Ghanudatada Itadu Kalasa Puramukaada In Telugu – ఘనుడాతడా యితడు కలశాపురముకాడ

ఘనుడాతడా యితడు కలశాపురముకాడ - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఘనుడాతడా యితడు కలశాపురముకాడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఘనుడాతడా యితడు కలశాపురముకాడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
సంఖ్య : 302
పుట: 204
రాగం: గుండక్రియ

గుండక్రియ

72 ఘనుఁడాతఁడా యితఁడు కలశాపురముకాడ
హనుమంతుఁ డితఁడా అంజనాతనయుఁడు.

||పల్లవి||

పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె
అడరి దానవుల హనుమంతుఁడు
బెడిదంపుఁ బెనుదోఁక బిరబిరఁ దిప్పి మొత్తె
అడఁగ మాల్యవంతు హనుమంతుఁడు

||ఘనుఁ||

దాకాల మోఁకాలఁ దాటించెఁ గొందరి
ఆకాశవీధినుండి హనుమంతుఁడు
పైకొని భుజములఁ బడఁదాఁకెఁ గొందరి
ఆకడ జలధిలోను హనుమంతుఁడు.

||ఘనుఁ||

ఆరుపుల నూరుపుల నందరిఁ బారఁగఁ దోలె
ఔరా సంజీవికొండహనుమంతుఁడు
మేరతో శ్రీవేంకటాద్రిమీఁదిదేవునిబంటు
ఆరితేరినబిరుదు హనుమంతుఁడు.

||ఘనుఁ||302

అవతారిక:

కలశాపురంలో తనయెదుటనున్న ఘనమైన హనుమంతుని యెదుట అన్నమాచార్యులవారు ఈ కీర్తనను వినిపిస్తున్నారు. ఆనాడు లంకలో రాక్షసమూకనుయెట్లు చీల్చి చెండాడినాడో వర్ణిస్తున్నారు. నేటి మన దుస్థితి యేమంటే అచ్చతెలుగు కీర్తనకి, సంకరతెలుగులో వివరణ ఇచ్చుకోవలసిన వస్తున్నది. “ఆరుపుల నూరుపులనందరి బారగ దోలె”… ఆయన హూంకారముతో కూడిన గట్టి నిశ్వాసవదిలి అందరూ కకావికలై పారిపోయేట్లు చేశాడట. ఇట్లా అడుగడుగునా తేలికగా తెలియని తెలివైన తెలుగు తికమకలు దిట్టంగావున్నాయి ఈ కీర్తనలో.

భావ వివరణ:

ఆనాడు లంకలో అన్ని ఘనకార్యములను చేసిన ఆ ఘనుడైన హనుమంతుడు ఆతడా, యితడు (ఈ కలశాపురంలో మనయెదుటనున్న ఆంజనేయుడు). ఏమి ఆశ్చర్యము!

ఈయన సీతాన్వేషణలో లంకలోని రాక్షసులను యెట్లు చితక్కొట్టాడో వినండి. ఆయన తన మోచేతితో కొందరిని కుమ్మి చంపాడు. కొందరిని చేతిలోపలి భాగంలో నొక్కి చంపాడు. అడరి (ఆ విధంగా అతిశయించి) ఆ హనుమంతుడు దానవులను చంపాడు. అప్పుడు మాల్యవంతుడనే రాక్షసుడు ఆయనపైకి వెళ్ళాడు. బెడిదంపు (భయంకరమైన) పెనుతోక (పెద్దతోకతో) బిరబిర తిప్పి అణిగిపోయేట్లు మొత్తి వాడిని ఆ హనుమంతుడు చంపేశాడు.

తన కాలు (దాగుకాలు) కాలివెనుక భాగంతో) తో తన్ని కొందరిని, మోకాలితో కుమ్మించి కొందరిని తాటించినాడు (కొట్టినాడు), ఆ హనుమంతుడు. ఇదంతా ఆయన ఆకాశవీధిలోనే చేశాడు. ఆ కడ (అప్పుడు) కొందరిని పైకొని (మీదపడి) భుజములతోపడదోసి జలధిలో చంపేశాడు. హనుమంతుని మారణకాండనేమని వర్ణింతుము?

అనంతరం ఆ హనుమంతుడు “ఆరుపుల నూరుపుల నందరి బారగదోలె” (తన హూంకారముతో కూడిన గట్టి నిస్వాసముతో అందరినీ చిందరవందరగా పారిపోయేట్లు చేశాడు. ఔరా సంజీవి కొండను తెచ్చిన ఈ హనుమంతుడు జగజ్జెట్టి. మేరతో (ఆ క్రమంలో) వేంకటాద్రిమీది దేవుడైన వేంకటేశ్వరుని బంటు అనే ఆరితేరిన బిరుదుతో ఈ హనుమంతుడు శోభించుచున్నాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Doratanamulatoda Todapai Srisatitoda In Telugu – దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ

దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
సంఖ్య: 518
పుట: 348
రాగం: నాట

నాట

71 దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
కేరలీఁ బంతముల సుగ్రీవనారసింహము.

||పల్లవి||

నిక్కినకర్ణములతో నిట్ట చూపుగుడ్లతో
మిక్కుటమైన పెద్దమీసాలతోడ
వెక్కసపునోరితోడ వెలయుబుగ్గలతోడ
క్రిక్కిరిసీ నవ్వుల సుగ్రీవనారసింహము.

||దొర||

చల్లునూరుపులతోడ సంకుఁజక్రములతోడ
మొల్ల మైనసహస్రకరములతోడ
తెల్లనిమేనితోడ దిండైనపిరుఁదుతోడ
కెల్లరేఁగీఁ గరుణ సుగ్రీవనారసింమము.

||దొర||

విరులపాదాలతోడ వెలయుసొమ్ములతోడ
తిరమైనకోటిసూర్యతేజముతోడ
విరులదండలతోడ వేడుక శ్రీవేంకట
గిరిమీఁద వెలసె సుగ్రీవనారసింహము.

||దొర||

అవతారిక:

సహజత్వం వుట్టిపడేలా వర్ణనలు కీర్తనలో జొప్పించటం అన్నమాచార్యుల వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన నరసింహుని వర్ణిస్తుంటే మనకళ్ళయెదుట ఆ స్వామి నిలుచున్నట్లే వుంటుంది. “దొరతనంతోడ, తొడపై శ్రీసతితోడ ఈ సుగ్రీవనరసింహుడు పంతములకేరలీ” అంటున్నారు. ఈయన కంఠము సుగ్రీవమట. అందంగావున్న కంఠస్వరం అన్నమాట. ఈయన పాదాలు పువ్వుల్లా వున్నాయట. వేంకటగిరి మీదనున్న సుగ్రీవనరసింహుని కీర్తించండి అంటున్నారు.

భావ వివరణ:

దొరతనముతోడ (సర్వేశ్వరుని ఠీవితో) తనతొడపై శ్రీదేవితో ఈ సుగ్రీవనారసింహుడు (చక్కటి కంఠధ్వనిగల నరసింహుడు), కేరడి పంతములవాడు (మిక్కుటమైన పట్టుదలగలవాడు).

ఈయన యెలావున్నాడో చూడండి. ఇతను నిక్కిన కర్ణములతో (నిక్కపొడుచుకొనిన చెవులతో) నిట్టచూపుగుడ్లతో (మిడిగుడ్లతో). దట్టమైన పెద్ద మీసాలతో, వెక్కసపు (భీతినిగొలుపు) నోటితోను, వెలయు (మెరయుచున్న) బుగ్గలతోను, క్రిక్కిరిసిన నవ్వులతోనూ (దట్టమైన నవ్వులు చిందించుచూ) ఈ సుగ్రీవ నారసింహుడు దర్శనమొసగుచున్నాడు.

ఈయన చల్లునూరుపులతో వున్నాడు. (వెలువడునప్పుడు విస్తరించుచున్న నిశ్వాసములతో వున్నాడు.) వున్నాడు.) ఈ చతుర్భుజుని, రెండుచేతులలో శంఖచక్రములన్నవి. అధికముగ వేయి కరములతో ఈ స్వామి వెలసియున్నాడు. ఈయన తెల్లని మేనితో (దేహంతో) దిండ్లవంటి పిరుదులతోనున్నాడు. ఈయన కెల్లురేగిన (పెల్లుబికిన) కరుణ మూర్తీభవించినట్లున్నాడు. ఈ సుగ్రీవనారసింహుని చూచి తరించండి.

ఈ దేవదేవుడు విరులవంటి (పుష్పములవలె సున్నితమైన) పాదములను కలిగియున్నాడు. విరివిగానున్న సొమ్ములు (ఆభరణములతోనున్నాడు). తిరమైన (స్థిరమైన) కోటి సూర్యులకాంతితో వెలుగొందుచున్నాడు. మెడలో ఈ స్వామి అనేక పుష్పహారములను ధరించియున్నాడు. వింతగా ఈ సుగ్రీవనారసింహుడు వేడుకతో శ్రీ వేంకటగిరిమీద వేంకటేశ్వరుడై వెలసియున్నాడు. ఈ స్వామిని చూచి భక్తితో మొక్కండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vari Vari Bhagyamulu Vrasivunnavi Nosalla In Telugu – వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల

వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల
సంఖ్య : 270
పుట: 181
రాగం: రామక్రియ

రామక్రియ

52 వారి వారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ల
ధీరతతో నేది మేలో తెలుసుకోరో

||పల్లవి||

అట్టే కొందరు మతము లన్నియు నేకమని
పట్టవర్ధనము నెత్తిఁబెట్టి చూపిరి
జట్టిఁ గొందరు జీవులు జంగమే లింగముగాని-
పుట్టుగెల్లా భస్మమని పూసుక చూపిరి

||వారి||

కొంద రేమియును లేదు కొట్టఁగొన లయమని
అంది వట్టిలలాటశూన్యము చూపిరి
కందువఁ గొందరు లక్ష్మీకాంతుఁ డంతరాత్మయని
ముందే నామము శ్రీచూర్ణమునుఁ బెట్టి చూపిరి

||వారి||

చెలఁగి దిష్ట మిపుడు శ్రీవేంకటేశుఁడు
అలమేలుమంగపతి యై యున్నవాఁడు
యిలవీర నీదాసుల కిట్టిభాగ్య రేఖలు
వలసినవారికెల్లా వ్రాసినాఁ డితఁడు

||వారి||270

అవతారిక:

“ఎంత మాత్రమున నెవ్వరు తలచిన అంతమాత్రమె నీవు” అనే అన్నమాచార్యుల వారి కీర్తనలో అన్న విషయాన్నే ఈ కీర్తనలోనూ ప్రస్తావిస్తున్నారు. ఎవరి భాగ్యంయెట్లా వుంటుందో వారి నొసటిపై విధాత వ్రాసి భూమిపైకి పంపిస్తాడని పెద్దవాళ్ళు చెబుతారు. ఎవరికేది మేలో ఏమిచెయ్యాలో ఎవరికివారే ధైర్యంతో ఆలోచించి తెలుసుకోవాలి అని అంటున్నారు శ్రీవేంకటేశుని దాసులు భాగ్యరేఖలు మాత్రం వారికెట్టాకావాలో అట్లా వ్రాస్తాడట.. ఆవిధాత. ఎందుకని? ఆయన దిష్ట అందుకని. దిష్ట అంటే అదృష్ట ప్రదాత అని చెప్పుకోవచ్చును. ఇది జటిలమైన కీర్తన అని విడిగా చెప్పనక్కరలేదు కదా!

భావ వివరణ:

ఓ ప్రజలారా! వారి భాగ్యములు (ఎవ్వరికి ప్రాప్తించెడి భాగ్యములు) వారి నొసళ్ళ (అవ్వారి నుదుటి భాగములలో) వ్రాసివున్నవి, (విధాత చేత పుట్టుకనాడే వ్రాయబడినవి). ఈ విషయాన్ని ధీరతతో తెలుసుకోరో! (ధైర్యంతో తెలుసుకోండయ్యా!) ఈ ప్రపంచంలో వేర్వేరు మతస్థులు వేర్వేరు నమ్మకాలతోవుంటారు.అ ట్టె (అదేవిధంగా) కొందరు మతములన్నియు ఏకమని (ఒక్కటేనని) పట్టవర్ధనము (నొసటిపై ధరించు ఒకరకమైన బొట్టు) నెత్తిబెట్టి (నుదుట ధరించి) చూపిరి. జట్టి (నిర్ణయించి) కొందరు జీవులు, జంగమే (శివుడే) లింగమ రూపంలో వుంటాడని జీవితాంతంలో పుట్టుకలన్నీ బూడిదయ్యేవేనని నమ్మి తమ శరీరమంతా భస్మము వ్రాసుకొని జీవిస్తారు. అది వారి నమ్మకం మనమెలా కాదనగలము? కొందరు శూన్యవాదులున్నారు. వారు పాపపుణ్యాలు రెండూ లేవంటారు. అసలు భగవంతుడే లేడు అంటారు. కొట్టకొనలయము (చిట్టచివరికి చావు తప్పదు కాబట్టి, మంచివాడు చెడ్డవాడు ఇద్దరూ చావక తప్పదు కనుక, ఏమీ అవసరంలేదని, వట్టి లలాటము (బోసిగావున్న నుదురుతో బొట్టులేకుండా శూన్యముగావున్న నొసలు) చూపిరి. కందువ (సామర్థ్యంగల) కొందరు లక్ష్మీపతియైన శ్రీహరియే అంతరాత్ముడని తమ నొసటిపై ఎచూర్ణము (తిరుచూర్ణము, పంగనామాలుగా ధరించి చూపిరి.

ఇప్పుడు శ్రీవేంకటేశ్వరుడు దిష్టము వలె (అదృష్టప్రదాతగా) చెలగి (అతిశయించగా) సిరులరాణియైన అలమేల్మంగమ్మ పతియైయున్నవాడు. అందుకని ‘యిల’ (ఈలోకంలో) వీర (వీరే… అంటే… అదేవీ ఆవిడ భర్తా) నీదాసులకు (హరిదాసులకు) ఇట్టి భాగ్యరేఖలు, వారికెల్లా వలసిన విధముగా (వారు కోరిన విధముగా) ఇతడు విధాత రూపంలో వారి భాగ్యం వారి నొసళ్ళపై వ్రాస్తాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vinavamma Janaki Nivibhudintesesinadu In Telugu – వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు

వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు
సంఖ్య : 462
పుట: 311
రాగం: రామక్రియ

రామక్రియ

51 వినవమ్మ జానకి నీవిభుఁ డింతసేసినాఁడు
యెనసి యీరఘరాముఁ డిఁక నేమి సేసునో

||పల్లవి||

వానరులదండు గూడి వారధి కొండలఁ గట్టె
ఆని లంక చుట్టిరా నదే విడిసె
కోనలఁ ద్రికూటమెక్కె గొడగులన్నియుఁ జెక్కె
యేనెపాన రఘురాముఁ డిఁక నేమిసేసునో

||విన||

కోరి ఇంద్రజిత్తుఁ జంపె కుంబకర్ణు నిర్జించె
గోరదానవులనెల్ల కూలఁగుమ్మెను
మారణహెూమము నేనె మతకమింతాఁ జెరిచె
యీరసాన రఘురాముఁ డిఁక నేమిసేసునో

||విన||

లావున రావణుఁ జంపె లంక విభీషణు కిచ్చె
చేవల నోసీత నిన్నుఁ జెకొనెను
భావించి శ్రీవేంకటాద్రిఁ బట్టము దాఁ గట్టుకొనె
యీవలనావల నాతఁ డిఁక నేమిసేసునో

||విన||462

అవతారిక:

ఇటువంటి కీర్తన నభూతో న భవిష్యతి అని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే గతంలో “ఓ సీతమ్మ తల్లీ! నను బ్రోవమని చెప్పవే” అని మొరబెట్టిన వారున్నారు. తల్లీ! నీవు సాక్షాత్తు లక్ష్మీదేవివమ్మా! అని కీర్తించినవారున్నారు కాని తానే ఒక రామదూత కపియై శ్రీరాముని శత్రు నిర్మూలనం సీతమ్మకు వర్ణించి వివరించటం యెన్నడూ యెరుగము. అన్నమాచార్యుని కృపచేత ఈ కీర్తన రూపంలో ఆలోటు తీరింది. “ఓ జానకమ్మా! మీ ఆయన యేమి చేశాడో వినవమ్మా! ఈయనగారు తిరుమల కొండలెక్కాడు. ఇకపై యేమిచేస్తాడో తెలియకుండావున్నది” అంటున్నారు, నభవిష్యతి- అని ఎందుకన్నానంటే ఈ తెలుగు పాండిత్యం వున్న మొనగాడెవడండీ…

భావ వివరణ:

ఓ జానకీదేవీ! ఇది వినవమ్మా! నీ విబుడు (నీభర్తయైన శ్రీరాముడు) ఇంసేసినాడు, ఇన్ని వీరోచితకార్యములను చేసినాడు. ఈ రగురాముడు, ఎనసి (పూని) ఇకన్ యేమిసేసునో!! ఇంకా ఏమిచేస్తాడో యేమో!!

నీ భర్త వానరదండు (కపులసేనతో కూడి కొండలతో వారధిగట్టె (సేతువును నిర్మించినాడమ్మా!) ఆపైన ఈ లంక చుట్టిరా (చుట్టూతా) అదే తన సైన్యంతో విడిసె (విడిది యేర్పరచుకొనినాడు) అదిగో ఆ లోయలవైపునుంచి చిత్రకూట పర్వతమునెక్కినాడు. ఆయనశక్తిసామర్థాల గురించి చెవులు కొరుక్కున్నవారి గొడుగులన్నిటికీ (గొణుక్కోవటాలకన్నింటికీ) చెక్కె (చెక్కినట్లు సమాధానమిచ్చాడు. ఈ రఘురాముడు ఇకపై యేనెపానటేమిసేసునో!! (దేనికోసం యేమిచేస్తాడో చెప్పలేము తల్లీ!)

కోరి ఇంద్రజిత్తుని జంపె (సీతాపరహరణంలో అతని పాత్రయేమీ లేకపోయినా, వాడు రావణుని ఆత్మజుడు కావున లక్ష్మణునితో చంపించాడు). అనేక వానరులను మూకొమ్మడిగాచంపాడని కుంభకర్ణుని తెగవేసినాడు. ఘోరమైన దానవులను కూలగమ్మె (కూలవేసినాడు). మతకమంతా జెరిచి (రాక్షసమాయను పటాపంచెలము చేసెను). రణరంగంలో మారణ హెూమం (మృత్యుహెూమం) చేశాడు ఈ రఘురాముడు, ఈరసానవున్నాడు (కోపముచేత వివశుడైయున్నాడు. ఇంకాయేమిసేసునో!!

ఆపైన రావణాసురుని లావున (ధైర్యముతో) చంపెను. లంకానగరానికి విభీషణుని పట్టాభిషిక్తునిచేశాడు. ఓ సీతా! ఆయన ఇక నిన్న చేవల చేకొనును (వశమై చేపట్టును). భావించి (ఆశ్రీరాముడే ఈ శ్రీవేంకటేశ్వరునిగా యెంచి) తాను శ్రీవేంకటాద్రిని, పట్టము కట్టుకొన్నాడు (పట్టాభిషిక్తుడయ్యాడు). ఈవల నావల (ఇక్కడ తిరుమలలోను అక్కడ అయోధ్యలోను) అతడు ఇక నేమిసేసునో!! ఎవరు చెప్పగలరు?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Malasi Chudaro Maga Simham In Telugu – మలసీ చూడరో మగ సింహము

మలసీ చూడరో మగ సింహము – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో మలసీ చూడరో మగ సింహము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మలసీ చూడరో మగ సింహము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 1
కీర్తన : మలసీ చూడరో మగ సింహము
సంఖ్య: 13
పుట: 9
రాగం: హిందోళ

హిందోళ

66 మలసీ చూడరో మగ సింహము
అలవి మీరిన మాయల సింహము

||పల్లవి||

అదివో చూడరో ఆదిమపురుషుని
పెదయౌభళము మీది పెనుసింహము
వెదకి బ్రహ్మాదులు వేదాంత తతులు
కదిసి కానగలేని ఘనసింహము

||లలల||

మెచ్చిమెచ్చి చూడరో మితిమీరినయట్టి
చిచ్చరకంటితోడి జిగి సింహము
తచ్చిన వారధిలోన తరుణి కౌగిట జేర్చి
నచ్చిన గోళ్ళ శ్రీనరసింహము

||లలల||

బింకమున చూడరో పిరితియ్యక నేడు
అంకపు దనుజ సంహార సింహము
వేంకటనగముపై వేదాచలము పై
కింక లేక వడి పెరిగిన సింహము

||లలల||

అవతారిక:

మలసి చూడరో (ఉద్యమించి చూడండయ్యా!) అంటున్నారు అన్నమాచార్యులవారు. ఎవరిని చూడాలి? ఈ మగసింహమును. అది మామూలు మగ సింగము కూడా కాదు అలవి మాలిన మాయల సింగమట. అహెూబల నృసింహునిపై చెప్పిన ఈ కీర్తనలో యెన్నో తెలియని విశేషాలున్నాయి. జాగ్రత్తగా చదివి ఆకలనం చేసికొనండి. చిచ్చరకంటితో అంటే అగ్నిని కురిపిస్తున్న కన్నులతో, జిగి సింహము మెరిసిపోతున్న సింహమట. వేంకటగిరి (తిరుమల) లోనూ వేదాచలంలో (అహెూబలం) లోనూ వున్నదొక్కరేనట. ఈయన, కింక లేక (కోపమును విడనాడి) వడి పెరిగిన సింహమట. అంటే యేమిటో!

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈ మగసింహము (మొండెము మగవాడు, తల సింహపుది అయిన నరసింహుడు) కనువిందు చేయుచున్నాడు. ఈయనను చూడరో (చూడండయ్యా!) ఈయన అలవిమీరిన (అశక్యమైన) మాయల సింహము (లీలలు కలిగిన నరసింహుడు).

అదిగో ఈ ఆదిపురుషుని చూడండయ్యా! ఈయనే నారాయణుడు, ఈయన ఇప్పుడు పెదయౌబళమున (అహెూబలమునందు) పెనుసింహము (పెద్ద నరసింహుని) వలెనున్నాడు. బ్రహ్మాది దేవతలుగాని వేదాంత తతులు (వేదవేదాంగములు) గాని, వెదకి (ఆయనకోసం గాలించినా) కదిసి కానలేని (సరిగ్గా కనుగొనలేకపోయిన) నరసింహము.

ఈ జిగిసింహము (కాంతులు వెదజల్లు నృసింహుడు) చిచ్చర కంటితో (అగ్నిశిఖలు వెదజల్లు ఫాలనేత్రముతో వుజ్వలముగా ప్రకాశించుచుండగా మితిమీరియున్నాడు (అతిశయించినాడు). మెచ్చి మెచ్చి (బాగుగా కీర్తించుచూ) చూడరో (ఈ స్వామి దర్శనం చేసికోండి). తచ్చిన (కిక్కిరిసియున్న) వారధిలోన (నది రెండు ఒడ్డులను కలుపు వంతెనలో) నచ్చిన తరుణిని (తన హృదయేశ్వరి అయిన శ్రీలక్ష్మిని గోళ్ళతో గిలిగింతలిడుచున్న నృసింహుని చూడండి.

ఈయన ఉగ్రనరసింహుడే, కాని భక్తవత్సలుడు. నేడు పిరుదియ్యక (భయపడక) బింకమున చూడరో (ధైర్యంగా చూడండయ్యా!) దనుజుని (హిరణ్యకశిపుని) అంకమున (ఒడిలో కూర్చొనబెట్టుకొని సంహరించాడు. ఈ నృసింహుని కొలవండి. ఈయన కింకలేక (కోపమును వుపసంహరించుకొని) వడి పెరిగెను (త్వరగా ప్రీతిపాత్రుడైనాడు). తిరుమలవేంకటేశ్వరుడు ఈయనే అహెూబల నరసింహుడు ఈ దేవుడే.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Tagu Munulu Rushulu Tapamulu Seyaga In Telugu – తగు మునులు ఋషులు తపముల సేయగ

తగు మునులు ఋషులు తపముల సేయగ - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో తగు మునులు ఋషులు తపముల సేయగ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

తగు మునులు ఋషులు తపముల సేయగ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : తగు మునులు ఋషులు తపముల సేయగ
సంఖ్య : 315
పుట : 213
రాగం : ధన్యాసి

ధన్యాసి

35 తగు మునులు ఋషులు తపములు సేయఁగ
గగనము మోచియుఁ గర్మము దెగదా.

||పల్లవి||

ధరణీధర ముందరధర నగధర
చిరకౌస్తుభధర శ్రీధరా
కరిఁ గాచితి కాకముఁ గాచితి నీ-
కరుణకుఁ బాత్రము గలదిదియా.

||తగు||

భవహర మురహర భక్తిపాపహర
భువన భారహర పురహరా
కవిసినవురుతను గద్దను మెచ్చితి –
వివల నీదయకు నివియా గురుతు.

||తగు||

శ్రీవేంకటపతి శేషగరుడపతి
భూవనితాపతి భూతపతి
గోవుల నేలితి కోఁతుల నేలితి
పావనపుఁగృపకుఁ బాత్రము లివియా.

||తగు॥ 315

అవతారిక:

ముల్లోకాలలోను శ్రీహరిని వేడని వారెవరు? ఎంతోమంది ఋషులు, మునులు యెన్నెన్నో తపములు చేశారు ఆకాశాన్ని అందుకొనేంత కీర్తిని సంపాదించారు. కాని వారి కర్మములు పరిపక్వంచెంది తెగితేకాని వారికి నీ కృప కలుగదు. నీకృప వారికి యేజన్మలోనైనా యేక్షణాననైనా కలుగవచ్చును. అజ్ఞానంతో వారు నీకు అపకారం చేసినా వారు యెంత హీనస్థితిలోవున్నా పరిగెత్తి వారిని చేరి వారిని అక్కున చేర్చుకొంటావు. అన్నీ నీ అభయానికి పాత్రములే. కరిగాని, కాకిగాని, వుడతగాని, గద్దగాని, ఆవులుగాని, కోతులుగాని.. ఒక్కటనేమిటి యేదయినా నీ సంతతే, నీదే అనే కరుణ చూపిస్తావు. అందుకే నీవు జగత్పితవు అంటున్నారు అన్నమాచార్యులవారు. సాధ్యమైనంత వివరించటానికి ప్రయత్నించాను.

భావ వివరణ:

ఓ దేవదేవా! అనేకమంది ఋషులు, మునులు తగిన విధములుగా నీకోసం తపములనాచరించారు. కాని అందరికీ నీకృప కలిగిందా? ఆకాశాన్ని కొనే కీర్తి సంపాదించవచ్చు గాక! కాని కర్మము దీరక (పరిపక్వముకాక) నీకృప సిద్ధిస్తుందా?

ఓ భూరమణా! మందరగిరిధరా! నగధరా! (గోవర్ధనధారీ) ప్రఖ్యాతి చెందిన కౌస్తుభమణని ధరించినవాడా! శ్రీధరా! (శ్రీకాంతా!) నీలీలలనేమని వర్ణించను ప్రభూ! అలనాడు కరిని రక్షించావు (గజేంద్ర వరదుడు), కాకిని రక్షించావు (కాకాసురుని శిక్షింపబూనియు శరణంటే రక్షించాడు శ్రీరాముడు). నీ కరుణకు పాత్రులవ్వాలంటే హీనాధికములైన యేదైనా అర్హమే.

ఓ భవహరా! (పుట్టుక లేక చేయగల దేవా!) మురహర! (ముర అను అసురుని నిర్జించిన దేవా!) భక్త పాపహరా, ప్రపంచమున పాపుల భారమును నివారించువాడా! పురహరా! (త్రిపురాసురులను హరించినవాడా! నీ దయకు అర్హత యెవ్వరికైనా కలుగవచ్చును. ఆనాడు నీ రామావతారంలో, కవిసిన వుడుతకు (పరుగులు పెట్టి తన శరీరానికి ఇసుకను అంటించుకొని సేతువుపై విదిలించి సేతు నిర్మాణానికి తనదవంతు కృషి చేసిన ఒక చిన్ని ఉడుతకు మోక్షమిచ్చావు). గద్దయైన గరుత్మంతుని నీవాహనం చేసికొని గరుడ గమనుడవయ్యావు. వాటిని మెచ్చావు. అవల (ఆవిధంగా) వాటి జాతి మొత్తం ఈనాటికీ నీ గుర్తులను తమ శరీరంపై ధరించియున్నాయి.

ఓ శ్రీవేంకటాచలపతీ! శేషాద్రివాసా! గరుడాద్రివాసా! భూధరా! భూతపతీ! (సర్వ భూతముల ఆధారా!) నీ పావనమైన కృపకు పాత్రాపాత్ర భేదము లేదు. అందరికీ జీవనాధారమైన గోవులను కాచి గోవిందుడివైనట్లే, నిరుపయోగమైన కోతులకు కూడా క్రమశిక్షణ నేర్పి రామదండు చేశావు. ఎనలేని కీర్తినిచ్చావు. కరుణామూర్తీ! ఇంతకంటే యే నిరూపణలు ఇంతకంటే యే నిరూపణలు కావాలి తండ్రీ, నీవు కరుణాంతరంగుడవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Annitipainunnatlu Haripai Nundadu Mati In Telugu – అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి

అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
సంఖ్య : 124
పుట : 83
రాగం: నారాయణి

నారాయణి

48 అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
కన్నులఁ బ్రహ్లాదువలె కనుఁగొను టరుదా

||పల్లవి||

పులుగు నర్చిం చొకఁడు పూఁచెనాగత మెరిఁగి
వెలసి ఘనుఁడనంటా విఱ్ఱవీఁగీని
జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు
ఇలలోనఁ బరమార్థ మెరుఁగుట యరుదా

॥అన్ని॥

మావోడ నమ్మొకఁడు మహాజలధి దాఁటి
నానార్ధములు గూర్చి నటియించీని
శ్రీనాథుపాదములు చేకొని నమ్మినవాఁడు
పూని భవవార్ధి దాఁటి పుణ్యమందు టరుదా

॥అన్ని॥

దీపమువట్టి యొకఁడు తెగనిచీఁకటిఁ బాసి
చూపుల నన్నిటిఁ గని సుఖమందీని
చేపట్టి పరంజ్యోతి శ్రీవేంకటేశు భక్తుఁ
డోపి ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా

॥అన్ని॥

అవతారిక:

ప్రహ్లాదునికి అందరిలోనూ హరియే కనుపించేవాడు. అన్నిటిలో వున్నది హరియే అని దృఢముగా నమ్మిన వానికే అది సాధ్యము. వారి వారి అభీష్టాలు నెరవేరుటతో మానవులు రకరకాల సాధనలను చేస్తారు. ప్రాపంచిక విషయాలలో కడతేరటం యేమంతకష్టం కాదు. శ్రీహరి శరణాగతుఉ వైకుంఠమ ఏ పొందగలరు; భవసాగరాన్ని సునాయాసంగా తరించగలరు; ముక్తిని కూడా పొందగలరు, ఎందుకంటే వారు పరంజ్యోతియైన శ్రీవేంకటేశ్వరుని భక్తులు కదా! అంటున్నారు అన్నమాచార్యులవారు.

భావ వివరణ:

అయ్యో! మతి (నామనస్సు) అన్నిటిపైన వున్నట్లు హరిపై నుండదు. ఏమి దౌర్భాగ్యము!! భక్త ప్రహ్లాదునివలె ఆ శ్రీహరిని కన్నుల యెదుట ప్రత్యక్షం చేసికొనుట అరుదా (అసంభవమా?) ఏమాత్రమూ కాదు.

ఇదివరలో ఒకడు గరుత్మంతుని అర్చించి ఆయన అనుగ్రహంతో ఆగతము (జరుగబోవునది) తెలిసికొని తానే ఘనుడనని విఱ్ఱవీగినాడు. అతడే అట్లయిన, ఆ గరుత్మంతుని అధిపతియైన జలజాక్షుడు శ్రీహరిపాదముల నర్చించువాడు, ఇలలో పరమార్థము నెరుగుట ఒక గొప్ప విషయమా?

మానివాడ (కొయ్యతో చేసిన ఓడ) నెక్కి మహాసముద్రములను దాటి రకరకములైన సంపదలను పొందుటకు అనేక నటనలు చేస్తాడు ఒకడు. వాడికే అటువంటి విశిష్టత కలిగితే ఇక శ్రీనాథుని పాదముల నాశ్రయించినవాడు భవసాగరమును దాటి పుణుడగుట అరుదా (అసంభవమైన విషయమా?) ఏమాత్రమూ కాదు.

ఒకానొకడు దీపమును తన చేత ధరించి తెగని చీకటి (అంతులేని అంధకారమును) అధిగమించి తన కళ్ళతో అన్నీ చూడగలిగి సుఖములననుభవించాడు. అటువంటప్పుడు పరంజ్యోతి అయిన శ్రీవేంకటేశ్వరుని భక్తుడు, ఓపి (ఓపికతో) ముక్తిని పొంది సర్వోన్నతుడవటం అరుదా (అసంభవమా?) ఏమాత్రం కాదు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Kundanampumai Golleta Ta In Telugu – కుందణంపుమై గొల్లెత తా

కుందణంపుమై గొల్లెత తా - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కుందణంపుమై గొల్లెత తా- కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కుందణంపుమై గొల్లెత తా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన : కుందణంపుమై గొల్లెత తా-
సంఖ్య : 92
పుట : 63
రాగం: ఆహిరి

ఆహిరి

85 కుందణంపుమై గొల్లెత తా
నెందును బుట్టని యేతరి జాతి

||పల్లవి||

కప్పులు దేరేటి కస్తురి చంకల
కొప్పెర గుబ్బల గొల్లెత
చప్పుడు మట్టెల చల్లలమ్మెడిని
అప్పని ముందట హస్తిణిజాతి

॥కుంద||

దుంప వెంట్రుకల దొడ్డతురుముగల
గుంపెన నడపుల గొల్లెత
జంపుల నటనలఁ జల్లలమ్మెడిని
చెంపల చెమటల చిత్రిణి జాతి

॥కుంద||

వీపున నఖములు వెడవెడ నాఁటిన
కోపపుఁ జూపుల గొల్లెత
చాఁపున కట్టిగఁ జల్లలమ్మెడిని
చాఁపేటి యెలుగున శంకిణిజాతి

॥కుంద||

గారవమున వేంకటపతి కౌఁగిట
కూరిమిఁ బాయని గొల్లెత
సారెకు నతనితో చల్లలమ్మెడిని
భారపుటలపుల పద్మిణిజాతి

॥కుంద||

అవతారిక:

కావ్యనాయికలను శృంగారశాస్త్రం నాలుగురకాలుగా వర్ణించింది. పద్మినిజాతి స్త్రీ, హస్తిణి, చిత్రిణి, శంకిణి అని చెప్పబడిన వీరిలో ప్రతి యువతి తన శారీరక, మానసిక లక్షణాలను బట్టి ఆ జాతికి చెందిన స్త్రీగా నిశ్చయింపబడినది. ఈ కీర్తనలో అన్నమాచర్యులవారు నలుగురు గొల్లెతలను ఆ విధంగా విభజించి బంగారు శరీరఛాయతోనున్న గొల్లెత తానెందును. బుట్టని యేతరిజాతి చిన్నది అంటున్నారు. అంటే యేమిటి? సరసశృంగారంకాస్త గూఢంగా వుంటే అందం కదా! భావవివరణ జాగ్రత్తగా చదవండి. కొసమెరుపేమంటే, నలుగురికీ ఆ నల్లనివాడంటే వుల్లములో జల్లే.

భావ వివరణ:

కుందణంపుమై (బంగారు శరీరచ్ఛాయగల) గొల్లెత (ఆ గొల్లభామ) | తాను యెందును (ఏజాతిలోనూ) పుట్టని యేతరిజాతి (అతిశయముగల స్త్రీ). అనగా వూహాసుందరి.

కప్పులుదేరేటి కస్తూరి (నల్లని కస్తూరీ పరిమళముగల) బాహు మూలములామె ప్రత్యేకత. ఆమె కొప్పెర గుబ్బల (వున్నత కుచయుగళము) గల గొల్లెత. ఆమె చల్లలమ్ముటకు పోతుంటే ఆమెమట్టెల చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. అప్పని ముందట (హరియెదుట) ఆ హస్తిణీజాతి గొల్లెత నడయాడుచున్నది.

ఆమె తల వెంట్రుకలు, దుంపలు కట్టి (కుచ్చులు కట్టి) పెద్ద కొప్పుతో వున్నది. | ఆమె నడుస్తుంటే గుంపెనగా (అట్టహాసముగా) వుంటుంది. ఆమె కదులుతుంటే ఆమె చెవులకు దరించిన జంపులు (చెంపసరములు) నర్తించుతాయి. చల్లలమ్ముటకు ఆమె మధురానగరంలో నడుస్తుంటే శ్రమవల్ల ఆమె చెంపలు చెమటను చెమరించుచున్నవి. ఆమె తప్పకుండా చిత్తిణీజాతి స్త్రీయే సుమా!

ఇదిగో ఈ గొల్లెతను చూడండి. ఉద్రేకమున ఈమె వీపుపై నఖక్షతములను సైతము జేయగలదు. ఈమె చూపులే చురచురమనునట్లు కోపాగ్నితో వుంటాయి. ఆమె నడుస్తుంటే పరుగెడునట్లుంటుంది. ఈమె చల్లలమ్ముటకు చాపేటి యెలుగున (పెద్ద గొంతుతో కేకలు వేస్తూ అమ్ముతుంది). ఈ జవ్వని శంకిణిజాతి గొల్లెత.

ఈ గొల్లెతను చూశారా? ఈమె అతిశయించిన గారవము (గౌరవము) తో శ్రీవేంకటేశ్వరుని కౌగిటిని యెన్నడు విడువదు. తిరుమలేశునిపై ఆమె యెనలేని కూరిమి (వలపు) కలిగి వుంటుంది. ఈ గొల్లెత యెప్పుడు చల్లలమ్ముటకు పోయినా తనవెంట ఆ రమణుడే వుండాలని ఆశపడుతుంది. ఆమె భారపు (అధికమైన) అలసటను (శ్రమను) తట్టుకోలేదు. ఆమె ఆయనకు ప్రియమైన పద్మినీజాతి స్త్రీ.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Sista Rakshanamunu Dushta Nigrahamunu In Telugu – శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును

శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
సంఖ్య : 258
పుట: 175
రాగం: పాడి

పాడి

70 శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
సృష్టించె నొక్కవేళనే శ్రీజయంతినాఁడు.

||పల్లవి||

హరి కృష్ణావతార మందినయంతలోనే
పరమమునుల కెల్ల భయముడిగెను
తెరలి దైత్యులగుండె దిగులుచొచ్చె నత్తరి
సిరులమించినయట్టి శ్రీజయంతినాఁడు.

||శిష్ట||

గోవిందుఁడు వసుదేవుకొడుకైనయప్పుడే
గోవులు రంకెలు వేసె గొల్లపల్లెను
నోవితోడఁ గంసునికి నూరునిండెఁ జూడఁగానె
చేపలుమీరినయట్టి శ్రీజయంతినాఁడు

||శిష్ట||

నారాయణుఁడు భువి నరుఁడు దాఁ గాఁగానే
మేరఁ బాండవు లెచ్చిరి మేనవావిని
కౌరవులపని దీరె కమ్మి శ్రీవేంకటేశుఁడు
చేరువనే మెరయఁగ శ్రీజయంతినాఁడు.

||శిష్ట||

అవతారిక:

ఒకానొక శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు వినిపించిన కీర్తననాలకించండి. “శిష్టరక్షణమును, దుష్టశిక్షణమును భగవంతుడు శ్రీజయంతినాడు ఒకే సమయంలో సృష్టించె” అంటున్నారు. మునులను రక్షించాడు, దానవులను భక్షించాడు. గోవులను మేపాడు, కంసుని వేపాడు. పాండవులు యెచ్చిరి, కౌరవుల పనిదీరె అని కృష్ణావతారవైశిష్ట్యాన్ని కీర్తిస్తున్నారు. శ్రీవేంకటేశుడు కూడా ఆయన చేరువనే మెరసినాడట. గతంలో ఇటువంటి కీర్తనలు చూచినా దేని మాధుర్యం దానిదే.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈ శ్రీజయంతినాడు (శ్రీకృష్ణాష్టమినాడు) ఆ భగవంతుడు, శిష్టరక్షణము (మంచివారిని రక్షించుట), దుష్టనిగ్రహము (చెడ్డవారిని నిరోధించుట) ఒక్కవేళనే (ఒకే సమయంలో) సృష్టించెన్ (సిద్ధింపజేశాడు).

శ్రీహరి కృష్ణావతారమును పొందినప్పుడు పరమ మునీంద్రులకు అందరికీ దానవుల భయము వుడిగెను (అణగిపోయినది). తెరలి (కలతపడిన) దైత్యుల గుండెలు, అత్తరి (అప్పుడు) దిగులుచొచ్చె (దిగులుతో దిగాలుపడ్డాయి). ఈ శ్రీజయంతి సిరులుమించిన (వైభవములతిశయించిన) పండుగ అవటంచేత ఈనాడు అంతా జయమే.

ఆ గోవింద వసుదేవుని కొడుకైనప్పుడే కొడుకైనప్పుడే గొల్లపల్లెను (గోకులమునందున్న) గోవులన్నీ సంతోషంతో రంకె వేసినవి. ఎందుకంటే వాటికి భగవంతుడు తమ మూపురాలను ప్రేమగా నిమరటానికి రాబోతున్నాడని తెలిసిపోయింది. అక్కడ మధురలో కంసునికి నోవితోడ (వేదనతో) చూడగానే (యోగమాయ హెచ్చరిక విని జరిగింది చూడగా) భయంతో నూరునిండె (నూరేళ్ళు నిండాయి). ఈ శ్రీజయంతినాడు చేవలు మీరినయట్టి (అందరికీ ధైర్యంకలిగినట్టి ఈరోజున) కంసాదులకు కన్నీళ్ళొచ్చాయి.

నారాయణుడు భువిపై తాన్ నరుడు కాగానే (అవగానే మేం (క్రమముగా) మేనవావిని (మేనరికపు బంధుత్వమునందు) పాండవులు యెచ్చిరి (బలోపేతులయ్యారు). కౌరవులు (దుష్టరాజసమూహంగల కురుసేన) పనిదీరె (పనిముగిసినది). ఈ శ్రీజయంతినాడు ఆ కృష్ణలీల సంకేతముగా, శ్రీవేంకటేశుడు ఈ తిరుమల శిఖరాలపై కమ్మి మెరయగా (వ్యాపించి మెరిసిపోగా) చేరువనే (ఇక్కడే) పండుగ పరిమళించింది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Kolluna Navveru Ninnu Govinduda In Telugu – కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా

కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా
సంఖ్య : 333
పుట: 193
రాగం: మనోహరి

మనోహరి

10 కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుఁడా
గొల్లెతల నేమనేవు గోవిందుఁడా

||పల్లవి||

యేపున నీసుద్దులెల్ల యిట్టె యశోదతోడ
గోపిక లాడుకొనేరు గోవిందుఁడా
తీపుల నీచేఁతలెల్ల తేట తెల్లమాయనిదే
కోపగించఁ జెల్లదిఁక గోవిందుఁడా

||కొల్లు||

సిసువవై యాడువారి చీరలు దీసినందుకు
కొసరి తిట్టేరు నిన్ను గోవిందుఁడా
పసులఁగాచేచోట భామలు విందు దెచ్చిరి
కుసిగుంపు సేయకుమీ గోవిందుఁడా

||కొల్లు||

వాడలసతుల నొక్కవావిగానే సేసితివి
కోడెల నావులఁ గాచేగోవిందుఁడా
యీడనే శ్రీవేంకటాద్రి నిరవై శ్రీసతితోడఁ
గూడి లోలుఁడ వైతివి గోవిందుఁడా.

||కొల్లు||

అవతారిక:

“గోవులను కాచే గోవిందుడా! నిన్ను చూచి ఈ రేపల్లె గొల్లభామలు గొల్లుమని నవ్వారయ్యా! వాళ్ళనేమనగలము?” అంటున్నారు అన్నమాచార్యులవారు. నీ కోపాలు యికపై చెల్లేట్లులేవు. మరి నీవు వాళ్ళ చీరెలెత్తికెళ్ళిపోతే మళ్ళీ నిన్నే తిడుతున్నారు, అంటున్నారు. ఈ గోవిందుడు గొల్లవాడలోనున్న సతులనందరినీ ఒక్కవావిగానే చేశాడట. అంటే యేమిటో తెలుసా? ఆ గోవిందుడు, వరుసకు వదినా మరదళ్ళయిన ఇద్దరిని కూడితే వారు ఏమవుతారు? ఒకేవావి కదా! అంటే అక్కా చెల్లెళ్ళేకదా! అదన్నమాట సంగతి. ఇంతా చేసిన ఆ శ్రీసతిలోలుడేనట.

భావ వివరణ:

ఓ గోవిందుడా! ఈ గొల్లెతలను (గొల్లభామలను యేమనేవు (నీవేమి అనగలవు?) నీసంగతులు చెప్పుకొంటూ వాళ్ళు గొల్లుమని నవ్వుకొంటున్నారు చూశావా?

ఓ గోవిందుడా! నీ సుద్దులెల్లా (ముచ్చట్లనన్నియు) ఈ గోపికలు నీ తల్లి యశోదమ్మతో యేపున వున్నవీ లేనివీ కల్పించి యెక్కువగా) చెబుతున్నారు. నీ తీపుల చేతలెల్లా (నీవు పెట్టిన యాతనలు చిలిపి పనులు) అన్నియునూ తేటతెల్లమాయె (బట్టబయలైపోయాయి). ఓ గోవిందుడా నీ అలుకలు చెల్లవిక.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: