాయ హస్తౌ హృదయేఽతివిస్మితా
శశంస కుబ్జాం కుపితా పునః పునః ||

62

యమస్య వా మాం విషయం గతామితో
నిశామ్య కుబ్జే ప్రతివేదయిష్యసి |
వనం గతే వా సుచిరాయ రాఘవే
సమృద్ధకామో భరతో భవిష్యతి ||

63

అహం హి నైవాస్తరణాని న స్రజో
న చందనం నాంజనపానభోజనమ్ |
న కించిదిచ్ఛామి న చేహ జీవితం
న చేదితో గచ్ఛతి రాఘవో వనమ్ ||

64

అథైతదుక్త్వా వచనం సుదారుణం
నిధాయ సర్వాభరణాని భామినీ |
అసంవృతామాస్తరణేన మేదినీ-
-మథాధిశిశ్యే పతితేవ కిన్నరీ ||

65

ఉదీర్ణసంరంభతమోవృతాననా
తథావముక్తోత్తమమాల్యభూషణా |
నరేంద్రపత్నీ విమనా బభూవ సా
తమోవృతా ద్యౌరివ మగ్నతారకా ||

66

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే నవమ సర్గః ||

Ayodhya Kanda Sarga 9 Meaning In Telugu 

ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజం అని నమ్మే పరిస్తితి వస్తుంది. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు. విద్వాసుల దగ్గరినుంచీ నిరక్షరాస్యులవరకూ జరుగుతుంది. కైక విద్వాంసురాలు. దశరథుని భార్య. కేకయ దేశపు రాకుమార్తె. కాని మంథర మాటలకు లోబడి పోయింది. రాముడు పుట్టినప్పటినుండి, రాముని తన కుమారునికన్న ఎక్కువ గారాబంగా పెంచింది. రాముడు అంటే కైకకు ప్రాణం. కాని మంథర చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్లు తాను రాముని మీద పెంచుకున్న ప్రేమ అనురాగము ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఒక్కసారిగా రాముని మీద ద్వేషము అసూయ ప్రబలాయి.

మంథర చెప్పిన మాటలు వినగానే కైకకు కోపం తారస్థాయికి చేరుకుంది. రోషంతో మంథరతో ఇలా అంది.

“మంధరా! ఆలోచించగా నీవు చెప్పినదే నిజము అనిపిస్తూ ఉంది. ఇంక ఆలస్యము చేసి ప్రయోజనము లేదు. రాముడు ఉన్నంత వరకూ భరతునికి భవిష్యత్తు లేదు. రాముడు అడవులకు వెళ్లాలి, భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. ఇదే నా తక్షణ కర్తవ్యము. మంథరా! నాకు ఏమీ తోచడం లేదు. ఎలాగైనా రేపటి పట్టాభిషేకము ఆగిపోవాలి. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి. దీనికి తగిన ఉపాయం చెప్పు.” అని అడిగింది కైక.

తన పాచిక పారినందుకు మంథర లోలోపల సంతోషించింది. ఇందులో మంథరకు లాభించింది ఏమీ లేదు. రాముడు పట్టాభిషేకం ఆగిపోతే మంధరకు ఒరిగింది ఏమీ లేదు. కాని మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది. అదే మంథరకు పదివేలు. మంథర రెచ్చిపోయి కైకతో ఇలా అంది.

“నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉ దమ్మా. ఏ పని అయిన చెయ్యడం కష్టం కాని చెడగొట్టడం ఎంత సేపు. రేపు జరగబోయే పట్టాభిషేకము పటాపంచలు చేసే ఉపాయము ఒకటి చెబుతాను. సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా! నేను చెప్పాలా చెప్పు. నీకు అన్నీ తెలుసు. ఈ ముసలి దాన్ని పరీక్ష చేస్తున్నావు కదూ. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా!” అంది మంథర

వెంటనే కైక తాను కూర్చున్న ఆసనము మీది నుండి లేచి మంథర దగ్గరగా వచ్చింది. “లేదే మంథరా. నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది ఎలాగో చెప్పు.” అని అడిగింది కైక.

“దానికే వస్తున్నానమ్మా! నీవు ఒకసారి నాతో ఒక విషయం చెప్పావు గుర్తుందా. అదేనమ్మా! దేవాసుర యుద్ధంజరిగింది కదా. అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్లాడు. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్లావు. మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడు అనే రాక్షసుని మీదికి యుద్ధానికి వెళ్లారు. ఆ అసురుడు మాయావి. దేవతలనందరినీ ఓడించాడు. ఇంద్రునితో కూడా యుద్ధము చేసాడు. పగలంతా యుద్ధం చేసిన దేవతలు తీసుకుంటున్నారు. నిశాచరులైన రాక్షసులు రాత్రి రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోసారు. అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగాడు. కాని రాక్షసులు దశరథుని ఒళ్లంతా తూట్లు పడేట్టు కొట్టారు. నీ భర్త కిందపడి నీ పోయాడు. స్పృహ కోల్పోయాడు.

అప్పుడు నీవు నీ భర్తను రణరంగము నుండి దూరంగా తీసుకొని పోయి కాపాడావు కదా! కాని రాక్షసులు మిమ్ములను వెంబడించి యుద్ధం చేసారు. మరలా నీవు నీ భర్తను రణరంగంనుండి రాక్షసుల కంట పడకుండా దూరంగా తీసుకొని పోయి కాపాడావు. అలా నీ భర్తను రెండు సార్లు ప్రాణాపాయం నుండి రక్షించావు. నీవు చేసిన మహోపకారమునకు నీ భర్త దశరథుడు ఎంతో సంతోషించాడు. నీకు రెండు సార్లు ఆయన ప్రాణాలు కాపాడావు కాబట్టి నీకు రెండు వరాలు ఇస్తాను అని అన్నాడు. వాటిని నీవు కోరుకోకుండా నీ ఇష్టంవచ్చినప్పుడు కోరుకుంటాను అని అన్నావు. ఇదంతా నీవు చెబితేనే నాకు తెలిసింది.

ఇప్పుడు ఆ వరాలతో పని పడింది. ఆ వరాలను ఇప్పుడు కోరుకో. ఒక వరంగా రామునికి 14 ఏళ్ల వనవాసము. రెండవ వరంగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము. దానితో రామ పట్టాభిషేకము ఆగిపోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గర అవుతాడు. వారి ప్రేమ అభిమానములను చూరగొంటాడు. అయోధ్యావాసులు భరతుని తమ ప్రభువుగా అంగీకరిస్తారు. రాముని మరిచిపోతారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు. నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇదీ పధకము.

ఈ పథకము అమలు చేయడానికి ముందు నీవు కోపగృహము అలంకరించాలి. మాసిన వస్త్రములు కట్టుకొని, తలకు కట్టుకట్టుకొని నేలమీద పడుకోవాలి. కొంచెం కష్టమే అయినా తప్పదు కదా! దశరథుడు నీ దగ్గరకు వచ్చినపుడు పెద్దపెట్టున ఏడిచి గోల చేయాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు. మాట్లాడ కూడదు. ఆయన మాట్లాడించినా ఎడమొహం పెడమొహంగా ఉండాలి.

నువ్వు అంటే దశరథునికి ఎంతో ప్రేమ అభిమానము. నీ కోసం ఏమి చెయ్యమన్నా చేస్తాడు. ఆఖరుకు నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నువ్వు బాధతో ఉంటే చూడలేడు. నువ్వు ఏం అడిగినా ఇస్తాడు. తుదకు తన ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇచ్చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న రెండు వరాలు ఇప్పుడు అడుగు. నీకు మణులు, రత్నాలు ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు. కాని వాటికి ఆశపడవద్దు. రెండు వరాలు జాగ్రత్తగా కోరుకో.

మొదటి వరం రాముని పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసమునకు పంపడం. రెండవ వరము గా భరతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం. రాముడు రాజ్యములో ఉంటే నీ కుమారుని ఎవరూ రాజుగా అంగీకరించరు. రాముడు అడవులకు వెళితే క్రమక్రమంగా భరతుడు రాజుగా వేళ్లూనుకొని స్థిరపడతాడు. రాముడు వనవాసమునకు వెళ్లడం ఒక వరంగా కోరాలి. లేకపోతే రాముడు అయోధ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. రాముడు వనములకు వెళితే ప్రజలు రాముని మరిచిపోతారు. నీ కుమారుడు భరతుని రాజుగా అంగీకరిస్తారు. రాముడు ఒక వేళ వనవాసము నుండి తిరిగి వచ్చినా భరతుడు రాజ్యమును ఇయ్యడు. కాబట్టి ముందు రామ పట్టాభిషేకమును ఆపించవలెను.” అని మంథర కైకకు ఒకటికి పది సార్లు చెప్పిందే చెప్పి నూరిపోసింది.

మంథర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజు అయినట్టు కలలు కంటోంది. తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలను చెప్పిన మంథరను మనసులోనే అభినందించింది.

(ఇక్కడ వాల్మీకి ఒక వాక్యం రాసాడు. కైకేయి స్వతాహాగా మంచి గుణములు కలది అయినా తన దాసి మంథర దుర్బోధలను విని ఏమీ తెలియని అమాయకురాలైన బాలిక వలె చెడుతోవలో నడిచింది. అని. ఇలాంటి మంధరలు మనకు ప్రతి ఇంటా కనపడతారు. వాళ్లు మన బంధువులైనా కావచ్చు లేక పక్కింటి వాళ్లు ఎదురింటి వాళ్లు కావచ్చు. వారి చెప్పుడు మాటలకు లోబడి సంసారాలు చెడ గొట్టుకొనే కైకలు ఎంతో మంది మన కళ్లముందే కనపడతున్నారు.)

“ఆ హా మంధరా! నీకు ఎన్ని విషయాలు తెలుసే. నాకు ఎన్ని మంచి విషయాలు చెప్పావు. నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకూ తెలియదు. నీమేలు ఎన్నటికీ మరువలేను. మంథరా! అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నీవు రూపానికి కుబ్జవే కాని బుద్ధిలో బృహస్పతివి. నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్లంతా బంగారు తొడుగు వేయిస్తానే. నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో, ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను. ఆ కౌసల్య దాసీలు నిన్ను చూచి అసూయపడేలా చేస్తాను.” అని మంథరను పొగిడింది.

తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే మంథర పొంగి పోయింది. “ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావా. నేను చెప్పినవి అన్నీ అప్పుడే మరిచిపోయావా” అంది మంథర.

“లేదు లేవే. అన్నీ గుర్తున్నాయి.” అంటూ తన అలంకారములు అన్నీ ఒకటి ఒకటిగా తీసేసింది. పట్టు బట్టలు విప్పి మాసిన చీర కట్టుకుంది. తలకు కట్టు కట్టింది. నేలమీద పడుకుంది.

“మంథరా! రాజుగారు వస్తే ఇలా చెప్పు. భరతుడు రాజైనా కావాలి. లేకపోతే నేను చావనన్నా చావాలి. అదే నా కోరిక అని చెప్పు. ఇంకా ఏమంటావంటే అక్కడ రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయి అని చెప్పు.” అని పలికింది.

“అవన్నీ నాకు తెలుసు లేవమ్మా. నువ్వు మాత్రం రాజుగారితో ఖచ్ఛితంగా ఉండు. రాముని అరణ్య వాసము, భరతుని పట్టాభిషేకము ఇవి రెండే కావాలి అని చెప్పు.” అని చెప్పింది మంథర.

“అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను లేవే.” అని పలికింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ దశమః సర్గః (10) >>

Ayodhya Kanda Sarga 35 In Telugu – అయోధ్యాకాండ పంచత్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 35

అయోధ్యాకాండము పంచత్రింశః సర్గము (35వ సర్గ) రామాయణంలో భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు చీరలను ధరించి, గంగా నదిని చేరుకుంటారు. అక్కడ నదిని దాటేందుకు గుహ అనే గిరిజన రాజును కలుస్తారు. గుహ, రామునికి తన భక్తిని, ప్రేమను ప్రదర్శిస్తాడు. రాముడు, సీత, లక్ష్మణులకు సేవ చేస్తాడు. వారు అరణ్యవాసం ప్రారంభం చేసేందుకు నదిని దాటుతారు. ఈ సర్గ రాముని వినయాన్ని, సీతా, లక్ష్మణుల సహనాన్ని, గుహ భక్తిని మరియు దాతృత్వాన్ని చూపిస్తుంది. రాముడు ధర్మాన్ని పాటిస్తూ ప్రజల కోసం త్యాగం చేసే వ్యక్తిగా ఇక్కడ ప్రదర్శించబడతాడు.

సుమంత్రగర్హణమ్

తతో నిర్ధూయ సహసా శిరో నిఃశ్వస్య చాసకృత్ |
పాణిం పాణౌ వినిష్పిష్య దంతాన్కటకటాప్య చ || ౧ ||

లోచనే కోపసంరక్తే వర్ణం పూర్వోచితం జహత్ |
కోపాభిభూతః సహసా సంతాపమశుభం గతః || ౨ ||

మనః సమీక్షమాణశ్చ సూతో దశరథస్య సః |
కంపయన్నివ కైకేయ్యా హృదయం వాక్ఛరైః శితైః || ౩ ||

వాక్యవజ్రైరనుపమైర్నిర్భిందన్నివ చాశుగైః |
కైకేయ్యాః సర్వమర్మాణి సుమంత్రః ప్రత్యభాషత || ౪ ||

యస్యాస్తవ పతిస్త్యక్తో రాజా దశరథః స్వయమ్ |
భర్తా సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ || ౫ ||

న హ్యకార్యతమం కించిత్తవ దేవీహ విద్యతే |
పతిఘ్నీం త్వామహం మన్యే కులఘ్నీమపి చాంతతః || ౬ ||

యన్మహేంద్రమివాజయ్యం దుష్ప్రకంప్యమివాచలమ్ |
మహోదధిమివాక్షోభ్యం సంతాపయసి కర్మభిః || ౭ ||

మాఽవమంస్థా దశరథం భర్తారం వరదం పతిమ్ |
భర్తురిచ్ఛా హి నారీణాం పుత్రకోట్యా విశిష్యతే || ౮ ||

యథావయో హి రాజ్యాని ప్రాప్నువంతి నృపక్షయే |
ఇక్ష్వాకుకులనాథేఽస్మింస్తల్లోపయితుమిచ్ఛసి || ౯ ||

రాజా భవతు తే పుత్రో భరతః శాస్తు మేదినీమ్ |
వయం తత్ర గమిష్యామో యత్ర రామో గమిష్యతి || ౧౦ ||

న హి తే విషయే కశ్చిద్బ్రాహ్మణో వస్తుమర్హతి |
తాదృశం త్వమమర్యాదమద్య కర్మ చికీర్షసి || ౧౧ ||

ఆశ్చర్యమివ పశ్యామి యస్యాస్తే వృత్తమీదృశమ్ |
ఆచరంత్యా న వివృతా సద్యో భవతి మేదినీ || ౧౨ ||

మహాబ్రహ్మర్షిసృష్టా హి జ్వలంతో భీమదర్శనాః |
ధిగ్వాగ్దండా న హింసంతి రామప్రవ్రాజనే స్థితామ్ || ౧౩ ||

ఆమ్రం ఛిత్వా కుఠారేన నింబం పరిచరేత్తు యః |
యశ్చైనం పయసా సించేన్నైవాస్య మధురో భవేత్ || ౧౪ ||

అభిజాతం హి తే మన్యే యథా మాతుస్తథైవ చ |
న హి నింబాత్స్రవేత్క్షౌద్రం లోకే నిగదితం వచః || ౧౫ ||

తవ మాతురసద్గ్రాహం విద్మః పూర్వం యథా శ్రుతమ్ |
పితుస్తే వరదః కశ్చిద్దదౌ వరమనుత్తమమ్ || ౧౬ ||

సర్వభూతరుతం తస్మాత్సంజజ్ఞే వసుధాధిపః |
తేన తిర్యగ్గతానాం చ భూతానాం విదితం వచః || ౧౭ ||

తతో జృంభస్య శయనే విరుతాద్భూరివర్చసః |
పితుస్తే విదితో భావః స తత్ర బహుధాహసత్ || ౧౮ ||

తత్ర తే జననీ క్రుద్ధా మృత్యుపాశమభీప్సతీ |
హాసం తే నృపతే సౌమ్య జిజ్ఞాసామీతి చాబ్రవీత్ || ౧౯ ||

నృపశ్చోవాచ తాం దేవీం దేవి శంసామి తే యది |
తతో మే మరణం సద్యో భవిష్యతి న సంశయః || ౨౦ ||

మాతా తే పితరం దేవి తతః కేకయమబ్రవీత్ |
శంస మే జీవ వా మా వా న మామపహసిష్యసి || ౨౧ ||

ప్రియయా చ తథోక్తః సన్కేకయః పృథివీపతిః |
తస్మై తం వరదాయార్థం కథయామాస తత్త్వతః || ౨౨ ||

తతః స వరదః సాధూ రాజానం ప్రత్యభాషత |
మ్రియతాం ధ్వంసతాం వేయం మా కృథాస్త్వం మహీపతే || ౨౩ ||

స తచ్ఛ్రుత్వా వచస్తస్య ప్రసన్నమనసో నృపః |
మాతరం తే నిరస్యాశు విజహార కుబేరవత్ || ౨౪ ||

తథా త్వమపి రాజానం దుర్జనాచరితే పథి |
అసద్గ్రాహమిమం మోహాత్కురుషే పాపదర్శిని || ౨౫ ||

సత్యశ్చాద్య ప్రవాదోఽయం లౌకికః ప్రతిభాతి మా |
పితౄన్సమనుజాయంతే నరా మాతరమంగనాః || ౨౬ ||

నైవం భవ గృహాణేదం యదాహ వసుధాధిపః |
భర్తురిచ్ఛాముపాస్వేహ జనస్యాస్య గతిర్భవ || ౨౭ ||

మా త్వం ప్రోత్సాహితా పాపైర్దేవరాజసమప్రభమ్ |
భర్తారం లోకభర్తారమసద్ధర్మముపాదధాః || ౨౮ ||

న హి మిథ్యా ప్రతిజ్ఞాతం కరిష్యతి తవానఘః |
శ్రీమాన్దశరథో రాజా దేవి రాజీవలోచనః || ౨౯ ||

జ్యేష్ఠో వదాన్యః కర్మణ్యః స్వధర్మస్యాభిరక్షితా |
రక్షితా జీవలోకస్య బ్రూహి రామోఽభిషిచ్యతామ్ || ౩౦ ||

పరివాదో హి తే దేవి మహాఁల్లోకే చరిష్యతి |
యది రామో వనం యాతి విహాయ పితరం నృపమ్ || ౩౧ ||

స రాజ్యం రాఘవః పాతు భవ త్వం విగతజ్వరా |
న హి తే రాఘవాదన్యః క్షమః పురవరే వసేత్ || ౩౨ ||

రామే హి యౌవరాజ్యస్థే రాజా దశరథో వనమ్ |
ప్రవేక్ష్యతి మహేష్వాసః పూర్వవృత్తమనుస్మరన్ || ౩౩ ||

ఇతి సాంత్వైశ్చ తీక్ష్ణైశ్చ కైకేయీం రాజసంసది |
సుమంత్రః క్షోభయామాస భూయ ఏవ కృతాంజలిః || ౩౪ ||

నైవ సా క్షుభ్యతే దేవీ న చ స్మ పరిదూయతే |
న చాస్యా ముఖవర్ణస్య విక్రియా లక్ష్యతే తదా || ౩౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశః సర్గః || ౩౫ ||

Ayodhya Kanda Sarga 35 Meaning In Telugu

అప్పటి దాకా జరిగినది అంతా మౌనంగా చూస్తున్నాడు సుమంత్రుడు. అతని మనస్సు కోపంతో రగిలిపోతూ ఉంది. చేతులు నులుముకుంటున్నాడు. మాటి మాటికీ తల కొట్టుకుం టున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంక తట్టుకోలేక పోయాడు. కైకను చూచి ఇలా అన్నాడు.

“ఓ కైకా దేవీ! మీరు మా మహారాజు భార్య అని ఇంతవరకూ గౌరవించాము. మీరు మా మహారాజునే వదిలి పెట్టాము అన్నారు. మా మహారాజునే వదిలిన మీరు ఎంతకైనా తెగించగలరు. మా మహారాజును నీ దుర్మార్గపు పనుల వలన చిత్రవధ చేసి చంపుతున్నావు. నీవు ఇక్ష్వాకు కులమును నాశనం చేయడానికి వచ్చావు. మహారాజుగారు నీవుకోరిన వరాలు ఇస్తానన్నాడు కదా. ఇలాంటి వరాలు కోరాలా! స్త్రీలకు భర్త కంటే వేరు దైవము లేరని తెలియదా! రాజుగారు మరణించినపుడు జ్యేష్టుడు రాజ్యాధి కారము వహిస్తాడు. ఈ ధర్మము నీకు తెలియదా! నేడు ఆ రాజధర్మమును ఎందుకు మార్చాలని ప్రయత్నిస్తున్నావు. నీ కుమారుడు భరతుడే రాజైతే మేమందరమూ రామునితో పాటు అడవులకు వెళుతాము. నీవు చేస్తున్న దుర్మార్గాలనూ ధర్మవిరుద్ధమైన పనులనూ చూస్తూ బ్రాహ్మణుడు ఎవరూ అయోధ్యలో ఉండడు. అయోధ్యలో ఉన్న బ్రాహ్మణులు ప్రజలా అంతా రాముని అనుసరించి వెళ్లాక, నీవు, నీకొడుకు ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన అయోధ్యను ఏలుకోండి. ఈ శ్మశానాన్ని ఏలుకుంటూ నీవు ఏమి ఆనందాన్ని పొందుతావో నేనూ చూస్తాను.

నీవు ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఈ భూమి ఎందుకు బ్రద్దలయి నిన్ను తనలో కలుపుకోలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాముని అరణ్యములకు పంపుతున్నావు అన్న వార్త విని నిన్ను ఛీ కొట్టుచున్న వారి శాపములతో నీవు ఇంకా ఎందుకు భస్మం కాలేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. వేపచెట్టుకు పాలుపోసి పెంచినా దాని చేదు పోనట్టు మా మహారాజుగారు నిన్ను ఎంత ప్రేమగా చూచినా ఆయన పట్ల నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. ఈ క్రూరత్వము నీకు జన్మతా వచ్చినదా అని సందేహాము గా ఉంది. ఎందుకంటే నీ తల్లి నీ కన్నా క్రూరురాలు అని మేము విన్నాము.

నీ తండ్రికి ఒక ఋషి ఒక వరం ఇచ్చాడు. దాని ప్రభావం వలన ఆయనకు అన్ని జంతువుల భాషలూ అర్ధం అయ్యేవి. ఒకరోజు నీ తండ్రి పడుకొని ఉండగా నేల మీద పాకుచున్న చీమ మాటలు విని, పక్కున నవ్వాడు. ఆ విషయము తెలియని నీ తల్లి తనను చూచి ఎగతాళిగా నవ్వుతున్నాడు అని అనుకొంది. “నన్నుచూచి ఎందుకు నవ్వుతున్నావు,కారణమేమి” అని నీ తండ్రిని నిలదీసింది. “దేవీ! నా నవ్వుకు కారణం చెబితే నాకు మరణం సంభవిస్తుంది. అందుకని దాని గురించి నన్ను అడగవద్దు.” అని అన్నాడు. అప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసా! “నీవు బతికితే బతుకు, లేకపోతే చావు. కాని నన్ను పరిహసించి నవ్విన దానికి కారణం చెప్పి తీరాలి” అనిపట్టుబట్టింది. అప్పుడు నీ తండ్రి ఏమన్నాడో తెలుసా! “నీ పట్టుదల కోసం నా ప్రాణాలు పోగొట్టుకోలేను. నువ్వు ఉంటే ఉండు పోతే పో. నేను మాత్రము చెప్పను.” అని అన్నాడు.

ఓ కైకా! నీకూ నీ తల్లి బుద్ధులు వచ్చినట్టున్నాయి. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. మా మహారాజు నీ తండ్రి వలె ప్రవర్తించకపోవడం వల్లనే రాముడు అరణ్యములకు వెళుతున్నాడు. కొడుకులకు తండ్రి గుణాలు, కూతుళ్లకు తల్లి గుణాలు వారసత్వంగా సంక్రమిస్తాయి అని నీవల్ల ఋజువు అయింది. కనీసం ఇప్పటి కన్నా నీ బుద్ధి మార్చుకొని, నీ పట్టుదల మాని, నీ వరములు ఉపసంహరించుకో. ఈ అయోధ్యను, ప్రజలను కాపాడు.
మరి ఇది నీవు పుట్టిన బుద్ధి లేక ఎవరి చెప్పుడు మాటలు విన్నావో తెలియదు కానీ నీచేతల వలన మా మహారాజును అధర్మపరుడిగా చేయకు. మా మహారాజు నీకు ఇస్తానన్న వరాలు ఇస్తాడు. కానీ నీవే నీ మాట మార్చుకో. వేరే ఏవైనా కోరుకో. జ్యేష్టుడైన రామునికి పట్టాభిషేకము జరిపించు. అలా కాకుండా రాముడు అరణ్యములకు వెళితే ఈ లోకంలో నీకు తీరని అపవాదు కలుగుతుంది. ఇంతకాలము బాగా బతికి ఇప్పుడు ఎందుకు ఇంతటి అపవాదును మూటగట్టుకుంటావు. నా మాట విను. రామ పట్టాభి షేకము జరిపించు. తన పూర్వీకుల మాదిరి దశరథుడు సంతోషంగా తపస్సుచేసుకోడానికి అడవులకు వెళతాడు.” అని సుమంత్రుడు నయానా భయానా కైకకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కాని కైకకు సుమంత్రుడి మాటలు రుచించలేదు. తన పట్టు వీడలేదు. రాముడు అరణ్యములకు వెళ్లాల్సిందే అని మొండిగా వాదించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షట్త్రింశః సర్గః (36) >>

Balakanda Sarga 38 In Telugu – బాలకాండ అష్టత్రింశః సర్గః

Balakanda Sarga 38 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టత్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో అష్టత్రింశః సర్గః ఒక ప్రధాన భాగం. ఈ సర్గలో రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి జనక మహారాజు యజ్ఞానికి చేరుతారు. అక్కడ వారు శివుని ధనుస్సును (ధనుర్బాణాన్ని) దర్శిస్తారు. జనకుడు, శివుని వును ఎవరైతే విరిచివేస్తారో, ఆ వ్యక్తికి తన కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు.

సగరపుత్రజన్మ

తాం కథాం కౌశికో రామే నివేద్య మధురాక్షరమ్ |
పునరేవాపరం వాక్యం కాకుత్స్థమిదమబ్రవీత్ ||

1

అయోధ్యాధిపతిః శూరః పూర్వమాసీన్నరాధిపః |
సగరో నామ ధర్మాత్మా ప్రజాకామః స చాప్రజాః ||

2

వైదర్భదుహితా రామ కేశినీ నామ నామతః |
జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదినీ ||

3

అరిష్టనేమిదుహితా రూపేణాప్రతిమా భువి |
ద్వితీయా సగరస్యాసీత్పత్నీ సుమతిసంజ్ఞితా ||

4

తాభ్యాం సహ తదా రాజా పత్నీభ్యాం తప్తవాంస్తపః |
హిమవంతం సమాసాద్య భృగుప్రస్రవణే గిరౌ ||

5

అథ వర్షశతే పూర్ణే తపసాఽఽరాధితో మునిః |
సగరాయ వరం ప్రాదాద్భృగుః సత్యవతాం వరః ||

6

అపత్యలాభః సుమహాన్భవిష్యతి తవానఘ |
కీర్తిం చాప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ ||

7

ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ |
షష్టిం పుత్రసహస్రాణి అపరా జనయిష్యతి ||

8

భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్య తమ్ |
ఊచతుః పరమప్రీతే కృతాంజలిపుటే తదా ||

9

ఏకః కస్యాః సుతో బ్రహ్మన్కా బహూన్జనయిష్యతి |
శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్సత్యమస్తు వచస్తవ ||

10

తయోస్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః |
ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛందోఽత్ర విధీయతామ్ ||

11

ఏకో వంశకరో వాఽస్తు బహవో వా మహాబలాః |
కీర్తిమంతో మహోత్సాహాః కా వా కం వరమిచ్ఛతి ||

12

మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన |
పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ ||

13

షష్టిం పుత్రసహస్రాణి సుపర్ణభగినీ తదా |
మహోత్సాహాన్కీర్తిమతో జగ్రాహ సుమతిః సుతాన్ ||

14

ప్రదక్షిణమృషిం కృత్వా శిరసాఽభిప్రణమ్య చ |
జగామ స్వపురం రాజా సభార్యో రఘునందన ||

15

అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠా పుత్రం వ్యజాయత |
అసమంజ ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజమ్ ||

16

సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుంబం వ్యజాయత |
షష్టిః పుత్రాః సహస్రాణి తుంబభేదాద్వినిస్సృతాః ||

17

ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యస్తాన్సమవర్ధయన్ |
కాలేన మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే ||

18

అథ దీర్ఘేణ కాలేన రూపయౌవనశాలినః |
షష్టిః పుత్రసహస్రాణి సగరస్యాభవంస్తదా ||

19

స చ జ్యేష్ఠో నరశ్రేష్ఠః సగరస్యాత్మసంభవః |
బాలాన్గృహీత్వా తు జలే సరయ్వా రఘునందన ||

20

ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్తాన్నిరీక్ష్య వై |
ఏవం పాపసమాచారః సజ్జనప్రతిబాధకః ||

21

పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్ |
తస్య పుత్రోంశుమాన్నామ అసమంజస్య వీర్యవాన్ ||

22

సమ్మతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః |
తతః కాలేన మహతా మతిః సమభిజాయత |
సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చితా ||

23

స కృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణస్తదా |
యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టత్రింశః సర్గః ||

Balakanda Sarga 38 Meaning In Telugu

” ఓ రామా! ఇప్పుడు నీకు సగరుడి కధ చెబుతాను విను. పూర్వము అయోధ్యా నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.ఆయనకు పుత్ర సంతానము లేదు. విదర్భ రాజు కుమారి కేశిని అతని మొదటి భార్య.. సుమతి ఆయన రెండవ భార్య..

పుత్ర సంతానము కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్పర్వతమునకు పోయి అక్కడ భృగుప్రస్రవణము అనే పర్వతము మీద నూరు సంవత్సరముల పాటు తపస్సు చేసారు. వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు.

“ఓ సగర చక్రవర్తీ! నీకు ఒక భార్య యందు ఒక కుమారుడు, మరొక భార్య యందు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు.” అని వరము ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించారు.

కాని వారికి ఒక సందేహము కలిగింది. ” ఓ మహర్షీ! మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు.” అని అడిగారు.

“ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి.” అని అన్నాడు.

భృగుమహర్షి

అప్పుడు కేశిని ” ఓ మహర్షి! నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి.” అని కోరుకుంది.
రెండవ భార్య సుమతి “నాకు 60,000 వేల మంది కుమారులను ప్రసాదించండి.” అని కోరుకుంది.

భృగుమహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు. భృగుమహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు. కాలక్రమేణా ఇరువురు గర్భములు ధరించారు. పెద్ద భార్య కేశిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది. రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ పెరిగి పెద్ద వారు అయ్యారు.

వారందరూ ఆటలు ఆడుతు ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి, వారు అరిచి కేకలు పెడుతుంటే, ఆనందించేవాడు. అనేక రకములైన పాప కార్యములను చేయుతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు. వాడి బాధ పడలేక సగరుడు అసమంజుని రాజ్యమునుండి వెళ్లగొట్టాడు. ఆ అసమంజుని పుత్రుడు అంశు మంతుడు. అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు. సజ్జనుడు. అందరూ అతను అంటే ఇష్టపడేవారు.

కొంత కాలము తరువాత సగరుడు ఒక యజ్ఞమే చేయ సంకల్పించాడు. పురోహితులను, ఋత్తిక్కులను సంప్రదించాడు. యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు. యజ్ఞము చేయ పూనుకున్నాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకోనచత్వారింశః సర్గః (39) >>

Balakanda Sarga 27 In Telugu – బాలకాండ సప్తవింశః సర్గః

Balakanda Sarga 27 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తవింశః సర్గలో, పెద్దల ఆదేశాలను పాటించి, తనకు అప్పగించిన పనిని చేయడంలో రాముడి ప్రవర్తనతో విశ్వామిత్ర మహర్షి సంతృప్తి చెందాడు, రాముడికి శాస్త్రం, అస్త్రాలు అని అనేక ఆయుధాలను ఇచ్చాడు . ఆయుధాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి శాస్త్రం – కత్తి, లాన్స్ లేదా గద్ద వంటి చేతితో పట్టుకునే ఆయుధం.

అస్త్రగ్రామప్రదానమ్

అథ తాం రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః |
ప్రహస్య రాఘవం వాక్యమువాచ మధురాక్షరమ్ ||

1

పరితుష్టోఽస్మి భద్రం తే రాజపుత్ర మహాయశః |
ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః ||

2

దేవాసురగణాన్వాపి సగంధర్వోరగానపి |
యైరమిత్రాన్ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి ||

3

తాని దివ్యాని భద్రం తే దదామ్యస్త్రాణి సర్వశః |
దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ ||

4

ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ |
విష్ణుచక్రం తథాఽత్యుగ్రమైంద్రమస్త్రం తథైవ చ ||

5

వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా |
అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఏషీకమపి రాఘవ ||

6

దదామి తే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమమ్ |
గదే ద్వే చైవ కాకుత్స్థ మోదకీ శిఖరీ ఉభే ||

7

ప్రదీప్తే నరశార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ |
ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ ||

8

పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమమ్ |
అశనీ ద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన ||

9

దదామి చాస్త్రం పైనాకమస్త్రం నారాయణం తథా |
ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః ||

10

వాయవ్యం ప్రథనం నామ దదామి చ తవానఘ |
అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవ చ ||

11

శక్తిద్వయం చ కాకుత్స్థ దదామి తవ రాఘవ |
కంకాలం ముసలం ఘోరం కాపాలమథ కంకణమ్ ||

12

ధారయంత్యసురా యాని దదామ్యేతాని సర్వశః |
వైద్యాధరం మహాస్త్రం చ నందనం నామ నామతః ||

13

అసిరత్నం మహాబాహో దదామి నృవరాత్మజ |
గాంధర్వమస్త్రం దయితే మానవం నామ నామతః ||

14 [మోహనం]

ప్రస్వాపనప్రశమనం దద్మి సౌరం చ రాఘవ |
దర్పణం శోషణం చైవ సంతాపనవిలాపనే ||

15

మదనం చైవ దుర్ధర్షం కందర్పదయితం తథా |
[* గాంధర్వమస్త్రం దయితం మానవం నామ నామతః | *]
పైశాచమస్త్రం దయితం మోహనం నామ నామతః ||

16

ప్రతీచ్ఛ నరశార్దూల రాజపుత్ర మహాయశః |
తామసం నరశార్దూల సౌమనం చ మహాబల ||

17

సంవర్తం చైవ దుర్ధర్షం మౌసలం చ నృపాత్మజ |
సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరమ్ ||

18

ఘోరం తేజఃప్రభం నామ పరతేజోఽపకర్షణమ్ |
సౌమ్యాస్త్రం శిశిరం నామ త్వాష్ట్రమస్త్రం సుదామనమ్ ||

19

దారుణం చ భగస్యాపి శితేషుమథ మానవమ్ |
ఏతాన్రామ మహాబాహో కామరూపాన్మహాబలాన్ ||

20

గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృపాత్మజ |
స్థితస్తు ప్రాఙ్ముఖో భూత్వా శుచిర్మునివరస్తదా ||

21

దదౌ రామాయ సుప్రీతో మంత్రగ్రామమనుత్తమమ్ |
సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభమ్ ||

22

తాన్యస్త్రాణి తదా విప్రో రాఘవాయ న్యవేదయత్ |
జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః ||

23

ఉపతస్తుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవమ్ |
ఊచుశ్చ ముదితాః సర్వే రామం ప్రాంజలయస్తదా ||

24

ఇమే స్మ పరమోదారాః కింకరాస్తవ రాఘవ |
[* అధికపాఠః –
యద్యదిచ్ఛసి భద్రం తే తత్సర్వం కరవామ వై |
తతో రామః ప్రసన్నాత్మా తైరిత్యుక్తో మహాబలైః |
*]
ప్రతిగృహ్య చ కాకుత్స్థః సమాలభ్య చ పాణినా |
మానసా మే భవిష్యధ్వమితి తానభ్యచోదయత్ ||

25

తతః ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిమ్ |
అభివాద్య మహాతేజా గమనాయోపచక్రమే ||

26

Balakanda Sarga 27 In Telugu Pdf With Meaning

మరునాడు అందరూ నిద్ర లేచారు. ప్రాతఃకాలము లో ఆచ రించ వలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు.

విశ్వామిత్రుడు రామునితో “రామా! నీకు దివ్యాస్త్రములు అన్ని ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధములో జయింపగలవు.

రామా! నీకు దివ్యమైన దండ చక్రమును, ధర్మ చక్రమును, కాల చక్రమును, విష్ణు చక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, అన్నిటి కంటే ఉత్తమము, శ్రేష్ఠము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించెదను. ఇవి కాకుండా నీకు మోదకి, శిఖరి అనే రెండు గదాయుధములను కూడా ఇస్తాను.

రామా! నీకు ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు రెండు పిడుపాటులను అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగాఉన్న పిడుగు ఇచ్చెదను. నీకు పినాక అస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను.

రామా! నీకు ఆగ్నేయాస్త్రమును, వాయవ్యాస్త్రమును ఇచ్చెదను.

ఓ రామా! నీకు హయశిరము, క్రౌంచ అస్త్రము అనే రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటు వంటి అస్త్రములు, అనగా కంకాళము, ముసలము, కపాలము, కంకణము నీకు ఇస్తున్నాను.

ఓ రామా! నీకు విద్యాధరముఅనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను. నీకు గాంధర్వ అస్త్రమును, సౌర అస్త్రమును ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థను కలుగ చేస్తాయి. నిద్రావస్థనుండి విముక్తులను చేస్తాయి. వీటికి ఆ ప్రభావము ఉంది.

ఓ రామా! నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన, మొదలగు అస్త్రములు, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను.

ఓ రామా! ఇంకా నీకు తామసాస్త్రము, సౌమనాస్త్రము, సంవర్ధాస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రము, పరమ శ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తి వంతము, భయంకరము అయిన త్వష్టురాస్త్రము, మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను.

ఓ రామా! ఈ అస్త్రములు అన్నీ కామ రూపులు. తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు. అత్యంత బలము కలవి. వీటిని నానుండి వెంటనే గ్రహించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు. ఆ అస్త్రములు అన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లబము. అటువంటిది రాముడు ఆ అస్త్రసముదాయమును అవలీలగా అధ్యయనం చేసాడు.

విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్ఛరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే, ఆ అస్త్రమునకు అధి దేవతలు వచ్చిరాముని ముందు నిలబడి “రామా! ఇకనుండి మేమందరమూ నీకు దాసులము” అని పలికారు. విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములు అన్నింటినీ రాముడు భక్తితో స్వీకరించాడు. ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి “మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్ములను స్మరించి నపుడు నా వద్దకు రండి” అనిపలికాడు.

తరువాత రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమయ్యారు

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఏడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ అష్టావింశః సర్గః (28) >>

Ayodhya Kanda Sarga 34 In Telugu – అయోధ్యాకాండ చతుస్త్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 34

అయోధ్యాకాండము చతుస్త్రింశః సర్గము (34వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, కౌసల్య, సుమిత్ర, సీతలతో కలిసి అరణ్యానికి వెళ్ళడానికి రాముడు సిద్ధమవుతాడు. అటువంటి సమయంలో, కౌసల్య రాముని నిరోధిస్తుంది, తల్లి భర్తవ్రతాన్ని గురించి మాట్లాడుతుంది. రాముడు ధర్మం, పితృవాక్యపాలనం గురించి సమాధానమిస్తాడు. సీత, లక్ష్మణులు రాముని వెనుక నడుస్తారు. చివరికి, రాముడు తన తల్లి కౌసల్యకు, తనను అనుమతించమని అభ్యర్థిస్తూ దీవెనలు కోరుతాడు. ఈ సర్గ రాముని ధర్మ నిష్ఠ, పితృవాక్య పాలనం, సీత, లక్ష్మణుల భక్తిని, కౌసల్యాదేవి ప్రేమను ప్రదర్శిస్తుంది.

దశరథసమాశ్వాసనమ్

తతః కమలపత్రాక్షః శ్యామో నిరుదరో మహాన్ |
ఉవాచ రామస్తం సూతం పితురాఖ్యాహి మామితి || ౧ ||

స రామప్రేషితః క్షిప్రం సంతాపకలుషేంద్రియః |
ప్రవిశ్య నృపతిం సూతో నిఃశ్వసంతం దదర్శ హ || ౨ ||

ఉపరక్తమివాదిత్యం భస్మచ్ఛన్నమివానలమ్ |
తటాకమివ నిస్తోయమపశ్యజ్జగతీపతిమ్ || ౩ ||

ఆలోక్య తు మహాప్రాజ్ఞః పరమాకులచేతసమ్ |
రామమేవానుశోచంతం సూతః ప్రాంజలిరాసదత్ || ౪ ||

తం వర్ధయిత్వా రాజానం సూతః పూర్వం జయాశిషా |
భయవిక్లబయా వాచా మందయా శ్లక్ష్ణమబ్రవీత్ || ౫ ||

అయం స పురుషవ్యాఘ్రో ద్వారి తిష్ఠతి తే సుతః |
బ్రాహ్మణేభ్యో ధనం దత్త్వా సర్వం చైవోపజీవినామ్ || ౬ ||

స త్వా పశ్యతు భద్రం తే రామః సత్యపరాక్రమః |
సర్వాన్సుహృద ఆపృచ్ఛ్య త్వామిదానీం దిదృక్షతే || ౭ ||

గమిష్యతి మహారణ్యం తం పశ్య జగతీపతే |
వృతం రాజగుణైః సర్వైరాదిత్యమివ రశ్మిభిః || ౮ ||

స సత్యవాదీ ధర్మాత్మా గాంభీర్యాత్సాగరోపమః |
ఆకాశ ఇవ నిష్పంకో నరేంద్రః ప్రత్యువాచ తమ్ || ౯ ||

సుమంత్రానయ మే దారాన్యే కేచిదిహ మామకాః |
దారైః పరివృతః సర్వైర్ద్రష్టుమిచ్ఛామి రాఘవమ్ || ౧౦ || [ధార్మికమ్]

సోఽంతఃపురమతీత్యైవ స్త్రియస్తా వాక్యమబ్రవీత్ |
ఆర్యాహ్వయతి వో రాజాఽగమ్యతాం తత్ర మా చిరమ్ || ౧౧ ||

ఏవముక్తాః స్త్రియః సర్వాః సుమంత్రేణ నృపాజ్ఞయా |
ప్రచక్రముస్తద్భవనం భర్తురాజ్ఞాయ శాసనమ్ || ౧౨ ||

అర్ధసప్తశతాస్తాస్తు ప్రమదాస్తామ్రలోచనాః |
కౌసల్యాం పరివార్యాథ శనైర్జగ్ముర్ధృతవ్రతాః || ౧౩ ||

ఆగతేషు చ దారేషు సమవేక్ష్య మహీపతిః |
ఉవాచ రాజా తం సూతం సుమంత్రానయ మే సుతమ్ || ౧౪ ||

స సూతో రామమాదాయ లక్ష్మణం మైథిలీం తదా |
జగామాభిముఖస్తూర్ణం సకాశం జగతీపతేః || ౧౫ ||

స రాజా పుత్రమాయాంతం దృష్ట్వా దూరాత్కృతాంజలిమ్ |
ఉత్పపాతాసనాత్తూర్ణమార్తః స్త్రీజనసంవృతః || ౧౬ ||

సోఽభిదుద్రావ వేగేన రామం దృష్ట్వా విశాంపతిః |
తమసంప్రాప్య దుఃఖార్తః పపాత భువి మూర్ఛితః || ౧౭ ||

తం రామోఽభ్యపతత్క్షిప్రం లక్ష్మణశ్చ మహారథః |
విసంజ్ఞమివ దుఃఖేన సశోకం నృపతిం తదా || ౧౮ ||

స్త్రీసహస్రనినాదశ్చ సంజజ్ఞే రాజవేశ్మని |
హా హా రామేతి సహసా భూషణధ్వనిమూర్ఛితః || ౧౯ ||

తం పరిష్వజ్య బాహుభ్యాం తావుభౌ రామలక్ష్మణౌ |
పర్యంకే సీతయా సార్ధం రుదంతః సమవేశయన్ || ౨౦ ||

అథ రామో ముహూర్తేన లబ్ధసంజ్ఞం మహీపతిమ్ |
ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవపరిప్లుతమ్ || ౨౧ ||

ఆపృచ్ఛే త్వాం మహారాజ సర్వేషామీశ్వరోఽసి నః |
ప్రస్థితం దండకారణ్యం పశ్య త్వం కుశలేన మామ్ || ౨౨ ||

లక్ష్మణం చానుజానీహి సీతా చాన్వేతి మాం వనమ్ |
కారణైర్బహుభిస్తథ్యైర్వార్యమాణౌ న చేచ్ఛతః || ౨౩ ||

అనుజానీహి సర్వాన్నః శోకముత్సృజ్య మానద |
లక్ష్మణం మాం చ సీతాం చ ప్రజాపతిరివ ప్రజాః || ౨౪ ||

ప్రతీక్షమాణమవ్యగ్రమనుజ్ఞాం జగతీపతేః |
ఉవాచ రాజా సంప్రేక్ష్య వనవాసాయ రాఘవమ్ || ౨౫ ||

అహం రాఘవ కైకేయ్యా వరదానేన మోహితః |
అయోధ్యాయాస్త్వమేవాద్య భవ రాజా నిగృహ్య మామ్ || ౨౬ ||

ఏవముక్తో నృపతినా రామో ధర్మభృతాం వరః |
ప్రత్యువాచాంజలిం కృత్వా పితరం వాక్యకోవిదః || ౨౭ ||

భవాన్వర్షసహస్రాయ పృథివ్యా నృపతే పతిః |
అహం త్వరణ్యే వత్స్యామి న మే కార్యం త్వయాఽనృతమ్ || ౨౮ ||

నవ పంచ చ వర్షాణి వనవాసే విహృత్య తే |
పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప || ౨౯ ||

రుదన్నార్తః ప్రియం పుత్రం సత్యపాశేన సంయతః |
కైకేయ్యా చోద్యమానస్తు మిథో రాజా తమబ్రవీత్ || ౩౦ ||

శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ |
గచ్ఛస్వారిష్టమవ్యగ్రః పంథానమకుతోభయమ్ || ౩౧ ||

న హి సత్యాత్మనస్తాత ధర్మాభిమనసస్తవ |
వినివర్తయితుం బుద్ధిః శక్యతే రఘునందన || ౩౨ ||

అద్య త్విదానీం రజనీం పుత్ర మా గచ్ఛ సర్వథా |
ఏకాహదర్శనేనాపి సాధు తావచ్చరామ్యహమ్ || ౩౩ ||

మాతరం మాం చ సంపశ్యన్వసేమామద్య శర్వరీమ్ |
తర్పితః సర్వకామైస్త్వం శ్వః కాలే సాధయిష్యసి || ౩౪ ||

దుష్కరం క్రియతే పుత్ర సర్వథా రాఘవ త్వయా |
మత్ప్రియార్థం ప్రియాంస్త్యక్త్వా యద్యాసి విజనం వనమ్ || ౩౫ ||

న చైతన్మే ప్రియం పుత్ర శపే సత్యేన రాఘవ |
ఛన్నయా చలితస్త్వస్మి స్త్రియా ఛన్నాగ్నికల్పయా || ౩౬ ||

వంచనా యా తు లబ్ధా మే తాం త్వం నిస్తర్తుమిచ్ఛసి |
అనయా వృత్తసాదిన్యా కైకేయ్యాఽభిప్రచోదితః || ౩౭ ||

న చైతదాశ్చర్యతమం యత్త్వం జ్యేష్ఠః సుతో మమ |
అపానృతకథం పుత్ర పితరం కర్తుమిచ్ఛసి || ౩౮ ||

అథ రామస్తథా శ్రుత్వా పితురార్తస్య భాషితమ్ |
లక్ష్మణేన సహ భ్రాత్రా దీనో వచనమబ్రవీత్ || ౩౯ ||

ప్రాప్స్యామి యానద్య గుణాన్కో మే శ్వస్తాన్ప్రదాస్యతి |
ఉపక్రమణమేవాతః సర్వకామైరహం వృణే || ౪౦ ||

ఇయం సరాష్ట్రా సజనా ధనధాన్యసమాకులా |
మయా విసృష్టా వసుధా భరతాయ ప్రదీయతామ్ || ౪౧ ||

వనవాసకృతా బుద్ధిర్న చ మేఽద్య చలిష్యతి |
యస్తుష్టేన వరో దత్తః కైకేయ్యై వరద త్వయా || ౪౨ ||

దీయతాం నిఖిలేనైవ సత్యస్త్వం భవ పార్థివ |
అహం నిదేశం భవతో యథోక్తమనుపాలయన్ || ౪౩ ||

చతుర్దశ సమా వత్స్యే వనే వనచరైః సహ |
మా విమర్శో వసుమతీ భరతాయ ప్రదీయతామ్ || ౪౪ ||

న హి మే కాంక్షితం రాజ్యం సుఖమాత్మని వా ప్రియమ్ |
యథానిదేశం కర్తుం వై తవైవ రఘునందన || ౪౫ ||

అపగచ్ఛతు తే దుఃఖం మా భూర్బాష్పపరిప్లుతః |
న హి క్షుభ్యతి దుర్ధర్షః సముద్రః సరితాం పతిః || ౪౬ ||

నైవాహం రాజ్యమిచ్ఛామి న సుఖం న చ మైథిలీమ్ |
నైవ సర్వానిమాన్కామాన్న స్వర్గం నైవ జీవితమ్ || ౪౭ ||

త్వామహం సత్యమిచ్ఛామి నానృతం పురుషర్షభ |
ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శపే || ౪౮ ||

న చ శక్యం మయా తాత స్థాతుం క్షణమపి ప్రభో |
స శోకం ధారయస్వేమం న హి మేఽస్తి విపర్యయః || ౪౯ ||

అర్థితో హ్యస్మి కైకేయ్యా వనం గచ్ఛేతి రాఘవ |
మయా చోక్తం వ్రజామీతి తత్సత్యమనుపాలయే || ౫౦ ||

మా చోత్కంఠాం కృథా దేవ వనే రంస్యామహే వయమ్ |
ప్రశాంతహరిణాకీర్ణే నానాశకునినాదితే || ౫౧ ||

పితా హి దైవతం తాత దేవతానామపి స్మృతమ్ |
తస్మాద్దైవతమిత్యేవ కరిష్యామి పితుర్వచః || ౫౨ ||

చతుర్దశసు వర్షేషు గతేషు నరసత్తమ |
పునర్ద్రక్ష్యసి మాం ప్రాప్తం సంతాపోఽయం విముచ్యతామ్ || ౫౩ ||

యేన సంస్తంభనీయోఽయం సర్వో బాష్పగళో జనః |
స త్వం పురుషశార్దూల కిమర్థం విక్రియాం గతః || ౫౪ ||

పురం చ రాష్ట్రం చ మహీ చ కేవలా
మయా నిసృష్టా భరతాయ దీయతామ్ |
అహం నిదేశం భవతోఽనుపాలయ-
-న్వనం గమిష్యామి చిరాయ సేవితుమ్ || ౫౫ ||

మయా నిసృష్టాం భరతో మహీమిమాం
సశైలషండాం సపురాం సకాననామ్ |
శివాం సుసీమామనుశాస్తు కేవలం
త్వయా యదుక్తం నృపతే తథాఽస్తు తత్ || ౫౬ ||

న మే తథా పార్థివ ధీయతే మనో
మహత్సు కామేషు న చాత్మనః ప్రియే |
యథా నిదేశే తవ శిష్టసమ్మతే
వ్యపైతు దుఃఖం తవ మత్కృతేఽనఘ || ౫౭ ||

తదద్య నైవానఘ రాజ్యమవ్యయం
న సర్వకామాన్న సుఖం న మైథిలీమ్ |
న జీవితం త్వామనృతేన యోజయ-
-న్వృణీయ సత్యం వ్రతమస్తు తే తథా || ౫౮ ||

ఫలాని మూలాని చ భక్షయన్వనే
గిరీంశ్చ పశ్యన్సరితః సరాంసి చ |
వనం ప్రవిశ్యైవ విచిత్రపాదపం
సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతిః || ౫౯ ||

ఏవం స రాజా వ్యసనాభిపన్నః
శోకేన దుఃఖేన చ తామ్యమానః |
ఆలింగ్య పుత్రం సువినష్టసంజ్ఞో
మోహం గతో నైవ చిచేష్ట కించిత్ || ౬౦ ||

దేవ్యస్తతః సంరురుదుః సమేతా-
-స్తాం వర్జయిత్వా నరదేవపత్నీమ్ |
రుదన్సుమంత్రోఽపి జగామ మూర్ఛాం
హాహాకృతం తత్ర బభూవ సర్వమ్ || ౬౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్త్రింశః సర్గః || ౩౪ ||

Ayodhya Kanda Sarga 34 Meaning In Telugu

రాముడు ఆదేశానుసారము సుమంత్రుడు రామ, లక్ష్మణ, సీతల రాకను దశరథునికి ఎరింగించుటకు అంతఃపురములోకి వెళ్లాడు. అంత:పురములో దశరథుడు గ్రహణం పట్టిన చంద్రుడి మాదిరి కళావిహీనంగా కూర్చుని ఉన్నాడు. సుమంత్రుడు దశరథుని వద్దకుపోయి “మహారాజులకు జయము. తమరి కుమారుడు రామలక్ష్మణులు, తమరి కోడలు సీత తమరి దర్శనార్ధము వచ్చి ఉన్నారు.” అని అన్నాడు.

ఆ మాటలువిన్న దశరథుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. సుమంత్రుని వంక బేలగా చూచాడు. మరలా సుమంత్రుడు ఇలా అన్నాడు. “మహారాజా! వారు అరణ్యములకు పోయే ముందు తమరి దర్శనార్థము ద్వారము వద్ద నిలబడి ఉన్నారు. వారికి తమరి దర్శన భాగ్యము కలిగించండి. అంతేకాదు అడవులకు పోయే ముందు మీరు కూడా రాముని ఒక సారి కనులారా చూడండి. తరువాత మీకు ఆ భాగ్యం కలుగుతుందో లేదో.” అని అన్నాడు సుమంత్రుడు.

అప్పుడు దశరథుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “సుమంత్రా! అంత:పురములో ఉన్న నా భార్యలను అందరినీ తీసుకొని రమ్ము. వారితో కలిసి నేను రాముని చూడదలచాను.” అని అన్నాడు.

వెంటనే సుమంత్రుడు అంత:పురములోనికి వెళ్లి దశరథుని భార్యలనందరినీ పిలుచుకొని వచ్చాడు. దశరథునికి 350 మంది భార్యలు. వారి అందరిలోకి పెద్దభార్య కౌసల్య కౌసల్య ముందురాగా, 350 మంది అక్కడకు వచ్చారు. అందరూ వచ్చారు అని సరి చూసుకొని తృప్తిపడిన తరువాత దశరధుడు సుమంత్రుని చూచి “సుమంత్రా! ఇప్పుడు రాముని లోపలకు తీసుకొని రా!” అని ఆదేశించాడు.

సుమంత్రుడు బయటకు వెళ్లి రాముడు, లక్ష్మణుడు, సీతను లోపలకు తీసుకొని వెళ్లాడు. లోపల దశరథుడు తన 350మంది భార్యలు చుట్టు ఉండగా ఒక ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. రాముని చూడగానే దశరథునకు దు:ఖము ఆగలేదు. వెంటనే ఆసనము మీదినుండి లేచాడు. రాముని వద్దకు గబా గబా నడుచుకుంటూ వెళ్లాడు. కాని మధ్యలోనే దుఃఖము ఆపుకోలేక కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు.

తండ్రి గారు కిందపడటం చూచిన రామలక్ష్మణులు ఆయన వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు. రాముని చూడగానే అంతఃపుర స్త్రీలందరూ దుఃఖము ఆపుకోలేక హా హా కారాలు చేసారు. వారి దు:ఖమును చూచి రామలక్ష్మణులకు కూడా దు:ఖము ఆగలేదు. వారు తమ తండ్రి దశరథుని పైకి లేపి ఒక పాన్పు మీద పడుకోబెట్టారు. దశరథుడు స్పృహలోకి వచ్చాడు. దుఃఖించుచున్న తండ్రిని చూచి రాముడు ఇలా అన్నాడు.

“మహారాజా! మీరు మాకందరికీ అధిపతులు. తమరి వద్దనుండి నేను దండకారణ్యములకు పోవుటకు అనుమతి కోరుచున్నాను. కాస్త తల ఎత్తి నన్ను చూడండి. నాతో పాటు నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసమునకు వచ్చుటకు అనుమతి ఇవ్వండి. నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను. వీరిద్దరూ నా మాట వినలేదు. నాతోపాటు అరణ్యములకు వస్తానని పట్టుబట్టారు. ఆకారణంగా వీరు కూడా నా వెంట అడవులకు వస్తున్నారు. కాబట్టి మా ముగ్గురికీ అనుమతి ప్రసాదించండి.” అని పలికి రాముడు చేతులు కట్టుకొని తండ్రి ఎదురుగా నిలబడ్డాడు. తండ్రిమాటలు విని రాముడు ఇలా అన్నాడు. “మహారాజా! తమరు అయోధ్యను ఎన్నో సంవత్సరముల నుండి పరిపాలిస్తున్నారు. అందుకని తమరు అయోధ్యలోనే ఉండండి. నేను అడవులలో ఉంటాను. నా గురించి మీరు ఆడినమాట తప్పకండి. తమరు విధించిన పదునాలుగు సంవత్సరముల వనవాసము తృటిలో పూర్తిచేసుకొని మీ పాదముల చెంత వాలుతాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని పలికాడు రాముడు.

దశరథుని పక్కనే ఉన్న కైక “ఏమిటా మంతనాలు. తొందరగా అడవులకు వెళ్లమనండి. మరలా భరతుడు వచ్చేస్తాడు. ఇంకా ఆలస్యం చెయ్యడం మంచిది కాదు” అని రహస్యంగా దశరథునితో చెప్పింది. రామునితో తనివితీరా మాట్లాడుకోడానికి కూడా అనుమతించని కైకను చూచి దుఃఖిస్తూ దశరథుడు రామునితో ఇలాఅన్నాడు. “రామా! నీకు, నీ భార్యకు, తమ్ముడికి మంగళమగు గాక! నీవు అన్నట్టు ఈ వనవాసము తృటిలో ముగించుకొని రమ్ము. నీ రాకకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రామా! నీవు ధర్మము పాటిస్తావు. అందుకని నిన్ను వెళవద్దు అన్నా వెళ్లడం మానవు. నీ బుద్ధి మరల్చడం నాకు చేతకాదు. కాని ఒక కోరిక. ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దుటే వెళ్లు. ఈ ఒక్కరోజు నిన్ను కనులారా చూస్తూ కాలం గడిపేస్తాను. నాకు నీ తల్లి కౌసల్యకు కనువిందు చేస్తూ ఈ రాత్రికి ఉండు. రేపు ఉదయమే వెళ్లు.

ఓరామా! నేను అన్న మాటను నిలబెట్టడానికి నువ్వు అరణ్యములకు వెళుతున్నావు. ఇంతవరకూ ఎవరూ చేయలేని పని నువ్వు చేస్తున్నావు. రామా! నువ్వు అరణ్యములకు పోవడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. ఇదుగో ఈ దుష్టురాలు కైక నన్ను మోసం చేసింది. నా దగ్గర నుండి ముందు మాట తీసుకొని తరువాత ఈ వనవాస విషయం విషం కక్కినట్టు కక్కింది. ఇది సత్యము. నువ్వు నా జ్యేష్ట పుత్రుడవు కాబట్టి, తండ్రిమాట నిలబెట్టడానికి, ఆ వంచకి మాటలను నువ్వు నిజం చేస్తున్నావు. నీరాజ్యం నీవు తీసుకోమని చెప్పినా నీవు వినడం లేదు. ఏం చేసేది.”అని దుఃఖిస్తున్నాడు దశరథుడు.

ఆమాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. “తండ్రీ! ఈ రాజభోగములు శాశ్వతములు కావు కదా! ఈనాడు ఉంటాయి రేపుపోతాయి. శాశ్వతముగా నిలిచిపోయేది, సత్యము పలకడం, ఆడిన మాట తప్పకుండా ఉండటం. నీవు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను. అయోధ్యమీద నాకు ఉన్న రాజ్యాధికారమును నేను వదులుకొంటున్నాను. ఈ రాజ్యమును భరతునికి ఇమ్ము. తల్లి కైకకు ఇచ్చిన రెండు వరములు పూర్తిగా నెరవేర్చుము. భరతుని రాజ్యాభిషిక్తుని చేయుము.

మీరు అన్న మాట నేను ఎలా నిలబెట్టుకుంటున్నానో తమరు కూడా తల్లి కైకకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీమాట ప్రకారము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములలో ఉంటాను. మీరు కూడా భరతునికి రాజ్యాభిషేకము చేయండి. నాకు ఈ రాజ్యము మీద గానీ, రాజభోగముల మీద గానీ ఎలాంటి వ్యామోహము లేదు. తమరి ఆదేశము నెరవేర్చడమే నా కర్తవ్యము. నా గురించి మీరు దు:ఖపడ వద్దు. మీరు అన్న మాటను నిలబెట్టుకోండి.

నేనుకూడా సత్యము మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. నానిర్ణయము నేను మార్చుకోను. నేను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేను. ఈ ఒక్కరాత్రి ఉన్నంత మాత్రాన ఒరిగేదేముంది. నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమంది. నేను వెళతాను అని అన్నాను. ఆమాట నిలబెట్టుకుంటాను.” అని అన్నాడు రాముడు.

రాముడు ఎన్ని విధముల అనునయించిననూ దశరథుడు దు:ఖము మానలేదు. రాముడు మరలా ఇలా అన్నాడు. “రాజా! తమరు మా గురించి దిగులు పెట్టుకోకండి. మీరు నాకు పితృదేవులు. దైవసమానులైన మీ మాట నాకు శిరోధార్యము. ఓ రాజా! మరలా చెప్పుచున్నాను. ఈ పదునాలుగు సంవత్సరములు నిమేషమాత్రములో గడిపి మరలా మీపాదముల చెంతకు వస్తాను. అప్పుడు నేను శాశ్వతంగా మీ వద్దనే ఉంటాను. ఇప్పుడు మాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి.

తండ్రిగారూ! అటు చూడండి. అయోధ్యా వాసులు ఎంతో దు:ఖపడుతున్నారు. మీరు మహారాజులు. వారిని మీరు ఓదార్చాలి. అటువంటి మీరే ఇలా దుఃఖిస్తే వారిని ఎవరూ ఓదారుస్తారు. కాబట్టి వెంటనే మాకు అడవులకు పోవుటకు అనుమతి ఇవ్వండి. మీరు వెంటనే భరతునికి పట్టాభిషేకము చేయించండి. అన్నమాట నిలబెట్టుకోండి.”అనిపలికాడు రాముడు.

రాముని మాటలకు దశరథునికి దుఃఖము పొంగుకొని వచ్చింది. ఏడుస్తూ కిందపడిపోయాడు. ఒక్క కైక తప్ప మిగిలిన రాణులందరూ హాహాకారాలు చేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచత్రింశః సర్గః (35) >>

Balakanda Sarga 36 In Telugu – బాలకాండ షట్త్రింశః సర్గః

Balakanda Sarga 36 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షట్త్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో షట్త్రింశః సర్గః కీలకమైన భాగం. ఈ సర్గలో, రాముడు విశ్వామిత్రుని ఆధ్వర్యంలో యజ్ఞాలను రక్షించడానికి సిద్ధమవుతాడు. తన భుజబలం, ధైర్యంతో తాటకను సంహరిస్తాడు. తాటక వధతో రాముడు తన వీరత్వాన్ని ప్రదర్శించి, ఋషులు, మునులు ఆనందంతో ఉప్పొంగుతారు. ఈ సర్గలో విశ్వామిత్రుడు రాముడికి అస్త్రశాస్త్రాలను నేర్పుతాడు, దీని వలన రాముడు మరింత శక్తివంతుడవుతాడు.

ఉమామాహాత్మ్యమ్

ఉక్తవాక్యే మునౌ తస్మిన్నుభౌ రాఘవలక్ష్మణౌ |
అభినంద్య కథాం వీరావూచతుర్మునిపుంగవమ్ ||

1

ధర్మయుక్తమిదం బ్రహ్మన్కథితం పరమం త్వయా |
దుహితుః శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి ||

2

విస్తరం విస్తరజ్ఞోఽసి దివ్యమానుషసంభవమ్ |
త్రీన్పథో హేతునా కేన ప్లావయేల్లోకపావనీ ||

3

కథం గంగా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా |
త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైః సమన్వితా ||

4

తథా బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రస్తపోధనః |
నిఖిలేన కథాం సర్వామృషిమధ్యే న్యవేదయత్ ||

5

పురా రామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః | [శితికంఠో]
దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే ||

6

శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతమ్ |
తస్య సంక్రీడమానస్య మహాదేవస్య ధీమతః ||

7

న చాపి తనయో రామ తస్యామాసీత్పరంతప |
తతో దేవాః సముద్విగ్నాః పితామహపురోగమాః ||

8

యదిహోత్పద్యతే భూతం కస్తత్ప్రతిసహిష్యతే |
అభిగమ్య సురాః సర్వే ప్రణిపత్యేదమబ్రువన్ ||

9

దేవ దేవ మహాదేవ లోకస్యాస్య హితే రత |
సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి ||

10

న లోకా ధారయిష్యంతి తవ తేజః సురోత్తమ |
బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర ||

11

త్రైలోక్యహితకామార్థం తేజస్తేజసి ధారయ |
రక్ష సర్వానిమాఁల్లోకాన్నాలోకం కర్తుమర్హసి ||

12

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకమహేశ్వరః |
బాఢమిత్యబ్రవీత్సర్వాన్పునశ్చేదమువాచ హ ||

13

ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేవ సహోమయా |
త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్ఛతు ||

14

యదిదం క్షుభితం స్థానాన్మమ తేజో హ్యనుత్తమమ్ |
ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః ||

15

ఏవముక్తాస్తతో దేవాః ప్రత్యూచుర్వృషభధ్వజమ్ |
యత్తేజః క్షుభితం హ్యేతత్తద్ధరా ధారయిష్యతి ||

16

ఏవముక్తః సురపతిః ప్రముమోచ మహీతలే |
తేజసా పృథివీ యేన వ్యాప్తా సగిరికాననా ||

17

తతో దేవాః పునరిదమూచుశ్చాథ హుతాశనమ్ |
ప్రవిశ త్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః ||

18

తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః |
దివ్యం శరవణం చైవ పావకాదిత్యసన్నిభమ్ ||

19

యత్ర జాతో మహాతేజాః కార్తికేయోఽగ్నిసంభవః |
అథోమాం చ శివం చైవ దేవాః సర్షిగణాస్తదా ||

20

పూజయామాసురత్యర్థం సుప్రీతమనసస్తతః |
అథ శైలసుతా రామ త్రిదశానిదమబ్రవీత్ ||

21

అప్రియస్య కృతస్యాద్య ఫలం ప్రాప్స్యథ మే సురాః |
ఇత్యుక్త్వా సలిలం గృహ్య పార్వతీ భాస్కరప్రభా ||

22

సమన్యురశపత్సర్వాన్క్రోధసంరక్తలోచనా |
యస్మాన్నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా ||

23

అపత్యం స్వేషు దారేషు నోత్పాదయితుమర్హథ |
అద్యప్రభృతి యుష్మాకమప్రజాః సంతు పత్నయః ||

24

ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి |
అవనే నైకరూపా త్వం బహుభార్యా భవిష్యసి ||

25

న చ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధకలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్ఛతీ ||

26

తాన్సర్వాన్వ్రీడితాన్దృష్ట్వా సురాన్సురపతిస్తదా |
గమనాయోపచక్రామ దిశం వరుణపాలితామ్ ||

27

స గత్వా తప ఆతిష్ఠత్పార్శ్వే తస్యోత్తరే గిరేః |
హిమవత్ప్రభవే శృంగే సహ దేవ్యా మహేశ్వరః ||

28

ఏష తే విస్తరో రామ శైలపుత్ర్యా నివేదితః |
గంగాయాః ప్రభవం చైవ శృణు మే సహలక్ష్మణః ||

29

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్త్రింశః సర్గః ||

Balakanda Sarga 36 Meaning In Telugu

అంత వరకువిన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

ఓ మహర్షీ! హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని మూడు మార్గములలో ప్రవహిస్తూ ఉంది. ఎందుకని గంగానదీ ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది. వివరించండి.” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

“మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ ఉమా దేవికి మహాశివునికి ఎంత కాలానికి పుత్ర సంతానము కలగ లేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి, ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరు బ్రహ్మదేవుని తీసుకొని మహా శివుని వద్దకు వెళ్లారు.

బ్రహ్మ దేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. ” ఓ మహాదేవా! మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడయిన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి. మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి.” అని ప్రార్థించారు.

వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. “దేవతలారా! మీరు చెప్పినట్టే చేసిదను. కాని నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి.” అని అన్నాడు.

దేవతలందరూ ముక్త కంఠంతో “మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది” అని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేసాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది.

అప్పుడు దేవతలు అగ్ని దేవుని చూచి ” ఓ అగ్నిదేవా ! నీవు వాయు దేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో” అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపజేసుకొన్నాడు.

మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్ని దేవుని లో నుండి మహా వీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలు అందరూ మహా శివుని ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉ మాదేవికి పట్టరాని కోపం వచ్చింది.

” ఓ దేవతలారా! నేను నా భర్తయందు పుత్రుని కనవలెనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేసారు. కాబట్టి మీరందరికీ మీ భార్యలవలన సంతానము కలుగకుండు గాక!” అని తీవ్రంగా శపించింది.

తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది.

“ఓ భూదేవీ! నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు. నావలెనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలుగ కుండు గాక!” అని శపించింది.

తరువాత మహా శివుడు ఉమా దేవితో సహా పశ్చిమదిక్కుగా పోయి హిమవత్పర్వతము మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాస గిరి మీద తపస్సు చేసాడు.

ఓరామా! ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను. అని విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ సప్తత్రింశః సర్గః (37) >>

Balakanda Sarga 25 In Telugu – బాలకాండ పంచవింశః సర్గః

Balakanda Sarga 25 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచవింశః సర్గలో, విశ్వామిత్ర మహర్షి తాటాకా అనే రాక్షసుడి పుట్టుక, వివాహం మరియు శాపాన్ని వివరిస్తాడు మరియు ఆమె సమాజం పట్ల క్రూరంగా ప్రవర్తించే స్త్రీని చంపడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఆమె ముప్పును తొలగించమని రాముడిని కోరింది.

తాటకావృత్తాంతః

అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమమ్ |
శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరమ్ ||

1

అల్పవీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |
కథం నాగసహస్రస్య ధారయత్యబలా బలమ్ ||

2

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః |
[* హర్షయన్ శ్లక్ష్ణయా వాచా సలక్ష్మణమరిందమమ్ | *]
విశ్వామిత్రోఽబ్రవీద్వాక్యం శృణు యేన బలోత్తరా ||

3

వరదానకృతం వీర్యం ధారయత్యబలా బలమ్ |
పూర్వమాసీన్మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్ ||

4

అనపత్యః శుభాచారః స చ తేపే మహత్తపః |
పితామహస్తు సుప్రీతస్తస్య యక్షపతేస్తదా ||

5

కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామతః |
బలం నాగసహస్రస్య దదౌ చాస్యాః పితామహః ||

6

న త్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః |
తాం తు జాతాం వివర్ధంతీం రూపయౌవనశాలినీమ్ ||

7

జంభపుత్రాయ సుందాయ దదౌ భార్యాం యశస్వినీమ్ |
కస్యచిత్త్వథ కాలస్య యక్షీ పుత్రం వ్యజాయత ||

8

మారీచం నామ దుర్ధర్షం యః శాపాద్రాక్షసోఽభవత్ |
సుందే తు నిహతే రామ సాగస్త్యం మునిపుంగవమ్ ||

9

తాటకా సహ పుత్రేణ ప్రధర్షయితుమిచ్ఛతి |
భక్షార్థం జాతసంరంభా గర్జంతీ సాఽభ్యధావత ||

10

ఆపతంతీం తు తాం దృష్ట్వా అగస్త్యో భగవానృషిః |
రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సః ||

11

అగస్త్యః పరమక్రుద్ధస్తాటకామపి శప్తవాన్ |
పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతాననా ||

12

ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తు తే |
సైషా శాపకృతామర్షా తాటకా క్రోధమూర్ఛితా ||

13

దేశముత్సాదయత్యేనమగస్త్యచరితం శుభమ్ |
ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణామ్ ||

14

గోబ్రాహ్మణహితార్థాయ జహి దుష్టపరాక్రమామ్ |
న హ్యేనాం శాపసంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్ ||

15

నిహంతుం త్రిషు లోకేషు త్వామృతే రఘునందన |
న హి తే స్త్రీవధకృతే ఘృణా కార్యా నరోత్తమ ||

16

చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూనునా |
నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్ ||

17

పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా |
రాజ్యభారనియుక్తానామేష ధర్మః సనాతనః ||

18

అధర్మ్యాం జహి కాకుత్స్థ ధర్మో హ్యస్యా న విద్యతే |
శ్రూయతే హి పురా శక్రో విరోచనసుతాం నృప ||

19

పృథివీం హంతుమిచ్ఛంతీం మంథరామభ్యసూదయత్ |
విష్ణునా చ పురా రామ భృగుపత్నీ దృఢవ్రతా ||

20

అనింద్రం లోకమిచ్ఛంతీ కావ్యమాతా నిషూదితా |
ఏతైరన్యైశ్చ బహుభీ రాజపుత్ర మహాత్మభిః ||

21

అధర్మనిరతా నార్యో హతాః పురుషసత్తమైః |
తస్మాదేనాం ఘృణాం త్యక్త్వా జహి మచ్ఛాసనాన్నృప ||

22

విశ్వామిత్రుని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

” ఓ మునిపుంగవా! సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా. యక్షిణి అయిన తాటకకు అంత బలం, వీరత్వము ఎలా వచ్చింది.” అని అడిగాడు.

దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. “ఓ రామా! పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు. ఆ యక్షుడు సంతానము కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు వేయి ఏనుగుల బలవంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు కాని పుత్ర సంతానము మాత్రము ఇవ్వలేదు. ఆమె పేరు తాటక.

తాటక పెరిగి పెద్దది అయింది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనే వాడికి ఇచ్చి వివాహం చేసాడు. సుందుడికి, తాటకకు మహా బలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు.

అగస్త్యుని శాపము వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపి తినడానికి అతని మీదికి వెళ్లారు.అప్పుడు అగస్త్యుడు మారీచుని “నీవు రాక్షసుడివి కా!” అని శపించాడు. తాటకను “నీవు వికృత రూపంతో, భయంకరంగా మనుష్యులను చంపి తింటూ, జీవించు” అని శపించాడు. అప్పటి నుండి తాటక అగస్యుడు సంచరించిన ఈ వనమును నాశనం చేయసాగింది.

ఓ రామా! తాటక స్త్రీ అని సంకోచించ వద్దు. ఆమె దుర్మార్గురాలు. లోకకంటకు రాలు. మునులను, బ్రాహ్మణులను రక్షించుటకు ఆమె సంహరించు. ఈమెకు ఉన్న వరములు, శాపములు వలన ఈమెను నీవు తప్ప వేరెవ్వరూ సంహరించలేరు.

లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ, పురుష బేధము లేకుండా ఎవరినైనా సంహరించవచ్చును. రాజు ప్రజలను రక్షించ డానికి చేసే పని పాపము అయినా సరే రాజుకు ఆపాపము అంటదు. ఇది రాజ్యపాలనలో ముఖ్యసూత్రము. ధర్మానికి విరుద్ధంగా, ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపము కాదు.

పూర్వము విరోచనుని కుమార్తె, భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. పూర్వము శుక్రాచార్యుని తల్లి, లోకములో ఇంద్రుడు ఉండకూడదు, అనే కోరికతో తీవ్రంగా తపస్సుచేసింది. ధర్మ విరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణువు.

ఓ రామా! వీరే కాదు. ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు. కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఐదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ షడ్వింశః సర్గః (26) >>

Ayodhya Kanda Sarga 33 In Telugu – అయోధ్యాకాండ త్రయస్త్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 33

అయోధ్యాకాండము త్రయస్త్రింశః సర్గము (32వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, లక్ష్మణుడు రాముని మాటలు విని బాధపడతాడు. రాముని అనుసరించాలని నిర్ణయిస్తాడు. సీత కూడా అరణ్యవాసానికి రాముడితో పాటు వెళ్లాలని కోరుతుంది. చివరికి రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అటు, ప్రజలు రాముని వెనక వెళ్లాలని నిర్ణయిస్తారు. ఈ సర్గ రాముని త్యాగం, సీత లక్ష్మణుల భక్తిని మరియు ప్రజల ప్రేమను చూపిస్తుంది. అరణ్యవాసానికి బయలుదేరిన రాముడు, సీత, లక్ష్మణుల ప్రయాణం ఈ సర్గలో ప్రధానాంశంగా ఉంటుంది.

పౌరవాక్యమ్

దత్త్వా తు సహ వైదేహ్యా బ్రాహ్మణేభ్యో ధనం బహు |
జగ్మతుః పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ || ౧ ||

తతో గృహీతే దుష్ప్రేక్షే త్వశోభేతాం తదాయుధే |
మాలాదామభిరాబద్ధే సీతయా సమలంకృతే || ౨ ||

తతః ప్రాసాదహర్మ్యాణి విమానశిఖరాణి చ |
అధిరుహ్య జనః శ్రీమానుదాసీనో వ్యలోకయత్ || ౩ ||

న హి రథ్యాః స్మ శక్యంతే గంతుం బహుజనాకులాః |
ఆరుహ్య తస్మాత్ప్రాసాదాన్దీనాః పశ్యంతి రాఘవమ్ || ౪ ||

పదాతిం వర్జితచ్ఛత్రం రామం దృష్ట్వా తదా జనాః |
ఊచుర్బహువిధా వాచః శోకోపహతచేతసః || ౫ ||

యం యాంతమనుయాతి స్మ చతురంగబలం మహత్ |
తమేకం సీతయా సార్ధమనుయాతి స్మ లక్ష్మణః || ౬ ||

ఐశ్వర్యస్య రసజ్ఞః సన్కామినాం చైవ కామదః |
నేచ్ఛత్యేవానృతం కర్తుం పితరం ధర్మగౌరవాత్ || ౭ ||

యా న శక్యా పురా ద్రష్టుం భూతైరాకాశగైరపి |
తామద్య సీతాం పశ్యంతి రాజమార్గగతా జనాః || ౮ ||

అంగరాగోచితాం సీతాం రక్తచందనసేవినీమ్ |
వర్షముష్ణం చ శీతం చ నేష్యంత్యాశు వివర్ణతామ్ || ౯ ||

అద్య నూనం దశరథః సత్త్వమావిశ్య భాషతే |
న హి రాజా ప్రియం పుత్రం వివాసయితుమిచ్ఛతి || ౧౦ ||

నిర్గుణస్యాపి పుత్రస్య కథం స్యాద్విప్రవాసనమ్ |
కిం పునర్యస్య లోకోఽయం జితో వృత్తేన కేవలమ్ || ౧౧ ||

ఆనృశంస్యమనుక్రోశః శ్రుతం శీలం దమః శమః |
రాఘవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషర్షభమ్ || ౧౨ ||

తస్మాత్తస్యోపఘాతేన ప్రజాః పరమపీడితాః |
ఔదకానీవ సత్త్వాని గ్రీష్మే సలిలసంక్షయాత్ || ౧౩ ||

పీడయా పీడితం సర్వం జగదస్య జగత్పతేః |
మూలస్యేవోపఘాతేన వృక్షః పుష్పఫలోపగః || ౧౪ ||

మూలం హ్యేష మనుష్యాణాం ధర్మసారో మహాద్యుతిః |
పుష్పం ఫలం చ పత్రం చ శాఖాశ్చాస్యేతరే జనాః || ౧౫ ||

తే లక్ష్మణ ఇవ క్షిప్రం సపత్న్యస్సహబాంధవాః |
గచ్ఛంతమనుగచ్ఛామో యేన గచ్ఛతి రాఘవః || ౧౬ ||

ఉద్యానాని పరిత్యజ్య క్షేత్రాణి చ గృహాణి చ |
ఏకదుఃఖసుఖా రామమనుగచ్ఛామ ధార్మికమ్ || ౧౭ ||

సముద్ధృతనిధానాని పరిధ్వస్తాజిరాణి చ |
ఉపాత్తధనధాన్యాని హృతసారాణి సర్వశః || ౧౮ ||

రజసాఽభ్యవకీర్ణాని పరిత్యక్తాని దైవతైః |
మూషకైః పరిధావద్భిరుద్బిలైరావృతాని చ || ౧౯ ||

అపేతోదకధూమాని హీనసమ్మార్జనాని చ |
ప్రణష్టబలికర్మేజ్యామంత్రహోమజపాని చ || ౨౦ ||

దుష్కాలేనేవ భగ్నాని భిన్నభాజనవంతి చ |
అస్మత్త్యక్తాని వేశ్మాని కైకేయీ ప్రతిపద్యతామ్ || ౨౧ ||

వనం నగరమేవాస్తు యేన గచ్ఛతి రాఘవః |
అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనమ్ || ౨౨ ||

బిలాని దంష్ట్రిణః సర్వే సానూని మృగపక్షిణః |
త్యజంత్యస్మద్భయాద్భీతాః గజాః సింహా వనాన్యపి || ౨౩ ||

అస్మత్త్యక్తం ప్రపద్యంతాం సేవ్యమానం త్యజంతు చ |
తృణమాంసఫలాదానాం దేశం వ్యాలమృగద్విజమ్ || ౨౪ ||

ప్రపద్యతాం హి కైకేయీ సపుత్రా సహబాంధవైః |
రాఘవేణ వనే సర్వే సహవత్స్యామ నిర్వృతాః || ౨౫ ||

ఇత్యేవం వివిధా వాచో నానాజనసమీరితాః |
శుశ్రావ రామః శ్రుత్వా చ న విచక్రేఽస్య మానసమ్ || ౨౬ ||

స తు వేశ్మ పితుర్దూరాత్కైలాసశిఖరప్రభమ్ |
అభిచక్రామ ధర్మాత్మా మత్తమాతంగవిక్రమః || ౨౭ ||

వినీతవీరపురుషం ప్రవిశ్య తు నృపాలయమ్ |
దదర్శావస్థితం దీనం సుమంత్రమవిదూరతః || ౨౮ ||

ప్రతీక్షమాణోఽపి జనం తదాఽఽర్త-
-మనార్తరూపః ప్రహసన్నివాథ |
జగామ రామః పితరం దిదృక్షుః
పితుర్నిదేశం విధివచ్చికీర్షుః || ౨౯ ||

తత్పూర్వమైక్ష్వాకసుతో మహాత్మా
రామో గమిష్యన్వనమార్తరూపమ్ |
వ్యతిష్ఠత ప్రేక్ష్య తదా సుమంత్రం
పితుర్మహాత్మా ప్రతిహారణార్థమ్ || ౩౦ ||

పితుర్నిదేశేన తు ధర్మవత్సలో
వనప్రవేశే కృతబుద్ధినిశ్చయః |
స రాఘవః ప్రేక్ష్య సుమంత్రమబ్రవీ-
-న్నివేదయస్వాగమనం నృపాయ మే || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయస్త్రింశః సర్గః || ౩౩ ||

Ayodhya Kanda Sarga 33 Meaning In Telugu

రాముడు, లక్ష్మణుడు, సీత తమకు ఉన్నదంతా బ్రాహ్మణు లకు దానము చేసిన తరువాత, వారు ముగ్గురూ దశరథుని వద్ద సెలవు తీసుకొనడానికి ఆయన మందిరమునకు వెళ్లారు. అప్పటికే రామపట్టాభిషేకము నిలిచి పోయినది అను వార్త దావానలము మాదిరి అయోధ్య అంతా పాకిపోయింది. దశరథుని మందిరమునకు వెళ్లు సీతారామలక్ష్మణులను చూచుటకు జనము వీధులలో బారులు తీరి నిలబడ్డారు. అందరి ముఖాలలో దైన్యము కనబడుతూ ఉంది. రాజలాంఛనములైన ఛత్రచామరములు లేకుండా కాలినడకన వెళు తున్న రాముని చూచి అయోధ్య ప్రజలు దు:ఖము ఆపుకోలేక పోయారు.

కేవలము తండ్రి మాటను మన్నించడానికి రాజ్యమును వదులుకొన్నాడు రాముడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా వారు సీతను ముఖాముఖి చూడలేదు. ఎండ అంటే అసలు తెలియని సీత ఈనాడు భర్త వెంట నడిచి వెళుతుంటే అందరూ ఆశ్చర్యం చూస్తున్నారు.
కొందరు ఆశావాదులు మాత్రము “రాజు రాజ్యమును ఇవ్వక పోతే మానె, రాముని ఊరువెళ్ల గొట్టడం ఎందుకు. ఏదో ఊరికే అని ఉంటాడు. రాముడు ఎక్కడకూ వెళ్లడు.” అని తమలో తాము సర్దిచెప్పుకుంటున్నారు.

మరి కొంతమంది “ఆ… ఈరోజుల్లో చెడ్డవాడైన కొడుకును కూడా మమకారంతో ఇంటి నుండి బయటకు పొమ్మనడం లేదు. అలాంటిది రాముని వంటి సుగుణాల రాసిని ఇంటినుండి ఎందుకు పొమ్మంటాడు. అదేమీ కాదు. మనం పొరపాటు వినిఉంటాము.”అని తమలో తాము అనుకుంటున్నారు.

కాని అందరూ రాముడు తమను విడిచి అడవులకు వెళు తున్నాడు అనే మాటను కూడా జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లు తమ కష్టసుఖాలలో పాలుపంచుకున్న రాముడు ఇలా అర్థాంతరంగా అడవులకు వెళ్లడంలోని ఆంతర్యం వారికి అవగతం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు.

ఇంతలో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది. “రాముడు లేని అయోధ్యలో మనం మాత్రం ఎందుకు. మనం కూడా రాముని వెంట అరణ్యములకు వెళుదాము. రాముడు ఎక్కడ ఉంటే అదే మనకు అయోధ్య” అని రాముని వెంట వెళ్లడానికి సిద్ధం అయ్యారు.

ఆ మాట ఆనోటా ఆనోటా పాకి అందరూ రాముని వెంట అడవులకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో కైకేయీ వల్లనే ఇదంతా జరిగింది అని అందరికీ తెలిసిపోయింది. దాంతో వారి ఆలోచన బలపడింది.

“మనం అంతా అయోధ్యను విడిచి వెళ్లిపోతే ఇక్కడెవరుం టారు. ఇండ్లు అన్నీ పాడుపడిపోతాయి. అగ్నిహోత్రములు వెలగవు. పంటలు పండించే వాళ్లు ఉండరు. వీళ్లకు పనిపాటలు చేసేవాళ్లు ఉండరు. ఈ పాడుబడ్డ శ్మశానములాంటి అయోధ్యను కైక ఒక్కతే ఏలుకుంటుంది” అని కసిదీరా అనుకొన్నారు.

మరికొందరు “రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. అరణ్యమే అయోధ్య. ఈ అయోధ్య అరణ్యము అవుతుంది.” అని శపిస్తున్నారు. ఇంకొంత మంది అయితే “ఒరేయ్! మనం అంతా రాముని వెంట అడవులకు వెళితే, మనలను చూచి, అడవులలో ఉన్న క్రూరమృగములు, ఏనుగులు, పాములు, తేళ్లు అన్నీ అడవులు వదిలి అయోధ్యలోకి వస్తాయి. అప్పుడు కైకకు మంచి శాస్త్రిఅవుతుంది. మనం అంతా రాముని పాలనలో అడవిలో సుఖంగా ఉంటే ఇక్కడ అయోధ్యలో కైక క్రూరమృగముల బారిన పడి నానా బాధలు పడుతుంది” అని కసిదీరా తిడుతున్నారు.

ఈ మాటలన్నీ రాముడు, సీత లక్ష్మణుడు వింటూ ముందుకు నడుస్తున్నారు. ముగ్గురూ దశరథమహారాజు మందిరమునకు సమీపించారు. మందిరము లోపల సుమంత్రుడు దీనంగా మొహం పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతని చుట్టు కొంతమంది పౌరులు గుమిగూడి ఉన్నారు.
వారందరినీ చూచి రాముడు చిరునవ్వు నవ్వి వారిని పలకరించాడు. “సుమంత్రా! నేను, సీత, లక్ష్మణుడు వచ్చామని మహారాజు గారికి మనవి చెయ్యి.” అని అన్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుస్త్రింశః సర్గః (33) >>

Balakanda Sarga 34 In Telugu – బాలకాండ చతుస్త్రింశః సర్గః

Balakanda Sarga 34 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుస్త్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో చతుస్త్రింశః సర్గం ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో విష్ణుమూర్తి వామనావతారాన్ని ధరించి, సుగ్రీవుడి సహాయంతో మహాబలివనితిని మోసగించి, ఆవిడలో హరికృష్ణుడు అవతరించాడని వివరిస్తుంది. సీతా హరణం గురించి విన్న రాముడు, లక్ష్మణుడు హనుమంతుని సహాయం తీసుకోవాలని నిర్ణయిస్తారు. రాముడి ధైర్యం, లక్ష్మణుడి నిబద్ధత హనుమంతుడిని ఆకర్షిస్తాయి.

విశ్వామిత్రవంశవర్ణనమ్

కృతోద్వాహే గతే తస్మిన్బ్రహ్మదత్తే చ రాఘవ |
అపుత్రః పుత్రలాభాయ పౌత్రీమిష్టిమకల్పయత్ ||

1

ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభం మహీపతిమ్ |
ఉవాచ పరమోదారః కుశో బ్రహ్మసుతస్తదా ||

2

పుత్ర తే సదృశః పుత్రో భవిష్యతి సుధార్మికః |
గాధిం ప్రాప్స్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతీమ్ ||

3

ఏవముక్త్వా కుశో రామ కుశనాభం మహీపతిమ్ |
జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనమ్ ||

4

కస్యచిత్త్వథ కాలస్య కుశనాభస్య ధీమతః |
జజ్ఞే పరమధర్మిష్ఠో గాధిరిత్యేవ నామతః ||

5

స పితా మమ కాకుత్స్థ గాధిః పరమధార్మికః |
కుశవంశప్రసూతోఽస్మి కౌశికో రఘునందన ||

6

పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రతా |
నామ్నా సత్యవతీ నామ ఋచీకే ప్రతిపాదితా ||

7

సశరీరా గతా స్వర్గం భర్తారమనువర్తినీ |
కౌశికీ పరమోదారా సా ప్రవృత్తా మహానదీ ||

8

దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవంతముపాశ్రితా |
లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ ||

9

తతోఽహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖమ్ |
భగిన్యాం స్నేహసంయుక్తః కౌశిక్యాం రఘునందన ||

10

సా తు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠితా |
పతివ్రతా మహాభాగా కౌశికీ సరితాం‍వరా ||

11

అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగతః |
సిద్ధాశ్రమమనుప్రాప్య సిద్ధోఽస్మి తవ తేజసా ||

12

ఏషా రామ మమోత్పత్తిః స్వస్య వంశస్య కీర్తితా |
దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి ||

13

గతోఽర్ధరాత్రః కాకుత్స్థ కథాః కథయతో మమ |
నిద్రామభ్యేహి భద్రం తే మా భూద్విఘ్నోఽధ్వనీహ నః ||

14

నిష్పందాస్తరవః సర్వే నిలీనా మృగపక్షిణః |
నైశేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునందన ||

15

శనైర్వియుజ్యతే సంధ్యా నభో నేత్రైరివావృతమ్ |
నక్షత్రతారాగహనం జ్యోతిర్భిరవభాసతే ||

16

ఉత్తిష్ఠతే చ శీతాంశుః శశీ లోకతమోనుదః |
హ్లాదయన్ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో ||

17

నైశాని సర్వభూతాని ప్రచరంతి తతస్తతః |
యక్షరాక్షససంఘాశ్చ రౌద్రాశ్చ పిశితాశనాః ||

18

ఏవముక్త్వా మహాతేజా విరరామ మహామునిః |
సాధు సాధ్వితి తే సర్వే మునయో హ్యభ్యపూజయన్ ||

19

కుశికానామయం వంశో మహాన్ధర్మపరః సదా |
బ్రహ్మోపమా మహాత్మానః కుశవంశ్యా నరోత్తమాః ||

20

విశేషేణ భవానేవ విశ్వామిత్రో మహాయశాః |
కౌశికీ చ సరిచ్ఛ్రేష్ఠా కులోద్ద్యోతకరీ తవ ||

21

ఇతి తైర్మునిశార్దూలైః ప్రశస్తః కుశికాత్మజః |
నిద్రాముపాగమచ్ఛ్రీమానస్తం గత ఇవాంశుమాన్ ||

22

రామోఽపి సహసౌమిత్రిః కించిదాగతవిస్మయః |
ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుస్త్రింశః సర్గః ||

Balakanda Sarga 34 Meaning In Telugu

ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు. కుశనాభుడు. కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్లారు. అప్పుడు తనకు పుత్రసంతానము కావాలని అనుకున్నాడు కుశనాభుడు. పుత్రసంతానము కోసరము పుత్రకామేష్టి యాగము చేసాడు.

ఆయాగము జరుగుతున్న సమయములో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు. “కుమారా! నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు.” అనిపలికి తాను బ్రహ్మ లోకమునకు వెళ్లిపోయాడు.

కొంత కాలము జరిగింది. కుశనాభునకు గాధి అనే కుమారుడు జన్మించాడు. ఓ రామా! ఆ గాధి నా తండ్రి. శుకుని వంశమున పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడు తున్నాను. నాకు ఒక జ్యేష్ట సోదరి (అక్కగారు) ఉండేది. ఆమెను నా తండ్రి గాధి ఋచకుడు అను వానికి ఇచ్చి వివాహము చేసాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్లింది.

ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసరం హిమవత్పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను.

రామా! ఈ యాగము చేయుట కొరకు సిద్ధాశ్రమమునకు వచ్చాను. నీవలన యాగమును నిర్విఘ్నముగా పూర్తిచేయ గలిగాను. నా కార్యము సిద్ధించింది. ఓరామా! నీవు అడిగినట్టు నా గురించి, నా జన్మ గురించి నీకు చెప్పాను. రామా! ఇప్పటికే అర్ధ రాత్రి దాటినది. ఇంక మీరు నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయమే మనము ప్రయాణము సాగించాలి కదా!” అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని వృత్తాంతమును విన్న రామ లక్ష్మణులు, మహా మునులుఅందరూ ఆయనను అభినందించారు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ! మీ వలనకుశ వంశము పూజ్యమైనది. మీరు బ్రహ్మ దేవునితో సమానమైన వారు. మీ అక్కగారు పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశమునకు కీర్తి తెచ్చింది.” అని కౌశికీ నదిని పొగిడారు. తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు.

శ్రీమద్రామాయణము
బాలకాండ ముప్పదినాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓంతత్సత్.

బాలకాండ పంచత్రింశః సర్గః (35) >>

Balakanda Sarga 23 In Telugu – బాలకాండ త్రయోవింశః సర్గః

Balakanda Sarga 23 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రయోవింశః సర్గలో, రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి గంగా నది మరియు సరయు నది సంగమించే ప్రదేశంలో ఒక ఆశ్రమంలో నివసిస్తున్నారు. ఒకసారి శివుడు తన మూడవ కన్నుతో ఈ ప్రదేశంలో ప్రేమ దేవుడైన మన్మథుని భౌతిక స్వరూపాన్ని కాల్చివేసాడు.

కామాశ్రమవాసః

ప్రభాతాయాం తు శర్వర్యాం విశ్వామిత్రో మహామునిః |
అభ్యభాషత కాకుత్స్థౌ శయానౌ పర్ణసంస్తరే ||

1

కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ||

2

తస్యర్షేః పరమోదారం వచః శ్రుత్వా నృపాత్మజౌ |
స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరమం జపమ్ ||

3

కృతాహ్నికౌ మహావీర్యౌ విశ్వామిత్రం తపోధనమ్ |
అభివాద్యాభిసంహృష్టౌ గమనాయోపతస్థతుః ||

4

తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యం త్రిపథగాం నదీమ్ |
దదృశాతే తతస్తత్ర సరయ్వాః సంగమే శుభే ||

5

తత్రాశ్రమపదం పుణ్యమృషీణాముగ్రతేజసామ్ |
బహువర్షసహస్రాణి తప్యతాం పరమం తపః ||

6

తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమమ్ |
ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రమిదం వచః ||

7

కస్యాయమాశ్రమః పుణ్యః కో న్వస్మిన్వసతే పుమాన్ |
భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హి నౌ ||

8

తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః |
అబ్రవీచ్ఛ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమః ||

9

కందర్పో మూర్తిమానాసీత్కామ ఇత్యుచ్యతే బుధైః |
తపస్యంతమిహ స్థాణుం నియమేన సమాహితమ్ ||

10

కృతోద్వాహం తు దేవేశం గచ్ఛంతం సమరుద్గణమ్ |
ధర్షయామాస దుర్మేధా హుంకృతశ్చ మహాత్మనా ||

11

దగ్ధస్య తస్య రుద్రేణ చక్షుషా రఘునందన | [అవదగ్ధస్య]
వ్యశీర్యంత శరీరాత్స్వాత్సర్వగాత్రాణి దుర్మతేః ||

12

తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మనా |
అశరీరః కృతః కామః క్రోధాద్దేవేశ్వరేణ హ ||

13

అనంగ ఇతి విఖ్యాతస్తదాప్రభృతి రాఘవ |
స చాంగవిషయః శ్రీమాన్యత్రాంగం స ముమోచ హ ||

14

తస్యాయమాశ్రమః పుణ్యస్తస్యేమే మునయః పురా |
శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే ||

15

ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన |
పుణ్యయోః సరితోర్మధ్యే శ్వస్తరిష్యామహే వయమ్ ||

16

అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమమ్ |
స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్యా నరోత్తమ ||

17

[* ఇహ వాసః పరో రామ సుఖం వస్త్యామహే వయమ్ | *]
తేషాం సంవదతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా |
విజ్ఞాయ పరమప్రీతా మునయో హర్షమాగమన్ ||

18

అర్ఘ్యం పాద్యం తథాఽఽతిథ్యం నివేద్య కుశికాత్మజే |
రామలక్ష్మణయోః పశ్చాదకుర్వన్నతిథిక్రియామ్ ||

19

సత్కారం సమనుప్రాప్య కథాభిరభిరంజయన్ |
యథార్హమజపన్సంధ్యామృషయస్తే సమాహితాః ||

20

తత్ర వాసిభిరానీతా మునిభిః సువ్రతైః సహ |
న్యవసన్సుసుఖం తత్ర కామాశ్రమపదే తదా ||

21

కథాభిరభిరామభిరభిరామౌ నృపాత్మజౌ |
రమయామాస ధర్మాత్మా కౌశికో మునిపుంగవః ||

22

Balakanda Sarga 23 In Telugu Pdf With Meaning

మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన మృదుమధురమైన మాటలతో నిద్రలేపాడు.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్య ప్రవర్తతే।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్॥

కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామా! ప్రాత: కాల సంధ్యకు సమయము ఆసన్నమైనది. ఓ రామా! నిద్ర లే! ప్రాత:కాల 3! కృత్యములు. సంధ్యావందనాది కార్యక్రములు నీవు చేయవలసి ఉన్నది.

(పైశ్లోకము అందరికీ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతములో మొదటి శ్లోకంగానే తెలుసు. ఆ శ్లోకము మూలం వాల్మీకి రామాయణంలో ఉందని కొద్దిమందికి మాత్రమేతెలుసు. అందుకే ఈ శ్లోకమును ఇక్క యధాతథంగా రాసాను).

విశ్వామిత్రుని మాటలు విన్న రామ లక్ష్మణులు వెంటనే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకొన్నారు. స్నానము, సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రము పఠించారు. తరువాత ముగ్గురూ తమ ప్రయాణము కొనసాగించారు.

వారు సరయూనదీ గంగానదిలో కలిసే సంగమస్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు “ఓ మహర్షీ! ఈ ఆశ్రమములు ఎవరివి?’ ఈ ఆశ్రమములలో ఎవరు ఉంటారు?”. అని అడిగారు.

దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానము చెప్పాడు. “ఓ రామా! ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు కానీ, పూర్వము మన్మధుడు దేహము కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశములో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకొని వెళ్లిపోయాడు. . అటువంటి శివుని మన్మథుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హంకరించి, మన్మధుని వంక కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మము అయిపోయాడు. మన్మధుని శరీర అవయవములు అన్ని చోట్లా చెల్లాచెదరుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు.

పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులు అందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగాఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపం అటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపుఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము. మనము ఇప్పుడు స్నానము, సంధ్య ఆచరించి, శుచులై ఈ ఆశ్రమములలోని ప్రవేశిద్దాము” అని అన్నాడు విశ్వామిత్రుడు.

వీరు ఈ ప్రకారము మాట్లాడుకుంటూ ఉండగా, ఆ ఆశ్రమములలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానిచి సత్కరించారు. తరువాత ఆ ఋషులు సాయంసంధ్యాసమయంలో చేయ వలసిన సంధ్యావందనము, గాయత్రీజపము కార్యములు ఏకాగ్రచిత్తంతో చేసారు.

ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ ఆశ్రమములో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్య కథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై మూడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ చతుర్వింశః సర్గః (24) >>