Viveka Margramlo Povali In Telugu – వివేక మార్గంలో పోవాలి

Viveka Margramlo Povali In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వివేక మార్గంలో పోవాలి నీతికథ.

వివేక మార్గంలో పోవాలి

మహా విద్వాంసుడూ, భారత వంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రీ. అయిన విదురుడు తన ప్రభువు అవివేశాన్ని వేలెత్తి చూపుతూ చెపు తున్నాడు.

ప్రభూ! ధనవంతుడున్నాడే వాడు హాయిగా సుఖపడుతూ భోగ మయ జీవితం గడుపుతూ తృప్తి పడకూడదు. పదిమందికీ పెట్టి, పేద వారికి దానధర్మాలు చేస్తూండాలి. దానం చేసేటప్పుడు చిరాకుతో, విసు గుతో చెయ్యకూడదు. సంతోషంతో చేస్తే పుచ్చుకున్న వాడు కూడా అనం దిస్తాడు. దానివల్ల మన పుణ్యం పెరుగుతుంది. అదే ధనానికి ఫలం.

వేద వేదాంగాలు చదివినవారుంటారు. వారు నిత్యం సత్కర్మలే చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడాలి. శాస్త్రాలు చదివిని వారందరూ అందులో చెప్పిన సదాచారాలను తాము ఆచరించి ఎదుటి వారికి బోధిం చాలి.

ఆత్మబలం కనక ఉన్నట్లయితే ఎన్ని వివత్తులు మీదపడ్డా తట్టుకో గలం. అది లేని నాడు ఏ చిన్న కష్టం వచ్చినా క్రుంగిపోతాం.

ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము. క్రోధాన్ని శాంతంతో జయించాలి. దుష్టులను మంచి మాటలతో మరలించాలి. లోభబుద్ధి ఉంటే అది పోవడానికి దానగుణం అలవరచుకోవాలి. అసత్యాన్ని పత్యమే జయిస్తుంది.

దొంగలు, జూదరులు, సోమరిపోతులు, కాముకులు, కృతఘ్నులు, వా స్తితులు- వీరందరూ అవఖ్యాతినే పొందుతారు.

విద్యావంతుడు కానివాడి జీవితం నిరర్థకం. అలానే సంతానం లేని దాంపత్య జీవితమూనూ.

విశ్రాంతి లేకుండా తిరిగే వారికి త్వరగా ముపలితనం వస్తుంది. పదిమంది చేత అవమానాల పాలయిన వాడి మనస్సుకి వార్ధక్యం ప్రాప్తి స్తుంది. నిరంతరం మననం చేసుకోక పోతే విద్య నిలవదు.

అన్నిటికంటె లోభం మహాచెడ్డది. ఎందుకంటే
ఈ ప్రపంచంలో ఉండే బంగారం, మణులూ, రత్నాలూ, ధాన్యాలూ, అన్నీ లభించినా యింకా ఏదో దొరకలేదని ఏడుస్తూనే ఉంటాడు లోభి. అందువల్లనే మానవుడు ముందుగా లోభ గుణాన్ని విడిచి పెట్టాలంటారు.

నడ్డిపంచి పని చేసేవాడికి ఏ లోటూ రాదు. సజ్జమలతో సహవాసం చేసే వానికి అపకీర్తి రాదు. వీరిద్దరూ సర్వ సుఖాలూ పొందుతారు.

గుంతలను దోషులుగా ప్రచారం చెయ్యడం కంటె మరణం లేదు. ఇతరులను నిందిస్తూ కూర్చోవడం కంటే దరిద్రం లేదు.

విద్యార్థులయిన వారు సోమరితనాన్ని దరి చేర నివ్వకూడదు. వ్యామోహాలకు లొంగరాదు. మదోన్మత్తులు కాకూడదు. చపలచిత్తులు కాకూడదు. సర్వ సుఖ భోగాలలో తేలియాడే వారికి చదువు రాదు. విద్యా భ్యాస కాలంలో వివయాన్నీ, క్లేశసహనాన్ని అలవరచుకోవాలి. అప్పుడే విద్య అంటుతుంది.

ప్రభూ!
మరొక్క ముఖ్యమయిన మాట. సావధానంగా వినండి. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ మాత్రమే నిత్యం. అంమచేత దానిని గురించే యోచన చెయ్యాలి.

ధన ధాన్య సమృద్ధమూ, రత్న మాణిక్య సంపన్నమూ అయిన ఈ భూమండలం అంతటినీ పాలించిన మహారాజు కూడా మరణానంతరం తనతో ఒక్క గడ్డి పరక కూడా పట్టుకుపోలేడు అన్నీ యిక్కడ విడిచి పోవలసిందే.

ఈ విషయం మీకు తెలియనిదని చెప్పడం లేదు. తెలిసిన వాటిని మళ్లీ గుర్తు చేసుకోవడం మన విధి.

కష్టపడి పెంచి, పోషించి, విద్యాబుద్ధులు నేర్పి, సంపదలన్నీ -యిచ్చిన తండ్రి మరణిస్తే, యిన్నీ అనుభవించే ఆ కొడుకు ఏం చేస్తు న్నాడు?

ఇంతసేపు ఏడ్చి, వల్లకాటికి తీసుకుపోయి బూడిద చేస్తున్నాడు. అంతేగదా ! ఆ తరువాత హాయిగా జీవితం సాగిస్తున్నాడు. ఇది లోక వ్యవహారం.

ఆ మరణించిన వాడి సిరి సంపదలన్నీ బంధువులు పంచుకు తింటు న్నారు. ఆ శరీరాన్ని బూడిద చేస్తే పంచ భూతాలలో కలసిపోతుంది.

పాతిపెడితే నక్కలూ, గ్రద్దలూ తింటున్నాయి.
పువ్వులూ, కాయలూ లేని చెట్లమీదికి పక్షులు కూడా చేరవు. అలానే మరణించిన వాడితో ఎవరూ పోరు.

ఎటొచ్చీ – వాడు చేసిన పుణ్య, పాపకర్మల ఫలం మాత్రం కూడా వెడుతుంది. కనుకనే దాన ధర్మాలూ, పుణ్యకార్యాలూ చెయ్యాలని పెద్దలు చెబుతున్నారు.

మనం చెయ్యవలసిన పనులు మనం చేసుకుంటూ పేదసాదలను ఆవరంతో చూస్తుండాలి. పతితులను రక్షించడానికి ప్రయత్నించాలి.
గురువులనుందు భక్తి కలిగి శ్రద్ధతో వారి బోధలు వింటూ, వారిని సేవించుకోవాలి.

ఎప్పుడూ పత్యమే పలకాలి అసత్య భాషణానికి అవకాశం యివ్వకూడదు.

ధనవంతులు దానధర్మాలతో త్యాగబుద్ధిని ఎలా అలవర్చుకుంటారో, అలానే బలపరాక్రమాలు కలవారు ఎదుటి వారిని హింసించడానికి దానిని వినియోగించరాదు.

దుర్బలులకు సాయపడడానికే వీరులు కృషి చెయ్యాలి.
అన్ని దానాల కంటే శ్రేష్ఠమయినది అన్నదానం.
అదే కదా ప్రాణానికి ఆధారం.
అలానే జీవితంలో ప్రధానమయినది ధర్మ మార్గాన నడవడం.
అంతకంటె ఏమీలేదు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satyanarayana Swamy Vrata Katha First Part In Telugu – వ్రత కథ ప్రథమ అధ్యాయం

Satyanarayana Vrata 1st Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

సత్యనారాయణ వ్రత కథ – ప్రథమోధ్యాయః

శ్లో//ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోప శాంతయే //

శ్రీమంతమైన నైమిశారణ్యములో శౌనకాదిమహర్షులు, తమ దగ్గరకు వచ్చిన మహాపురాణవేత్తయైన సూతునికి మర్యాదలు చేసి, యిట్లడిగిరి. పౌరాణిక శేఖరా ! మానవులు కోటిన ఇహలోక, పరలోకములందలి సౌఖ్యములు ఏ వ్రతము చేసిన లభించును ? ఏ తపము చేసిన లభించును ? అదంతయు మాకు చెప్పుము. అని కోరగా సూతుడిట్లనెను. మునులారా ! మీరడిగిన ప్రశ్ననే ఒకప్పుడు దేవర్షియైన నారదుడు శ్రీమన్నారాయణు నడిగెను.ఆయన నారదునకు చెప్పిన దానినే మీకు చెప్పెదను, వినుడు.ఒకానొకప్పుడు నారదమహాముని లోకములను అనుగ్రహించు కోరిక గలవాడై వివిధ లోకములు దిరుగుచు భూలోకమునకు వచ్చెను. అక్కడ, తాము చేసిన కర్మములచే నానాదుఃఖములనుభవించుచు, అనేక జన్మములెత్తుచున్న జనములనుజూచి, ఏ యపాయముచే వీరి దుఃఖములు తొలగు నని చింతించి, సర్వలోక పరిపాలకుడగు శ్రీహరి నివసించు వైకుంఠమునకు వెడలను. అక్కడ, తెల్లని శరీరకాంతి గలవాడును, నాలుగు భుజములు ప్రథమ అధ్యాయం గలవాడును, శంఖము – చక్రము – గద – పద్మము వనమాల వీనిచే అలంకరింపబడినవాడును అగు శ్రీమన్నారయణుని జూచి స్తుతించుట ఆరంభించెను. “మాటలకును మనస్సునకును అందని రూపముగలవాడవును, సృష్టి స్థితి లయములు చేయు అనంతశక్తి గలవాడవును, పుట్టుట – పెరుగుట – నశించుట లేనివాడవును, మొదట సత్వరజస్తమో గుణములు లేనివాడవే అయినను సృష్టి వ్యవహారములో త్రిగుణములు గలవాడవును, అన్నింటికి మొదటివాడవును, భక్తుల బాధలు తీర్చువాడవును అగు నీకు నమస్కారము” నారదుని యీ స్తోత్రమును విని విష్ణువు నారదమునీ తో నిట్లనెను. నారదమునీ ! నీవిక్కడి కేల వచ్చితివి? నీ మన్సులో నేమి కోరిక యున్నది? చెప్పుము. నీవడిగిన వన్నియు వివరింతును. అని నారదుడిట్లనెను. స్వామీ ! భూలోకమున జనులందరును చాల దుఃఖము లనుభవించున్నారు. మృగ పశుపక్షి మనుష్యాది అనేక జన్మములెత్తుచున్నారు.అనేక పాపములు చేసి ఆ పాప ఫలములనుభవించుచున్నారు. తేలికయైన ఉపాయము చేత వారి పాపములన్నియు నశించు మార్గమును దయచేసి ఉపదేశింపుము. అని అడుగగా భగవానుడిట్లనెను, నారదా! లోకములోనివారు సుఖపడవలెనను మంచిబుద్ధితో నీవడిగిన విషయము చాల బాగున్నది. జనులు దేనిచే సంసార భ్రాంతి విడిచి సౌఖ్యము పొందుదురో అట్టి సులభోపాయమును జెప్పెదను, వినుము.

భూలోకమందును, స్వర్గలోకమందును గూడ దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రత మొక్కటి కలదు. నీయందలి వాత్సల్యము చే చెప్పుచున్నాను. అది సత్యనారాయణ వ్రతము. దానిని విధివిధానముగా ఆచరించినవాడు ఈ లోకమున సమస్త సౌఖ్యముల ననుభవించి ఆపైన ముక్తి నొందును. అని చెప్పగా స్వామీ ! ఆ వ్రతవిదానమేమి? ఆ వ్రత మట్లు చేసినచో ఫలమేమి? పూర్వ మెవ్వరైన చేసి ఫలము నొందినారా? ఆ వ్రతమెప్పుడు చెయవలెను? ఇవ్వన్నియు వివరముగా జెప్పుమని యడిగెను. భగవానుడిట్లు చెప్పెను. వ్రతవిష్టత ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును. ఈవ్రతము ఏప్పుడు చేయాలిమాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభదినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ధ ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించవచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదశినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను. .ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యావందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలెను. పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్ధికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల మ్రుగ్గులు పెట్టవలెను. ఆ మ్రుగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు. కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో నుంచవలెను.

గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్యష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన చేసి, సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజచేయవలెను. బ్రాహ్మణ – క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక – పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశ్రద్దలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను. బ్రాహ్మణులతోను బంధువులతోను గూడి వ్రతము చేయవలెను. అరటిపండ్లు, ఆవునేయి, ఆవుపాలు, శేరంబావు గోధుమనూక, గోధుమనూక లేనిచో వరినూక, పంచదార వీనినన్నిటిని కలిపి ప్రసాదము చేసి స్వామికి నివేదనము చేయవలెను.

బంధువులతో గూడి సత్యనారాయణ వ్రతకథను విని, బ్రాహ్మణులకు దక్షిణతాంబూలములిచ్చి, వారికిని బంధువులకును భోజనములు పెట్టి స్వామి ప్రసాదమును స్వీకరించి, స్వామికి నృత్యగీతాది మహారాజోపచారములర్పించి తానును భుజింపవలెను. నదీతీరమున ఇట్లు వ్రతము చేసి, స్వామిని స్మరించుచు స్వగృహమునకు చేరవలెను.

ఇట్లు సాంగముగ భక్తి శ్రద్ధలతో వ్రతము చేసినవారికి కోరినవి సిద్ధించును. విశేషించి, కలియుగములో సర్వార్థ సిద్ధికి ఇదియే సులభమైన ఉపాయము. దీనిని మించినదేదియు లేదు. అని శ్రీమన్నారయణుడు, నారదున కుపదేశించెనని సూతుడు శౌనకాది మహామునులకు జెప్పెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ప్రథమోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Sri Sai Deeksha Vidhanam In Telugu – శ్రీ సాయి దీక్షా విధానము

Sri Sai Deeksha Vidhanam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి దీక్షా విధానము గురించి తెలుసుకుందాం…

Sri Sai Deeksha Or Sai Mala Vidhanam

శ్రీ సాయి దీక్షా విధానము

మానవునికి శాంతి సౌఖ్యములను సమకూర్చేది భక్తి. ఆ సాయినాథుని కృపాకటాక్షములు ఎల్లవేళల తోడుండాలని చేసే ప్రయత్నమే శ్రీ సాయిదీక్ష. ఈ దీక్షను శ్రీ సాయి పుట్టిన రోజగు శ్రీరామ నవమికి ముందు, శ్రీ సద్గురుని గురు పౌర్ణిమగు ఆషాఢ పౌర్ణిమకు ముందు, శ్రీ సాయి పుణ్యతిథి యగు విజయదశమికి ముందు, శ్రీ దత్త జయంతి యగు మార్గశిర పౌర్ణిమకు ముందు మండలము, అర్ధ మండలము, సప్తాహంగా వీలును బట్టి స్వీకరించవచ్చును.

దీక్షకు అవసరమగు వస్తువులు:

రెండు మాలలు. ఒకటి ధారణమాల, రెండవది జపమాల. మాలలలో తులసీ, రుద్రాక్ష, స్పటిక, రక్త చందన రకాలున్నాయి. వీటిలో తులసీమాల శ్రేష్ఠము. తెలుపు రంగు దీక్షా వస్త్రములు, అలంకరణ కొరకు గంధము, విభూతి, కుంకుమ, పూజ కొరకు పసుపు, కుంకుమ, అక్షింతలు, అగరవత్తులు, గంధము, కర్పూరం, కలకండ (కడి చక్కెర), పన్నీరు, పీచుతో కూడిన నారికేళం, ఊదు, విభూతి చూర్ణం, ప్రమిదలు, గంట, ఏక మరియు పంచ హారతులు, ఉదాని, వత్తులు, మంచి నూనె, సాయి బాబా విగ్రహం లేదా బాబా, గణపతి, దత్తాత్రేయుల చిత్రపటాలు.

మాలాధారణ విధానము:

మాలాధారణ రోజు ఉదయమే తలంటు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీక్షా దుస్తులు ధరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం పొంది సాయి కాకడహారతికి (ఉ॥ 5-15 ని॥) ముందుగా ఆలయాన్ని చేరి కాకడ హారతి అనంతరం గురు స్వామి లేదా పూజారి చేత మాలధారణ చేయవలెను. తరువాత తాను నివసించు ప్రదేశంలో పీఠం ఏర్పాటు చేసుకొని సాయి విగ్రహం, చిత్ర పటాలు, గురుస్వామి ఇచ్చిన నారికేళం ఉంచి నిత్యం పూజించాలి.

దీక్షా నియమాలు:

  1. వ్రతి రోజు నూర్యోదయం కన్నా ముందు మరియు సూర్యాస్త మయం తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి.
  2. స్నానానంతరం దీక్షా వస్త్రధారణ కాగానే గంధం, కుంకుమ, విభూతి ధరించాలి.
  3. పీఠం వద్ద శుభ్ర పరచి సాయినాథునికి అభిషేకము చేసి దీపారాధన అనంతరం అష్టోత్తరంతో కూడిన అర్చన గావించి ధూపం చూపించి కలకండ నైవేద్యం సమర్పించి, కర్పూర హారతి యిచ్చి మంత్ర పుష్ప సాష్టాంగ నమస్కారాలతో వూజ నాచరించవలెను.
  4. మధ్యాహ్నం 12 గం॥లకు మహా నైవేధ్యం చూపి పంచ హారతులతో మధ్యాహ్న హారతి సాయికి ఇచ్చి అనంతరం భోజనం చేయాలి. ఆహారం సాత్వికమై ఉండాలి.
  5. సూర్యాస్తమయం అనంతరం స్నానాది కార్యక్రమాలు జరిపిన తరువాత ఏక హారతితో ప్రదోష పూజ (సంధ్యా హారతి) ను, రాత్రి 10 గం॥లకు శేజారతి నివ్వాలి.
  6. దీక్షా సాధకుడు ప్రతి రోజు ఒకే పూట భోజనం చేసి రాత్రికి పాలు, ఫలములు మాత్రమే తీసుకోవాలి. నేలపైనే నిద్రించాలి. నిరంతరం సాయి నామం జపిస్తు గురు స్వామి ఉపదేశించిన మంత్రమును ఉదయం 108 సార్లు, రాత్రి 108 సార్లు స్మరించాలి.
  7. తను నిర్వర్తించే వృత్తులను నిర్వర్తిస్తు వీలైన సమయంలో సాయి జీవిత చరితము సాయి లీలామృతము నిత్య పారాయణము చేయాలి.
  8. భూత దయను కలిగి వుండి, ప్రతి జీవిలో సాయిని దర్శించాలి.
  9. ఇతరులను సాయిరాం అని గాని, సాయి శరణం అని గాని సంబోధించాలి.
  10. ప్రతి స్త్రీలోను తల్లిని చూడవలెను.
  11. వీలును బట్టి ఆలయ దర్శనం చేయాలి. దైవ భక్తి కార్యక్రమాల్లో పాల్గొనాలి.
  12. తీసుకొనే ప్రసాదము భోజనం పరిశుభ్ర స్థలంలో ఒకే సారి తీసుకోవాలి.
  13. ఆర్థిక పరిస్థితిని బట్టి అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలి.

దీక్షలో చేయకూడనివి:

  1. తెలుపు దుస్తులు తప్ప ఇతర రంగు దుస్తులు ధరించకూడదు.
  2. క్షౌరము చేయకూడదు, గోళ్ళు తీయకూడదు.
  3. క్రీములు, నూనెలు, సబ్బులు వాడకూడదు.
  4. విలాసాలకు, హాస్యానికి, రాజకీయ విషయములకు దూరంగా వుండాలి. (న్యూస్ పేపర్ చదవకూడదు. టి.వి, సినిమాలు చూడకూడదు)
  5. ధూమపానం, మద్యపానం, మాంసాహారమును విడిచిపెట్టాలి.
  6. పాదరక్షలు ధరించకూడదు.

దీక్షావిరమణ :

దీక్ష పూర్తయిన మరుసటి రోజు ఉదయం పీఠం వద్ద పూజా కార్యక్రమాలు జరిపి పీఠంను కదిలించి పీఠంపై గల నారికేళమును తీసుకొని దానితో స్వామి వారి పూజా వస్తువులు, నైవేద్యంతో శ్రీ సాయిబాబా మందిరమును చేరి గురు స్వామి లేదా పూజారి చే దీక్షా విరమణ చేయాలి. శాంతిని చేకూర్చు శ్రీ సాయిబాబా దీక్షను కుల మత భేదాలు లేకుండా స్వీకరించిన కార్యసిద్ధి తప్పక జరుగును.

మరిన్ని పోస్ట్లు:

Sri Madhava Nagar Sai Kshetram In Telugu – శ్రీ మాధవ నగర సాయి క్షేత్రము

Sri Madhava Nagar Sai Kshetram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భక్తి యోగం అనేది మనస్సును శుద్ధి చేసే, ఆత్మ అధ్యాత్మిక ప్రయత్నము. అనుష్ఠానాల్లో ప్రార్థన, భజన, ధ్యాన, పరమాత్మ సేవ మరియు ముక్తి సాధన ముందుగా ఉంటుంది. భక్తి యోగం యోగుడును ఆత్మశుద్ధి, సర్వోత్తమ ప్రమేయాలు మరియు ఆనందంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ మాధవ నగర సాయి క్షేత్రము గురించి తెలుసుకుందాం…

Sri Madhava Nagar Sai Baba Kshetram

శ్రీ మాధవ నగర సాయి క్షేత్రము

సదానింబ వృక్షస్య మూలాధి వాసాత్
సుదా సావిణం విక్రమప్య ప్రియంతం
తరుం కల్ప వృక్షాధికమ్ సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ।

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దివ్య మంగళ స్వరూపుడైన భగవానుడు సాయిబాబ రూపంలో శ్రీరామ నవమి పర్వదినమున ఈ అవనిపై అవతరించాడు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాన్ సమీపాన గోదావరి తీరంలో గల షిరిడీలోని మసీదును కోవెలగా మలచుకొని కొలువైనాడు. ప్రాణుల పట్ల దయను కలిగియుండాలని, అందరి దైవం ఒక్కడేనని చాటి, కనులుండి చూడలేని లోకానికి వెలుగు దారిని చూపాడు. బాబా నివసించు మసీదులో ఎల్లప్పుడు ‘ధుని’ (హోమ గుండం)ని వెలిగించేవారు. ప్రతి అణువులో నిండియుండి ప్రతి ఇంటిలో పూజలందుకొంటున్న పరమేశుడు సాయి. ఆయన లీలలు తెలుపగ ఈ జీవితం చాలదు. వ్రాయడానికి ఎన్ని పుటలైనా సరిపోవు.

ఇందూరుకు 5 కి.మీ. దూరంలో ఇప్పుడు మాధవనగర్ సాయిబాబ దేవస్థానం ఉన్న స్థానంలో క్రీ.శ. 1930-35 సం॥ ప్రాంతంలో అంజయ్య అనే భక్తుడు రావిచెట్టు క్రింద బాబా ఫోటో పెట్టి ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో పూజనాచరించేవాడు. ప్రతి గురువారము రోజున సాయి పల్లకితో ఒంటెద్దు బండిపై ఇందూరు పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేసేవాడు. క్రీ.శ. 1945-55 సం॥ ప్రాంతంలో ద్వారకామాయిని ఏర్పాటు చేసి షిరిడీలో మాదిరిగా ‘ధుని’ని వెలిగించేవారు.

అలా అంజయ్య అనే భక్తుడు సాయినాథుని సేవ చేస్తున్న రోజులలో 1962-63 సం॥ ప్రాంతంలో నవీపేట్ వాస్తవ్యులు శ్రీ కిష్టాపురం బాలాగౌడ్ గారు ఈ దారి వెంట ప్రయాణిస్తూ తన వాహనం చెడిపోగా ఆ రాత్రి ఇక్కడే బస చేశారు. ఆ రాత్రి సాయినాథుడు అంజయ్య, బాలాగౌడ్ గార్లకు స్వప్నంలో కనిపించి తనకు ఆలయము నిర్మించండని చెప్పినాడట.

జైపూర్ నుండి శ్రీ సాయిబాబ పాలరాతి విగ్రహాన్నితీసుకొని వచ్చి 21 రోజులు 101 మంది పురోహితులచే పూజా హోమాదులను జరిపించి క్రీ.శ. 1964 సం||లో బాబా విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సాక్షాత్తు శ్రీ సాయినాథుని ద్వారా నవ నాణెములు పొందిన సాయి భక్తురాలు శ్రీమతి లక్ష్మీ బాయి షిండే గారు షిరిడీ నుండి వచ్చారు. 1972 సం॥లో ఈ దేవస్థానం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. 6 ఎకరాల 30 గుంటల భూమిని శ్రీ సుబ్బారెడ్డి (మోస్రా) గారు ఆలయానికి విరాళముగా అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్లుగా పదవీ బాధ్యతలను చేపట్టేవారు, అభివృద్ధికై కృషి చేసినారు. ఆలయ సిబ్బంది, అర్చక . బృందము మరియు భక్తుల సహాయ సహకారములతో దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది.

ఆలయ ప్రాంగణంలో శ్రీ గణపతి, శివుడు, నాగేంద్రుడు, సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, శ్రీ పద్మావతీ శ్రీనివాసులు, దత్తాత్రేయులు, నవగ్రహాలు మొదలగు దేవతామూర్తులు దర్శనమిస్తారు. ఎల్లప్పుడు ద్వారకామాయిలో వెలుగొందే ‘ధుని’ లోని విభూతి సర్వరోగహరిణి, సర్వ పాప నివారిణి.

ఇక్కడి మందిరములో షిరిడీలో మాదిరిగా నాలుగు వేళలందు హారతులివ్వడం జరుగుతుంది. ఉ॥ 5-15 ని॥లకు కాకడ హారతి, మ॥ 12-00 గం॥లకు మధ్యాహ్న హారతి, సాయం సంధ్యా సమయంలో సంధ్యా హారతి, రాత్రి 10 గం॥లకు శేజారతి ఉంటుంది. ప్రతి గురువారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నిండైన మనస్సుతో బాబాను కొలుస్తారు. ఇదే రోజున సాయంత్రం సాయికి పల్లకీ సేవ జరుగుతుంది.

సాయి జన్మదినమైన శ్రీరామనవమి, సద్గురుని శ్రీ గురు పౌర్ణిమ సాయినాథుని పుణ్యతిథియైన విజయదశమి (బాబా సమాధియైన రోజు), దత్త రూపుని శ్రీ దత్త జయంతి రోజులలో అశేష భక్తజనావళి తరలిరాగ ఘనముగా వేడుకలు జరుగుతాయి.

అష్టదిక్కులే అప్లైశ్వర్యములుగా, పంచభూతములే పంచభక్ష పరమాన్నములుగా మలచుకొన్న సచ్చిదానంద రూపునకు ఈ ఇందూరు అవని తన మదినే మందిరముగా చేయగా నిత్య పూజలతో మరో షిరిడీగా మారిపోయింది.

భక్తుల కొరకు నీటి సరఫరా, వసతిగృహాలు, వంట గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యములను కల్పించడం జరిగినది.

మరిన్ని పోస్ట్లు:

Durga Saptashati Pradhanika Rahasyam In Telugu | దుర్గా సప్తశతీ ప్రధానిక రహస్యం

Durga Saptashati Pradhanika Rahasyam In Telugu

Durga Saptashati Pradhanika Rahasyam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దేవీ సూక్తం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దుర్గా సప్తశతీ ప్రధానిక రహస్యం

అస్య శ్రీసప్తశతీరహస్యత్రయస్య నారాయణ ఋషిః అనుష్టుప్చందః శ్రీమహాకాలీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతా యథోక్తఫలావాప్త్యర్థం జపే వినియోగః |

రాజోవాచ |

భగవన్నవతారా మే చండికాయాస్త్వయోదితాః |
ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం వక్తుమర్హసి ||

ఆరాధ్యం యన్మయా దేవ్యాః స్వరూపం యేన చ ద్విజ |
విధినా బ్రూహి సకలం యథావత్ప్రణతస్య మే ||

ఋషిరువాచ |

ఇదం రహస్యం పరమమనాఖ్యేయం ప్రచక్షతే |
భక్తో సీతి న మే కించిత్తవావాచ్యం నరాధిప ||

సర్వస్యాద్యా మహాలక్ష్మీస్త్రిగుణా పరమేశ్వరీ |
లక్ష్యాలక్ష్యస్వరూపా సా వ్యాప్య కృత్స్నం వ్యవస్థితా ||

మాతులుంగం గదాం ఖేటం పానపాత్రం చ బిభ్రతీ |
నాగం లింగం చ యోనిం చ బిభ్రతీ నృప మూర్ధని ||

తప్తకాంచనవర్ణాభా తప్తకాంచనభూషణా |
శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజసా ||

శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరీ |
బభార రూపమపరం తమసా కేవలేన హి ||

సా భిన్నాంజనసంకాశా దంష్ట్రాంచితవరాననా |
విశాలలోచనా నారీ బభూవ తనుమధ్యమా ||

ఖడ్గపాత్రశిరఃఖేటైరలంకృతచతుర్భుజా |
కబంధహారం శిరసా బిభ్రాణా హి శిరఃస్రజమ్ ||

తాం ప్రోవాచ మహాలక్ష్మీస్తామసీం ప్రమదోత్తమామ్ |
దదామి తవ నామాని యాని కర్మాణి తాని తే ||

మహామాయా మహాకాలీ మహామారీ క్షుధా తృషా |
నిద్రా తృష్ణా చైకవీరా కాలరాత్రిర్దురత్యయా ||

ఇమాని తవ నామాని ప్రతిపాద్యాని కర్మభిః |
ఏభిః కర్మాణి తే జ్ఞాత్వా యోధీతే సోశ్నుతే సుఖమ్ ||

తామిత్యుక్త్వా మహాలక్ష్మీః స్వరూపమపరం నృప |
సత్త్వాఖ్యేనాతిశుద్ధేన గుణేనేందుప్రభం దధౌ ||

అక్షమాలాంకుశధరా వీణాపుస్తకధారిణీ |
సా బభూవ వరా నారీ నామాన్యస్యై చ సా దదౌ ||

మహావిద్యా మహావాణీ భారతీ వాక్ సరస్వతీ |
ఆర్యా బ్రాహ్మీ కామధేనుర్వేదగర్భా సురేశ్వరీ ||

అథోవాచ మహాలక్ష్మీర్మహాకాలీం సరస్వతీమ్ |
యువాం జనయతాం దేవ్యౌ మిథునే స్వానురూపతః ||

ఇత్యుక్త్వా తే మహాలక్ష్మీః ససర్జ మిథునం స్వయమ్ |
హిరణ్యగర్భౌ రుచిరౌ స్త్రీపుంసౌ కమలాసనౌ ||

బ్రహ్మన్ విధే విరించేతి ధాతరిత్యాహ తం నరమ్ |
శ్రీః పద్మే కమలే లక్ష్మీత్యాహ మాతా స్త్రియం చ తామ్ ||

మహాకాలీ భారతీ చ మిథునే సృజతః సహ |
ఏతయోరపి రూపాణి నామాని చ వదామి తే ||

నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరమ్ |
జనయామాస పురుషం మహాకాలీం సితాం స్త్రియమ్ ||

స రుద్రః శంకరః స్థాణుః కపర్దీ చ త్రిలోచనః |
త్రయీ విద్యా కామధేనుః సా స్త్రీ భాషా స్వరాక్షరా ||

సరస్వతీ స్త్రియం గౌరీం కృష్ణం చ పురుషం నృప |
జనయామాస నామాని తయోరపి వదామి తే ||

విష్ణుః కృష్ణో హృషీకేశో వాసుదేవో జనార్దనః |
ఉమా గౌరీ సతీ చండీ సుందరీ సుభగా శివా ||

ఏవం యువతయః సద్యః పురుషత్వం ప్రపేదిరే |
చక్షుష్మంతో2 నుపశ్యంతి నేతరే తద్విదో జనాః ||

బ్రహ్మణే ప్రదదౌ పత్నీం మహాలక్ష్మీర్నృప త్రయీమ్ |
రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చ శ్రియమ్ ||

స్వరయా సహ సంభూయ విరించోండమజీజనత్ |
బిభేద భగవాన్ రుద్రస్తదౌర్యా సహ వీర్యవాన్ ||

అండమధ్యే ప్రధానాది కార్యజాతమభూన్నృప |
మహాభూతాత్మకం సర్వం జగత్ స్థావరజంగమమ్ ||

పుపోష పాలయామాస తల్లక్ష్మ్యా సహ కేశవః |
మహాలక్ష్మీరేవమజా రాజన్ సర్వేశ్వరేశ్వరీ ||

నిరాకారా చ సాకారా సైవ నానాభిధానభృత్ |
నామాంతరైర్నిరూప్యెషా నామ్నా నాన్యేన కేనచిత్ ||

ఇతి ప్రాధానికం రహస్యం సంపూర్ణమ్ |

మరిన్ని స్తోత్రాలు:

Devi Suktam In Telugu | దేవీ సూక్తం

Devi Suktam In Telugu

Devi Suktam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దేవీ సూక్తం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దేవీ సూక్తం

ఓం అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమా”దిత్యెరుత విశ్వదే”వైః |
అహం మిత్రావరుణోభా బిభర్మ్యహమి”స్త్రాగ్నీఅహమశ్విన్తోభా ||

అహం సోమమా సోమమాహనసం” బిభర్మ్యహం త్వష్టా”రముత పూషణం భగమ్” |
అహం దధామి ద్రవిణం హవిష్మతే సుప్రావ్యే ఏయజమానాయ సున్వతే ||

అహం రాష్ట్రీ” సంగమనీ వసూ”నాం చికితుషీ” ప్రథమా యజ్ఞియా”నామ్ |
తాం మా” దేవా వ్యదధుః పురుత్రా భూరిస్థాత్రాం భూర్యా” వేశయన్”తీమ్ ||

మయా స్కో అన్నమత్తి యో విపశ్యతి యః ప్రాణితి యఈ”౦ శ్రుణోత్యుక్తమ్ |
అమన్తవోమాన్త ఉపక్షియన్తి శ్రుధిశ్రుత శ్రద్ధివం తే” వదామి ||

అహమేవ స్వయమిదం వదామి జుష్ట”౦ దేవేభిరుత మానుషేభిః |
యం కామయే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తమృషిం తం సుమేధామ్ ||

అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవేహన్త వా ఉ |
అహం జనా”య సమదం” కృణోమ్యహం ద్యావా”పృథివీ ఆవివేశ ||

అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోనిరప్స్వ౬౧న్తః సముద్రే |
తతో వితిష్ఠ భువనాను విశ్వో తామూం ద్యాం వర్ష్మణోపస్పృశామి ||

అహమేవ వాత౬ఇవ ప్రవా”మ్యారభమాణా భువనాని విశ్వా” |
పరో దివా పరఏనా పృథివ్యె తావతీ మహినా సంబభూవ ||

ఓం శాస్త్రి: శాస్త్రి: శాస్త్రి: ||

మరిన్ని స్తోత్రాలు:

Durga Saptashati Vaikruthika Rahasyam In Telugu | దుర్గా సప్తశతీ వైకృతిక రహస్యం

Durga Saptashati Vaikruthika Rahasyam In Telugu

Durga Saptashati Vaikruthika Rahasyam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దుర్గా సప్తశతీ వైకృతిక రహస్యం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దుర్గా సప్తశతీ వైకృతిక రహస్యం

ఋషిరువాచ |

త్రిగుణా తామసీ దేవీ సాత్త్వికీ యా త్రిధోదితా |
సా శర్వా చండికా దుర్గా భద్రా భగవతీర్యతే ||

యోగనిద్రా హరేరుక్తా మహాకాలీ తమోగుణా |
మధుకైటభనాశార్థం యాం తుష్టావాంబుజాసనః ||

దశవక్త్ర దశభుజా దశపాదాంజనప్రభా |
విశాలయా రాజమానా త్రింశల్లోచనమాలయా ||

స్ఫురద్ధశనదంష్ట్రా సా భీమరూపాపి భూమిప |
రూపసౌభాగ్యకాంతీనాం సా ప్రతిష్ఠా మహాశ్రియామ్ ||

ఖడ్గబాణగదాశూలశంఖచక్రభుశుండిభృత్ |
పరిఘం కార్ముకం శీర్షం నిశ్చోతద్రుధిరం దధౌ ||

ఏషా సా వైష్ణవీ మాయా మహాకాలీ దురత్యయా |
ఆరాధితా వశీకుర్యాత్ పూజాకర్తుశ్చరాచరమ్ ||

సర్వదేవశరీరేభ్యో యావిర్భూతామితప్రభా |
త్రిగుణా సా మహాలక్ష్మీః సాక్షాన్మహిషమర్దినీ ||

శ్వేతాననా నీలభుజా సుశ్వేతస్తనమండలా |
రక్తమధ్యా రక్తపాదా నీలజంఘోరురున్మదా ||

సుచిత్రజఘనా చిత్రమాల్యాంబరవిభూషణా
చిత్రానులేపనా కాంతిరూపసౌభాగ్యశాలినీ ||

అష్టాదశభుజా పూజ్యా సా సహస్రభుజా సతీ |
ఆయుధాన్యత్ర వక్ష్యంతే దక్షిణాధఃకరక్రమాత్ ||

అక్షమాలా చ కమలం బాణో సిః కులిశం గదా |
చక్రం త్రిశూలం పరశుః శంఖో ఘంటా చ పాశకః ||

శక్తిర్దండశ్చర్మ చాపం పానపాత్రం కమండలుః |
అలంకృతభుజామేభిరాయుధైః కమలాసనామ్ ||

సర్వదేవమయీమీశాం మహాలక్ష్మీమిమాం నృప |
పూజయేత్ సర్వలోకానాం స దేవానాం ప్రభుర్భవేత్ ||

గౌరీదేహాత్సముద్భూతా యా సత్త్వెకగుణాశ్రయా |
సాక్షాత్సరస్వతీ ప్రోక్తా శుంభాసురనిబర్హిణీ ||

దధౌ చాష్టభుజా బాణాన్ముసలం శూలచక్రభృత్ |
శంఖం ఘంటాం లాంగలం చ కార్ముకం వసుధాధిప ||

ఏషా సంపూజితా భక్త్యా సర్వజ్ఞత్వం ప్రయచ్ఛతి |
నిశుంభమథినీ దేవీ శుంభాసురనిబర్హిణీ ||

ఇత్యుక్తాని స్వరూపాణి మూర్తీనాం తవ పార్థివ |
ఉపాసనం జగన్మాతుః పృథగాసాం నిశామయ ||

మహాలక్ష్మీర్యదా పూజ్యా మహాకాలీ సరస్వతీ |
దక్షిణోత్తరయోః పూజ్యే పృష్ఠతో మిథునత్రయమ్ ||

విరంచిః స్వరయా మధ్యే రుద్రో గౌర్యా చ దక్షిణే |
వామే లక్ష్మ్యా హృషీకేశః పురతో దేవతాత్రయమ్ ||

అష్టాదశభుజా మధ్యే వామే చాస్యా దశాననా |
దక్షిణే౬ ష్టభుజా లక్ష్మీర్మహతీతి సమర్చయేత్ ||

అష్టాదశభుజా చైషా యదా పూజ్యా నరాధిప |
దశాననా చాష్టభుజా దక్షిణోత్తరయోస్తదా ||

కాలమృత్యూ చ సంపూజ్యౌ సర్వారిష్టప్రశాంతయే |
యదా చాష్టభుజా పూజ్యా శుంభాసురనిబర్హిణీ ||

నవాస్యాః శక్తయః పూజ్యాస్తదా రుద్రవినాయకౌ |
నమో దేవ్యా ఇతి స్తోత్రైర్మహాలక్ష్మీం సమర్చయేత్ ||

అవతారత్రయార్చాయాం స్తోత్రమంత్రాస్తదాశ్రయాః |
అష్టాదశభుజా చైషా పూజ్యా మహిషమర్దినీ ||

మహాలక్ష్మీర్మహాకాలీ సైవ ప్రోక్తా సరస్వతీ |
ఈశ్వరీ పుణ్యపాపానాం సర్వలోకమహేశ్వరీ ||

మహిషాంతకరీ యేన పూజితా స జగత్ప్రభుః |
పూజయేజ్జగతాం ధాత్రీం చండికాం భక్తవత్సలామ్ ||

అర్ఘ్యాదిభిరలంకారైర్గంధపు ప్పెస్తథాక్షతైః ||
ధూపైర్దీపైశ్చ నైవేద్యైర్నానాభక్ష్యసమన్వితైః ||

రుధిరాక్తేన బలినా మాంసేన సురయా నృప |
ప్రణామాచమనీయేన చందనేన సుగంధినా ||

సకర్పూరైశ్చ తాంబూలైర్భక్తిభావసమన్వితైః |
వామభాగే గ్రతో దేవ్యాశ్ఛిన్నశీర్షం మహాసురమ్ ||

పూజయేన్మహిషం యేన ప్రాప్తం సాయుజ్యమీశయా |
దక్షిణే పురతః సింహం సమగ్రం ధర్మమీశ్వరమ్ ||

వాహనం పూజయేద్దేవ్యా ధృతం యేన చరాచరమ్ |
[* కుర్యాచ్ఛ స్తవనం ధీమాంస్తస్యా ఏకాగ్రమానసః | *]
తతః కృతాంజలిర్భూత్వా స్తువీత చరితైరిమైః ||

ఏకేన వా మధ్యమేన నైకేనేతరయోరిహ |
చరితార్ధం తు న జపేజ్జపంఛిద్రమవాప్నుయాత్ ||

స్తోత్రమంత్రైః స్తువీతేమాం యది వా జగదంబికామ్ |
ప్రదక్షిణనమస్కారాన్ కృత్వా మూర్ధ్ని కృతాంజలిః ||

క్షమాపయేజ్జగద్ధాత్రీం ముహుర్ముహురతంద్రితః |
ప్రతిశ్లోకం చ జుహుయాత్ పాయసం తిలసర్పిషా ||

జుహుయాత్ స్తోత్రమంత్రైర్వా చండికాయై శుభం హవిః |
నమో నమః పదైర్దేవీం పూజయేత్ సుసమాహితః ||

ప్రయతః ప్రాంజలిః ప్రహ్వః ప్రాణానారోప్య చాత్మని |
సుచిరం భావయేద్దేవీం చండికాం తన్మయో భవేత్ ||

ఏవం యః పూజయేద్భక్త్యా ప్రత్యహం పరమేశ్వరీమ్
భుక్త్వా భోగాన్ యథాకామం దేవీసాయుజ్యమాప్నుయాత్ ||

యోన పూజయతే నిత్యం చండికాం భక్తవత్సలామ్ |
భస్మీకృత్యాస్య పుణ్యాని నిర్దహేత్ పరమేశ్వరీ ||

యో న పూజయతే నిత్యం చండికాం భక్తవత్సలామ్ |
భస్మీకృత్యాస్య పుణ్యాని నిర్దహేత్ పరమేశ్వరీ ||

తస్మాత్ పూజయ భూపాల సర్వలోకమహేశ్వరీమ్ |
యథోక్తేన విధానేన చండికాం సుఖమాప్స్యసి ||

ఇతి వైకృతికం రహస్యం సంపూర్ణమ్ ||

మరిన్ని స్తోత్రాలు:

Sri Mallikarjuna Mangalasasanam In Telugu – శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్

Sri Mallikarjuna Mangalasasanam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్గురించి తెలుసుకుందాం…

Sri Mallikarjuna Mangalasasanam In Telugu Lyrics

శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే,
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్.

టీక. ఉమాకాంతాయ = పార్వతీరమణుఁడైనట్టియు, కాంతాయ = మనోహరుఁడైనట్టియు, కామితార్థ = కోర్కెలను, ప్రదాయినే = ఇచ్చువాఁడును, శ్రీ గిరీశాయ = శ్రీశైలనివాసియు, దేవాయ = దేవుఁడైన మల్లినాథాయ = మల్లి కార్జున ప్రభువుకొఱకు, మంగళం = శుభమగుఁగాక !

తా. ఉమాధవుఁడును, అతి మనోహరుఁడును, సర్వఫల ప్రదాతయు నగు శ్రీగిరి మల్లికార్జునస్వామికి మంగళమగుఁగాక !

సర్వమంగళరూపాయ శ్రీనగేంద్రనివాసినే,
గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్.

టీక. సర్వమంగళరూపాయ = సర్వమంగళ స్వరూపమును ధరించినట్టియు, శ్రీనగేంద్రనివాసినే = శ్రీ గిరియందు నివసించియున్నట్టియు, గంగా ధరాయ = గంగను ధరించినట్టియు, నాథాయ = లోక నాథుఁడైనట్టి, శ్రీ గిరీశాయ = శ్రీ శైలమల్లికార్జునునికొఱకు, మంగళమ్ = మంగళమగుఁగాక !

తా. సర్వమంగళరూపుఁడును, శ్రీగిరి నివాసియా, గంగాధరుఁడును, లోకనాథుఁడు నైన మల్లికార్జునుని కొఱకు మంగళమగుఁగాక !

సత్యానందస్వరూపాయ నిత్యానందవిధాయినే,
స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్.

టీక. సత్యానందస్వరూపాయ = సదానందస్వరూపుఁడును, నిత్యానంద విధాయినే = నిత్యానందమును గలుగఁజేయువాఁడును, స్తుత్యాయ = స్తోత్రముఁజేయఁదగిన వాఁడును, శ్రుతిగమ్యాయ = వేదవేద్యుఁడును, (అగు) శ్రీగిరీశాయ = శ్రీగిరిమల్లికార్జునకు, మంగళం = మంగళమగుఁగాక !

తా. సచ్చిదానందరూపధారియు, జీవులకు నిత్యానందమొసఁగు వాఁడును, వేదవేద్యుఁడైన శ్రీగిరి మల్లికార్జునునకు మంగళమగుఁగాక !

ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే,
సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్.

టీక. ముక్తిప్రదాయ = మోక్షము నిచ్చునట్టివాఁడును, ముఖ్యాయ = ప్రధానదైనమైనట్టియు, భక్తానుగ్రహకారిణే = భక్తులపై దయఁగల వాఁడును, సౌమ్యాయ = శాంతిప్రదుఁడైన, శ్రీగిరీశాయ = శ్రీగిరిప్రభువగు మల్లికార్జునునికొఱకు, మంగళమ్ = శుభముగలుగుఁగాక !

తా. మోక్షదాయకుఁడును, సర్వామరముఖ్యుఁడును, భక్తాను గ్రహప్రదుఁడును, సుందరాతి సుందరుఁడునై, శాంతిసౌఖ్య ములిచ్చు శ్రీగిరీశునకు మంగళమగుఁగాక !

మరిన్ని స్తోత్రాలు:

Vidura Neethi Patinchi Sukhinchandi In Telugu – విదుర నీతి పాటించి సుఖించండి

Vidura neethi Patinchi Sukhinchandi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విదుర నీతి పాటించి సుఖించండి నీతికథ.

విదుర నీతి పాటించి సుఖించండి

(ఈ కథ ఉద్యోగపర్వంలో ఉంది.)

వెళ్ళాడు.
వచ్చాడు సంజయుడు.
తష్కప్రియాలతోవెళ్ళి, శూన్యహస్తాలతో తిరిగివచ్చాడు. వస్తూనే ధృతరాష్ట్రమహారాజును దర్శించి, రాయబారం విఫలమయిందని, విశేషా అన్నీ మరుసటి ఉదయం మహాసభలో కురు, గురు, వృద్ధబాంధవమంత్రి, సామంత, దండనాథులందరూ ఉండగా వివరంగా చెపుతానని స్వగృహ నికి వెళ్ళాడు.

సంజయుడు వెళ్ళడంతో మహారాజు మనసు మథనపడసాగింది. కుటుంబకలహం ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళనతో ఆ వృద్ధ రాజు హృదయంలో కల్లోలం పుట్టింది. రాత్రికి రాత్రి మనశ్శాంతి కలిగించే ప్రియవాక్యాలు వింటూ నిద్రపోదామని మహామంత్రి విమరునికి కబురు చేశాడు. కౌరవసామ్రాజ్యానికి నిండు గౌరవం తెచ్చే మంత్రి పదవిని నిరా డంబరంగా నిర్వహించే నిరహంకారుడు, నిశ్చలమనస్కుడైన విదురుడు మహారాజు పిలుపును రాత్రివేళ అందుకోవడం అదే మొదటి సారి.

మొదటిసారే ఆయినా ఆ దీవిశారదుడు నిశ్చలచిత్తంతో రాజమంది రానికి విచ్చేసి తనరాకను ద్వారపాలకునిద్వారా మహారాజుకి తెలిమ జేశాడు.

తక్షణం లోవలకు రమ్మని అనుజ్ఞ అయింది.
విదురుడువచ్చి నమస్కరించి, రాజాఙ్ఞానుసారం ఆసీమ డయ్యాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తనకు నిద్ర పట్టటంలేదనీ, హృదయానికి శాంతి కలిగించేమాటలు చెప్పవలసిందనీ అడిగాడు.

‘మహారాజా! మీకు నిద్రపట్టడంలేదంటే నాకు చిత్రంగా ఉంది. బలవంతునితో విరోధం తెచ్చుకున్న దుర్బలులకూ, ఇతరుల సంపదను హరించినవారికీ, కామం పెచ్చు పెరిగినవారికి, దొంగలకుమాత్రమే రాత్రి నిద్రపట్టదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ లక్షణాలన్నీ మీకున్నట్లు వే నెరుగుదును. అటువంటప్పుడు మీకు నిద్రపట్టకపోవడానికి కారణం ఏమిటో నా కవగాహన కావడంలేదు’.

అని ఎదురుప్రశ్న వేయడంతో ధృతరాష్ట్రుడు కొంచెం చికాగ్గా- “నేను నీ ముఖంనుండి ధర్మప్రవచనమే కోరుతున్నాను’ అన్నాడు.

‘ మహారాజా ! ఉత్తమగుణాలూ, ఉన్నతాశయాలూ, ఉదాత్త ధర్మాలూకల ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. కాగలిగిన శక్తి ఉన్నా ఆ కుంతీసుతుడు మీ మాటకెన్నడూ ఎదురు చెప్పలేదు. అయినా మీరు వారిని కారడవులకు పంపారు. మీకు బుద్ధిలేదనీ, ధర్మజ్ఞులుగారనీ అవలేం. అయినా వాటిని అనుసరించేవృష్టి మీకు లోపించింది. వారికి రావలసిన రాజ్యభాగంకూడా వారి కివ్వలేని స్థితిలో ఉన్నారు మీరు.

దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాది అయోగ్యులపై అపరిమిత మైన విశ్వాసం ఉంచి ఈ సామ్రాజ్యభారం అంతా వారిచేతులలో ఉంచారు.

అలా ఉంచి శాంతిని వాంఛించడం వివేకమా మహారాజా?
సాత్త్విక స్వభావమూ, ఉద్యోగయత్నము, క్లేశపహనమూ, ధర్మబద్ధ దృష్టికల పురుషుడు ఎన్నడూ వంచితుడుకాడు. ఇటువంటి విద్వాంసులు దుష్టులకు దూరంగా ఉంటారు. మహారాజా! ధర్మార్థాలను అమసరిస్తూ, లోకవ్యవహారం గ్రహిస్తూ, భోగచింతలేకుండా పురుషార్థాలు సేవిస్తూ, అప్రస్తుతప్రసంగాలు చెయ్యకుండా, దుర్లభాలు వాంఛించ కుండా, పోయినవాటికోసం శోకించకుండా, ఎటువంటి వివత్తులువచ్చినా, ధైర్యంకోల్పోకుండా, ప్రారంభించిన పనిని నిర్విఘ్నంగా పరిసమాప్తం । చెయ్యనిదే విడువకుండా, సోమరితనాన్ని దరిజేరనివ్వకుండా, మనస్సును స్వాధీనంలో ఉంచుకోగలవాడే విద్వాంసుడు.

ఆదరిస్తే ఆనందిస్తూ, అనాదరానికి ఆగ్రహం పొందడం విద్వాం మఖ లక్షణంకాదు. వారిహృదయం గంభీరంగా గంగావడి చదృశంగా ఉంటుంది. విద్వాంమలబుద్ధి విద్యను అనుసరిస్తుంది. విద్య వారి బుద్ధికి థా. బీ. 4

అదుపులో ఉంటుంది. విద్యా వివేకమూ, లేకుండా గర్వంతో చరించే వాడు మూర్ఖుడు. దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ, లేనిపోని ఆశలు పెట్టుకునేవాడూ, అంతే.

స్వీయ ధర్మం విడిచి, యితరుల మార్గాలసాగేవాడూ, స్నేహితు లతో అసంబద్ధంగా చరించేవాడూ, శత్రువులతో సఖ్యంగా ఉంటూ, బల వంతునితో వైరం పెంచుకునేవాడూ, మిశ్రశూన్యుడూ, ఎదుటివారు కోర కుండానే సంభాషించేవాడూ, కృతఘ్నులను విశ్వసించేవాడూ, పరులలో దోషాలే చూచేవాడూ, అకారణంగా ఆవేశానికి లొంగేవాడూ, అనర్హులకు ఉపదేశాలిచ్చేవాడూ …. వీరందరూ మూర్ఖులే ప్రభూ!

విద్యా, దానాలు ఎంత విరివిగా ఉన్నా, ఆ రెండింటిలో అహం కారం లేకుండా ఉండేవాడే విద్వాంసుడు.

తనపోషణలో ఉన్నవారికి భోజనభాజనాలు సమకూర్చకుండా తన పొట్టనింపుకునేవాడు వరమమూర్ఖుడు. విషంఉన్నదే. అది త్రాగినవానినే చంపుతుంది. వాడిమొన కలిగిన బాణం గుచ్చుకున్న వాడే యమసదనం చేరుతాడు. మరి ప్రజలో ! ….

ఈ ప్రజాసమూహం ప్రభువును పదభ్రష్టునిచేసి, పరలోకానికే పంపగలదు.

విధి నిషేధాలు

మహారాజా!
ఏకాకిగా – అంటే ఒంటరిగా భోజనంచెయ్యకూడదు. విషము నమ స్యలు ఎదురయినప్పుడు తనకుతానై నిశ్చయాలు తీసుకోకూడదు. ఒంట రిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ న్వి దిస్తూంటే ఒక్కడుగా మేల్కొని ఉండరాదు,

వహనశక్తి కలవారిలో అసమర్థత ఉంటుందని అంటారు. కాని, అసమర్థులలో సహనం ఉండనే ఉండదు. క్షమ కంటే బలీయ మయినది లేదు. అది పురుషులకు అలంకారంకూడా.

అల్పబుద్ధులనూ, అదే పనిగా ఆలోచించే వారినీ, త్వరత్వరగా నిర్ణయాలు మార్చేవారినీ, స్తోత్ర పాఠకులనూ రహస్య సమాలోచనకు ఆహ్వానించ కూడదు.

కుటుంబంలోని వృద్ధులనూ, దారిద్యంలో వడ్డ ఉన్నత కుటుంబీ కులనూ, అటువంటి దశనే అనుభవించే స్నేహితులనూ, సంతాన విహి నయై, భర్తను కోల్పోయిన సోదరినీ, ఆదరించి ఆశ్రయమిచ్చి పోషించాలి.

సమయం, సందర్భం లేకుండా కోపం తెచ్చుకునేవాడూ, సేవ కుల కష్ట సుఖాలతో నిమిత్తం లేకుండా వారిచేత సేవ చేయించుకునే వాడూ, వారి కృషికి తగిన వేతనాలూ, బహుమతులూ యివ్వని ప్రభు వును అచిరకాలంలోనే ప్రజలు క్రిందికి దింపుతారు.

ప్రభూ పన్నులు వసూలు చేయడంలో కూడా అధికారులు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. పూలదండలు కట్టివాడు మొక్కకి ఏ చేటు రాకుండా దాన్ని పెంచుతూనే పువ్వులు కోపెట్టు, పన్నులు వమాలు చెయ్యాలే తప్ప, బొగ్గులవ్యాపారిలా చెట్టు మొదలంటా నరకకూడదు.

గో, నారీ, విప్రజనులమీద, స్వజనంమీద శౌర్యం ప్రకటించే వారు అరముగ్గిన పండులా నేల కూలుతారు.

విశాల ప్రాంతంలో ఒక్కటిగా పెరిగే చెట్టు గట్టి వేళ్ళతో బలంగా పెరుగవచ్చు. కాని ఒక్క గాలివాన వివరిందో మహారాజాః సమూలంగా నేలకూలి పోతుంది. అదే వృక్ష సమూహం మధ్యలో ఉంటే అప్పుడది అంత సులభంగా గాలికి వరిగిపోదు. అందు చేతనే వజ్జములు సంఘంగా ఉండాలనీ, వారంతా పరస్పర సహకారంతో చరించాలనీ, బుధులు చెపుతూ ఉంటారు.

ఆకాశాన్ని పిడికిటి పోటుతో వంచేద్దామనుకునే వాడూ, ఇంద్రధనస్సును తవ బాహు బలంతో పంచుదామమకునేవాడూ, మార్యకిరణాలను దోసిట పడదామనుకునే వాడూ, వీరందరూ మూర్ఖులే అంటారు స్వాయం భువనుమవుం

ప్రియం – హితం

మనకు ప్రీతికలిగే మాటలు చెప్పేవారు అయాచితంగానే అనే కులు లభిస్తారు. కాని, మన శ్రేయస్సుకోరి హితవు చెప్పేవాడు దొరకడు. ఓవేళ హితబోధ చేసే వారున్నా, వినేవాడుండడు. ధర్మదృష్టి విడువ కుండా స్వామియొక్క ప్రియాప్రియాలతో నిమిత్తం లేకుండా హితవు చెప్పగలవాడే ఉత్తమ సేవకుడు.

సేవకుల జీవనభారం గ్రహించి వారికి వేతనా లివ్వకపోయినా, మంత్రులు భోగవంచితు అయినా ఆ ప్రభువు వడచ్యుతుడు కాక తప్పదు.

ప్రభువుమాట పెడచెవిని పెట్టి యితర కార్యాలలో తిరిగే సేవకుని, అహంకారంతో ప్రభువుకు ప్రతికూలంగా చరించేవానినీ, మరుక్షణమే పదవి నుండి తొలగించాలి. ప్రభువుకు గల బలాలలో బాహుబలం మెద టిదే అయినా, దాన్ని ఘనంగా భావించరాదు. ఇక రెండవ బలం ఉత్తముడయిన మంత్రి. తరువాత ధనబలం. పితృ, పితామహప్రాప్త మున్నదే అది సహజం. అన్నింటినీ మించినది బుద్ధిబలం. స్త్రీ – సౌభాగ్యశాలిని. కనుక ఆమె గృహాలంకారం. అందుకే ఆమెను రక్షించు కోవడం పురుషుని విధి.

మహారాజా ! సర్వసద్గుణ సంపన్నులూ, ధర్మ మర్మజ్ఞులూ అయిన పాండవులతో విరోధం ఉచితం కాదు. అందుచేత వారిభాగం వారికిచ్చి సంతోషించండి’ అన్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Ennadu Parushyapu Matalaadaradu In Telugu – ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

Ennadu Parushyapu Matalaadaradu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు కథ. 

ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

నహుష మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి. అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూరువునికి రాజ్యభారమొసగి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేదవేదాంగ పాఱంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. హవిస్సులతో దేవతలను తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు. కామ క్రోధాది అరిషడ్వర్గాలను జయించి సహస్ర దివ్యవర్షములు తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. ముప్పది ఏండ్లు నిరాహారిగా ఒక్క ఏడాది వాయుభక్షణ చేసి తరువాత పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు. అటు తరువాత ఒక్క ఏడాది సముద్రమధ్యములో ఒంటికాలుమీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యనిధి ప్రభావంవల్ల దివ్యవిమానములో దేవలోకానికి వెళ్ళాడు.

అక్కడ దేవర్షుల పూజలందుకొని బ్రహ్మలోకం చేరాడు. అక్కడ అనేక కల్పములు ఉండి బ్రహ్మర్షుల చేత పూజలందుకొన్నాడు! ఆ తరువాత ఇంద్రలోకాని వచ్చాడు. ధర్మాత్ముడు మహాతపశ్శక్తి సంపన్నుడు అయిన యయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయముగా వచ్చి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు. మహావిభవోపేతుడైన ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు “ఏమి తపస్సు చేశావయ్య మహానుభావా? నువ్వు సామాన్యుడవు కావు! శతసహస్ర వర్షముల తపస్సు సామాన్యులకు సాధ్యమా?”.

సాక్షాత్ దేవేంద్రుడంతటివాడు ఇలా పొగిడేసరికి యయాతి ప్రారబ్ధవశాత్తు ఇలా పారుష్య వాక్యాలు అన్నాడు “ఓ అమరేంద్రా! సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ మునిగణముల తపస్సులు నా తపస్సుకు సాటిరావు”. “ఔరా! ఇంత గొప్పవాడయ్యికూడా గర్వమును వీడలేదు కదా!” అని అనుకొని ఇంద్రుడు యయాతితో “మహనీయులైన మహర్షుల తపస్సులను గర్వముతో కించపఱచినావు. లోకశ్రేయస్సుకై తమ జీవితాలను ధారపోసిన ఆ మహనీయులనెన్నడూ అవమానించరాదు. ఓ యయాతి! ఈ ఒక్క మాటతో నీవు సంపాదించుకొన్న తపశ్శక్తి అంతా అంతరించిపోయింది. ఇక నీకు ఈ లోకములో ఉండటానికి అర్హతలేదు. అధోలోకానికి పో” అని శపించాడు.

తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో శరణువేడి యయాతి “ఓ దేవేంద్రా! ఏ క్షణాన నేను పూజ్యులైన మహర్షులను అవమానించానో ఆ క్షణమే నా శక్తి అంతా కరిగిపోయింది. నన్ను అధోలోకాలకు పంపకు. నాకు సత్సంగత్యం లేకుండా చేయకు. సత్ భువనములో సత్పురుషుల సాంగత్యములో నన్ను ఉండనివ్వు” అని ప్రార్థించాడు. పశ్చాత్తాపముతో కుమిలిపోతున్న యయాతిని కరుణించి దేవేంద్రుడు యయాతికి సద్భువనములో నివసించుటకు అనుజ్ఞ ఇచ్చాడు.

సద్భువనములో ఉండి ఆ యయాతి అచిరకాలములోనే అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించాడు. అహంకారమును పూర్తిగా విడిచి మహాతేజోమయుడయ్యాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దౌహిత్రులైన అష్టకుడు ప్రతర్దనుడు వసుమంతుడు ఔసీనరుడు మరియు శిబి సద్భువనమునకు వచ్చిరి. అనంతపుణ్యసంపదతో వెలిగిపోతున్న యయాతిని పూజించి “స్వామి! మీరెవరు” అని అడిగారు. యయాతి తన కథను చెప్పి “నాయనలారా! ఎంత కొంచెమైనా గర్వము ఎన్నడు ఉండరాదు. గర్వముతో నేను పారుష్యవాక్యములు మాట్లాడి ఉత్తములైన మహర్షులను అవమానించినాను. మీరెన్నడు అట్టి తప్పుచేయవద్దు. వాక్పారుష్యము విషము కన్నా అగ్ని కన్నా భయంకరమైనది” అని హితవు చెప్పాడు. యాయాతిని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించి ఆయనవద్ద ఎన్నో రహస్యములైన ధర్మోపదేశాలు పొందారు అష్టకాదులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. గర్వము అహంకారము ఎంత కొంచెముగా ఉన్నా హాని కాలుగచేస్తాయి. ఒక్కచిన్న పారుష్యవాక్యము వలన తన తపశ్శక్తినంతా పోగొట్టుకున్నాడు యయాతి.
  2. ఎన్నడూ ఉత్తములను అవమానించరాదు. మహర్షుల తపస్సులు తన తపస్సుతో సాటిరావని అని యయాతి వారిని అవమానించాడు.
  3. ఒక సజ్జనుడెన్నడూ తప్పుచేయడు. పొరబాటుగా చేసినా దానికి పశ్చాత్తాపము చెంది ఆ తప్పు నెన్నడు మళ్ళీ చేయడు. సజ్జనుడైన యయాతి తను చేసిన తప్పును దౌహిత్రుల వద్ద చెప్పుకొని ఆ తప్పు చేయవద్దని హితవు చెప్పాడు.
  4. ఒక మనిషి యొక్క ఉద్ధారణకు సత్సంగత్యం చాలా అవసరము. ఈ విషయం తెలిసిన యయాతి సత్సంగత్య భాగ్యము కలిగించమి ఇంద్రుని కోరుకున్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం: