Sri Vinayaka Ashtottara Shatanamavali In Telugu – శ్రీ వినాయకాష్టోత్తర శతనామావళిః

Sri Vinayaka Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు వినాయకాష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Sri Vinayaka Ashtottara Shatanamavali

శ్రీ వినాయకాష్టోత్తర శతనామావళిః

(ఈ క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజచేయాలి.)

  • ఓం గజాననాయ నమః
  • ఓం గణాధ్యక్షాయ నమః
  • ఓం విఘ్నరాజాయ నమః
  • ఓం వినాయకాయ నమః
  • ఓం ద్వైమాతురాయ నమః
  • ఓం ద్విముఖాయ నమః
  • ఓం ప్రముఖాయ నమః
  • ఓం సుముఖాయ నమః
  • ఓం కృతినే నమః
  • ఓం సుప్రదీపాయ నమః
  • ఓం సుఖనిధయే నమః
  • ఓం సురాధ్యక్షాయ నమః
  • ఓం సురారిఘ్నాయ నమః
  • ఓం మహాగణపతయే నమః
  • ఓం మాన్యాయ నమః
  • ఓం మహాకాలాయ నమః
  • ఓం మహాబలాయ నమః
  • ఓం హేరంబాయ నమః
  • ఓం లంబజఠరాయ నమః
  • ఓం హ్రస్వగ్రీవాయ నమః
  • ఓం మహోదరాయ నమః
  • ఓం మదోత్కటాయ నమః
  • ఓం మహావీరాయ నమః
  • ఓం మంత్రిణే నమః
  • ఓం మంగళస్వరాయ నమః
  • ఓం ప్రమధాయ నమః
  • ఓం ప్రథమాయ నమః
  • ఓం ప్రాజ్ఞాయ నమః
  • ఓం విఘ్నకర్ర్తే నమః
  • ఓం విఘ్నహంత్రే నమః
  • ఓం విశ్వనేత్రే నమః
  • ఓం విరాట్పతయే నమః
  • ఓం శ్రీపతయే నమః
  • ఓం వాక్పతయే నమః
  • ఓం శృంగారిణే నమః
  • ఓం ఆశ్రితవత్సలాయ నమః
  • ఓం శివప్రియాయ నమః
  • ఓం శీఘ్రకారిణే నమః
  • ఓం శాశ్వతాయ నమః
  • ఓం బలాయ నమః
  • ఓం బలోత్థితాయ నమః
  • ఓం భవాత్మజాయ నమః
  • ఓం పురాణపురుషాయ నమః
  • ఓం పూష్ణే నమః
  • ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః
  • ఓం అగ్రగణ్యాయ నమః
  • ఓం అగ్రపూజ్యాయ నమః
  • ఓం అగ్రగామినే నమః
  • ఓం మంత్రకృతే నమః
  • ఓం చామీకరప్రభాయ నమః
  • ఓం సర్వస్మై నమః
  • ఓం సర్వోపాస్యాయ నమః
  • ఓం సర్వకర్ర్తే నమః
  • ఓం సర్వనేత్రే నమః
  • ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
  • ఓం సర్వసిద్ధియే నమః
  • ఓం పంచహస్తాయ నమః
  • ఓం పార్వతీనందనాయ నమః
  • ఓం ప్రభవే నమః
  • ఓం కుమారగురవే నమః
  • ఓం అక్షోభ్యాయ నమః
  • ఓం కుంజరాసుర భంజనాయ నమః
  • ఓం ప్రమోదాయ నమః
  • ఓం మోదకప్రియాయ నమః
  • ఓం కాంతిమతే నమః
  • ఓం ధృతిమతే నమః
  • ఓం కామినే నమః
  • ఓం కపిత్థవనప్రియాయ నమః
  • ఓం బ్రహ్మచారిణే నమః
  • ఓం బ్రహ్మరూపిణే నమః
  • ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః
  • ఓం జిష్ణవే నమః
  • ఓం విష్ణుప్రియాయ నమః
  • ఓం భక్తజీవితాయ నమః
  • ఓం జితమన్మథాయ నమః
  • ఓం ఐశ్వర్యకారణాయ నమః
  • ఓం జ్యాయసే నమః
  • ఓం యక్షకిన్నర సేవితాయ నమః
  • ఓం గంగాసుతాయ నమః
  • ఓం గణాధీశాయ నమః
  • ఓం గంభీరనినదాయ నమః
  • ఓం వటవే నమః
  • ఓం అభీష్టవరదాయ నమః
  • ఓం జ్యోతిషే నమః
  • ఓం భక్తనిధయే నమః
  • ఓం భావగమ్యాయ నమః
  • ఓం మంగళప్రదాయ నమః
  • ఓం అవ్యక్తాయ నమః
  • ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
  • ఓం సత్యధర్మిణే నమః
  • ఓం సఖయే నమః
  • ఓం సరసాంబునిధయే నమః
  • ఓం మహేశాయ నమః
  • ఓం దివ్యాంగాయ నమః
  • ఓం మణికింకిణీ మేఖలాయ నమః
  • ఓం సమస్త దేవతామూర్తయే నమః
  • ఓం సహిష్ణవే నమః
  • ఓం సతతోత్థితాయ నమః
  • ఓం విఘాతకారిణే నమః
  • ఓం విశ్వగ్ధృశే నమః
  • ఓం విశ్వరక్షాకృతే నమః
  • ఓం కళ్యాణగురవే నమః
  • ఓం ఉన్మత్తవేషాయ నమః
  • ఓం అపరాజితే నమః
  • ఓం సమస్త జగదాధారాయ నమః
  • ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
  • ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
  • ఓం విఘ్నేశ్వరాయ నమః
  • ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః

మరిన్ని అష్టోత్తరములు:

Sri Raghavendra Kavacham In Telugu | శ్రీ రాఘవేంద్ర కవచం

Sri Raghavendra Kavacham

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… ఈ క్రింద ఇచ్చిన లింకు నందు శ్రీ రాఘవేంద్ర కవచం ఇవ్వబడినది. అది ఏమిటో తెలుసుకుందాం…

Sri Raghavendra Kavacham In Telugu Lyrics

శ్రీ రాఘవేంద్ర కవచం

కవచం రాఘవేంద్రస్య యతీంద్రస్య మహాత్మనః |
వ్యమి గురువర్యస్య వాంఛితార్థ ప్రదాయకమ్ ||

1

మహాత్ముడు, యతి శ్రేష్ఠుడు, గురువర్యుడు నగురాఘ వేంద్రునియొక్క వాంఛితార్ధము నొసంగు కవచమును చెప్పుచున్నాను.

ఋషిరస్యప్పణాచార్య ఛందొనుష్టుప్ ప్రకీర్తితమ్ |
దేవతా శ్రీరాఘ వేంద్రగురురిష్టార్థ సిద్ధయే ||

2

ఈ కవచమునకు ఋషి అప్పణాచార్యులు, ఛందస్సు అనుష్టుప్పు, దేవత శ్రీరాఘ వేంద్రగురువు, ఇష్టార్థసిద్ధి కొఱకు ఇది చెప్పబడినది.

అష్టోత్తరశతం జాప్యం భ క్తియు క్తేన చేతసా |
ఉద్యత్ ప్రద్యోతనద్యోతద్భర్మ కూర్మాస నేస్థితమ్ ||

3

ప్రకాశించు సూర్యునివలె వెలుగొందు సువర్ణకూర్మాస నమునందు కూర్చుండి భక్తితో గూడిన మనస్సుతో నూట యెనిమిది మారులు దీనిని జపింపవలెను.

ఖద్యఖద్యోతనద్యోత ప్రతాపం రామమానసమ్ |
ధృత కాషాయవసనం తులసీహారవక్షసమ్ ||

4

సూర్యునిప్రకాశము వంటి ప్రతాపము గలవాడు, రామ మానసుడు, కాషాయ వస్త్రములను ధరించినవాడు, తులసీ మాలలచే శోభిల్లు వక్షస్థలము గలవాడు.

దోర్దండ విలసద్దండ క మండలువిరాజితమ్ |
అభయజ్ఞానముద్రాక్షమాలసీల కరాంబుజమ్ ||

5

భుజదండములయందు విరాజిల్లు దండకమండలములు గలవాడు, అభయజ్ఞానముద్ర అక్షమాల హస్తమునందు గలవాడు.

యోగీంద్రవంద్య పాదాబ్జం రాఘవేంద్రగుణం భజే
శిరోరక్షతు మే నిత్యం రాఘ వేంద్రో౭ఖ లేష్టదః ||

6

యోగీంద్రులచే నమస్కరింపదగు పాదపద్మములు గలవాడు నగు రాఘవేంద్ర గురువును సేవించుచున్నాను. సమ స్తవాంఛలను దీర్చునట్టి రాఘ వేంద్రుడు నిత్యము నాశిరస్సును రక్షించుగాక !

పాపాద్రిపాట నే వజ్రః కేశాన్ రక్షతు మే సదా !
క్షమాసురగణాధీశో ముఖం రక్షతు మే గురుః ॥

7

పాపములనెడు పర్వతమును ఛేధించుటయందు వజ్రా యుధము వంటివాడై న రాఘవేంద్రుడు ఎల్లప్పుకునా కేశములను రక్షించుగాక ! భూసురగణముల కధీశుడు, గురువునగు శ్రీరాఘ వేంద్రుడు నా ముఖమును రక్షించుగాక !

హరి సేవాలబ్ధసర్వసంపత్ ఫాలం మమావతు |
దేవస్వభావోఒవతు మే దృశౌ తత్వప్రదర్శకః ||

8

హరిసేవవలన లభించిన సర్వసంపదలు గలిగిన రాఘ వేంద్రుడు నాఫాల భాగమును కాపాడుగాక ! దేవస్వభావుడు, తత్త్వజ్ఞానమును ప్రదర్శించువాడు నగు రాఘ వేంద్రుడు నాదృక్కులను కాపాడుగాక !

ఇష్టప్రదానే కల్పద్రుః శ్రోత్రే శ్రుత్యర్థబోధకః |
భవ్యస్వరూపో మే నాసాం జిహ్వంమేవతుభవ్యకృత్ ||

9

ఇష్టార్థముల నొసంగుటయందు కల్పవృక్షమువంటివాడు శ్రుత్యర్థములను బోధించువాడు నగురాఘ వేంద్రుడు నాశ్రోత్ర ములను (చెవులను) భవ్య స్వరూపుడు నానాసికను, శుభంకరుడు నాజిహ్వను (నాలుకను) రక్షించుగాక !

ఆస్యం రక్షతు మే దుఃఖతూలసంఘాగ్ని చర్యకః |
సుఖధై.ర్యాదిసుగుణో భ్రువౌ మమ సదావతు ||

10

దుఃఖములనెడు దూది మూటలను అగ్నివలె దగ్ధము చేయువాడు నా ముఖమును, సుఖము ధైర్యము మున్నగు సుగుణములు గలవాడు నా కనుబొమ్మలను ఎల్లప్పుడు రక్షించుగాక !

ఓస్టౌ రక్షతు మే సర్వగ్రహనిగ్రహశ క్తిమాన్ |
ఉపప్ల వోదధి సేతుర్దంతాన్ రక్షతు మే సదా ||

11

సర్వగ్రహములను నిగ్రహించుటయందు సామర్ధ్యము గలవాడు నా ఓష్ఠములను (పెదవులను), ఉపద్రవములనెడు సముద్రమునకు సేతువువంటివాడు నా దంతములను ఎల్లప్పుడు రక్షించుగాక !

నిర స్తదోషో ”మే పాతు కపోతా సర్వపాలకః |
నిరవద్యమహావేషః కంఠం మే౭వతు సర్వదా ||

12

దోషములు లేనివాడు, సర్వపాలకుడు నాక పోలములను (చెంపలను), దోషము లేని మహా వేషముగలవాడు నా కంఠమును అన్ని వేళల రక్షించుగాక !

కర్ణమూలే తు ప్రత్యర్థి మూకత్వకరవాఙ్మమ |
బహువాదిజయీ పాతు హస్తా స త్తత్వవాదకృత్ ||

13

ప్రత్యర్థులను మూగివారినిగా జేయువాడు. నా కర్ణములను. (చెవులను) పెక్కండ్రు వాదులను జయించువాడు, సత్తత్వమును గూర్చి వాదించువాడు నా హస్తములను రక్షించుగాక!

కరౌ రక్షతు మే విద్వత్ పరిజ్ఞేయని శేష వాన్ |
వాగ్వైఖరీభవ్య శేషజయీ వక్ష స్థలం మమ ||

14

విద్వాంసులు దెలిసికొన దగిన విశేషములు గలవాడు నా కరములను రక్షించుగాక ! వాగై ఖరి చేత గొప్పవాడైన అది శేషువును జయించినవాడు నా వక్షస్థలమును రక్షించుగాక !

సతీసంతానసంపత్తి భ క్తిజ్ఞానాదివృద్ధికృత్ |
స్తనౌ రక్షతు మే నిత్యం శరీరావద్యహానికృత్ ||

15

పత్నీ పుత్రసంతాన సంపదను భ క్తిజ్ఞానాదులను వృద్ధి చేయువాడు, శరీరము నందలి దోషములను నశింప జేయు వాడు నగురాఘ వేంద్రుడు నా స్తనములను రక్షించుగాక!

పుణ్యవర్ధనపాదాబ్జాభి షేకజలసంచయః |
నాభిం రక్షతు మే పార్శ్వౌ ద్యునదీతుల్య సద్గుణః ||

16

పుణ్యమును పెంచునట్టి పాదపద్మముల యందలి అభిషేక జలముయొక సమూహముగలవాడు నానాభిని రక్షించుగాక. ఆకాశగంగతో సమాన మైన సద్గుణములుగలవాడు రెండువైపుల నన్ను రక్షించుగాక !

పృష్టం రక్షతు మే నిత్యం తాపత్రయవినాశకృత్ |
కటిం మే రక్షతు సదా వంధ్యా సత్పుత్రదాయకః ||

17

తాపత్రయమును నాశముచేయువాడు ఎల్లప్పుడు నాపృష్టమును ( వెనుక భాగమున్ను రక్షించుగాక ! గొడ్రాలికి సత్పుత్రులనొసంగువాడు ఎల్లప్పుడు నా కటి (నడుమును) భాగమును రక్షించుగాక !

జఘనం మే౭వతు సదా వ్యంగస్వంగ సమృద్ధికృత్ |
గుహ్యం రక్షతు మే పాపగ్రహారిష్ట వినాశకృత్ ||

18

వికలాంగులకు సహితముమంచి అవయవముల యొక్క పాటవము నొసంగువాడు నిత్యము నాజఘనములను (పిరుదులను) రక్షించుగాక! పాపగ్రహాదుల వలన సంభవించు అనర్థములను నాశన మొనరించువాడు నాగుహ్యాంగములను రక్షించుగాక !

భక్తాఘవిధ్వంసకరనిజమూర్తి ప్రదర్శకః |
మూర్తిమాన్ పాతు మేరోమం రాఘవేంద్రో జగద్గురుః ||

19

భక్తుల పాపములను విధ్వంస మొనరించునట్టి తన స్వరూపమును ప్రదర్శించువాడు, జగద్గురువు నగు శ్రీరాఘ వేంద్ర స్వామి రోమములను మూర్తిమంతుడై రక్షించుగాక !

సర్వతంత్ర స్వతంత్రో సౌ జానునీ మే సదా౭వతు |
జంఘే రక్షతు మే నిత్యం శ్రీమధ్వమతవర్ధనః ||

20

సర్వతంత్ర స్వతంత్రు డైనవాడు నాజానువులను (మోకాళ్ళను) రక్షించుగాక! మధ్యమత వర్ధను డైనవాడు నాజంఘములను (పిక్క్లను) రక్షించుగాక !

విజయీంద్రక రాజ్జోత సుధీంద్రవరపుత్రకః |
గుల్ఫౌ శ్రీరాఘ వేంద్రో మే యతిరాట్ సర్వదావతు ||

21

శ్రీవిజయీంద్ర కరపద్మములనుండి ఉద్భవించినవాడైన సుధీంద్రునివరపుత్రుడు, శిష్యుడు, యతీశ్వరుడు నైనశ్రీరాఘ వేంద్రస్వామి నాగుల్ఫములను (చీలమండలను రక్షించుగాక !

పాదౌ రక్షతు మే సర్వఅభయహరీ కృపానిధిః |
జ్ఞాన భక్తి సుపుత్రాయుర్యశః శ్రీ పుణ్యవర్ధనః ||

22

సర్వజనులకు అభయము నిచ్చునట్టిదాయానిధి, జ్ఞానము, భక్తి, సుపుత్రులను, ఆయుష్యమును, యశశును, సంపదను, పుణ్యమును వృద్ధి యొనరించువాడు. నా పాదములను రక్షించుగాక !

కరపాదాంగులీస్సర్వా మసూవతు జగద్గురుః |
ప్రతివాడి జయస్వంత భేదచిహ్నాదరో గురుః ||

23

ప్రతివాదులను జయించునపుడు తన హృదయమున భేద (ద్వైతచిహ్నమును) ఆదరమున ధరించు చిహ్నమును జగద్గురువు నా కరపాదాంగుళీయకములను రక్షించుగాక !

సఖానవతు మే సర్వాన్ సర్వశాస్త్ర విశారదః |
అపరోక్షకృతశ్రీశః ప్రాచ్యాం దిశి సదావతు ||

24

సర్వశాస్త్రవిశారదుడు నా నఖములను రక్షించుగాక ! శ్రీపతిని ప్రత్యక్ష మొనరించుకొనినవాడు, నన్ను తూర్పుదిక్కు నందు సదా రక్షించుగాక !

స దక్షిణే చావతు మాం సముపేక్షిత భావజః ।
అపేక్షితప్రదాతా చ ప్రతీచ్యామవతూ ప్రభుః ॥

25

మన్మథుని ఉపేక్షించినవాడు నన్ను దక్షిణదిక్కునందు సదారక్షించుగాక ! అపేక్షితములు (కోరినకోర్కెలు) నిచ్చు ప్రభువు నన్ను పడమర దిక్కునందు రక్షించుగాక !

Sri Raghavendra Kavacham In Telugu 

దయాదాక్షిణ్య వై రాగ్యవాక్పాటవముఖాంకితః |
సదోదీచ్యామవతు మాం శాపానుగ్రహశక్తిమాన్ ||

26

దయ, దాక్షిణ్యము, వైరాగ్యము, వాక్పాటవములతో కూడిన ముఖము కలవాడు, శాపానుగ్రహశక్తి కలవాడు, నన్ను ఉత్తరదిక్కు నందు సదా రక్షించుగాక !

నిఖి లేంద్రియదోషఘ్నో మహానుగ్రహకృద్గురుః |
అధశోర్ధ్వం చావతు మామాష్టాక్షరమనూదితః ||

27

సర్వేంద్రియ దోషములను పోగొట్టి మహానుగ్రహమును సంపాదింప జేయునట్టి గురువు నా అధో దేశమును, అష్టాక్షర మంత్రముచే నిరూపితు డైనగురువు నా ఊర్ధ్వ దేశమును రక్షించుగాక !

ఆత్మాత్మీయాఘరాశిఘ్నా మాం రక్షతు విధిక్షు చ |
చతుర్ణాం చ పునర్థానాం దాతా ప్ర్రాతః సదావతు ||

28

నా యొక్కయు, నా ఆత్మీయుల యొక్కయు, పాప సమూహములను నాశన మొనరించు నట్టివాడు, ధర్మార్థకామ మోక్షములను చతుర్విధ పురుషార్థముల నిచ్చు నట్టివాడు, దిక్కులయందు, విదిక్కులందు నన్ను రక్షించుగాక!

సంగ మ్కేవతు మాం నిత్యం తత్వవిత్ సర్వసౌఖ్యకృత్ |
మధ్యాహ్నేగమ్యమహిమా మాం రక్షతు మహాయశాః ||

29

తత్వములు నెరింగినవాడు, సర్వ సౌఖ్యములను సంపా దించువాడు, మధ్యాహ్న సమయమున మహిమ తెలియుటకు శక్యముగానివాడు నన్ను సంగమమున రక్షించుగాక !

మృతపోత ప్రాణదాతా సాయాహ్నే మాం సదావతు |
వేదిస్థ పురుపోజ్జీవీ నిశీథే పాతు మాం గురుః ||

30

చనిపోయిన బాలకులకు ప్రాణదాత నన్ను సాయం కాలమున రక్షించుగాక! అరుగుపైనున్న పురుషుని జీవింప జేసిన వాడు సన్ను రాత్రియందు రక్షించుగాక !

వహ్నిస్థమాలికోద్ధర్తా వహ్ని తాపాత్సదావతు |
సమగ్రటీకావ్యాఖ్యాతా గురు ర్మే విషయే: ఒవతు ||

31

అగ్నిలో పడిన రత్నమాలికను ఉద్దరించినవాడు, అగ్ని పాతమునుండి నన్ను రక్షించుగాక! సంపూర్ణముగ టీకా వాఖ్యాన మొనరించిన గురువు విషయములనుండి నన్ను సదా రక్షించుగాక !

కాంతా రేవతు మాం నిత్యం భాట్టసంగ్రహకృద్గురుః |
సుధాపరిమళోద్ధర్తా సుచ్ఛందస్తుసదావతు ||

32

భాట్ట సంగ్రహమహా గ్రంథమును రచించిన గురువు నన్ను అరణ్యములందు రక్షించుగాక! శ్రీమన్న్యాయ సుధకు పరిమళ వ్యాఖ్యానమును రచించినవాడు, మంచి అభిప్రాయముల యందు సదా నన్ను రక్షించుగాక !

రాజచోరవిష వ్యాధియాదోవన్యమృగాదిభిః |
అపస్మారాపహర్తా నః శాస్త్రవిత్ సర్వదావతు ||

33

రాజభయము, చోరభయము, విషవ్యాధులు, జలజంతువులు, వన్యమృగములు వీనినుండి రక్షించువాడు, సర్వ శాస్త్రములు నెరింగినవాడు నన్ను అపస్మార రోగమునుండి రక్షించుగాక !

గతౌ సర్వత్ర మాం పాతూపనిషదర్థ కృద్గురుః |
ఋగ్వ్యాఖ్యానకృదాచార్యః స్థితా రక్షతు మాం సదా ||

34

ఉపనిషదర్థములను ఆచరించిన గురువు అంతటా నన్ను రక్షించుగాక ! ఋగ్వేద వ్యాఖ్యానముల నొనరించిన గురువు, స్థితిలో నన్ను రక్షించుగాక !

మంత్రాలయనివాసీ మాం జాగ్రత్ కాలే సదావతు |
న్యాయముక్తావలీకర్తా స్వప్నే రక్షతు మాం సదా ||

35

మంత్రాలయమున నివసించువాడు నన్ను జాగ్రత్కాల మందు సదా రక్షించుగాక ! న్యాయముక్తావళి యను మహా గ్రంథమును రచించినవాడు నన్ను సదా స్వప్నములో రక్షించుగాక !

మాం పాతు చంద్రికావ్యాఖ్యాకర్తా సుప్తాహి తత్త్వకృత్ |
సుతంత్రదీపికాకర్తా ముక్తా రక్షతు మాం గురుః ||

36

చంద్రికా వ్యాఖ్యానమును రచించినవాడు, తత్త్వ మెరిగినవాడు, సుతంత్ర దీపికయను గ్రంథమును రచించినవాడు, నన్ను ముక్తిలో రక్షించుగాక !

గీతార్థసంగ్రహకర్తా సదా రక్షతు మాం గురుః |
శ్రీమధ్వమతదుగ్ధాబ్ధి చంద్రోవతు సదానఘః ||

37

గీతార్థ సంగ్రహమును రచించిన గురుదేవుడు నన్ను యెల్లప్పుడు రక్షించుగాక! మధ్వ మత మనెడు క్షీరసాగరము నుండి ఉద్భవించిన చంద్రుడు నిత్యము నన్ను రక్షించుగాక !

ఇతి శ్రీ రాఘవేంద్రస్య కవచం పాపనాశనమ్ |
సర్వవ్యాధిహరం సద్యః పావనం పుణ్యవర్ధనమ్ ||

38

ఇది శ్రీరాఘవేంద్ర కవచము. పాపములను నశింప జేయునది. సర్వ వ్యాధులను హరించునది. ఇది సత్యము, పావనము, పుణ్యములను వృద్ధి చేయునది.

య ఇదం పఠతే నిత్యం నియమేన సమాహితః |
అదృష్టిః పూర్ణదృష్టిః స్యా దేడమూకోపివాక్పతిః ||

39

నియమముగా నిష్టకలవాడై నిత్యము ఈ కవచమును పఠించినచో, దృష్టి లేనివాడు పూర్ణ దృష్టివంతుడగును, మూగవాడు వాక్పతి యగును.

పూర్ణాయుః పూర్ణ సంపత్తి భ క్తి జ్ఞానాదివృద్ధికృత్ |
పీత్వా వారినలో యేన కవచేనాభిమంత్రితమ్ ||

40

ఈకవచముతో మంత్రించిన ఉదకమును ద్రావినచో పూర్ణాయుర్దాయము, పూర్ణ సంపద, భక్తి, జ్ఞానాభివృద్ధి కలవాడగును.

జహాతి కుషిగాన్ రోగాన్ గురువర్య ప్రసాదతః |
ప్రదక్షిణ నమస్కారాన్ గురో వృందావనస్య యః ||

41

గురు దేవునకు, బృందావనమునకు ప్రదక్షిణ నమస్కార ముల నొనరించినవాడు గురువు అనుగ్రహమువలన ఉదర రోగ ముల నన్నింటిని నశింపజేసికొనగలడు.

కరోతి పరయా భక్త్యా తదేతత్ కవచం పఠన్ |
పంగుః కుణిశ్చపోగండః పూర్ణాంగో జాయతేధ్రువమ్ ||

42

భ క్తి తోకూడుకొని ఈకవచమును పఠించువాడు, కుంటి వాడై నను అంగహీను డైసను పూర్ణాంగుడగును.

శేషాశ్చ కుష్టపూర్వాశ్చ నశ్యంత్యామయరాశయః |
అష్టాక్ష రేణ మంత్రేణ స్తోత్రేణ కవచేన చ ||

43

అష్టాక్షరమంత్రమును, కవచమును, స్తోత్రమును పఠించినచో కుష్ఠు ‘మొదలైన మిగిలిన భయంకర వ్యాధులు నశించిపోవును.

వృందావనే సన్నిహితమభిషి చ్య యథావిధి |
యంతే మంత్రాక్షరాణ్యష్టా విలిఖ్యాత్ర ప్రతిష్టితం ||

44

బృందావనము చెంత మంత్రాక్షరములను యెనిమిదింటిని లిఖించి, యంత్రమునుంచి యథావిధిగా అభిషేకింపవలెను.

షోడశై రుపచారైశ్చ సంపూజ్య త్రిజగద్గురుమ్ |
అష్టోత్తర శతాఖ్యాభిరర్చయేత్ కుసుమాదిభి ||

45

త్రిజగములకు గురువైన శ్రీరాఘ వేంద్రస్వామిని పోడ శోపచారములతో పూజింపవలెను. అష్టోత్తరశతనామములను బల్కుచు పుష్పములు నర్పింపవలెను…

ఫలైశ్చ వివిధై రేవ గురోరర్చాం ప్రకుర్వతః |
నామశ్రవణమా తేణ గురువర్య ప్రసాదతః ||

46

భూత ప్రేతపిశాచాద్యాః విద్రవంతి దిశో దశ |
పఠేదేతత్ త్రికం నిత్యం గురో వృందావనాంతికే ||

47

నిత్యము బృందావనము చెంత యీ మూడింటిని ( స్తోత్ర, కవచ, మంత్రములను) పఠించి వివిధములగు ఫలములతో గురు దేవు నర్చించినచో, గురుదేవుని నామశ్రవణ మాత్రముననే ఆయన ప్రసాదమువలన భూత ప్రేతపిశాచాదులు పది దిక్కులకు పారిపోవును.

దీపంసం యోజ్య విద్యావాన్ సభాసు విజయీభవేత్ |
రాజచోరమహావ్యాఘ్రసర్పనక్రాది పీడనమ్ ||

48

విద్యావంతు డైనవాడు బృందావనము చెంత దీపమును వెలిగించినచో సభలలో విజయమును పొందగలడు. అతడు రాజువలన, చోరులవలన, వ్యాఘ్రాది క్రూర జంతువులవలన, సర్పములవలన, మొసళ్ళవలన పీడ లేనివాడగును.

కవచస్య ప్రభావేన భయం తస్య నజాయతే |
సోమసూర్యోపరాగాదికాలే వృందావనాంతికే ||

49

సూర్యచంద్ర గ్రహణ సమయములో బృందావనము చెంత నీకవచమును పఠించిన వానికి ఈకవచప్రభావమున ఎట్టి భయము యుండదు.

కవచాదిత్రికం పుణ్యం అప్పణాచార్యదర్శితం |
జపేద్యః స ధనం పుత్రాన్ భార్యాం చ సుమనోహరామ్ ||

50

శ్రీఅప్పణాచార్యులు రచించిన పుణ్యమయము లేన ఈకవచత్రయము (కవచము, స్తోత్రము, మంగళాష్టకము) ను జపించువాడు ధనమును, భార్యను, పుత్రులను, సంపదలను పొందగలడు.

జ్ఞానం భక్తిం చ వై రాగ్యం భుక్తిం ముక్తిం చ శాశ్వతీమ్ |
మోదతే నిత్యం గురువర్య ప్రసాదతః ||

51

ఈకవచత్రికమును కవచము, స్తోత్రము, మంగళాష్ట కము) పఠించినవాడు ” గురుదేవుని అనుగ్రహము వలన జ్ఞాన మును, భక్తిని, వైరాగ్యమును, భక్తిని, శాశ్వతమగు ముక్తిని పొంది సంతోషము కలవాడగును.

మరిన్ని కవచాలు మీకోసం:

Vinayaka Chavithi Vratha Katha In Telugu – వినాయక చవితి వ్రత క‌థ‌

Vinayaka Chavithi Vratha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. హిందువులు ఏ కార్యక్రమం ప్రారంభించినప్పుడు, విఘ్నాలు లేకుండా, ఆటంకాల లేకుండా జరగాలని వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వినాయక చవితి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

Vinayaka Pooja Lo Chadavalsina Vrata Katha

వినాయకోత్పత్తి

Vinayaka Chavithi Vratham

కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడ ముచ్చటైన బాలుడుగా కనిపిం చింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో వుంచి, ఎవరినీ లోనికి రానివ్వ రాదని చెప్పి లోపలకు వెళ్ళింది.

శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో వున్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనము చేసి, లోపలికి వెళ్లాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.

విఘ్నేశాధిపత్యం

ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇమ్మని డు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నారు. అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి “మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర న నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగివెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడు కున్నాడు. వినాయకుని బుద్ధిసూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫల దాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నియూ నారాయణుని అధీనములు. అనగా నారాయణ మంత్రం అధీనంలో వుంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడు కోట్ల యాభైలక్షల నదులలో వినాయకుడి ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ”ని ప్రార్థించాడు.

చంద్రుని పరహాసం

Chandruni Parahasam

అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకా యలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పంచి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్నిచేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గవుతాయి అనే సామెత నిజ విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతిచెందాడు. అంత పార్వతి శోకించుచూ చంద్ర ప్రదే “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి చూసిన వారు పాపాత్ములై నీలాపనిందల పొందురుగాక” అని శపించింది.

ఋషిపత్నులకు నీలాపనిందలు

ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞంచేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులకు మోహించి, శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపముదక్క మిగిలిన ఋషి పత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్ని దేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి, ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి ఈ నీలాపనింద కలిగింది.

దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరు నికి తెలుపగా, అతడు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు “ఓ పార్వతీ! నీ శాపమువల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహించుకోవా”లని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది “ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు”అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితినాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇలా కొంతకాలం గడచెను.

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి, స్తుతిం చాడు. మాటల సందర్భంగా స్వామీ ! సాయంకాలమయింది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఒక సెలవు అని పూర్వవృత్తాంతమంతయూ శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలుపిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. “ఆహా! ఇక నాకెట్టి అపనింద రానున్నదో”అని అనుకున్నాడు.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపా దించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాదచేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చు దానిని ఏఆప్తునకైన నెవ్వరు ఇవ్వరనిన సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగ ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతివిని, కృష్ణుడు, మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోషఫలమని అను కున్నాడు. దానినిబాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది.

Samantakopakhyana

అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని బడద్రోసి వృక్షములు, రాళ్ళతోను, తుదకు ముష్టిఘాతములతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్నవ్యక్తి రావణహంతకుడగు శ్రీరాముడే అని తెలుసు కున్నాడు. అంజలి ఘటించి దేవాదిదేవా! ఆర్తజనపోషా! భక్తరక్షా నిన్ను శ్రీరామ చంద్రునిగా తెలిసికొంటిని. ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరు కొమ్మనగా, నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం జేయవలెనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీకోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అదిమొదలు మీనామ స్మరణచేయుచూ అనేకయుగములు గడిపాను, ఇపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇకజీవితేచ్చలేదు. నాఅపరాధములు క్షమించి కాపాడుము. నీకన్న వేరు దిక్కులేదు” అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయూ తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలాఅన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటువచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తనకుమార్తెనగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్య మునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోను, మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు.

సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు “అయ్యో! లేనిపోని నిందమోపి దోషము నకు పాల్పడితి”నని విచారించి మణిసహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపుమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణివలదని తిరిగిఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్త మున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనుక నీలాప నింద బాపుకొంటిరి మాకేమిగతి” యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపద శుద్ధ చతుర్ధిని ప్రమాదవశంబున చంద్ర దర్శనమయ్యెనేని ఆనాడు గణపతిని యధావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక” అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి, తమ ఇళ్ళకువెళ్ళి ప్రతిసంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమతమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో వున్నారు.

సర్వేజనాః సుఖినోభవంతు.

మరిన్ని వ్రతాలు:

Sri Rama Kavacham In Telugu – శ్రీ రామ కవచం

Sri Rama Kavacham Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… ఈ క్రింద ఇచ్చిన లింకు నందు శ్రీ రామ కవచం ఇవ్వబడినది. అది ఏమిటో తెలుసుకుందాం…

Sri Rama Kavacham Telugu

శ్రీ రామ కవచం

అగస్తిరువాచ

ఆజానుబాహుమరవిందదళాయతాక్ష-
-మాజన్మశుద్ధరసహాసముఖప్రసాదమ్ ।
శ్యామం గృహీత శరచాపముదారరూపం
రామం సరామమభిరామమనుస్మరామి ॥ 1

అస్య శ్రీరామకవచస్య అగస్త్య ఋషిః అనుష్టుప్ ఛందః సీతాలక్ష్మణోపేతః శ్రీరామచంద్రో దేవతా శ్రీరామచంద్రప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।

అథ ధ్యానం

నీలజీమూతసంకాశం విద్యుద్వర్ణాంబరావృతమ్ ।
కోమలాంగం విశాలాక్షం యువానమతిసుందరమ్ ॥ 1

సీతాసౌమిత్రిసహితం జటాముకుటధారిణమ్ ।
సాసితూణధనుర్బాణపాణిం దానవమర్దనమ్ ॥ 2

యదా చోరభయే రాజభయే శత్రుభయే తథా ।
ధ్యాత్వా రఘుపతిం క్రుద్ధం కాలానలసమప్రభమ్ ॥ 3

చీరకృష్ణాజినధరం భస్మోద్ధూళితవిగ్రహమ్ ।
ఆకర్ణాకృష్టవిశిఖకోదండభుజమండితమ్ ॥ 4

రణే రిపూన్ రావణాదీంస్తీక్ష్ణమార్గణవృష్టిభిః ।
సంహరంతం మహావీరముగ్రమైంద్రరథస్థితమ్ ॥ 5

లక్ష్మణాద్యైర్మహావీరైర్వృతం హనుమదాదిభిః ।
సుగ్రీవాద్యైర్మాహావీరైః శైలవృక్షకరోద్యతైః ॥ 6

వేగాత్కరాలహుంకారైర్భుభుక్కారమహారవైః ।
నదద్భిః పరివాదద్భిః సమరే రావణం ప్రతి ॥ 7

శ్రీరామ శత్రుసంఘాన్మే హన మర్దయ ఖాదయ ।
భూతప్రేతపిశాచాదీన్ శ్రీరామాశు వినాశయ ॥ 8

ఏవం ధ్యాత్వా జపేద్రామకవచం సిద్ధిదాయకమ్ ।
సుతీక్ష్ణ వజ్రకవచం శృణు వక్ష్యామ్యనుత్తమమ్ ॥ 9

అథ కవచం

శ్రీరామః పాతు మే మూర్ధ్ని పూర్వే చ రఘువంశజః ।
దక్షిణే మే రఘువరః పశ్చిమే పాతు పావనః ॥ 10

ఉత్తరే మే రఘుపతిర్భాలం దశరథాత్మజః ।
భ్రువోర్దూర్వాదలశ్యామస్తయోర్మధ్యే జనార్దనః ॥ 11

శ్రోత్రం మే పాతు రాజేంద్రో దృశౌ రాజీవలోచనః ।
ఘ్రాణం మే పాతు రాజర్షిర్గండౌ మే జానకీపతిః ॥ 12

కర్ణమూలే ఖరధ్వంసీ భాలం మే రఘువల్లభః ।
జిహ్వాం మే వాక్పతిః పాతు దంతపంక్తీ రఘూత్తమః ॥ 13

ఓష్ఠౌ శ్రీరామచంద్రో మే ముఖం పాతు పరాత్పరః ।
కంఠం పాతు జగద్వంద్యః స్కంధౌ మే రావణాంతకః ॥ 14

ధనుర్బాణధరః పాతు భుజౌ మే వాలిమర్దనః ।
సర్వాణ్యంగులిపర్వాణి హస్తౌ మే రాక్షసాంతకః ॥ 15

వక్షో మే పాతు కాకుత్స్థః పాతు మే హృదయం హరిః ।
స్తనౌ సీతాపతిః పాతు పార్శ్వం మే జగదీశ్వరః ॥ 16 ॥

మధ్యం మే పాతు లక్ష్మీశో నాభిం మే రఘునాయకః ।
కౌసల్యేయః కటీ పాతు పృష్ఠం దుర్గతినాశనః ॥ 17 ॥

గుహ్యం పాతు హృషీకేశః సక్థినీ సత్యవిక్రమః ।
ఊరూ శారంగధరః పాతు జానునీ హనుమత్ప్రియః ॥ 18

జంఘే పాతు జగద్వ్యాపీ పాదౌ మే తాటకాంతకః ।
సర్వాంగం పాతు మే విష్ణుః సర్వసంధీననామయః ॥ 19

జ్ఞానేంద్రియాణి ప్రాణాదీన్ పాతు మే మధుసూదనః ।
పాతు శ్రీరామభద్రో మే శబ్దాదీన్విషయానపి ॥ 20

ద్విపదాదీని భూతాని మత్సంబంధీని యాని చ ।
జామదగ్న్యమహాదర్పదలనః పాతు తాని మే ॥ 21

సౌమిత్రిపూర్వజః పాతు వాగాదీనీంద్రియాణి చ ।
రోమాంకురాణ్యశేషాణి పాతు సుగ్రీవరాజ్యదః ॥ 22

వాఙ్మనోబుద్ధ్యహంకారైర్జ్ఞానాజ్ఞానకృతాని చ ।
జన్మాంతరకృతానీహ పాపాని వివిధాని చ ॥ 23

తాని సర్వాణి దగ్ధ్వాశు హరకోదండఖండనః ।
పాతు మాం సర్వతో రామః శారంగబాణధరః సదా ॥ 24

ఇతి శ్రీరామచంద్రస్య కవచం వజ్రసమ్మితమ్ ।
గుహ్యాద్గుహ్యతమం దివ్యం సుతీక్ష్ణ మునిసత్తమ ॥ 25

యః పఠేచ్ఛృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహితః ।
స యాతి పరమం స్థానం రామచంద్రప్రసాదతః ॥ 26

మహాపాతకయుక్తో వా గోఘ్నో వా భ్రూణహా తథా ।
శ్రీరామచంద్రకవచపఠనాచ్ఛుద్ధిమాప్నుయాత్ ॥ 27

బ్రహ్మహత్యాదిభిః పాపైర్ముచ్యతే నాత్ర సంశయః ।
భో సుతీక్ష్ణ యథా పృష్టం త్వయా మమ పురాః శుభమ్ ।
తథా శ్రీరామకవచం మయా తే వినివేదితమ్ ॥ 28

మరిన్ని కవచాలు:

Sri Mallikarjuna Prapatti In Telugu – శ్రీ మల్లికార్జున ప్రపత్తిః

Sri Mallikarjuna Prapatti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మల్లికార్జున ప్రపత్తిః గురించి తెలుసుకుందాం…

Sri Saila Mallikarjuna Prapatti In Telugu Lyrics

శ్రీ మల్లికార్జున ప్రపత్తిః

జయ జయ జయ శంభో ! జంభభిత్పూర్వదేవ
ప్రణతపదసరోజద్వంద్వ ! నిర్ద్వంద్వ ! బంధో !
జయ జయ జయ జన్మస్థేమసంహారకార !
ప్రణయసగుణమూర్తే ! పాలయాస్మాన్ ప్రపన్నాన్.

టీక. శంభో! = ఓ శంకర! జంభభిత్ = ఇంద్రుఁడు, పూర్వదేవ = రాక్ష శులు మొదలగువారిచేత, ప్రణత = నమస్కరింపఁబడిన, పదసరోజిద్వంద్వ = పాదపద్మమాల జంటగలఁవాడా! నిర్ద్వంద్వ = ద్వంద్వభావము లేనివాఁడా!బంధో! = ఆపద్బాంధవుఁడా! జయ, జయ, జయ! = ముమ్మాటికి నీకు జయమగుఁగాక ! జన్మమ సంహారకార! = జన్మస్థితిలయకార = కుఁడైనవాఁడా! ప్రణయ సగుణమూర్తే! = భక్తియే గుణముగాఁగల మూర్తీ! జయ, జయ, జయ = ముమ్మాటికి జయము నొందుమ!, ప్రశన్నాన్ = నిన్ను శరణన్న, ఆస్మాన్ = మమ్ము, పాలయ= పరిపాలిం పుము !

తా. దేవాసురులచే నమస్కరింపఁబడు పాదపద్మయుగళము గలవాఁడా! అద్వైతమూర్తి ! ఆపద్బాంధవ! జన్మస్థితి లయ కారక ప్రపన్నులమగు మమ్ము పాలింపుమ ! నీకు జయ మగుఁ గాక !

వధూముఖం వల్గదపాంగరేఖం
అఖండితానందకరప్రసాదమ్,
విలోకయన్ విస్ఫురదాత్మభావ
స్స మే గతిశ్శ్రీగిరిసార్వభౌమః.

టీక. వల్గదపొంగరేఖం = ఏటవాలుగనున్న క్రీగంటి రేఖలఁ గలిగినట్టిదగ్గు, వధూముఖం = తన కాంతాముఖమును, అఖండితానందకర ప్రసాదం = అమితానందానుగ్రహము గలుగునట్లుగా, విలోకయన్ = చూచుచు, విస్ఫురదాత్మభావః = ప్రకాశించు నాత్మస్వరూపముగానున్న, సః = ఆ, శ్రీగిరిసార్వభౌమః = శ్రీశైలసార్వభౌముఁడైన శివుఁడు, మే = నాకు, గతిః = దిక్క గుఁగాక !

తా. క్రీఁగన్నులఁజూచుచున్న ఆత్మకాంతాముఖము నమితా నందానుగ్రహములతోఁ జూచుచు నాత్మస్వరూపియై ప్రకాశించు నా మల్లికార్జున ప్రభువు నాకు గతియగుఁగాక!

కురంగపాణిః కరుణావలోకః
సురోత్తమశ్చంద్రకళావతంసః,
వధూసహాయస్సకలేష్టదాతా
భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః.

టీక. కురంగపాణి = లేడిని చేతియందుఁగలవాఁడును, కరుణావలోకః = దయా వీక్షణములు గలవాఁడును, సురోత్తమః = దేవతలలో నుత్తముఁడును, చంద్రకళావతంసః = చంద్రకళను శిరోమణిగ ధరించినవాఁడును, వధూసహాయః = వామభాగార్ధమున నాఁడుతోఁడుగలవాఁడును, అగు, అసౌ = ఈ, శ్రీగిరిభాగ్యరాశిః = శ్రీశైలేశ్వరుఁడు, సకలేష్టదా = సమస్తాభీష్టము లిచ్చువాఁడు, భవతి = అగుచున్నాఁడు.

తా. దేవోత్తముఁడు నర్ధనారీ రూపుఁడగు చంద్రకళాశేఖరుడు తేడి నొకచేతథరించి దయారస మొలుకు చూపులతో నీ శ్రీశైల వాసుఁడుగా నుండెను, అట్టి యీ దేవుఁడు మాకు సకలాభీష్టము లొసఁగుగాక !

Sri Saila Mallikarjuna Prapatti In Telugu

సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్,
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున  మహాలింగం శివాలింగితమ్.

టీక. సంధ్యారంభ = సంధ్యానట నారంభ సమయమునందు, విజృంభితమ్ = ప్రకటితమైనట్టియు; శ్రుతిశిరస్థాన = ఉపనిషత్ప్రదేశములయొక్క, అంతర = నడుమ, ఆధిష్ఠితం = నిండియున్నట్టియు, సప్రేమ = ప్రీతితో గూడిన, భ్రమరా = భ్రమరాదేవితో, అభిరామం = మనోహరమైనట్టియు, అసకృత్ = మాటిమాటికి, సద్వాసనా = సువాసనచే, శోభితం = ప్రకాశించునట్టియు, భోగీంద్రాభరణం = సర్పరాజాభరణముల గల్గినట్టియు, సమస్తసుమనఃపూజ్యం = పండితుఅందఆకు (ఎల్లదేవతలకు) పూజ్యం = పూజింపఁజగినట్టియు, గణావిష్కృతమ్ = సత్త్వరజోగుణ ములచేఁ బ్రకటిత మైనదియు, శివాలింగితం = పార్వతిచే నాలింగితమైన, శ్రీశైలమల్లికార్జున మహాలింగం = శ్రీ శైలమల్లికార్జున మహాలింగమును, సేవే = సేవించుచున్నాను.

తా. సంధ్యానటన విజృంభితమును, ఉపనిషత్సం వేద్యమును, భ్రమరాంబా ప్రేమాభిశోభితమును, సగుణనిర్గుణోపేతమును, శేషాహిభూషితమును, సర్వదేవతాపూజ్యమును పార్వతీప్రియమైన శ్రీగిరి మల్లికార్జున లింగమును నేను. సేవించుచున్నాను.

యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ
వ్యక్తాత్మా పరిపాలనాయ జగతామాప్తావతారస్థితిః,
దుష్టధ్వంస-సదిష్టదానవిధయే నానాసనాధ్యాసినీ
శ్రీశైలాగ్రనివాసినీ భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ.

టీక. యా = ఏ దేవి, సచరాచరస్య = స్థావరజంగమాత్మకమైన, జగతః = ప్రపంచమానకు, మూలం = ప్రథానమైనదో (ప్రకృతియైనదో) పుంసః = ఆదిపురషుఁడైన యీశ్వరునకు, పురాణీ = ప్రాచీనమైన, సఖీ = చెలికత్తియయో, వ్యక్తాత్మా = ఆకారముతోఁ బ్రకటితమైనదో, జగ తాం = లోకములయొక్క, పరిపాలనాయ= రక్షణమకొఱకు, ఆప్తావ తారస్థితిః = పొందఁబడిన జన్మలంగలదో, దుష్టధ్వంస = దష్టులనాశ మొనర్చిట, సత్ = నుఁచివారలకు, ఇష్టదాన = అభీష్టములిచ్చుటయను, విధయే = పనికొఱకు, నానాసనాధ్యానినీ = శ్రీ గిరిశిఖరమున నివసించిన, భ్రామరీ = ఆ భ్రమరాఁబిక, మే నాకు, మే నాకు, శ్రేయస్కరీ = మంగళప్రదురాలు, భవతు = ఆగుఁగాక !

తా. ఏ దేవి చరాచరజగత్తున కంతటికి మూలప్రకృతియో, పురాణపురుషుఁడై న యీశ్వరునకే దేవి పట్టపురాణియో, లోకుల సనుగ్రహింప నేదేవి రూపమును ధరించినదో, దుష్ట సంహారము, శిష్టరక్షణ మొనర్చుచు సర్వాభీష్టములను భక్తుల కనేక స్థలములనుండి యొసంగుచున్నదో ఆ శ్రీగిరి భ్రమరాఁబిక నాకు శుభప్రదురాలగుఁగాక !

యత్తేజః పరమాణురేతదఖిలం నానాస్ఫురన్నామభిః
భూతం భావి భవచ్చరాచరజగద్ధత్తే బహిశ్చాంతరే,
సా సాక్షాత్ భ్రమరాంబికా శివసఖీ శ్రీశైలవాసోత్సుకా
దిశ్యాదాశ్రితలోకకల్పలతికా శ్రేయాంసి భూయాంసి నః.

టీక . ఏతత్ = ఈ, ఆఖిలం = సమస్తజగత్తు, యత్తేజః పరమాణుః = ఏ దేవి యొక్క తేజో రూపపరమాణువో, ఏతత్ = ఈ భూతం, భావి, భవత్ = జరిగినది (పుట్టినది) భావి = పుట్టఁబోవుంది, భగత్ = జరుగుచున్న, చరాచరజగత్ = స్థావరజంగమాత్మళమగు ప్రపంచమును నానాస్ఫురన్నా మభిః = తేజోవంతములగు ననేక నామములతో, ఆంతరే = లోపలను, బహిశ్చా = వె· పలను, ధత్తే = ఏ దేవి ధరించుచున్నదో, సా = ఆ, శివసఖీ = శివప్రియము, శ్రీ శైలవాసోత్సుకా = శ్రీ శైలశిఖర వాసమందు వేడ్కఁ గలదియు, ఆశ్రితలోక కల్పలతికా = ఆశ్రితజనమునకుఁ గల్పవృక్షమువంటిదైన, సాక్షాత్ప్రమరాంబికా = ప్రత్యేక్ష భనురాంబిక, సః = మాకు, భూయాంని = అనేకములగు, శ్రేయాంసి = శుభములను, దిశ్యాత్ = ఇచ్చునుగాక !

తా. ఏ జగదంబికయొక్క తేజోవిశేషమే యీ చరాచర ప్రపంచరూపమో, భూత భవిష్య ద్వర్తమాన సర్వ ప్రపంచము నేదేవి యనేకరూప నామములతో ధరించుచున్నదో, ఆ శ్రీశైలవాసిని యగు భ్రమరాంబిక మాకు శుభము లొడఁ గూర్చుఁగాక !

శరణం తరుణేందుశేఖరశ్శరణం మే గిరిరాజకన్యకా,
శరణం పునరేవ తావుభౌ శరణం నాన్యదుపైమి దైవతమ్.

టీక. మే = నాకు, తరుణేందుశేఖరః = బాలచంద్ర శేఖరుఁడు, శరణం = రక్షకుఁడు; గిరిరాజకన్యకా = హిమవత్పు తియగు పార్వతి, మే = నాకు, శరణం = రక్షణము. తౌ = ఆ, ఉభౌపునః = పార్వతీపరమేశ్వరు : లిరువురును, శరణ మేవ = రక్షకులేయగుదురుగాక! ఆన్యత్ = ఇతరమగు, (ఈ పార్వతీపర మేశ్వరులకంటే) దైవతం = దైవమును, శరణం = రక్షణను, నోప్రేమి = పొందను,

తా. నాకా చంద్రకళావతంసుఁడు, శ్రీగిరి భ్రమరాంబికయు రక్షకులగుదురు గాక! ఆ యుభయమునకున్న నితరదైవ మెద్దియు నాచే శరణ మనఁబడ కుండుఁగాక!

మరిన్ని ప్రపత్తులు:

Bharatuni Katha In Telugu – భరతుని కథ | శ్రీమద్భాగవతం లోని కథ

Bharatuni katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భరతుని కథ.

భరతుని కథ

శ్రీ హరి అంశతో పుట్టిన భరతుడు కణ్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపినాడు. వనమే అతని క్రీడారంగం మృగాలే అతని స్నేహితులు. ఆ బలశాలి సింహం పిల్లలతో ఆటలాడే వాడు! ఆ పసివాడి బలపరాక్రమాలు చూచి ఆశ్చర్యచకిత అయ్యేది తల్లి శకుంతల. స్వయంగా కణ్వమహర్షే భరతునికి జాతక కర్మలు చేసి విద్యాబుద్ధులు నేర్పినాడు. కుమారుడైన భరతుని తీసుకుని కణ్వ మహర్షి అనుజ్ఞపై ఆ సాధ్వి దుష్యంతుని వద్దకు వెళ్ళింది.

రాజు యొక్క జీవతం కత్తిమీద సాము వంటిది. అతడు ఏది చేసినా ప్రజల హితం కోరి వారి ఆమొదంపైనే చేయాలి. శకుంతల భరతుని తీసుకొని వచ్చి ఈతడే నీ వారసుడు అని చూపినది. ఆ విషయం నిజం అని తనకి శకుంతలకి కణ్వమహర్షికే తెలుసు. అది ప్రజులకు విశ్వసనీయమైన రీతిలో తెలియ చేయాలని తలచి ఆ ధర్ముడే రక్షిస్తాడని నమ్మి ఏమనక ఊరకున్నాడు దుష్యంతుడు. అప్పుడు ధర్మాత్ముడైన దుష్యంతుని కరుణించి ఆకాశవాణి అందఱికీ తెలిసే లాగా స్పష్టంగా ఈ భరతుడే దుష్యంతుని పుత్రుడు కాబోవు చక్రవర్తి అని చెప్పినది. ఆ వాక్కు విని దుష్యంతుడు శకుంతల సంతసించి పుత్రినికి పట్టాభిషేకం చేసి ఐహిక విషయాల మీద మనసు పెట్టక తపోవనాలకు వెళ్ళిపోయారు.

భరతుడు సమర్థమైన తన భుజస్కంధాలపైన ఈ భూభారాన్నంతా నిలిపి ధర్మపాలన చేశాడు. ధర్మస్థాపన కోసమే యుద్ధం చేసేవాడు. తన దిగ్విజయ యాత్రలో సనాతన ధర్మానికి విరుద్ధమైన శక కబర బర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛ దేశాల రాజులను అణచాడు. పాతాళంలో దేవతాస్త్రీలను చెఱబెట్టిన రాక్షసులను శిక్షించి ఆ స్త్రీలను వారి భర్తలకు అప్పగించినాడు. త్రిపురరాక్షసులను జయించి దేవతలను వారి వారి పదవులయందు నిలబెట్టినాడు. సత్యం శౌచం దయ తపస్సు స్థిరంగా భరతుని రాజ్యంలో ఉండటంతో ప్రకృతి సహజంగా జనాలు కోరినవన్నీ ఇచ్చేది.

ఈ భూమండలం అంతా భరతుని పాలనలో ఉన్నా కర్మ భూమి అయిన ఈ భరతఖండంలోనే అన్ని యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేశాడు. దీర్ఘతపుడను మర్షిని పురోహితునిగా చేసుకుని యమునా తీరమునందు 78 అశ్వమేధయాగాలు చేశాడు. గంగాతీరం పొడుగునా 55 అశ్వమేధాలు చేసి దేవేంద్రుని అతిశయించిన వైభవంతో శోభించినాడు.

పదమూడువేల యనభైనాలుగు పాడి ఆవుల మందను ద్వంద్వం అంటారు. అట్టి వేయి ద్వంద్వాలను దూడలతోపాటు బంగారముతో గిట్టలు కొమ్ములు అలంకరించి బాగా పండితులైన వేయి మంది విప్రోత్తములకి దానం చేశాడు. బంగారు నగలతో శోభించేవీ తెల్లని దంతాలు కలవీ అయిన పధ్నాలుగులక్షల నల్లని ఏనుగులను మష్కారతీర్థం ఒడ్డున దాన మిచ్చినాడు!

కుబేరునితో సమానమైన సంపద సాటిలేని శౌర్యం దేవేంద్రునితో సమానమైన విభవం మహర్షులతో సరితూగే తపశ్శక్తి ఉండికూడా భరతుడు ఎన్నడూ గర్వించక అర్థశరీరాలు తృణప్రాయంగా భావించి శాంతికాముకుడై భగవత్భక్తితో జీవించాడు. ఈ విధముగా ఇరవైయేడువేల యేండ్లు రాజ్యపాలన చేసినాడు. ఈ భరతుని సంతతి వారము కనుక మనం భారతీయులం అయ్యాము.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

ఒక మనిషి నిజంగా మనస్సుపెట్టి ధర్మబుద్ధితో పరిశ్రమ చేస్తే దేవతలనే మించిన మహామనీషి అవుతాడని భరతుడు మనకు నిరూపించాడు. అతడు తన బలపరాక్రమాలను ఉపయోగించి యుద్ధములలో విజయుడై భూమండలం అంతటా ధర్మస్థాపన చేశాడు. ప్రజల హితార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. నభూతో నభవిష్యతి అనే రీతిలో ఎన్నో దాన ధర్మాలు చేసి యశశ్వి అయ్యాడు.

భారతీయుల ఆధ్యాత్మ చింతన ఈ కథలో మనకు తెలిసింది. దుష్యంతుడు శకుంతల అన్ని ఐశ్వర్యాలను రాజభోగాలను పుత్రపౌత్రాది ఆకర్షణను త్యజించి తపోవనాలకి వెళ్ళి తపస్సు చేసుకొన్నారు. అలాగని కర్తవ్యాన్ని విస్మరించకుండా ఎంతో కాలం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసి కర్తవ్యం పూర్తి చేసుకొని ఆ తరువాతే వానప్రస్థం స్వీకరించారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Shuchilenidi Satpurusha Darsanam Labhinchadu In Telugu – శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు

Shuchilenidi Satpurusha Darsanam Labhinchadu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు కథ. 

శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు

వేదప్రవర్తకుడైన పైలమహర్షికి ఉదంకుడను ఉత్తమ శిష్యుడుండెడివాడు. అతడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సంపన్నుడు. గురుదేవతా అనుగ్రహం వలన అణిమాద్యష్టసిద్ధులు జ్ఞానము పొందిన మహానుభావుడు ఉదంకుడు.

ఒకరోజు గురుపత్ని అతనికి ఒకకార్యమును అప్పచెప్పినది “నాయనా! మనదేశ మహారాజైన పౌష్యుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మపత్ని ఉత్తమురాలు. ఒక వ్రతము చేయటానికి నాకు ఆ సాధ్వి కుండలాలు కావాలి. ఆమెను అర్థించి అవి తీసుకొనిరా”. గురుపత్ని ఆజ్ఞను శిరసావహించుటకై ఉదంకుడు వెంటనే ధర్మాత్ముడైన పౌష్యమహారాజు వద్దకు బయలుదేరినాడు. దారిలో అరణ్యమార్గములో వెళుతుండగా ఒక మహావృషభము మీదనున్న దివ్యపురుషుని చూచినాడు. అతడు సూర్యుని వలె వెలిగిపోతున్నాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునికి అనుగ్రహముతో పవిత్రమైన గోమయమును ఆరగించుటకు ఇచ్చెను. అమృతప్రాయమైన గోయమును భుజించి గురుపత్ని ఆజ్ఞ త్వరగా నెరవేర్చుటకై ఆ మహాపురుషుని వద్ద సెలవు తీసుకొని పౌష్యుని రాజ్యమును చేరుకున్నాడు.

పౌష్యుడు ఉదంకునికి యథావిధి సత్కారాలు చేసి రాకకు కారణమేమియో తెలుపుమని ఉదంకుని ప్రార్థించినాడు. ఉదంకుడు తన గురుపత్నిగారి ఆజ్ఞను రాజుకు తెలిపినాడు. “ఆహా! లోకశ్రయస్సును కోరే మీవంటి తాపసులను సేవించుటకంటే అదృష్టమేమున్నది? మహానుభావా నా రాణి వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పి కుండలములను తీసుకొనుము” అని పౌష్యుడు చెప్పినాడు. వెంటనే ఉదంకుడు మహారాణిగారి మందిరమును చేరుకున్నాడు. కానీ ఆయనకు ఎక్కడా పౌష్యరాణి కనబడలేదు! తరిగివచ్చి “రాజా! నాకు మహారాణి కనబడలేదు. నీవే ఆ కుండలములను తెప్పించి ఇవ్వు” అని అడిగినాడు.

అప్పుడు పౌష్యమహారాజు ఇలా అన్నాడు “భూవినుత! నీవంటి త్రిభువన పావనుని అశుచివి అని ఎట్లా అనగలను? నా రాణి మహాపతివ్రత కావున అశుచులకు కనబడదు”. ఉదంకుడు ఎందులకు తనకు అశుచి వచ్చినదో ఆలోచించినాడు. తాను గురుపత్నీ కార్యమును త్వరగా పూర్తిచేసే తొందరలో ఆ మహాపురుషుడు ఇచ్చిన గోమయాన్ని భుజించిన తరువాత ఆచమించలేదని గుర్తుకు వచ్చినది. వెంటనే కాళ్ళూ చేతులు అన్ని కడుక్కుని కేశవ నామాదులతో ఆచమనము చేసి శిచియై మహారాణి అంతఃపురమునకు వెళ్ళినాడు. అక్కడ యథాస్థానములో మహారాణిని చూసి ఆమె పాతివ్రత్య మహాత్మ్యమునకు ఆశ్చర్యపోయి “మహారాణీ! మా గురుపత్ని వ్రతార్థము మీ కుండలములు కోరి వచ్చినాను” అని ప్రార్థించినాడు. ఆ పతివ్రతామతల్లి తన కుండలములు ఇట్టి తాపసులకు ఉపకరిస్తున్నాయని సంతోషించి ఉదంకునకు కుండములను ఇచ్చి పంపివేసినది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

శుచిత్వము సత్పురుషుల సందర్శనమునకు ప్రథమ సోపానము. ఉదంకుడు భోజనము తరువాత తొందరలో ఉండి కాళ్ళుకడుక్కుని ఆచమించనందున ఎంతగొప్పవాడైనా ఆయనకు పతివ్రత అయిన పౌష్యరాణి కనబడలేదు. కావున మనమన్ని వేళలా ముఖ్యముగా సత్పురుష, దైవ సందర్శనమునకు వెళ్ళునప్పుడు శుచిగా ఉండవలయును. ఇదే కారణముగా అర్జునుడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రప్రయోగమునకు ముందు శుచులై మంత్రప్రయోగము చేసినారు (ద్రౌపదీదేవి కథ చూడండి). బకాసురుని యుద్ధమునకు ముందు భీమసేనుడు ఆహారము భుజించి శుచిఅయ్యి తరువాతనే యుద్ధముచేసినాడు (బకాసురవధ కథ చూడండి). అవంతీరాజు, విక్రమార్కుడు పుష్కరిణిలో స్నానము చేసిన తరువాతనే కాళీ ఆలయములోకి ప్రవేశించినారు (విక్రమార్కుని కథ చూడండి).

మరిన్ని నీతికథలు మీకోసం:

Bhumilona Gottalaya Butrotsava Midivo In Telugu – భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో

భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
సంఖ్య : 17
పుట: 12
రాగం: రామక్రియ

రామక్రియ

77 భూమిలోనఁ గొత్తలాయఁ బుత్రోత్సవ మిదివో
నేమపు కృష్ణజయంతి నేఁడే యమ్మా

||పల్లవి||

కావిరి బ్రహ్మాండము కడుపులోనున్నవాని
దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని
యీవల వసుదేవుఁడు యెట్టు గనెనమ్మా.

||భూమి|||

పొడవుకుఁ బొడవైన పురుషోత్తముఁడు నేఁడు
అడరి తొట్టెలబాలుఁడాయ నమ్మ
వుడుగక యజ్ఞ భాగమొగి నారగించేవాఁడు
కొడుకై తల్లిచన్నుగుడిచీనమ్మా.

||భూమి||

పాలజలధియల్లుండె(డై?) పాయకుండేయీతనికి
పాలవుట్లపండుగ బాఁతే (తా?) యనటే
ఆలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి
పేలరియై కడు పెచ్చుపెరిగీనమ్మా

||భూమి||17

అవతారిక:

శ్రీకృష్ణజయంతి పర్వదినాన అన్నమాచార్యులవారు వినిపించిన కీర్తన ఇది. “ఓ అమ్మలారా! మనం అంతా నియమంతో జరుపుకొనే కృష్ణజయంతి వేడుక నేడు నందుని ఇంట పుత్రుడుదయించాడనె వుత్సవం భూమిపై ప్రతియేడూ జరుపుకొంటున్నా అది యెప్పటికప్పుడు కొత్తలాయె” అంటున్నారు అన్నమాచార్యులవారు. ఆ అల్లరి కృష్ణుడు శ్రీవేంకటాద్రిపై ఆటలాడుట మరిగిపేలరియై కడుపెచు పెరిగీనమ్మా! అంటున్నారు. అంటే యేమిటి? ‘పేలరి’ అంటే వదరుబోతు అని అర్థం. వాగుడుకాయ అన్నమాట. మరి “బాత్రేయనటే” అంటే….?

భావ వివరణ:

ఓ అమ్మలారా! ఇదివో ఈ పుత్రోత్సవము (పుత్రుని పుట్టుక సందర్భంగా చేయు పండుగ) భూమిపై కొత్తలాయ (ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది). నేడే అట్టి కృష్ణజయంతి. ఇది నేమపు పండుగ (నియమం ప్రకారం జరిపే పండుగ).

కావిరి బ్రహ్మాండము (అనంత నిశీధిలో యెడతెగక విస్తరించే విశ్వము) తన బొజ్జలో దాచుకొన్న ఈ విశ్వరూపుని కంసుడి చెల్లెలు దేవకీదేవి తన గర్భమున మోసిందమ్మా! అద్దిర! (అదిరా… ఎంతంటే) దేవతలంతా త్రిభువనాలు వెదకినా కనబడని ‘పరమాత్మ’ యీ యాదవరాజు వసుదేవుడికి యెట్లా కనుపించాడో కదా!

ఆ దేవదేవుని లీలలు చెప్పలేమమ్మా!

పొడవుకు బొడవైన (ఉన్నతోన్నతుడైన ఈ పురుషోత్తముడు నేడు, అడరి (అతిశయించి) తొట్టెలో బాలుడు (ఉయ్యాలలో శిశువు) యైనాడమ్మా! ఈ ప్రపంచంలో యెక్కడ యే యజ్ఞం జరిగినా ఆ యజ్ఞభోక్త (యాగఫలములో మొదటిభాగం ఈయనకే అర్పిస్తారు. దానిని ఆయన వుడుగక (వదలక) నారగించీ (స్వీకరిస్తాడు). అట్టి యజ్ఞపురుషుడు, కొడుకై చనుబాలుత్రాగుతున్నాడే… ఆహా! ఏమిఈ పరమాత్ముని లీల.

ఈయన యెవరో తెలుసునటే? క్షీరసాగరునికి స్వయంగా అల్లుడు. పైగా ఆయన నివాసస్థానంకూడ పాలసముద్రమే. అటువంటి వాడికి పాలవుట్లు తెంచేపండుగ ‘బాతేయనటే’ (ప్రేమకలిగిందటనే?) ఎంతెంత మనం పండుగ చేసికొంటే అదే ఆయనకు పండుగ. ఇవన్నీ ఆవిశ్వాత్మునికెందుకమ్మా? నేడు ఈ తిరుమలలో ఆలరి (అల్లరిపిల్లవాడే) శ్రీవేంకటాద్రిపై ఆటలాడమరగినాడు. పేలరియై (అతివాగుడుకాయయై) ఈ పిల్లవాడు కడుపెచ్చుపెరిగీనమ్మా (తెగ విజృంభిస్తున్నాడమ్మా!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Bhaktha Puramdaradasu Katha In Telugu – భక్త పురందరదాసు కథ

Bhaktha Purandaradasa Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భక్త పురందరదాసు కథ. 

భక్త పురందరదాసు కథ

పూర్వం విక్రమార్క శకం 16వ శతాబ్దములో నవనిధి శ్రీనివాసనాయకుడనే గొప్పధనవంతుడు ఉండేవాడు. అతడు పరమ లోభి. భార్య సరస్వతీబాయి భక్తురాలు దానగుణశీలి. పతియే ప్రత్యక్షదైవమని నమస్కరించిన ఆ సాధ్వితో శ్రీనివాసనాయకుడిలా అనేవాడు “ఏమని ఆశీర్వదించను? అంకా దానధర్మాలు చేయమనా?” “స్వామీ! మీ ఆనుజ్ఞ తీసుకునే నేనీ వ్రతము ఆచరించితిని కదా!” అని బదులిచ్చిన భార్యతో “ఆ! ఆ! పొందితివి పొందితివి. తులసీపూజయే కదా ఖర్చు ఉండదులే అనుకున్నాను. కాని ఆ పేరుతో దంపతి పూజలు దానాలు ఒక్కటేమిటి అన్నీ చేశావు. నీ సుపుత్రుడు వరదుడు లెక్క చూపిన తరువాతే నాకీ విషయం తెలిసింది. నువ్విలాంటి నాగులు వ్రతాలు చేస్తే చాలు మనమందఱము తలకొక జోలె పట్టుకోవలసి వస్తుంది” అని అనేవాడు శ్రీనివాసనాయకుడు.

“రామ! రామ! అట్లా అనకండి. భగవంతుడు మనకు ఇచ్చినప్పుడే దానాదులు చేయకుంటే లేనప్పుడీయ గలమా”? అని సత్యం పలికిన సరస్వతీబాయితో శ్రీనివాసనాయకుడు “ఇందులో భగవంతుడిచ్చినది ఏమున్నది? మా తాతముత్తాతలు మా నాన్నగారు నేను ఎంతో శ్రమించి ఆర్జించినదే కదా!” అని అనేవాడు. “దానధర్మాదులకు ఉపయోగపడని ధనమెందులకు స్వామి? ఇట్టి సత్కార్యములే సద్గతులకు చద్ది మూటలని సాధుసజ్జనులంటారు” అని హితవు చెప్పిన భార్యతో భర్త “ఆ సన్యాసుల మాటలకేమిలే వాళ్ళలానే అంటారు. అవన్నీ ఆచరిస్తూ కూర్చుంటే మనకు మిగిలేది బూడిదే! చూడు సరస్వతీ! ధనమూలమిదం జగత్ అన్నారు. ఆ సిరి యొక్క గరిమ ఎంతో కష్టపడి సంపాదించిన నాకు తెలుసు” అని అనేవాడు. ఆ భార్యా భర్తల సంభాషణములు ఇలా ఉండేవి!

శ్రీనివాసనాయకుని అనంత పూర్వజన్మ పుణ్యమో లేక సరస్వతీబాయి అఖండ సౌశీల్య మహాత్మ్యమో పుట్టు లోభి అయిన శ్రీనివాసనాయకుని భక్త పురందరదాసుగా మార్చా అనుకున్నాడు పాండురంగ విఠ్ఠలుడు. ఏ దుర్గుణాన్నైనా నివారించవచ్చును కానీ లోభగుణాన్ని మార్చుట దుష్కరం అని అనుకున్న స్వామి స్వయంగా ఆ శ్రీనివాసనాయకుని వద్దకు ఒక బ్రాహ్మణుని వేషంలో వచ్చాడు. ఎవరి పాదాలకు సకల చరాచర జీవులు ముక్తికై చేతులుజోడించి నమస్కరిస్తాయో అట్టి స్వామి శ్రీనివాసనాయకుని ముందర నిలిచి ఏదైనా దానమివ్వమని యాచించేవాడు! కసురుకుంటూ వెళ్ళగొట్టేవాడు నాయకుడు.

భగవంతుడు శ్రీనివాసనాయకుడెన్ని అవమానాలు చేసినా రోజూ పుత్రవాత్సల్యంతో వచ్చి ఏదో ఒకటి దానమిమ్మని అర్థించేవాడు. భగవంతుడు ఎన్ని సార్లు అడిగినా ఆ శ్రీనివాసనాయకుడు ఒక్కసారికూడా ఏమీ ఇవ్వలేదు. ఇలా ప్రతిరోజు ఆ లక్ష్మీపతి శ్రీనివాసనాయకుని మార్చడం కోసం పడరాని పాట్లు పడ్డాడు. బహుశః ఇందుకేనేమో ఆ భగవంతుడు ఆశ్రితపక్షపాతి అని నిందింపబడినాడు. నీవే తప్ప ఇతరమెఱుగనని శరణువేడిన సరస్వతీబాయిని రక్షించటానికే నేమో ప్రాయశః స్వామి ఇన్ని పాట్లుపడ్డాడు. లేదా కర్మయే పరమాత్మ అన్న నిజం నిరూపించేలా శ్రీనివాసనాయకుని పూర్వజన్మల పుణ్యానికి ఫలముగా ఇలా అనుగ్రహించదలచినాడో స్వామి. ఆ పన్నగశాయి లీలలు అర్థం చేసుకోవటం ఎవరి తరము?

“ఏమైనా సరే నీకేమీ ఇవ్వను” అని నిక్కచ్చగా అన్నాడు ఒకరోజు విప్రవేషంలో ఉన్న భగవంతుని చూసి శ్రీనివాసనాయకుడు. “అయ్యా! వీడు నా ఒక్కగానొక్క కొడుకు. వీడికి ఉపనయనం చేయాలని సంకల్పించాను. ఓం ప్రథమంగా మీ వద్దకొచ్చాను. మీరు దయతో ఏది ఇచ్చినా తీసుకుంటాను” అని అడిగాడు భగవంతుడు. “ఏది ఇచ్చినా తీసుకుంటావా?” అని రెట్టిస్తూ “నేను ఇచ్చేది కిం అనక తీసుకు వెళిపోవాలి” అని అంటూ ఇల్లంతా వెతికి వెతికి తుప్పు పట్టిన కాణీ బిళ్ళ తెచ్చి విఠ్ఠలునికి ఇచ్చి పంపించి “పీడా వదిలింది” అనుకున్నాడు.

ఏదో పనిమీద నాయకుడు బయటికెళ్ళాడోలేదో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు విఠ్ఠలనాథుడు. “అమ్మా! నాకు సహాయం చేయండి” అని అన్నాడు స్వామి. “ఇందాకే కదయ్య మా ఆయనిచ్చారు?” అని అన్నది ఆ ఇల్లాలు. ఆ తుప్పుపట్టిన కాణీ చూపించాడు స్వామి. ఖిన్నురాలై నిస్సహాయిగా నిలుచున్న ఆమెను చూసి పరమాత్మ “అమ్మా! మీ ముక్కెర ఇప్పిస్తే నా అవసరం తీరుతుంది” అని అన్నాడు. నీళ్ళునములుతూ యాచించిన ఆ పేద బ్రాహ్మణుని చూసి జాలిపడి సరస్వతీబాయి వెంటనే తన ముక్కెర తీసి ఇచ్చింది. మనసారా ఆశీర్వదించి ముక్కెర తీసుకుని స్వామి వెళ్ళిపోయాడు.

విప్రునికి ముక్కెర ఇచ్చింది కాని భర్తకు ఏమని సమాధానం చెబుతుంది? ఏమి చేయాలిరా భగవంతుడా అని వ్యాకుల పడుతుండగా ఆమె ప్రాణాలపాలిటి రెండో కాలునిలా శ్రీనివాసనాయకుడు వచ్చి “ఏదీ నీ ముక్కెర?” అని ప్రశ్నించాడు. లోభికి ధనం తప్ప ఇంకేదీ కానరాదు కదా! ఎక్కడుందో వెతికి తెమ్మన్నాడు భర్త. “రంగ రంగ! ఏమి లీల స్వామి? నాకు దిక్కెవ్వరు?” అని భగవంతునికి మొరపెట్టుకుంది సరస్వతీబాయి. “ఇది ఏమైనా సత్యయుగమా చమత్కారాలు జరగడానికి?” అని అనుకుని మరణమే శరణ్యమని నిశ్చయించుకున్నది.

ప్రేమతో అటుకులిచ్చినందుకే స్వామి సుదామునికి అనంత ఐశ్వర్యాలు కడకు కైవల్యమిచ్చాడు. ఇక అవసరానికి ఏమీ సంకోచించక అడిగనదే తడవుగా ముక్కెర ఇచ్చిన ఆ సాధ్విని మఱుస్తాడా స్వామి? “సాధ్వీ! నీ దానగుణానికి భక్తికి మెచ్చాను. ముక్కెర ధారపోసి ముక్తేశుడనైన నన్ను కొన్నావు. ఇదుగో! ముక్తిని తులతూచిన నీ ముక్కెర” అన్న భగవంతుని అంతర్వాణి వినిపించింది సరస్వతీబాయికి. ఎంతో సంతోషంతో ముక్కెర తీసుకొని భర్త దగ్గరకు వెళ్ళింది. అదిచూసి అవాక్కయ్యాడు నాయకుడు. విప్రుడు తన వద్దకే వచ్చి ముక్కెర అమ్మాడు. విషయము తెలిసింది ఆ దంపతులకు. రోజూ విప్రవేషంలో వచ్చి యాచించినది ఆ విఠ్ఠలేశుడే అని అవగతమైంది ఆ దంపతులకు. “వడివాయక తిరిగే ప్రాణబంధుడు స్వామి” అన్న సత్యం తెలుసుకున్నాడు నాయకుడు. ఆ రోజునుండి ఎన్నో దానధర్మాలుచేస్తూ భగవంతుని భక్తితో కొలుస్తూ తరించారు ఆ దంపతులు. దాదాపు నాలుగు లక్షల సంకీర్తనలు గానంచేసి భక్త పురందరదాసుగా ప్రసిద్ధికెక్కాడు శ్రీనివాసనాయకుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. కర్మఫలం అమోఘమైనది. శ్రీనివాసనాయకుని పూర్వ పుణ్యం వలన భగవంతుడు స్వయంగా వచ్చి అతనిలోని లోభగుణాన్ని పోగొట్టి కాపాడినాడు.
  2. ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలంటారు. ఆ సూక్తికి తార్కాణం సరస్వతీబాయి. సుశీలవతి అయిన సరస్వతీబాయి తన సుగుణాలతో స్వామిని మెప్పించి తనను తానే కాక తన భర్తను కుడా తరింపచేసింది.
  3. లోభం చాలా భయంకరమైన దుర్గుణము. సాక్షాత్ ఆ భగవంతునికే శ్రీనివాసనాయకుని లోభగుణం మార్చడానికి అంత శ్రమ పడవలసి వచ్చింది. మనమెన్నడూ ధనకాంక్షులము కారాదని దానధర్మాలు చేయాలని మనకీ కథద్వారా తెలిసినది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Bhartruhari Katha In Telugu – భర్తృహరి కథ

Bhartruhari Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

విక్రమార్కుని సాహసగాధల నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భర్తృహరి కథ. 

భర్తృహరి కథ

మహానుభావుడైన కేశవశర్మకు నలుగురు ఉత్తములైన పుత్రులు దైవానుగ్రహము వలన కలిగినారు. సంస్కృత వ్యాకరణకర్త దివ్య శివమహిన్మా: స్తుతికర్త అయిన కాత్యాయన వరరుచి, అతిలోక సాహవంతుడు ధర్మాత్ముడు మహాకాళీభక్తుడు అయోధ్యాలయ పునరుద్ధారకుడు శకకర్త అయిన విక్రమార్కుడు, పండితుడు మహావివేకవంతుడు కాళీ అనుగ్రహపాత్రుడు అయిన భట్టి మరియు సంస్కృత మహాకవి సుభాషిత రత్నావళికర్త వాక్యప్రదీప, రాహత, కారిక గ్రంథకర్త అయిన భర్తృహరి ఆయన నలుగురు కుమారులు. కేశవశర్మ యోగ్యుడైన భర్తృహరికి రాజ్యభారమప్పగించి వానప్రస్థమును స్వీకరించాడు. చిన్నప్పటినుంచి భర్తృహరి సాధుసజ్జనుల సేవలుచేస్తూ ఉండేవాడు.

భర్తృహరి రాజ్యములో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధనానికి పేదకాని గుణానికి కాదు. సౌశీల్యుడు మంత్రతంత్రశాస్త్ర కోవిదుడు అయిన ఆ విప్రోత్తముడు భువనేశ్వరీదేవి ఉపాసకుడు. మాత ఆ పరమభక్తుని అనుగ్రహించదలచి ఆయన ముందు ప్రత్యక్షమై “కుమారా! నీ గుణసంపదను భక్తిని మెచ్చినాను. ఈ దివ్యఫలం తీసుకో. ఈ ఫలం తిన్నవాడికి జరామరణాలు ఉండవు!” అని ఆజ్ఞాపించింది జగజ్జనని.

గుణాగ్రగణ్యుడైన ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచించాడు “నేను ఒక పేదబ్రాహ్మణుడను. అమృతత్వము సంపాదించిననూ నేను ఎవరిని కాపాడగలను? ఈ పండు కనక మన మహారాజుగారు తింటే ఎందఱో నిర్భాగ్యులను రక్షించగలడు. అప్పుడే నేనీ ఫలమును సద్వినియోగము చేసినవాడను అవుతాను”. ఇలా తలచి ఆ బ్రాహ్మణుడు మహారాజైన భర్తృహరి వద్దకు వెళ్ళి అతనిని ఆశీర్వదించి ఆ దివ్యఫలాన్ని అతనికిచ్చి వచ్చేశాడు!

ఫలము యొక్క మహిమను అర్థంచేసుకోలేక భర్తృహరి ఆ ఫలమును తన ప్రియురాలైన అనంగసేనకు ఇచ్చివేసాడు. కుటిలాత్మురాలైన ఆ అనంగసేన తన సఖుడైన అశ్వపోషకునికి ఆ దివ్యఫలం ఇచ్చింది. మూర్ఖుడైన ఆ అశ్వపోషకుడు తన దాసికి ఆ ఫలాన్ని ఇచ్చాడు. ఆమె తనకు ప్రియుడైన ఒక గోపాలకునికి ఫాలాన్ని ఇవ్వగా వాడు దానిని తన ప్రియురాలికిచ్చాడు. ఆ చిన్నది పశువులపెంట ఉన్న బుట్టలో పండును పెట్టి రాజమార్గముగుండా ఆ బుట్టను తలపైపెట్టుకొని తన ఇంటికి వెళ్ళింది. భర్తృహరి ఆ పండును చూశాడు. బ్రాహ్మణుడు మహాత్యాగం చేసి లోకహితార్థం తనకిచ్చిన దివ్యఫలం చివరికి పెంటబుట్టలో చేరిందని బాధపడ్డాడు. ఆ పండు ఎంతమంది చేతులు మారిందో తెలుసుకున్నాడు.

ఒక్కసారిగా భర్తృహరికి వైరాగ్యం వచ్చింది. సంసారం మీద విరక్తి పుట్టింది. తను ఎవరినైతే ప్రియులు అనుకుంటున్నాడో వాళ్ళు నిజమైన ప్రియులు కాదని పరమేశ్వరుడొక్కడే ప్రాణబంధుడని తెలుసుకున్నాడు. మిథ్యాజగత్తులోని విషయభోగాలను త్యజించి రెమేశునిపై అనురక్తుడై వైరాగ్యముతో తపోవనాలకు వెళ్ళడనికి సిద్ధపడ్డాడు. దేవీప్రసాదమైన ఆ దివ్యఫలాన్ని తన రాజ్యసర్వస్వాన్ని యోగ్యుడైన విక్రమార్కుని చేతిలో పెట్టి తపస్సుకై వెళ్ళిపోయాడు.

మహౌదార్యుడైన విక్రమాదిత్యుడు తన వద్దకు వచ్చిన దీనుడైన ఒక బ్రాహ్మాణునిపై జాలిపడి ఆ దివ్యఫలాన్ని అతనికి ఇచ్చివేశాడు!!

రత్నైర్మాహార్హైస్తుతుషుర్న దేవా న భేజిరే భీమ విషేణ భీతిమ్|
సుధాం వినా న పరయుర్విరామం న నిశ్చితార్థాద్విరమన్తి ధీరాః||

– భర్తృహరి నీతిశతకమ్

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

విప్రోత్తముని సద్భావము మనకు కనువిప్పుకావాలి. లోకంలో జనాలు వృద్ధాప్యం రాకూడదు మృత్యువు రాకూడదు అని తపిస్తుంటే ఆ బ్రాహ్మణుడు జరామరణ రహితముగా చేసే దివ్యఫలాన్ని లోకహితార్థం మహారాజుకు ఇచ్చివేశాడు. స్వధర్మపాలలనో పరాకాష్టను చూపిన ఆ భూసురుడు ధన్యుడు.

“అంతా మిథ్య తలంచిచూచిన” అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు భర్తృహరి. లౌకిక విషయాలను విడిచి మోక్షమార్గోన్ముఖుడైనాడు. ఆయన మనకు అందించిన సుభాషితాలను చదివి అర్థంచేసుకుని మన నిత్యజీవితములో అనుసంధానం చేసుకోవడం మన కర్తవ్యము.

విక్రమార్కుని ఔదార్యము గొప్పది. దీనుడైన విప్రునికి దివ్యఫలాన్ని దానం చేసి తన త్యాగబుద్ధిని మనకు చూపినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం: