Ayodhya Kanda Sarga 16 In Telugu – అయోధ్యాకాండ షోడశః సర్గః

Ayodhya Kanda Sarga 16

“రామాయణం” లో అయోధ్యాకాండ షోడశః సర్గం (16వ సర్గ)లో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు భద్రత కోసం చిత్రకూటం చేరుకుంటారు. అక్కడ, వారు తపస్వులు మరియు సన్యాసులతో కలుస్తారు. చిత్రకూటంలో సుఖశాంతులతో నివసిస్తూ, రాముడు తన తండ్రి దశరథుని మరణవార్త వింటాడు. ఈ వార్త రాముని, సీత మరియు లక్ష్మణులను తీవ్రంగా కలచివేస్తుంది. రాముడు పితృవేదనతో తపస్సులో మునిగిపోతాడు. ఈ సర్గలో, రాముడి ధర్మపరమైన కట్టుబాట్లు మరియు తండ్రి పట్ల ప్రేమ స్పష్టంగా తెలుస్తాయి. త్రయం చిత్రకూటంలో శోకంతో పాటు శాంతిని అనుభవిస్తారు.

రామప్రస్థానమ్

స తదంతఃపురద్వారం సమతీత్య జనాకులమ్ |
ప్రవివిక్తాం తతః కక్ష్యామాససాద పురాణవిత్ || ౧ ||

ప్రాసకార్ముకబిభ్రద్భిర్యువభిర్మృష్టకుండలైః |
అప్రమాదిభిరేకాగ్రైః స్వనురక్తైరధిష్ఠితామ్ || ౨ ||

తత్ర కాషాయిణో వృద్ధాన్వేత్రపాణీన్ స్వలంకృతాన్ |
దదర్శ విష్ఠితాన్ద్వారిః త్ర్యధ్యక్షాన్సుసమాహితాన్ || ౩ ||

తే సమీక్ష్య సమాయాంతం రామప్రియచికీర్షవః |
సహసోత్పతితాః సర్వే స్వాసనేభ్యః ససంభ్రమాః || ౪ ||

తానువాచ వినీతాత్మా సూతపుత్రః ప్రదక్షిణః |
క్షిప్రమాఖ్యాత రామాయ సుమంత్రో ద్వారి తిష్ఠతి || ౫ ||

తే రామముపసంగమ్య భర్తుః ప్రియచికీర్షవః |
సహభార్యాయ రామాయ క్షిప్రమేవాచచక్షిరే || ౬ ||

ప్రతివేదితమాజ్ఞాయ సూతమభ్యంతరం పితుః |
తత్రైవానాయయామాస రాఘవప్రియకామ్యయా || ౭ ||

తం వైశ్రవణసంకాశముపవిష్టం స్వలంకృతమ్ |
దదర్శ సూతః పర్యంకే సౌవర్ణే సోత్తరచ్ఛదే || ౮ ||

వరాహరుధిరాభేణ శుచినా చ సుగంధినా |
అనులిప్తం పరార్ధ్యేన చందనేన పరంతపమ్ || ౯ ||

స్థితయా పార్శ్వతశ్చాపి వాలవ్యజనహస్తయా |
ఉపేతం సీతయా భూతశ్చిత్రయా శశినం యథా || ౧౦ ||

తం తపంతమివాదిత్యముపపన్నం స్వతేజసా |
వవందే వరదం వందీ వినయజ్ఞో వినీతవత్ || ౧౧ ||

ప్రాంజలిస్తు సుఖం పృష్ట్వా విహారశయనాసనే |
రాజపుత్రమువాచేదం సుమంత్రో రాజసత్కృతః || ౧౨ ||

కౌసల్యా సుప్రజా రామ పితా త్వాం ద్రష్టుమిచ్ఛతి |
మహిష్యా సహ కైకేయ్యా గమ్యతాం తత్ర మా చిరమ్ || ౧౩ ||

ఏవముక్తస్తు సంహృష్టో నరసింహో మహాద్యుతిః |
తతః సమ్మానయామాస సీతామిదమువాచ హ || ౧౪ ||

దేవి దేవశ్చ దేవీ చ సమాగమ్య మదంతరే |
మంత్రయేతే ధ్రువం కించిదభిషేచనసంహితమ్ || ౧౫ ||

లక్షయిత్వా హ్యభిప్రాయం ప్రియకామా సుదక్షిణా |
సంచోదయతి రాజానం మదర్థం మదిరేక్షణే || ౧౬ ||

సా ప్రహృష్టా మహారాజం హితకామానువర్తినీ |
జననీ చార్థకామా మే కేకయాధిపతేః సుతా || ౧౭ ||

దిష్ట్యా ఖలు మహారాజో మహిష్యా ప్రియయా సహ |
సుమంత్రం ప్రాహిణోద్దూతమర్థకామకరం మమ || ౧౮ ||

యాదృశీ పరిషత్తత్ర తాదృశో దూత ఆగతః |
ధ్రువమద్యైవ మాం రాజా యౌవరాజ్యేఽభిషేక్ష్యతి || ౧౯ ||

అహం శీఘ్రమితో గత్వా ద్రక్ష్యామి చ మహీపతిమ్ | [హంత]
సహ త్వం పరివారేణ సుఖమాస్వ రామస్వ చ || ౨౦ ||

పతిసమ్మానితా సీతా భర్తారమసితేక్షణా |
ఆద్వారమనువవ్రాజ మంగళాన్యభిదధ్యుషీ || ౨౧ ||

రాజ్యం ద్విజాతిభిర్జుష్టం రాజసూయాభిషేచనమ్ |
కర్తుమర్హతి తే రాజా వాసవస్యేవ లోకకృత్ || ౨౨ ||

దీక్షితం వ్రతసంపన్నం వరాజినధరం శుచిమ్ |
కురంగశృంగపాణిం చ పశ్యంతీ త్వాం భజామ్యహమ్ || ౨౩ ||

పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం పాతు తే యమః |
వరుణః పశ్చిమామాశాం ధనేశస్తూత్తరాం దిశమ్ || ౨౪ ||

అథ సీతామనుజ్ఞాప్య కృతకౌతుకమంగళః |
నిశ్చక్రామ సుమంత్రేణ సహ రామో నివేశనాత్ || ౨౫ ||

పర్వతాదివ నిష్క్రమ్య సింహో గిరిగుహాశయః |
లక్ష్మణం ద్వారి సోఽపశ్యత్ప్రహ్వాంజలిపుటం స్థితమ్ || ౨౬ ||

అథ మధ్యమకక్ష్యాయాం సమాగమ్య సుహృజ్జనైః |
స సర్వానర్థినో దృష్ట్వా సమేత్య ప్రతినంద్య చ || ౨౭ ||

తతః పావకసంకాశమారురోహ రథోత్తమమ్ |
వైయాఘ్రం పురుషవ్యాఘ్రో రాజతం రాజనందనః || ౨౮ ||

మేఘనాదమసంబాధం మణిహేమవిభూషితమ్ |
ముష్ణంతమివ చక్షూంషి ప్రభయా హేమవర్చసమ్ || ౨౯ ||

కరేణుశిశుకల్పైశ్చ యుక్తం పరమవాజిభిః |
హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవాశుగమ్ || ౩౦ ||

ప్రయయౌ తూర్ణమాస్థాయ రాఘవో జ్వలితః శ్రియా |
స పర్జన్య ఇవాకాశే స్వనవానభినాదయన్ || ౩౧ ||

నికేతాన్నిర్యయౌ శ్రీమాన్మహేంద్రాదివ చంద్రమాః |
ఛత్రచామరపాణిస్తు లక్ష్మణో రాఘవానుజః || ౩౨ ||

జుగోప భ్రాతరం భ్రాతా రథమాస్థాయ పృష్ఠతః |
తతో హలహలాశబ్దస్తుములః సమజాయత || ౩౩ ||

తస్య నిష్క్రమమాణస్య జనౌఘస్య సమంతతః |
తతో హయవరా ముఖ్యాః నాగాశ్చ గిరిసన్నిభాః || ౩౪ ||

అనుజగ్ముస్తదా రామం శతశోఽథ సహస్రశః |
అగ్రతశ్చాస్య సన్నద్ధాశ్చందనాగరురూషితాః || ౩౫ ||

ఖడ్గచాపధరాః శూరాః జగ్మురాశంసవో జనాః |
తతో వాదిత్రశబ్దాస్తు స్తుతిశబ్దాశ్చ వందినామ్ || ౩౬ ||

సింహనాదాశ్చ శూరాణాం తథా శుశ్రువిరే పథి |
హర్మ్యవాతాయనస్థాభిర్భూషితాభిః సమంతతః || ౩౭ ||

కీర్యమాణః సుపుష్పౌఘైర్యయౌ స్త్రీభిరరిందమః |
రామం సర్వానవద్యాంగ్యో రామపిప్రీషయా తతః || ౩౮ ||

వచోభిరగ్ర్యైర్హర్మ్యస్థాః క్షితిస్థాశ్చ వవందిరే |
నూనం నందతి తే మాతా కౌసల్యా మాతృనందన || ౩౯ ||

పశ్యంతీ సిద్ధయాత్రం త్వాం పిత్ర్యం రాజ్యమవస్థితమ్ |
సర్వసీమంతినీభ్యశ్చ సీతాం సీమంతినీం వరామ్ || ౪౦ ||

అమన్యంత హి తా నార్యో రామస్య హృదయప్రియామ్ |
తయా సుచరితం దేవ్యా పురా నూనం మహత్తపః || ౪౧ ||

రోహిణీవ శశాంకేన రామసంయోగమాప యా |
ఇతి ప్రాసాదశృంగేషు ప్రమదాభిర్నరోత్తమః || ౪౨ ||

శుశ్రావ రాజమార్గస్థః ప్రియా వాచ ఉదాహృతాః |
ఆత్మసంపూజనైః శృణ్వన్యయౌ రామో మహాపథమ్ || ౪౩ ||

స రాఘవస్తత్ర కథాప్రపంచాన్
శుశ్రావ లోకస్య సమాగతస్య |
ఆత్మాధికారా వివిధాశ్చ వాచః
ప్రహృష్టరూపస్య పురో జనస్య || ౪౪ ||

ఏష శ్రియం గచ్ఛతి రాఘవోఽద్య
రాజప్రసాదాద్విపులాం గమిష్యన్ |
ఏతే వయం సర్వసమృద్ధకామాః
యేషామయం నో భవితా ప్రశాస్తా || ౪౫ ||

లాభో జనస్యాస్య యదేష సర్వం
ప్రపత్స్యతే రాష్ట్రమిదం చిరాయ |
న హ్యప్రియం కించన జాతు కశ్చి-
-త్పశ్యేన్న దుఃఖం మనుజాధిపేఽస్మిన్ || ౪౬ ||

స ఘోషవద్భిశ్చ హయైర్మతంగజైః
పురఃసరైః స్వస్తికసూతమాగధైః |
మహీయమానః ప్రవరైశ్చ వాదకై-
-రభిష్టుతో వైశ్రవణో యథా యయౌ || ౪౭ ||

కరేణుమాతంగరథాశ్వసంకులం
మహాజనౌఘప్రతిపూర్ణచత్వరమ్ |
ప్రభూతరత్నం బహుపణ్యసంచయం
దదర్శ రామో రుచిరం మహాపథమ్ || ౪౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశః సర్గః || ౧౬ ||

Ayodhya Kanda Sarga 16 Meaning In Telugu

రాముని అంతఃపురములో ఒక్కొక్క ద్వారమును దాటు కుంటూ వెళుతున్నాడు సుమంత్రుడు. రాముని అంత:పురము బయట కాపలా ఉన్న భటులతో “రాముని దర్శనము కొరకు సుమంత్రుడు వచ్చి ఉన్నాడు” అని చెప్పండి అని చెప్పి పంపించాడు. సీతతో ముచ్చటిస్తున్న రామునితో భటులు సుమంత్రుడు వచ్చాడు అన్న మాటను చెప్పారు. “సుమంత్రుని సాదరంగా లోపలకు తీసుకొని రండి” అని ఆదేశించాడు రాముడు.
సుమంత్రుడు రాముని అంతఃపురములోకి వెళ్లాడు. రాముని చూచాడు. రామునికి నమస్కరించాడు. రాముని చూచి ఇలా అన్నాడు.
” ఓ కౌసల్యా నందనా! రామా! మీ తండ్రిగారు దశరథ మహారాజు గారూ, తమరి తల్లి కైకేయీ మహారాణి గారూ తమరిని చూడవలెనని అనుకుంటున్నారు. తమరు వెంటనే దశరథుల వారి అంతఃపురమునకు బయలు దేరండి.” అని పలికాడు.

ఆ మాటలు విన్న రాముడు పక్కనే ఉన్న సీతను చూచి ఇలా అన్నాడు. “సీతా! నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక నా పట్టాభిషేకము గురించి నాతో చర్చించవలెనని అనుకుంటున్నారు. నన్ను తీసుకొని రమ్మని సుమంత్రుని పంపారు. నేను వెంటనే నా తల్లి తండ్రుల వద్దకు వెళ్లుతున్నాను.” అని చెప్పాడు.

సీత చిరునవ్వుతో భర్తను సాగనంపింది. ద్వారము దాకా తోడు వచ్చింది. “ఆర్యపుత్రా! మీకు జయమగుగాక! తమరు త్వరలో ఈ అయోధ్యకు పట్టాభిషిక్తులు కాబోతున్నారు. తమరు పట్టాభిషిక్తులు కావడం చూచి నేను ఎంతో ఆనందిస్తాను. దిక్పాలకులైన ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు తమరిని సదా రక్షించు గాక! శు భంగా వెళ్లిరండి.” అని భర్తను సాగనంపింది సీత. సీత వద్దనుండి అనుమతి తీసుకున్న రాముడు, సుమంత్రునితో సహా దశరధ మహారాజు మందిరమునకు బయలుదేరాడు.

ద్వారము దగ్గర లక్ష్మణుడు అన్నగారి కోసరము వేచి ఉన్నాడు. లక్ష్మణుని కూడా తనతో రమ్మన్నాడు రాముడు. ముగ్గురూ కలిసి వెళు తున్నారు. దారిలో తన కోసం వేచి ఉన్న తన మిత్రులను చూచి రాముడు వారికి ‘తండ్రిగారిని కలుసుకొని ఇప్పుడే వస్తాను’ అని చెప్పాడు. రాముడు లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు. సుమంత్రుడు రథం తోలుతున్నాడు. రాముడు ఎక్కిన రథము రాజాంతఃపురమునకు బయలుదేరింది. లక్ష్మణుడు రాముని వెనక నిలబడి రాముని అప్రత్తంగా రక్షిస్తున్నాడు. రాముని రథము వెంట గుర్రములు, ఏనుగులు ఎక్కిన సైనికులు అనుసరించారు. కవచములు, ఆయుధములు ధరించిన భటులు రాముని రథమును అనుసరించి వెళుతున్నారు.

రాముని చూచి మార్గమునకు అటు ఇటు నిలబడ్డ ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు. రాముని గుణగణములను స్తుతిస్తున్నారు. మేడల మీద నిలబడ్డ స్త్రీలు రాముని మీద పూలు చల్లుతున్నారు. దారికి అటు ఇటు నిలబడ్డ ప్రజలు రామునికి భక్తితో నమస్కరిస్తున్నారు. అటువంటి రాముని భర్తగా పొందిన సీతను అయోధ్యావాసులు మనసులోనే అభినందించారు. “పూర్వజన్మలో ఏ తపస్సు చేసిందో ఏమో ఈ జన్మలో రాముని వంటి ఉత్తముని భర్తగా పొందినది”, సీత అదృష్టాన్ని పొగిడారు.

వారందరి మాటలు చిరునవ్వుతో వింటున్నాడు రాముడు. ఈ నాడే రాముడు మనకందరికీ పాలకుడు కాబోతున్నాడు. ఇంక మనకోరికలు అన్నీ తీరుతాయి. ఇంక అయోధ్యా ప్రజలకు దుఃఖము అనే మాట వినపడదు. అని అయోధ్యావాసులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.
ఆ ప్రకారంగా రాముడు, ముందు వంది మాగధులు కైవారములు చేస్తూ ఉంటే, వెనక ఆశ్విక బలము, గజబలము వెంట వస్తూ ఉంటే, రాజాంతఃపురమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తదశః సర్గః (17) >>

Balakanda Sarga 18 In Telugu – బాలకాండ అష్టాదశః సర్గః

Balakanda Sarga 18 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టాదశః సర్గంలో, విశ్వామిత్రుడు రామ, లక్ష్మణులతో కలిసి మిథిలానగరికి ప్రయాణం ప్రారంభిస్తారు. మార్గంలో, విశ్వామిత్రుడు సుగ్రీవుడి కథను రాముడికి వివరిస్తారు. సుగ్రీవుడు తన సోదరుడు వాలి చేత అవమానితుడై, తన రాజ్యం కోల్పోయాడు. తరువాత, వారు గంగా నది తీరానికి చేరుకుంటారు. అక్కడ విశ్వామిత్రుడు గంగా నది ఉద్భవ కథను వివరిస్తాడు. ఈ ప్రయాణంలో రాముడు, లక్ష్మణుడు గురువు మాటలను ఆసక్తితో వింటారు.

శ్రీరామాద్యవతారః

నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్హయమేధే మహాత్మనః |
ప్రతిగృహ్య సురా భాగాన్ ప్రతిజగ్ముర్యథాగతమ్ ||

1

సమాప్తదీక్షానియమః పత్నీగణసమన్వితః |
ప్రవివేశ పురీం రాజా సభృత్యబలవాహనః ||

2

యథార్హం పూజితాస్తేన రాజ్ఞా వై పృథివీశ్వరాః |
ముదితాః ప్రయయుర్దేశాన్ప్రణమ్య మునిపుంగవమ్ ||

3

శ్రీమతాం గచ్ఛతాం తేషాం స్వపురాణి పురాత్తతః |
బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే ||

4

గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా |
ప్రవివేశ పురీం శ్రీమాన్పురస్కృత్య ద్విజోత్తమాన్ ||

5

శాంతయా ప్రయయౌ సార్ధమృశ్యశృంగః సుపూజితః |
అన్వీయమానో రాజ్ఞాఽథ సానుయాత్రేణ ధీమతా ||

6

ఏవం విసృజ్య తాన్సర్వాన్రాజా సంపూర్ణమానసః |
ఉవాస సుఖితస్తత్ర పుత్రోత్పత్తిం విచింతయన్ ||

7

తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః |
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ ||

8

నక్షత్రేఽదితిదైవత్యే స్వోచ్చసంస్థేషు పంచసు |
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ||

9

ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్కృతమ్ |
కౌసల్యాఽజనయద్రామం దివ్యలక్షణసంయుతమ్ ||

10

విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకువర్ధనమ్ |
[* లోహితాక్షం మహాబాహుం రక్తోష్ఠం దుందుభిస్వనమ్ | *]
కౌసల్యా శుశుభే తేన పుత్రేణామిత తేజసా ||

11

యథా వరేణ దేవానామదితిర్వజ్రపాణినా |
భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః ||

12

సాక్షాద్విష్ణోశ్చతుర్థభాగః సర్వైః సముదితో గుణైః |
అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ ||

13

సర్వాస్త్రకుశలౌ వీరౌ విష్ణోరర్ధసమన్వితౌ |
పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః ||

14

సార్పే జాతౌ చ సౌమిత్రీ కులీరేఽభ్యుదితే రవౌ |
రాజ్ఞః పుత్రా మహాత్మానశ్చత్వారో జజ్ఞిరే పృథక్ ||

15

గుణవంతోఽనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః |
జగుః కలం చ గంధర్వా ననృతుశ్చాప్సరోగణాః ||

16

దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా |
ఉత్సవశ్చ మహానాసీదయోధ్యాయాం జనాకులః ||

17

రథ్యాశ్చ జనసంబాధా నటనర్తకసంకులాః |
గాయనైశ్చ విరావిణ్యో వాదకైశ్చ తథాఽపరైః ||

18

[* విరేజుర్విపులాస్తత్ర సర్వ రత్న సమన్వితాః | *]
ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవందినామ్ |
బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః ||

19

అతీత్యైకాదశాహం తు నామకర్మ తథాఽకరోత్ |
జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతమ్ ||

20

సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా |
వసిష్ఠః పరమప్రీతో నామాని కృతవాంస్తదా ||

21

బ్రాహ్మణాన్భోజయామాస పౌరజానపదానపి |
అదదద్బ్రాహ్మణానాం చ రత్నౌఘమమితం బహు ||

22

తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణ్యకారయత్ |
తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరః పితుః ||

23

బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సంమతః |
సర్వే వేదవిదః శూరాః సర్వే లోకహితే రతాః ||

24

సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః |
తేషామపి మహాతేజా రామః సత్యపరాక్రమః ||

25

ఇష్టః సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మలః |
గజస్కంధేఽశ్వపృష్టే చ రథచర్యాసు సంమతః ||

26

ధనుర్వేదే చ నిరతః పితృశుశ్రూషణే రతః |
బాల్యాత్ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః ||

27

రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః |
సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః ||

28

లక్ష్మణో లక్ష్మిసంపన్నో బహిఃప్రాణ ఇవాపరః |
న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః ||

29

మృష్టమన్నముపానీతమశ్నాతి న హి తం వినా |
యదా హి హయమారూఢో మృగయాం యాతి రాఘవః ||

30

తదైనం పృష్ఠతోఽభ్యేతి సధనుః పరిపాలయన్ |
భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజో హి సః ||

31

ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్తథా ప్రియః |
స చతుర్భిర్మహాభాగైః పుత్రైర్దశరథః ప్రియైః ||

32

బభూవ పరమప్రీతో వేదైరివ పితామహః |
తే యదా జ్ఞానసంపన్నాః సర్వే సముదితా గుణైః ||

33

హ్రీమంతః కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శినః |
తేషామేవం ప్రభావానాం సర్వేషాం దీప్తతేజసామ్ ||

34

పితా దశరథో హృష్టో బ్రహ్మా లోకాధిపో యథా |
తే చాపి మనుజవ్యాఘ్రా వైదికాధ్యయనే రతాః ||

35

పితృశుశ్రూషణరతా ధనుర్వేదే చ నిష్ఠితాః |
అథ రాజా దశరథస్తేషాం దారక్రియాం ప్రతి ||

36

చింతయామాస ధర్మాత్మా సోపాధ్యాయః సబాంధవః |
తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః ||

37

అభ్యాగచ్ఛన్మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
స రాజ్ఞో దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షానువాచ హ ||

38

శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినః సుతమ్ |
తచ్ఛ్రుత్వా వచనం త్రాసాద్రాజ్ఞో వేశ్మ ప్రదుద్రువుః ||

39

సంభ్రాంతమనసః సర్వే తేన వాక్యేన చోదితాః |
తే గత్వా రాజభవనం విశ్వామిత్రమృషిం తదా ||

40

ప్రాప్తమావేదయామాసుర్నృపాయైక్ష్వాకవే తదా |
తేషాం తద్వచనం శ్రుత్వా సపురోధాః సమాహితః ||

41

ప్రత్యుజ్జగామ తం హృష్టో బ్రహ్మాణమివ వాసవః |
తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా తాపసం సంశితవ్రతమ్ ||

42

ప్రహృష్టవదనో రాజా తతోఽర్ఘ్యం సముపాహరత్ |
స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం శాస్త్రదృష్టేన కర్మణా ||

43

కుశలం చావ్యయం చైవ పర్యపృచ్ఛన్నరాధిపమ్ |
పురే కోశే జనపదే బాంధవేషు సుహృత్సు చ ||

44

కుశలం కౌశికో రాజ్ఞః పర్యపృచ్ఛత్సుధార్మికః |
అపి తే సన్నతాః సర్వే సామంతా రిపవో జితాః ||

45

దైవం చ మానుషం చాపి కర్మ తే సాధ్వనుష్ఠితమ్ |
వసిష్ఠం చ సమాగమ్య కుశలం మునిపుంగవః ||

46

ఋషీంశ్చాన్యాన్యథాన్యాయం మహాభాగానువాచ హ |
తే సర్వే హృష్టమనసస్తస్య రాజ్ఞో నివేశనమ్ ||

47

వివిశుః పూజితాస్తత్ర నిషేదుశ్చ యథార్హతః |
అథ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిమ్ ||

48

ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్ |
యథాఽమృతస్య సంప్రాప్తిర్యథా వర్షమనూదకే ||

49

యథా సదృశదారేషు పుత్రజన్మాప్రజస్య వై |
ప్రనష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే ||

50

తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే |
కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః ||

51

పాత్రభూతోఽసి మే బ్రహ్మన్దిష్ట్యా ప్రాప్తోఽసి ధార్మిక |
అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితమ్ ||

52

[* యస్మాద్విప్రేంద్రమద్రాక్షం సుప్రభాతా నిశా మమ | *]
పూర్వం రాజర్షిశబ్దేన తపసా ద్యోతితప్రభః |
బ్రహ్మర్షిత్వమనుప్రాప్తః పూజ్యోఽసి బహుధా మయా ||

53

తదద్భుతమిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ |
శుభక్షేత్రగతశ్చాహం తవ సందర్శనాత్ప్రభో ||

54

బ్రూహి యత్ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి |
ఇచ్ఛామ్యనుగృహీతోఽహం త్వదర్థపరివృద్ధయే ||

55

కార్యస్య న విమర్శం చ గంతుమర్హసి కౌశిక |
కర్తా చాహమశేషేణ దైవతం హి భవాన్మమ ||

56

మమ చాయమనుప్రాప్తో మహానభ్యుదయో ద్విజ |
తవాగమనజః కృత్స్నో ధర్మశ్చానుత్తమో మమ ||

57

ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం
శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్ |
ప్రథితగుణయశా గుణైర్విశిష్టః
పరమ ఋషిః పరమం జగామ హర్షమ్ ||

58

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టాదశః సర్గః ||

Balakanda Sarga 18 Meaning In Telugu

దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ హవిర్భాగములను తీసుకొని దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. పత్నీ సమేతంగా అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. తరువాత ఋష్య శృంగుడు తన భార్య శాంతతోనూ, రోమపాదుని తోనూ అంగదేశము నకు వెళ్లిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురు చూస్తున్నాడు.

యజ్ఞము పూర్తి అయి ఒక సంవత్సరము గడిచింది. మరలా చైత్రమాసము వచ్చింది. వసంత ఋతువులో, చైత్రమాసములో, పునర్వసు నక్షత్రము నాడు, నవమి తిథి యందు, ఐదు గ్రహములు ఉచ్ఛ స్థానములో ఉండగా, కర్కాటక లగ్నమందు, కౌసల్యాదేవి గర్భవాసమున, సర్వలక్షణ సమన్వితుడు, సకల లోకములచే పూజింప తగినవాడు, విష్ణువు యొక్క ప్రథమ అంశ ఐన వాడు, మహాభాగుడు, ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన రాముడు జన్మించాడు.

విష్ణువులో నాల్గవభాగము అయిన వాడు, సత్యవంతుడు, పరాక్రమ వంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయీ గర్భ వాసమున జన్మించాడు.

సర్వ అస్త్ర కుశలురు, వీరులు, విష్ణువులో నాలుగవ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషా నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో సుమిత్రా గర్భ వాసాన జన్మించారు.

ఆ ప్రకారంగా దశరథునకు ముగ్గురు భార్యల యందు నలుగురు కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేసారు. దేవ దుందుభులు మోగాయి. అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేసాడు. పారితోషికాలు ఇచ్చాడు.

పదకొండవ రోజున నామకరణ మహోత్సవము జరిగింది. జ్యేష్ట పుత్రునకు రాముడు అనీ, తరువాత పుట్టిన కైకేయి సుతునకు భరతుడు అనీ, తరువాత పుట్టిన సుమిత్రా నందనులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనీ కుల గురువు, పురోహితుడు అయిన వసిష్టుడు నామకరణం చేసాడు. ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు, అయోధ్యా పౌరులకు, జానపదులకు, సంతర్పణలు చేసాడు. వారికి ఎన్నో కానుకలు, దక్షిణలు ఇచ్చాడు.

తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణము తరువాత జరిగే అన్ని సంస్కారములు యధావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు.

దశరధుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు. రాముడు గజములు, అశ్వములు, రథముల మీద ఎక్కియుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు. రాముడు ధనుర్వేదము నందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు. తండ్రికి సేవ చెయ్యడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవాడు రాముడు.

రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచి పెట్టి క్షణం కూడా ఉండే వాడు కాదు. చూచేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కానీ, ప్రాణము ఒకటే అన్నట్టు ఉండేవాళ్లు. అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడంది ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రిళ్లు కూడా లక్ష్మణుడు పక్కన లేనిది నిద్రపోయేవాడు కాదు. ఆహార, నిద్రా, విహారలలో రాముడు లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనుస్సు చేత పట్టుకొని అన్న వెంట రక్షణగా వెళ్లేవాడు.

రామ లక్ష్మణులు ఇలా ఉంటే, భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన నలుగురు కుమారులను చూచుకొని దశరథుడు పొంగిపోయేవాడు. నా కన్న అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు.

ఇంతలో రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. నలుగురికీ వివాహములు చేయవలెనని సంకల్పించాడు దశరథుడు. పురోహితులతోనూ, బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా, ఒక రోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకొన్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చి సత్కరించాడు. ఉచితాసనము మీద ఆసీనుని చేసాడు.

“ఓ దశరథ మహారాజా! నీ రాజ్యములో ప్రజలందరూ క్షేమమే కదా! నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా! నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా! నీ సామంత రాజులు నీకు అణిగి మణిగి ఉన్నారు కదా! నీకు శత్రుభయము లేదు కదా! నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞ యాగములు చేయుచున్నావా! ” అని అడిగాడు. తరువాత దశరథుని ఆస్థానములో ఉన్న వసిష్టుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేసాడు. అందరి క్షేమ సమాచారములు తెలుసుకొన్నాడు విశ్యామిత్రుడు.

” ఓ విశ్వామిత్ర మహర్షీ! నీరాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన అందరమూ క్షేమముగా ఉన్నాము. తమరు రాజర్షులు, బ్రహ్మర్షులు. మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమి! సెలవివ్వండి! అది ఎంతటి క్లిష్టతరమైన కార్మము అయినను నెరవేరుస్తాను. ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు.” అని వినయంగా అడిగాడు దశరథుడు.

దశరథుడు పలికిన మాటలు వినిన విశ్యామిత్రుడు ఎంతో సంతోషించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదునెనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ ఏకోనవింశః సర్గః (19) >>

Balakanda Sarga 19 In Telugu – బాలకాండ ఏకోనవింశః సర్గః

Balakanda Sarga 19 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము.  బాలకాండ లోని ఏకోనవింశః సర్గలో, విశ్వామిత్ర మహర్షి దశరథుడు తాను నిర్వహిస్తున్న వైదిక కర్మను నిరంతరం భంగపరిచే రాక్షసుల నుండి రక్షించడానికి రాముడిని పంపమని అడుగుతాడు. తనకు మరియు దశరథుని ఆస్థానంలో ఉన్న ఇతర ఋషులకు రాముని సామర్థ్యాలు తెలుసునని మరియు రాముడు తన యుక్తవయస్సులో ఉన్నప్పటికీ, అతను రాక్షసులను సులభంగా చంపగలడని ఋషి దశరథ రాజును నొక్కి చెప్పాడు. కానీ ఈ అభ్యర్థనపై దశరథుడు కలత చెందాడు.

విశ్వామిత్రవాక్యమ్

తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్యమద్భుతవిస్తరమ్ |
హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత ||

1

సదృశం రాజశార్దూల తవైతద్భువి నాన్యథా |
మహావంశప్రసూతస్య వసిష్ఠవ్యపదేశినః ||

2

యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయమ్ |
కురుష్వ రాజశార్దూల భవ సత్యప్రతిశ్రవః ||

3

అహం నియమమాతిష్ఠే సిద్ధ్యర్థం పురుషర్షభ |
తస్య విఘ్నకరౌ ద్వౌ తు రాక్షసౌ కామరూపిణౌ ||

4

వ్రతే మే బహుశశ్చీర్ణే సమాప్త్యాం రాక్షసావిమౌ |
[* మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ | *]
తౌ మాంసరుధిరౌఘేణ వేదిం తామభ్యవర్షతామ్ ||

5

అవధూతే తథాభూతే తస్మిన్నియమనిశ్చయే |
కృతశ్రమో నిరుత్సాహస్తస్మాద్దేశాదపాక్రమే ||

6

న చ మే క్రోధముత్స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ |
తథాభూతా హి సా చర్యా న శాపస్తత్ర ముచ్యతే ||

7

స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమమ్ |
కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి ||

8

శక్తో హ్యేష మయా గుప్తో దివ్యేన స్వేన తేజసా |
రాక్షసా యే వికర్తారస్తేషామపి వినాశనే ||

9

శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయః |
త్రయాణామపి లోకానాం యేన ఖ్యాతిం గమిష్యతి ||

10

న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథంచన |
న చ తౌ రాఘవాదన్యో హంతుముత్సహతే పుమాన్ ||

11

వీర్యోత్సిక్తౌ హి తౌ పాపౌ కాలపాశవశం గతౌ |
రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః ||

12

న చ పుత్రకృతం స్నేహం కర్తుమర్హసి పార్థివ |
అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ ||

13

అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ |
వసిష్ఠోఽపి మహాతేజా యే చేమే తపసి స్థితాః ||

14

యది తే ధర్మలాభం చ యశశ్చ పరమం భువి |
స్థిరమిచ్ఛసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి ||

15

యద్యభ్యనుజ్ఞాం కాకుత్స్థ దదతే తవ మంత్రిణః |
వసిష్ఠప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ ||

16

అభిప్రేతమసంసక్తమాత్మజం దాతుమర్హసి |
దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనమ్ ||

17

నాత్యేతి కాలో యజ్ఞస్య యథాఽయం మమ రాఘవ |
తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృథాః ||

18

ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః |
విరరామ మహాతేజా విశ్వామిత్రో మహామునిః ||

19

స తన్నిశమ్య రాజేంద్రో విశ్వామిత్రవచః శుభమ్ |
శోకమభ్యాగమత్తీవ్రం వ్యషీదత భయాన్వితః ||

20

ఇతి హృదయమనోవిదారణం
మునివచనం తదతీవ శుశ్రువాన్ |
నరపతిరగమద్భయం మహ-
-ద్వ్యథితమనాః ప్రచచాల చాసనాత్ ||

21

దశరథుని చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు.

” ఓ దశరథ మహారాజా! ఇక్ష్వాకు వంశంలో పుట్టి, వసిష్ఠుని పురోహితుని గా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను. జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో. నేను ఒక సిద్ధికొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కాని ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు. నేను పూనిన వ్రతము సమాప్తి అయ్యే కాలములో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను. నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను. కానీ వ్రత సమయములో కోపము తెచ్చుకోకూడదు. శపించకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు, మహావీరుడు అయిన రాముని నాకు ఇమ్ము. రాముడు ఆ
రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడౌతాడు. ఆ మారీచ సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు. నీవు పుత్ర వ్యామోహముతో వెనకాడకుము. నీ రాముని కి ఏం అపకారము కలగకుండా నీకు అప్పచెబుతాను.

ఓ దశరథ మహారాజా! రాముని గురించి నీకన్నా నాకు వసిష్ఠునకు మాత్రమే ఎక్కువగా తెలుసు. నీకు, నీ కుమారుడు రాముడు సామాన్యుడు గా కనపడుతున్నాడు. కాని రాముని అసలు స్వరూపము మా వంటి తపశ్శాలులకు మాత్రమే తెలుసు. ఓ రాజా! నీవు ధర్మాత్ముడవైతే, నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలెనంటే రాముని నా వెంట పంపు. నీ పురోహితుడు వసిష్ఠుని, మంత్రులను సంప్రదించి రాముని నా వెంట పంపు. కాని తొందరగా పంపు. ఎందుకంటే నా యాగము పదిదినములు జరుగుతుంది. ఆ పది దినములు రాముడు నా వెంట ఉండాలి. కాబట్టి సమయము మించి పోకుండా ఒక నిర్ణయము తీసుకో. నీకు క్షేమం కలుగుతుంది.” అని పలికాడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముని పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటు లాగా తగిలాయి. సింహాసనము మీద కూర్చోలేకపోయాడు దశరథుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పందొమ్మిదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ వింశః సర్గః (20) >>

Ayodhya Kanda Sarga 15 In Telugu – అయోధ్యాకాండ పంచదశః సర్గః

Ayodhya Kanda Sarga 15

“రామాయణం” లో అయోధ్యాకాండ పంచదశః సర్గం (15వ సర్గ)లో, రాముడు, సీత మరియు లక్ష్మణులు గంగానది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ, గౌహ్నుడు వారిని కలుస్తాడు. గౌహ్నుడు రాముని ప్రాముఖ్యతను తెలుసుకొని, తన సేవలను అర్పిస్తాడు. గౌహ్నుడు తన పడవలో రాముడు, సీత మరియు లక్ష్మణులను నదిని దాటిస్తాడు. నది దాటిన తర్వాత, రాముడు తన భవిష్యత్ ప్రణాళికలను చర్చిస్తాడు, దండకారణ్యంలో వాసం చేయాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గలో రాముడి ధైర్యం, విధేయత, మరియు ధర్మపరమైన కట్టుబాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. త్రయం గంగానది దాటి తమ వనవాసాన్ని కొనసాగిస్తారు.

సుమంత్రప్రేషణమ్

తే తు తాం రజనీముష్య బ్రాహ్మణా వేదపారగాః |
ఉపతస్థురుపస్థానం సహ రాజపురోహితాః || ౧ ||

అమాత్యా బలముఖ్యాశ్చ ముఖ్యా యే నిగమస్య చ |
రాఘవస్యాభిషేకార్థే ప్రీయమాణాస్తు సంగతాః || ౨ ||

ఉదితే విమలే సూర్యే పుష్యే చాభ్యాగతేఽహని |
లగ్నే కర్కటకే ప్రాప్తే జన్మ రామస్య చ స్థితే || ౩ ||

అభిషేకాయ రామస్య ద్విజేంద్రైరుపకల్పితమ్ |
కాంచనా జలకుంభాశ్చ భద్రపీఠం స్వలంకృతమ్ || ౪ ||

రథశ్చ సమ్యగాస్తీర్ణో భాస్వతా వ్యాఘ్రచర్మణా |
గంగాయమునయోః పుణ్యాత్సంగమాదాహృతం జలమ్ || ౫ ||

యాశ్చాన్యాః సరితః పుణ్యా హ్రదాః కూపాః సరాంసి చ |
ప్రాగ్వాహాశ్చోర్ధ్వవాహాశ్చ తిర్యగ్వాహాః సమాహితాః || ౬ ||

తాభ్యశ్చైవాహృతం తోయం సముద్రేభ్యశ్చ సర్వశః |
సలాజాః క్షీరిభిశ్ఛన్నాః ఘటాః కాంచనరాజతాః || ౭ ||

పద్మోత్పలయుతా భాంతి పూర్ణాః పరమవారిణా |
క్షౌద్రం దధి ఘృతం లాజాః దర్భాః సుమనసః పయః || ౮ ||

వేశ్యాశ్చైవ శుభాచారాః సర్వాభరణభూషితాః |
చంద్రాంశువికచప్రఖ్యం కాంచనం రత్నభుషితమ్ || ౯ ||

సజ్జం తిష్ఠతి రామస్య వాలవ్యజనముత్తమమ్ |
చంద్రమండలసంకాశమాతపత్రం చ పాండరమ్ || ౧౦ ||

సజ్జం ద్యుతికరం శ్రీమదభిషేకపురస్కృతమ్ |
పాండరశ్చ వృషః సజ్జః పాండరోఽశ్వశ్చ సుస్థితః || ౧౧ || [సంస్థితః]

ప్రసృతశ్చ గజః శ్రీమానౌపవాహ్యః ప్రతీక్షతే |
అష్టౌ చ కన్యా రుచిరాః సర్వాభరణభూషితాః || ౧౨ || [మాంగళ్యాః]

వాదిత్రాణి చ సర్వాణి వందినశ్చ తథాఽపరే |
ఇక్ష్వాకూణాం యథా రాజ్యే సంభ్రియేతాభిషేచనమ్ || ౧౩ ||

తథా జాతీయమాదాయ రాజపుత్రాభిషేచనమ్ |
తే రాజవచనాత్తత్ర సమవేతా మహీపతిమ్ || ౧౪ ||

అపశ్యంతోఽబ్రువన్కో ను రాజ్ఞో నః ప్రతివేదయేత్ |
న పశ్యామశ్చ రాజానముదితశ్చ దివాకరః || ౧౫ ||

యౌవరాజ్యాభిషేకశ్చ సజ్జో రామస్య ధీమతః |
ఇతి తేషు బ్రువాణేషు సార్వభౌమాన్మహీపతీన్ || ౧౬ ||

అబ్రవీత్తానిదం వాక్యం సుమంత్రో రాజసత్కృతః | [సర్వాన్]
రామం రాజ్ఞో నియోగేన త్వరయా ప్రస్థితోఽస్మ్యహమ్ || ౧౭ ||

పూజ్యా రాజ్ఞో భవంతస్తు రామస్య చ విశేషతః |
అహం పృచ్ఛామి వచనాత్సుఖమాయుష్మతామహమ్ || ౧౮ ||

రాజ్ఞః సంప్రతిబుధ్యస్య యచ్చాగమనకారణమ్ |
ఇత్యుక్త్వాంతఃపురద్వారమాజగామ పురాణవిత్ || ౧౯ ||

సదాఽసక్తం చ తద్వేశ్మ సుమంత్రః ప్రవివేశ హ |
తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్య స విశాంపతేః || ౨౦ ||

శయనీయం నరేంద్రస్య తదసాద్య వ్యతిష్ఠత |
సోఽత్యాసాద్య తు తద్వేశ్మ తిరస్కరణిమంతరా || ౨౧ ||

ఆశీర్భిర్గుణయుక్తాభిరభితుష్టావ రాఘవమ్ |
సోమసూర్యౌ చ కాకుత్స్థ శివవైశ్రవణావపి || ౨౨ ||

వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రదిశంతు తే |
గతా భగవతీ రాత్రిః కృతం కృత్యమిదం తవ || ౨౩ ||

బుధ్యస్వ నృపశార్దూల కురు కార్యమనంతరమ్ |
బ్రాహ్మణా బలముఖ్యాశ్చ నైగమాశ్చాగతా నృప || ౨౪ ||

దర్శనం ప్రతికాంక్షంతే ప్రతిబుధ్యస్వ రాఘవ |
స్తువంతం తం తదా సూతం సుమంత్రం మంత్రకోవిదమ్ || ౨౫ ||

ప్రతిబుధ్య తతో రాజా ఇదం వచనమబ్రవీత్ |
రామమానయ సూతేతి యదస్యభిహితోఽనయా || ౨౬ ||

కిమిదం కారణం యేన మమాజ్ఞా ప్రతిహన్యతే |
న చైవ సంప్రసుప్తోఽహమానయేహాశు రాఘవమ్ || ౨౭ ||

ఇతి రాజా దశరథః సూతం తత్రాన్వశాత్పునః |
స రాజవచనం శ్రుత్వా శిరసా ప్రణిపత్య తమ్ || ౨౮ || [ప్రతిపూజ్య]

నిర్జగామ నృపావాసాన్మన్యమానః ప్రియం మహత్ |
ప్రపన్నో రాజమార్గం చ పతాకాధ్వజశోభితమ్ || ౨౯ ||

హృష్టః ప్రముదితః సూతో జగామాశు విలోకయన్ |
స సూతస్తత్ర శుశ్రావ రామాధికరణాః కథాః || ౩౦ ||

అభిషేచనసంయుక్తాః సర్వలోకస్య హృష్టవత్ |
తతో దదర్శ రుచిరం కైలాసశిఖరప్రభమ్ || ౩౧ ||

రామవేశ్మ సుమంత్రస్తు శక్రవేశ్మసమప్రభమ్ |
మహాకవాటవిహితం వితర్దిశతశోభితమ్ || ౩౨ ||

కాంచనప్రతిమైకాగ్రం మణివిద్రుమశోభితమ్ | [తోరణమ్]
శారదాభ్రఘనప్రఖ్యం దీప్తం మేరుగుహోపమమ్ || ౩౩ ||

మణిభిర్వరమాల్యానాం సుమహద్భిరలంకృతమ్ |
ముక్తామణిభిరాకీర్ణం చందనాగరుధూపితమ్ || ౩౪ ||

గంధాన్మనోజ్ఞాన్విసృజద్దార్దురం శిఖరం యథా |
సారసైశ్చ మయూరైశ్చ నినదద్భిర్విరాజితమ్ || ౩౫ ||

సుకృతేహామృగాకీర్ణం సుకీర్ణం భిత్తిభిస్తథా |
మనశ్చక్షుశ్చ భూతానామాదదత్తిగ్మతేజసా || ౩౬ ||

చంద్రభాస్కరసంకాశం కుబేరభవనోపమమ్ |
మహేంద్రధామప్రతిమం నానాపక్షిసమాకులమ్ || ౩౭ ||

మేరుశృంగసమం సూతో రామవేశ్మ దదర్శ హ |
ఉపస్థితైః సమాకీర్ణం జనైరంజలికారిభిః || ౩౮ ||

ఉపాదాయ సమాక్రాంతైస్తథా జానపదైర్జనైః |
రామాభిషేకసుముఖైరున్ముఖైః సమలంకృతమ్ || ౩౯ ||

మహామేఘసమప్రఖ్యముదగ్రం సువిభూషితమ్ |
నానారత్నసమాకీర్ణం కుబ్జకైరాతకావృతమ్ || ౪౦ ||

స వాజియుక్తేన రథేన సారథి-
-ర్నరాకులం రాజకులం విలోకయన్ |
వరూథినా రామగృహాభిపాతినా
పురస్య సర్వస్య మనాంసి హర్షయన్ || ౪౧ || [రంజయత్]

తతః సమాసాద్య మహాధనం మహ-
-త్ప్రహృష్టరోమా స బభూవ సారథిః |
మృగైర్మయూరైశ్చ సమాకులోల్బణం
గృహం వరార్హస్య శచీపతేరివ || ౪౨ ||

స తత్ర కైలాసనిభాః స్వలంకృతాః
ప్రవిశ్య కక్ష్యాస్త్రిదశాలయోపమాః |
ప్రియాన్నరాన్రామమతే స్థితాన్బహూ-
-నపోహ్య శుద్ధాంతముపస్థితో రథీ || ౪౩ ||

స తత్ర శుశ్రావ చ హర్షయుక్తాః
రామాభిషేకార్థయుతా జనానామ్ |
నరేంద్రసూనోరభిమంగళార్థాః
సర్వస్య లోకస్య గిరః ప్రహృష్టః || ౪౪ ||

మహేంద్రసద్మప్రతిమం తు వేశ్మ
రామస్య రమ్యం మృగపక్షిజుష్టమ్ |
దదర్శ మేరోరివ శృంగముచ్చం
విభ్రాజమానం ప్రభయా సుమంత్రః || ౪౫ ||

ఉపస్థితైరంజలికారకైశ్చ
సోపాయనైర్జానపదైశ్చ మర్త్యః |
కోట్యా పరార్ధైశ్చ విముక్తయానైః
సమాకులం ద్వారపథం దదర్శ || ౪౬ ||

తతో మహామేఘమహీధరాభం
ప్రభిన్నమత్యంకుశమప్రసహ్యమ్ |
రామౌపవాహ్యం రుచిరం దదర్శ
శత్రుంజయం నాగముదగ్రకాయమ్ || ౪౭ ||

స్వలంకృతాన్సాశ్వరథాన్సకుంజరా-
-నమాత్యముఖ్యాన్ శతశశ్చ వల్లభాన్ |
వ్యపోహ్య సూతః సహితాన్సమంతతః
సమృద్ధమంతఃపురమావివేశ || ౪౮ ||

తదద్రికూటాచలమేఘసన్నిభం
మహావిమానోత్తమవేశ్మసంఘవత్ |
అవార్యమాణః ప్రవివేశ సారథిః
ప్రభూతరత్నం మకరో యథాఽర్ణవమ్ || ౪౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశః సర్గః || ౧౫ ||

Ayodhya Kanda Sarga 15 Meaning In Telugu

వేదపారంగతులైన బ్రాహ్మణులు పొద్దుటే పట్టాభిషేక మండపమునకు చేరుకున్నారు. అయోధ్యా నగర మంత్రులు, సేనాధిపతులు, పురప్రముఖులు అందరూ పట్టాభిషేక మంటపము వద్దకు వచ్చారు. అందరి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరు తున్నారు.

రాముని జన్మ లగ్నము కర్కాటకము. అదే లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో రాముని పట్టాభిషిక్తుని చేయవలెనని వేద పండితులు నిశ్చయం చేసారు. పట్టాభిషేక మంటపం చుట్టు పూర్ణకుంభాలు పెట్టబడి ఉన్నాయి. రాముడు ఎక్కడానికి స్వర్ణ రథం ఏర్పాటు చేసారు. రాముడు కూర్చోడానికి పులి చర్మము పరిచారు. అక్కడ ఉన్న బంగారు కలశములలో, గంగానదీ, యమునా నదీ, సరస్వతీ నదీ కలిసే చోట (త్రివేణీ సంగమము….ప్రస్తుతము అలహాబాద్) నుండి సేకరించిన జలము, ఇతర పుణ్యనదుల నుండీ, సరస్సులనుండీ, నదీనదముల నుండి, నాలుగు సముద్రముల నుండీ తెచ్చిన జలములను నింపి పట్టాభిషేకమునకు కావలసిన లాజలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పూలు, దర్భలు అన్నీ మండపము దగ్గర బంగారు పాత్రలలో అమర్చి ఉన్నాయి. సర్వాభరణ భూషితలైన వేశ్యలు అటూ ఇటూ తిరుగుతూ అన్ని పనులలో పాలుపంచుకుంటున్నారు. రాముడు పట్టాభిషిక్తుడు కాగానే, సింహాసనము మీద కూర్చోగానే ఆయనకు అటు ఇటు వింజామరలు వేయుటకు రత్నఖచితమైన వింజామరలు సిద్ధంగా ఉంచారు. అయోధ్య సామ్రాజ్యమునకు కాబోయే చక్రవర్తి అయిన రామునికి పట్టుటకు పాలనురగలాగా తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయే పట్టు గొడుగు సిద్ధంగా ఉంచారు.

యువరాజు రాముని సేవించుటకు తెల్లని ఎద్దు, తెల్లటి గుర్రము, మదము కారే ఏనుగు రాజద్వారము బయట కట్టివేయబడి ఉన్నాయి. పట్టాభిషేక సమయంలో రాముని పక్కన ఉండటానికి ఎనిమందిమంది కన్యముత్తయిదువలు సకలమైన అలంకారములు చేసుకొని పట్టాభిషేక మంటపము దగ్గర నిలబడి ఉన్నారు. పట్టాభిషేక సమయములో మ్రోగించుటకు రకరకాల వాద్యములు, వాద్యకారులు సిద్ధంగా ఉన్నారు. రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాగానే రాముని, రాముని వంశములో మూల పురుషులను కీర్తించుటకు వందులు, మాగధులు ఒక పక్కగా నిలబడి ఉన్నారు.

పట్టాభిషేకమునకు కావలసిన సంభారాలు అన్నీ, అన్నివిధాలా అమర్చి ఉన్నాయి కానీ పట్టాభిషేకము నిర్వహించే దశరథ మహారాజు, పట్టాభిషేకము జరిపించుకొనే రాముడు అక్కడలేరు. వారి రాక కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు.

“సుముహూర్తము సమీపిస్తూ ఉంది. ఇంకా దశరథుడు, రాముడు, రాజమాతలు రాలేదు. ఏమయి ఉంటుంది. అసలు పట్టాభిషేకము జరుగుతుందా! లేదా!” అని వారిలో వారే అనుకుంటున్నారు.

ఇంకా కొంతమంది “మనమంతా పట్టాభిషేకము కొరకు అన్ని సంభారములు సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నాము. దశరథమహారాజు ఇంకా రాలేదు. మనమంతా సిద్ధముగా ఉన్నట్టు దశరథమహారాజుకు ఎవరిద్వారా తెలియపరచాలి.” అని తమలో తాము అనుకుంటున్నారు. ఇంతలో సుమంత్రుడు అక్కడకు చేరుకున్నాడు. అక్కడ వేచి ఉన్న సామంతులను, పురప్రముఖులు సుమంత్రుని చూచి ఇలా అన్నారు.
“సుమంత్రా! ఏమి ఆలస్యము. రామ పట్టాభిషేకమునకు సుముహూ ర్తము మించిపోడుతున్నది. ఇంకా మహారాజు గారు రాలేదు. కారణం తెలియడం లేదు. నీ కేమైనా తెలుసునా!” అని అడిగారు. దానికి సుమంత్రుడు ఇలా అన్నాడు.

“దశరథమహారాజుగారి ఆజ్ఞ ప్రకారము నేను రాముని వద్దకు వెళుతున్నాను. మీరు అన్నట్టుగా సుముహూర్తము సమీపిస్తూ ఉంది. మీరందరూ సర్వ సంభారములతో ఎదురుచూస్తున్నారు. దశరథీ “మహారాజుగారు ఇంకా ఇక్కడకు రాలేదు. రాజుగారు పట్టాభిషేకమునకు సుముఖంగా ఉన్నాడా లేదా అన్న విషయం, రాజుగారు ఇంకా ఇక్కడకు రాకపోవ డానికి కారణము నాకూ తెలియదు. ఇప్పుడే నేను మహారాజు గారి వద్దకు వెళ్లి మీ మాటగా నేను మహారాజుగారిని అడుగు తాను. మీరందరూ దయతో ఓపికతో వేచిఉండండి.” అని పలికాడు.

వెంటనే సుమంత్రుడు రాజాంత: పురమునకు వెళ్లాడు. దశరథుని శయన మందిరములోకి ప్రవేశించాడు. బయట నిలబడి దశరథుని, ఆయన వంశమును స్తుతించాడు. ‘ఓ దశరథమహారాజా! తమకు జయమగుగాక! ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, కుబేరుడు వారి కృపను తమ మీద ప్రసరింతురు గాక! రాజేంద్రా! పట్టాభిషేక ముహూర్తము సమీపించుచున్నది. బ్రాహ్మణులు, సామంతులు, పురప్రముఖులు పట్టాభిషేకమంటపము వద్ద తమరి రాక కోసరము వేచి ఉన్నారు. తమరు వెంటనే అక్కడకు రావలసినది..” అని పలికాడు.

అప్పుడు దశరథుడు బయటకు వచ్చి సుమంత్రుని చూచి “రాముని ఇక్కడకు తీసుకొని రమ్మని ఈమె నీకు చెప్పింది కదా! నీవు రాముని ఇక్కడకు ఎందుకు తీసుకొని రాలేదు. నా ఆజ్ఞ ఎందుకు పాటించ లేదు. నేను చెబితే ఒకటి కైక చెబితే ఒకటీనా. నేను నిద్రించుటలేదు. మేలుకొనే ఉన్నాను. నన్ను ఎవరూ మేలుకొలుప నవసరము లేదు. నీవు వెంటనే రాముని ఇక్కడకు తీసుకొని రా. వెళ్లు.” అని ఆజ్ఞాపించాడు దశరథుడు. ఇంక చేసేది లేక సుమంత్రుడు రాజాజ్ఞ పాలించుటకు రాజాంతఃపురము నుండి బయటకు వచ్చాడు. రాముని రాజభవనము వద్దకు వచ్చాడు.

రాముని మందిరమును కూడా శోభాయమానంగా అలంక రించారు. రాముని భవనము ఎదుట కూడా ప్రజలు గుమి గూడి రాముని చూడటానికి వేచి ఉన్నారు. సుమంత్రుని రథము వారిని దాటుకుంటూ రామ మందిరము వద్దకు సమీపించింది. అయోధ్యా పౌరులు, జానపదులు, రాముని మిత్రులు అప్పటికే అక్కడకు చేరుకున్నారు. రాముని పట్టాభిషేక మంటపమునకు తీసుకొని పోవుటకు ఏర్పాటు చేయబడిన సుందరంగా అలంకరించిన మద గజము (మదించిన ఏనుగు) ద్వారము వద్ద వేచి ఉన్నది. వీరందరినీ దాటుకుంటా సుమంత్రుడు రాముని అంతఃపురములోకి ప్రవేశించాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ షోడశః సర్గః (16) >>

Balakanda Sarga 16 In Telugu – బాలకాండ షోడశః సర్గః

Balakanda Sarga 16 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండలోని 16వ సర్గ. ఈ సర్గలో, విష్వామిత్రుడు రామ-లక్ష్మణులను తనతో తీసుకువెళ్లి తాటకావనానికి చేరుకుంటాడు. తాటకావనం ఒక దివ్యమైన ప్రదేశం, కానీ తాటక అనే రాక్షసి వలన అది శూన్యంగా మారింది. విష్వామిత్రుడు రాముడిని తాటకను సంహరించమని ఆజ్ఞాపిస్తాడు.

పాయసోత్పత్తిః

తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః |
జానన్నపి సురానేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||

1

ఉపాయః కో వధే తస్య రాక్షసాధిపతేః సురాః |
యమహం తం సమాస్థాయ నిహన్యామృషికంటకమ్ ||

2

ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుర్విష్ణుమవ్యయమ్ |
మానుషీం తనుమాస్థాయ రావణం జహి సంయుగే ||

3

స హి తేపే తపస్తీవ్రం దీర్ఘకాలమరిందమ |
యేన తుష్టోఽభవద్బ్రహ్మా లోకకృల్లోకపూర్వజః ||

4

సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుః |
నానావిధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్ ||

5

అవజ్ఞాతాః పురా తేన వరదానేన మానవాః |
ఏవం పితామహాత్తస్మాద్వరం ప్రాప్య స దర్పితః ||

6 [గర్వితః]

ఉత్సాదయతి లోకాంస్త్రీంస్త్రయశ్చాప్యపకర్షతి |
తస్మాత్తస్య వధో దృష్టో మానుషేభ్యః పరంతప ||

7

ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్ |
పితరం రోచయామాస తదా దశరథం నృపమ్ ||

8

స చాప్యపుత్రో నృపతిస్తస్మిన్కాలే మహాద్యుతిః |
అయజత్పుత్రియామిష్టిం పుత్రేప్సురరిసూదనః ||

9

స కృత్వా నిశ్చయం విష్ణురామంత్ర్య చ పితామహమ్ |
అంతర్ధానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః ||

10

తతో వై యజమానస్య పావకాదతులప్రభమ్ |
ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలమ్ ||

11

కృష్ణం రక్తాంబరధరం రక్తాక్షం దుందుభిస్వనమ్ |
స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రుప్రవరమూర్ధజమ్ ||

12

శుభలక్షణసంపన్నం దివ్యాభరణభూషితమ్ |
శైలశృంగసముత్సేధం దృప్తశార్దూలవిక్రమమ్ ||

13

దివాకరసమాకారం దీప్తానలశిఖోపమమ్ |
తప్తజాంబూనదమయీం రాజతాంతపరిచ్ఛదామ్ ||

14

దివ్యపాయససంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియామ్ |
ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ ||

15

సమవేక్ష్యాబ్రవీద్వాక్యమిదం దశరథం నృపమ్ |
ప్రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నృప ||

16

తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలిః |
భగవన్ స్వాగతం తేఽస్తు కిమహం కరవాణి తే ||

17

అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరోఽబ్రవీత్ |
రాజన్నర్చయతా దేవానద్య ప్రాప్తమిదం త్వయా ||

18

ఇదం తు నరశార్దూల పాయసం దేవనిర్మితమ్ |
ప్రజాకరం గృహాణ త్వం ధన్యమారోగ్యవర్ధనమ్ ||

19

భార్యాణామనురూపాణామశ్నీతేతి ప్రయచ్ఛ వై |
తాసు త్వం లప్స్యసే పుత్రాన్యదర్థం యజసే నృప ||

20

తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగృహ్య తామ్ |
పాత్రీం దేవాన్నసంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీమ్ ||

21

అభివాద్య చ తద్భూతమద్భుతం ప్రియదర్శనమ్ |
ముదా పరమయా యుక్తశ్చకారాభిప్రదక్షిణమ్ ||

22

తతో దశరథః ప్రాప్య పాయసం దేవనిర్మితమ్ |
బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తమివాధనః ||

23

తతస్తదద్భుతప్రఖ్యం భూతం పరమభాస్వరమ్ |
సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత ||

24

హర్షరశ్మిభిరుద్ద్యోతం తస్యాంతఃపురమాబభౌ |
శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంశుభిః ||

25

సోంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్ |
పాయసం ప్రతిగృహ్ణీష్వ పుత్రీయం త్విదమాత్మనః ||

26

కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా |
అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః ||

27

కైకేయ్యై చావశిష్టార్ధం దదౌ పుత్రార్థకారణాత్ |
ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమమ్ ||

28

అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః |
ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్ ||

29

తాస్త్వేతత్పాయసం ప్రాప్య నరేంద్రస్యోత్తమాః స్త్రియః |
సమ్మానం మేనిరే సర్వాః ప్రహర్షోదితచేతసః ||

30

తతస్తు తాః ప్రాశ్య తదుత్తమస్త్రియో
మహీపతేరుత్తమపాయసం పృథక్ |
హుతాశనాదిత్య సమానతేజస-
-శ్చిరేణ గర్భాన్ప్రతిపేదిరే తదా ||

31

తతస్తు రాజా ప్రసమీక్ష్య తాః స్త్రియః
ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః |
బభూవ హృష్టస్త్రిదివే యథా హరిః
సురేంద్రసిద్ధర్షిగణాభిపూజితః ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షోడశః సర్గః ||

Balakanda Sarga 16 Meaning In Telugu

విష్ణు మూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు.

“ ఓ దేవతలారా! నేను మనుష్యునిగా అవతారము ఎత్తుతాను. కాని లోక కంటకుడైన రావణుని ఎలా సంహరించాలి. దానికి ఉ పాయము ఏమి?” అని అడిగాడు. దానికి దేవతలు ఇలాఅన్నారు.
” ఓ మహావిష్ణూ! నీవు మనుష్య శరీరమును ధరించి, రావణుని తో యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే…… రావణాసురుడు చాలాకాలము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. ‘మనుషులతో తప్ప అతనికి వేరే వారిచేత మరణభయము లేకుండు గాక!’ అని వరం ప్రసాదించాడు. మానవులు బలహీనులని, వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలము మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యము లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి.” అని వివరంగా చెప్పారు దేవతలు. దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకొని, విష్ణుమూర్తి అంతర్థానము అయ్యాడు.

అయోధ్యలో దశరధుడు పుత్రులకొరకు యాగము చేస్తున్నాడు. ఆ హెూమ గుండము నుండి తేజోవంతుడైన, మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములను ధరించిన వాడు, రక్త వర్ణముకల ముఖము కలవాడు, దుందుభి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించిన వాడు, పర్వతశిఖరము మాదిరి ధృఢమైన వాడు, పెద్దపులి వంటి పరాక్రమము కలవాడు, సూర్యుని వంటి తేజస్సుకలవాడు, భగభగమండే అగ్ని శిఖల మాదిరి వెలుగు చున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో, దానిమీద ఒక వెండి మూతతో, ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో, ఒక భూతా కారము ఆవిర్భవించింది. ఆ భూతమును చూచి దశరధుడు చేతులు జోడించి నమస్కరించాడు.

“ఓమహానుభావా! తమరు ఎవరు? తమరికి నేను ఏమి సేవ చేయగలను.” అని ప్రార్థించాడు.

ఆ భూతము దశరధుని చూచి ఇలా పలికింది.

“ఓ దశరధమహారాజా! నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతలచేత తయారుచేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్షును, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది.” అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరధుడికి ఇచ్చాడు.

దశరధుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించాడు. తరువాత ఆ భూతము అంతర్ధానము అయింది.

దశరధుడు సంతోషముతో ఆ పాయన అంతఃపురములో ప్రవేశించాడు. ఆ పాయసములో సగ భాగము కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసములో సగభాగం (అనగా నాల్గవ భాగము) సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం (అనగా ఎనిమిదవ భాగము) కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం (అనగా మిగిలిపోయిన ఎనిమిదవ భాగము) ఏంచెయ్యాలా అని ఆలోచించి, దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు.

ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు. కాని దశరధుని భార్యలు తమకు పాయన పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏ మాత్రం చింతింపక, పాయసము దొరికి తమకు పుత్రసంతానము కలగడమే మహాభాగ్యం అనుకొని సంతోషించారు.

కాల క్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయిలు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదహారవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ సప్తదశః సర్గః (17) >>

Balakanda Sarga 17 In Telugu – బాలకాండ సప్తదశః సర్గః

Balakanda Sarga 17 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తదశః సర్గలో, రావణుని సంహరించడంలో రాముడికి సహాయం చేయమని బ్రహ్మ ఆదేశం మేరకు దేవతలు పూర్వీకులు వానర వీరులుగా మారారు. కోతి లాంటి వానర జాతి అనేక మంది ఖగోళ జీవులచే సంతానోత్పత్తి చేయబడింది, దీనికి విచిత్రమైన శక్తివంతమైన శరీరాకృతి మరియు రాముడికి సహాయం చేయడానికి ప్రత్యేక శక్తి ఉంది.

ఋక్షవానరోత్పత్తిః

పుత్రత్వం తు గతే విష్ణౌ రాజ్ఞస్తస్య మహాత్మనః |
ఉవాచ దేవతాః సర్వాః స్వయంభూర్భగవానిదమ్ ||

1

సత్యసంధస్య వీరస్య సర్వేషాం నో హితైషిణః |
విష్ణోః సహాయాన్బలినః సృజధ్వం కామరూపిణః ||

2

మాయావిదశ్చ శూరాంశ్చ వాయువేగసమాఞ్జవే |
నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్ విష్ణుతుల్యపరాక్రమాన్ ||

3

అసంహార్యానుపాయజ్ఞాన్ సింహసంహననాన్వితాన్ |
సర్వాస్త్రగుణసంపన్నానమృతప్రాశనానివ ||

4

అప్సరఃసు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ |
కింనరీణాం చ గాత్రేషు వానరీణాం తనూషు చ ||

5

యక్షపన్నగకన్యాసు ఋక్షివిద్యాధరీషు చ |
సృజధ్వం హరిరూపేణ పుత్రాంస్తుల్యపరాక్రమాన్ ||

6

పూర్వమేవ మయా సృష్టో జాంబవానృక్షపుంగవః |
జృంభమాణస్య సహసా మమ వక్రాదజాయత ||

7

తే తథోక్తా భగవతా తత్ప్రతిశ్రుత్య శాసనమ్ |
జనయామాసురేవం తే పుత్రాన్వానరరూపిణః ||

8

ఋషయశ్చ మహాత్మానః సిద్ధవిద్యాధరోరగాః |
చారణాశ్చ సుతాన్వీరాన్ససృజుర్వనచారిణః ||

9

వానరేంద్రం మహేంద్రాభమింద్రో వాలినమూర్జితమ్ |
సుగ్రీవం జనయామాస తపనస్తపతాం వరః ||

10

బృహస్పతిస్త్వజనయత్తారం నామ మహాహరిమ్ |
సర్వవానరముఖ్యానాం బుద్ధిమంతమనుత్తమమ్ ||

11

ధనదస్య సుతః శ్రీమాన్వానరో గంధమాదనః |
విశ్వకర్మా త్వజనయన్నలం నామ మహాహరిమ్ ||

12

పావకస్య సుతః శ్రీమాన్నీలోఽగ్నిసదృశప్రభః |
తేజసా యశసా వీర్యాదత్యరిచ్యత వానరాన్ ||

13

రూపద్రవిణసంపన్నావశ్వినౌ రూపసంమతౌ |
మైందం చ ద్వివిదం చైవ జనయామాసతుః స్వయమ్ ||

14

వరుణో జనయామాస సుషేణం నామ వానరమ్ |
శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలమ్ ||

15

మారుతస్యాత్మజః శ్రీమాన్హనుమాన్నామ వానరః |
వజ్రసంహననోపేతో వైనతేయసమో జవే ||

16

సర్వవానరముఖ్యేషు బుద్ధిమాన్బలవానపి |
తే సృష్టా బహుసాహస్రా దశగ్రీవవధే రతాః ||

17

అప్రమేయబలా వీరా విక్రాంతాః కామరూపిణః |
తే గజాచలసంకాశా వపుష్మంతో మహాబలాః ||

18

ఋక్షవానరగోపుచ్ఛాః క్షిప్రమేవాభిజజ్ఞిరే |
యస్య దేవస్య యద్రూపం వేషో యశ్చ పరాక్రమః ||

19

అజాయత సమస్తేన తస్య తస్య సుతః పృథక్ |
గోలాంగూలీషు చోత్పన్నాః కేచిత్సంమతవిక్రమాః ||

20

ఋక్షీషు చ తథా జాతా వానరాః కింనరీషు చ |
దేవా మహర్షిగంధర్వాస్తార్క్ష్యా యక్షా యశస్వినః ||

21

నాగాః కింపురుషాశ్చైవ సిద్ధవిద్యాధరోరగాః |
బహవో జనయామాసుర్హృష్టాస్తత్ర సహస్రశః ||

22

[* అధికపాఠః –
చారణాశ్చ సుతాన్ వీరాన్ ససృజుః వన చారిణః |
అప్సరస్సు చ ముఖ్యాసు తథా విద్యధరీషు చ |
నాగకన్యాసు చ తథా గంధర్వీణాం తనూషు చ |
కామరూప బలోపేతా యథా కామవిచారిణః |
*]

వానరాన్సుమహాకాయాన్సర్వాన్వై వనచారిణః |
సింహశార్దూలసదృశా దర్పేణ చ బలేన చ ||

23

శిలాప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః |
నఖదంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్రకోవిదాః ||

24

విచాలయేయుః శైలేంద్రాన్భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్ |
క్షోభయేయుశ్చ వేగేన సముద్రం సరితాం పతిమ్ ||

25

దారయేయుః క్షితిం పద్భ్యామాప్లవేయుర్మహార్ణవమ్ |
నభస్థలం విశేయుశ్చ గృహ్ణీయురపి తోయదాన్ ||

26

గృహ్ణీయురపి మాతంగాన్మత్తాన్ప్రవ్రజతో వనే |
నర్దమానాశ్చ నాదేన పాతయేయుర్విహంగమాన్ ||

27

ఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూపిణామ్ |
శతం శతసహస్రాణి యూథపానాం మహాత్మనామ్ ||

28

తే ప్రధానేషు యూథేషు హరీణాం హరియూథపాః |
బభూవుర్యూథపశ్రేష్ఠా వీరాంశ్చాజనయన్హరీన్ ||

29

అన్యే ఋక్షవతః ప్రస్థానుపతస్థుః సహస్రశః |
అన్యే నానావిధాన్ శైలాన్భేజిరే కాననాని చ ||

30

సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వాలినమ్ |
భ్రాతరావుపతస్థుస్తే సర్వే ఏవ హరీశ్వరాః ||

31

నలం నీలం హనూమంతమన్యాంశ్చ హరియూథపాన్ |
తే తార్క్ష్యబలసంపన్నాః సర్వే యుద్ధవిశారదాః ||

32

విచరంతోఽర్దయన్దర్పాత్ సింహవ్యాఘ్రమహోరగాన్ |
తాంశ్చ సర్వాన్మహాబాహుర్వాలీ విపులవిక్రమః ||

33

జుగోప భుజవీర్యేణ ఋక్షగోపుచ్ఛవానరాన్ |
తైరియం పృథివీ శూరైః సపర్వతవనార్ణవా |
కీర్ణా వివిధసంస్థానైర్నానావ్యంజనలక్షణైః ||

34

తైర్మేఘబృందాచలకూటకల్పై-
-ర్మహాబలైర్వానరయూథపాలైః |
బభూవ భూర్భీమశరీరరూపైః
సమావృతా రామసహాయహేతోః ||

35

ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలి అని నిర్ణయించుకొన్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు.

శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్లాలి. మీ మీ అంశలతో కామరూపులు, అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులు గానూ, వాయువేగముతో ప్రయాణించగలవారు గానూ అయి ఉండాలి. విష్ణువుతో సరి తూగ గల పరాక్రమ వంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతి మంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేత గానీ, ఏ ఆయుధము చేత గానీ చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసల యందు, గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే ఋక్ష శ్రేష్టుడు (ఎలుగుబంటి) నేను ఆవలించి నపుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు.” అని పలికాడు.

బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు.

దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు.

సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు.

బ్రహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు.

కుబేరుని అంశతో గంధమాధనుడు అనే వానరుడు పుట్టాడు.

అగ్ని అంశతో నీలుడు, అశ్వినీ దేవతల అంశలతో మైందుడు, ద్వివిదుడు, వరుణుని అంశతో సుషేణుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి హనుమంతుడు, ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వారనులు సృజింపబడ్డారు.

వారందరూ కాపరూపులు, బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు, బలపరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్లు, దంతములు. వారందర ఋక్షవత పర్వతము మీద నివసిస్తున్నారు.

ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహు బలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరూ శ్రీ రామునికి సహాయము చేయుటకు సృష్టింప బడ్డారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ అష్టాదశః సర్గః (18) >>

Sravana Mangala Gowri Vratham (Puja, Katha) In Telugu – శ్రావణ మంగళగౌరీ వ్రతకల్పం

Sravana Mangala Gowri Vratham In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం (Mangala Gowri Puja). ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రావణ మంగళగౌరీ వ్రత విధానము గురించి తెలుసుకుందాం…

Sravana Mangala Gowri Vratham (Puja, Katha) In Telugu

శ్రావణ మంగళగౌరీ వ్రతకల్పం

పూజా సామాగ్రి

  • పసుపు
  • కుంకుము
  • పండ్లు
  • పూలు
  • తమలపాకులు
  • ఒక్కలు
  • అగరబత్తులు
  • కర్పూరం
  • గంధం
  • అక్షతలు
  • కొబ్బరికాయ
  • నేతి దీపము
  • తైలదీపము
  • వస్త్రము (ప్రత్తితో తయారు చేయవచ్చు)
  • నాలుగు తోరములు
  • 5 జ్యోతులు
  • కత్తి
  • ఇనుపకాడ
  • నానబెట్టిన శనగలు

నైవేద్యము

కొబ్బరి, పండ్లు, పిండి వంటలు

పూజా మంటపము

పసుపుతో గౌరిని, వినాయకుడిని చేసి రెండు తమలపాకుల మీద ఉంచాలి. అవే అన్ని మంగళవారములు వాడచ్చు. నీళ్ళు, ఉద్దరిణ, హరివాణం.

సాంప్రదాయ పద్ధతులు

1. ప్రాతః కాలం లేచి ఏర్పాట్లు చేయాలి.
2. స్నానము చేసాక 100 గ్రా. బియ్యం పిండి, 10 గ్రా. బెల్లం, నీళ్ళు కలిపి గట్టి ముద్ద చేయాలి (పిష్టము). దాన్ని 5 భాగాలు చేయాలి. 5 ప్రమిదలు చేసి నెయ్యి వేసి వత్తులు వేసి దీపం వెలిగించాలి.
3. దారం మూరెడు తీసుకుని 5 వరసలు తీసి, దానికి 5 గ్రంధులు (ముడులు) వేయాలి. ముడులలో పూవులు పెట్టచ్చు. 4 తోరాలు ఇలా (1 అమ్మవారికి 2 మీకు 3 కాటుక చేసే కత్తికి 4 మొదటి వాయనం ఇచ్చే స్త్రీకి) చేయాలి.
4. తల్లికి మొదటి వాయనం ఇవ్వాలి. కుదరని పక్షంలో ఎవరైన ముత్తైదువకి ఇవ్వాలి. దక్షిణ, పసుపు, కుంకుమ రవికె గుడ్డ యిచ్చి వీలుంటే భోజనం పెట్టాలి.
5. మొదటి సంవత్సరం 5 గురికి తర్వాత 10 మందికి ఇలా పెంచు కుంటూ పోవాలి. కుదరక పోతే ఐదుగురికే ప్రతి ఏడు ఇవ్వచ్చు.
6. వాయనం ఇచ్చే స్త్రీని గౌరీగా భావించి పాదాలకు పసుపు రాసి శెనగలు, పళ్ళు, పూలు, తాంబూలం కాటుక ఇచ్చి నమస్కారం చేసి ఆశీర్వాదం పొందాలి.
7. నెయ్యి జ్యోతులు (పిష్టము) సాయంత్రంలోగా తినాలి. మీరు తినలేక పోతే 5 సువాసినులకు వాయంనంతో కూడా యిచ్చి వాళ్ళని తినమనవచ్చు.
8. 5వ సంవత్సరం పూర్తి అయ్యాక ఉద్యాపనకి 32 అరిసెలు ఒక కొత్త పాత్రలో పెట్టి రవికె గుడ్డ వాసన కట్టాలి. పసుపు, కుంకుమ, మంగళ సూత్రాలు మట్టెలు పెట్టి ఎవరైనా పెళ్ళిలో కొత్త పెళ్ళికూతురుకి వాయనం ఇవ్వాలి.
9. మొదటి మంగళవారము పుట్టింట్లో చేసుకోవాలి. కుదరని పక్షంలో వాళ్ళింట్లోనే చేసుకోవచ్చు. పూజలో పెట్టిన దక్షిణ సొమ్మును ఎవరైనా బ్రాహ్మణుడికి గాని, కుదరని పక్షంలో ఏదైనా గుడిలో హుండీలో గాని ‘పరమేశ్వరి అర్పణం’ అని వేయాలి.

ఆచమనము

ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని మూడుమారులు ఆచమనము చేసి ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్ష జాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః.

ఉత్తిష్టంతు భూతపిశాచా య ఏతే భూమికారకాః,
ఏతేషా మవిరోధేన దేవికర్మ సమారభే. (అక్షతలు వెనుక వేసుకోవలెను)

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం – శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయే – త్సర్వవిఘ్నోపశాంతయే.
అయం ముహూర్తః సుముహూర్తోస్తు.

ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీశచీపురందరాభ్యాం నమః, శ్రీఅరుంధతీ వసిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో దేవేభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః

తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవః
విద్యాబలం దైవబలం తదేవః
లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి.

ప్రాణాయామం

ఓం భూర్భువః సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్, దేవి సవిత: ప్రసూవ, సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణ మపి.

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా,
బ్రహ్మణి మ ఆత్మామృతత్వాయ
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాపిధాన మసీ, ఉత్తరాపోశనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధానమ నీయం సమర్పయామి.

యత్ర యోగేశ్వరః కృష్ణో – యత్ర పార్థో ధనుర్ధరః,
తత్ర శ్రీ ర్వీజయో భూతి – ధ్రువా నీతి ర్మతి ర్మమ.
స్మృతే సకలకల్యాణ – భాజనం యత్ర జాయతే,
పురుషస్త మజం నిత్యం – ప్రజామి శరణం హరిమ్.

సర్వదా సర్వకార్యేషు – నాస్తి తేషా మమంగళమ్,
లాభ స్తేషాం జయ స్తేషాం కుత స్తేషాం పరాభవః,
యేషాం హృదిస్థో భగవా – స్మంగళాయతనం హరిః.
ఆపదా మపహర్తారం – దాతారం సర్వసంపదామ్,
లోకాభిరామం శ్రీరామం – భూయో భూయో నమామ్యహమ్.

సంకల్పం

విష్ణు ర్విష్ణు ర్విష్ణు రితి సంస్కృత్య. పంచాశత్కోటి విస్తీర్ణమహీమండలే జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య… దిగ్భాగే, నద్యో ర్మధ్యప్రదేశ్ స్వగృహీ సమస్త దేవతాగోబ్రాహ్మణ హరిహర చరణసన్నిధౌ శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే అష్టావింశతితమే కలియుగే, ప్రథమపాదే, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ………. నామ సంవత్సరే …………….. ఆయనే ………… ఋతా……………… మాసే ………………. పక్షే…………… తిధౌ………… వాసరే ……… …… శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శ్రీమతః ……..గోత్రస్య ……………. శర్మణః ధర్మపత్ని శ్రీమతిః గోత్రవతీ ……..నామధేయవతి, అహం యావజ్జీవసామంగల్య సిద్ధ్యర్ధ్యం మమ ……………. మమోపాత్తదురితక్షయద్వారా వివాహప్రథమవర్షాది పంచవర్ష పర్యంతం శ్రీమంగళగౌరీవ్రతం కరిష్యే | అదృశ్రీ మంగళగౌరీ దేవతాప్రీత్యర్ధ్యం సంభవద్భిర్దవ్యైః సంభవతా నియమేన ధ్యానావాహనది షోడశాపచారపూజాం కరిష్యే!॥ అని సంకల్ప మొనర్చి నీటిని విడువవలెను.

సంకల్పం (తెలుగులో)

నేను అనేక జన్మలనుండి ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న పాపములు హరించి పోవుటకు ఈశ్వరుని ప్రీతి కొరకు, శుభప్రదమైన ఈ ముహూర్తమందు శ్రీమహావిష్ణువు ఆజ్ఞ చేత సృష్టి కార్యము నిర్వహిస్తున్న ఇప్పటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క జీవితకాలంలోని రెండవ సగభాగం లో జరుగుతున్న శ్వేత వరాహకల్పమందు, అందులో వైవస్వత మన్వంతరము నందు, అందులో 28వ మహా యుగములోని కలియుగంలోని 4 భాగాలలోని మొదటి నాలుగవ భాగమందు ఈ విశ్వంలోని జంబూద్వీపమందున్న భరతవర్షమునందు భరత ఖండమందు, మేరు పర్వతమునకు దక్షిణ దిక్కునందు శ్రీశైల క్షేత్రమునకు …………….. దిక్కునందు, (కృష్ణా, గోదావరి, కావేరి) …………………. జీవనదుల మద్యనున్న భూభాగమందు, వసతి గృహమందు, (స్వగృహమైతే స్వగృహమందు) చాంద్రమాన ప్రకారంగా ఇప్పటి …………………….. సంవత్సరంలో దక్షిణాయనమందు, వర్షఋతువులోని శ్రావణ మాసంలో శుక్లపక్షము (పౌర్ణమి ముందైతే) కృష్ణపక్షము (అమావాస్య ముందైతే) మంగళవారమందు శుభమైన ఈ రోజున ………………….. గోత్రం, ………………. పేరు నాయొక్క, నాకుటుంబ సభ్యుల యొక్క అన్ని పాపములు నశించుటకు మాకందరికి క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యములు సిద్ధించుటకు, ధర్మము, ధనము, కోరికలు, మోక్షము అనే నాలుగు పురుషార్ధములు సిద్ధించుటకు ప్రత్యేకించి నేను నా జీవిత పర్యంతము పసుపు కుంకుమలతో సుఖముగా జీవించుటకు, మంచి ప్రవర్తన కలిగిన కుమార్తెలు, కుమారులు, మనుమలు, మనుమరాళ్ళు కలుగుటకు, శ్రావణ మంగళ గౌరి ప్రీతి కొరకు, నాశక్తి మేరకు నేను ఏర్పాటుచేసిన పూజా ద్రవ్యములతో, యథా శక్తిగా శ్రీసూక్తమంత్రములతో, కలశములోని శ్లోకములతో అమ్మవారికి 16 ఉపచారములతో కూడిన పూజను, ఆ పూజ తర్వాత కథా శ్రవణమును చేయుచున్నాను. ఏ విఘ్నములు లేకుండా పూజ జరుగుటకై వినాయకుని పూజచేస్తున్నాను.

కలశపూజ

తదంగం కలశారాధనం కరిష్యే, కలశం శుద్ధోదకైః గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య – (పరిశుద్ధమైన నీరు నింపిన కలశమును గంధముతోడను, అక్షతల తోడను అలంకరించవలెను. అలంకరించిన పూవును నీటిలో వేసి (మధ్యవేలు పక్కవేలుతో పూవు పట్టుకొని నీటిలోకదుపుతూ క్రింద శ్లోకమును పఠించవలెను. అనంతరము కుడిచేతి వ్రేళ్ళతో కలశమందలి జలమును తాకుచు ఈ క్రింది శ్లోకములను శ్రద్ధగా పఠించవలయును.)

శ్లో॥ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః,
మూలే తత్ర స్థితో బ్రహ్మా – మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే – సప్తద్వీపా వసుంధరా.
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే – కలశాంబు సమాశ్రితాః,
గంగే చ యమునే కృష్ణా – గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేరి – జలేస్మి స్సన్నిధిం కురు॥

ఆయాంతు శ్రీమంగళగౌరీ పూజార్ధం మమ దురితక్షయ కారకాః.
కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవీం ఆత్మానంచ సంప్రోక్ష్య

ఈ విధముగా చదివి కలశములోని జలమును పూజాద్రవ్యములపై చల్లి, తరువాత తన తలపై చల్లుకొనవలయును. అనంతరము పసుపుతోగాని, స్వర్ణముతోగాని సిద్ధము చేసికొనిన గౌరీదేవిపై కలశోదకమును చల్లవలెను

అథగణపతిపూజా

మంత్రః: గణానాం త్వా గణపతిగ్ం హవామహే,
కవిం కవీనా ముపమశ్రవస్తమం,
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత,
ఆ న శ్శృణ్వ న్నూతిభి స్సీదసాదనమ్.

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయో రర్ఘ్యం సమర్పయామి, శుద్దాచమనీయం సమర్పయామి, ఓం ఆపో హిష్టామయోభువ స్తాన ఊర్జే దధాతన, మహేరణాయ చక్షసే.
యో వ శ్శివతమో రస స్తస్యభాజయతేహ నః,
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
అభివస్తా సువసనా న్యరాభిధేనూ స్సుదషూః పూయమానః,
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవ సోమ.
శ్రీ మహాగణాధిపతయే నమః, వస్త్రయుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజేపతే ర్యత్సహజం పురస్తాత్,
ఆయుష్య మగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం,
యజ్ఞోపవీతం బల మస్తు తేజః,
శ్రీ మహాగణాధి పతయే నమః,
యజ్ఞోపవీతం సమర్పయామి,
గంధద్వారాం దురాధరాం,
నిత్య పుష్టాం కరీషిణీం,
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపవ్వాయే శ్రియమ్.

శ్రీ మహాగణాధిపతయే నమః, దివ్యశ్రీచందనం సమర్పయామి.

ఆయనే తే పరాయణే, దూర్వా రోహంతు పుష్పిణీః,
హ్రదాశ్చ పుండరీకాణి, సముద్రస్య గృహే ఇమే.
శ్రీ మహాగణాధిపతయే నమః గంధస్యోపరి అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.

పుష్పైః పూజయామి

ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్న రాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

ధూపాదయః

శ్లో॥ వనస్పత్యు దృవైర్ణివ్యై, ర్నానాగంథై స్సుసంయుతః, ఆమ్రేయ స్పర్వదేవానాం, ధూపాయం ప్రతిగృహ్యతామ్.
శ్రీ మహాగణాధిపతయే నమః, ధూపమాఘ్రాపయామి,
సాజ్యం త్రివర్తిసంయుక్తం, వహ్నినా యోజితం ప్రియం, గృహాణ
మంగళం దీపం, త్రైలోక్య తిమిరాపహమ్.
భక్త్యా దీపం ప్రయచ్ఛామి, దేవాయ పరమాత్మనే,
త్రాహి మాం నరకా దోరా దివ్య జ్యోతి ర్నమోస్తుతే.
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి, ధూపదీపానంతరం
శుద్దాచమనీయం సమర్పయామి.

నైవేద్యం

(నైవేద్యమును సమర్పించుచు ఈ క్రింది మంత్రమును చదువవలెను.) ఓం భూర్భువ స్సువః – ఓం తత్ సవితు ర్వరేణ్యం; భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. (ఋతం త్వా సత్యేన పరిషించామి – అని రాత్రి చెప్పవలెను.)
శ్రీమహాగణాధిపతయే నమః, నైవేద్యం సమర్పయామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి, ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపోశనం సమర్పయామి – హస్తా ప్రక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్ధాచమనీయం సమర్పయామి.

శ్లో॥ పూగీఫలై స్వకర్పూరై, రాగవల్లీదలై ర్యుతం
ముక్తా చూర్ణసమాయుక్తం, తాంబూలం ప్రతి గృహ్యతామ్
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి.
గణానాం త్వా గణపతిగ్ం హవామహే,
కవిం కవీనా ముపమశ్రవ స్తవం.
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత,
ఆ న శ్శృణ్వ న్నూతిభి స్సీదసాదనమ్.
శ్రీ మహాగణాధిపతయే నమః
సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి.
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ త్సమర్పయామి,
యస్య స్మృత్యా చనామోత్తా శ్రీ తపః పూజా క్రియాదిషు,
న్యూనం సంపూర్ణతాం యాతి, సద్యో వందే త మచ్యుతమ్.
మంత్రహీనం క్రియాహీనం, భక్తిహీనం గణాధిప,
య త్పూజితం మయా దేవ, పరిపూర్ణం తదస్తు తే.

అనయా ధ్యానావాహనాదిషోడశోపచారపూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్యవిఘ్ను మస్త్యితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు. శ్రీగణాధిపతిప్రసాదం శిరసా గృష్ణమి.

శ్లో॥ సహస్రపరమా దేవీ, శతమూలా శతాంకురా,
సర్వగ్ం హరతు మే పాపం, దూర్వా దుస్స్వప్న నాశనీ,
గణపతిం యథాస్థాన ముద్వాసయామి. యజ్ఞేన యజ్ఞమయజంత
దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్,
తేహ నాకం మహిమాన స్పచంతే,
యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః.

పంచలోకపాలకపూజా

ఆచమ్య, పుర్వోకై వంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ సత్యనారాయణ ప్రతాంగం గణపత్యాదిపంచలోకపాల కపూజాం, ఆదిత్యాది నవగ్రహపూజాం, ఇంద్రాద్యష్టదిక్పాల కపూణాం చ కరిష్యే.
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముప క్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పతి, ఆ న శ్శృణ్య మ్నాతిభి స్సీదసాదనమ్. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రపరివార సమేతం గణపతిం లోక పాలక మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం బ్రహ్మా దేవానాం, పదవీః కవీనా, మృషి ర్విప్రాణాం మహిషో, మృగాణాం, శ్యేనో గృధ్రాణాగ్ం స్వదితిర్వనానాగ్ం, సోమః పవిత్ర మత్యేతి రేషన్. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బ్రహ్మాణం లోకపాలక మావాహయామి, స్థాపయామి పూజయామి.

ఓం ఇదం విష్ణు ర్విచక్రమే, త్రేధా విదధే పదం, సమూఢ మస్యపాగ్ం సురే. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం విష్ణుం లోకపాలక మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసీ, వోచేమ శంతమగ్ం హృ దే. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం రుద్రం లోకపాలక మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం గౌరీ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సా చతుప్పదీ, అష్టాపదీ నవపదీ బభూవుషీ, సహస్రాక్షరా పరమేవ్యోమన్. సాంగం సాయుధాం సవాహనాం స శక్తిం పతి పుత్ర పరివారసమేతాం గౌరీం లోకపాలికా మావాహయామి, స్థాపయామి పూజయామి.

గణేశాది పంచలోకపాలకదేవతాభ్యోనమః, ధ్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్దాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూప మాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.

గణేశాది పంచలోకపాలక దేవతాప్రసాద సిద్ధి రస్తు.

తదుపరి ఇక్కడ గౌరి దేవి పూజ చేయవలెను

శ్రీ గౌరి దేవి పూజ

అథాంగ పూజా

  • ఉమాయై నమః – పాదౌ పూజయామి
  • గౌర్యై నమః – జంఘే పూజయామి
  • పార్వత్యై నమః – జానునీ పూజయామి
  • జగన్మాత్రే నమః – ఊరూ పూజయామి
  • జగత్ప్రతిష్ఠాయై నమః – కటిం పూజయామి
  • మూల ప్రకృత్యైనమః – నాభిం పూజయామి
  • అంబికాయై నమః – ఉదరం పూజయామి
  • అన్నపూర్ణాయై నమః – స్తనౌ పూజయామి
  • శివ సుందర్యై నమః – వక్షః పూజయామి
  • మహాబలాయై నమః – బాహూ పూజయామి
  • వరప్రదాయై నమః – హస్తా పూజయామి
  • బ్రహ్మవిద్యాయై నమః – జిహ్వాం పూజయామి
  • శాంకర్యై నమః – ముఖం పూజయామి
  • రుద్రాణ్యై నమః – కర్ణా పూజయామి
  • సర్వమంగళాయై నమః – లలాటం పూజయామి
  • సర్వేశ్వర్యై నమః – శిరః పూజయామి
  • శ్రీ మంగళ గౌర్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి

అక్షతలను, పువ్వులను జల్లుచు తల్లి మంగళగౌరీ దేవిని పూజించుచుండవలెను.

అష్టోత్తరశతనామావళీ

శ్రీ మంగళగౌరీ అష్టోత్తరశతనామావళిః 
శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి

శ్లో॥ హ్రీంకారేశ్వరి ! తప్తహాటకకృతే స్థాలీసహసైరృృతం
దివ్యాన్నా మృతసూపశాకభరితం- చిత్రాన్నభేదం తథా
అన్నం తే మధుశర్కరాదధియుతం – మాణిక్యపాత్రే స్థితమ్
మాషాపూవనసహస్రకంచ సఫలం నైవేద్య మావేదయే.

హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః మహానైవేద్యం సమర్పయామి అని చదువుచు కళాశాంతర్గత జలమును తన కుడిదిక్కుగా చల్లుకొనవలెను. అనంతరము ఏయే పదార్ధములు నైవేద్యముగా పెట్టుచుండిమో ఆయా పదార్థములపై పువ్వులతో కలశమునందలి నీరుజల్లవలెను. వానిచుట్టు వీరు త్రిప్పవలెను. ‘అమృతమస్తు’ అనుచు కలశోదకమును పళ్ళెములో వేయవలెను. ‘అమృతోపస్తరణమసి’ అని శ్రీ మంగళ గౌరిదేవికి పదార్థములు సమర్పించవలెను.

ఓం ప్రాణాయ స్వాహా – ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా – ఓం ఉదానాయ స్వాహా – ఓం సమానాయ స్వాహా ॥
అని చెప్పి ఎడమచేయి ఆనించి కుడిచేతిలో ఒక పువ్వునుంచుకొని శ్రీశ్రీ మంగళగౌరీదేవికి నైవేద్య మొసగవలెను.
మధ్యే మధ్యే ఉదకం సమర్పయామి.
అమృతాభిధానమసి, ఉత్తరపోశనం సమర్పయామి.
హస్తా ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ్యాచమనీయం సమర్పయామి అని అయిదుసార్లు ఒక పువ్వుతో ఉదకము జల్లవలెను.

హ్రీం శ్రీం మంగళగౌరీదేవతాయై నమః
ముఖమండనార్ధం తాంబూలం సమర్పయామి.
అనుచు వివిధ సుగంధ ద్రవ్య పరిమళ సంయుతమైన తాంబూలమును మంగళగౌరి చెంత నుంచవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీదేవతాయై నమః
ఆనంద నీరాజనం సమర్పయామి.
అని హారతి వెలగించి మహిమాన్వితశక్తి అయిన దేవికి చూపించుచు మంగళహారతి పాడవలెను.

మంగళహారతి

చల్లని చూపులతో ఎల్లవారల బ్రోచు మంగళగౌరికి జయమంగళం
ఎల్లవేళల బ్రోచే ఉల్లమునగల అమ్మ మంగళగౌరికి శ్రీమంగళం
శ్రద్ధతో పూజించి భక్తితో ప్రార్ధించ
వెంటనే దయచూపు దేవి మా అంబికకు

||జయ||

వృద్ధులూ, పిన్నలూ అందరూ హృదయాల ధ్యానించు గారికి

||జయ||

సర్వశోకమ్ములూ సర్వవిధ బాధలూ
పూజించ తొలగించు మాతల్లి గారికి
సర్వవేళల గాని ఏ వేళను గాని పూజించ మేలేయు తల్లి మా గారికి
పాపములనెల్ల పటాపంచలుగ జేయుచూ
కరుణనే వర్షించు దయామతల్లికి

||జయ||

లోపములు పూజలో ఏపగిది జరిగినా కోపపడనీ తల్లిమంగళగౌరికీ

॥జయ॥

హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
అని పువ్వులను దేవికి అర్పించి నమస్కారము చేయవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
ఛత్రం సమర్పయామి అని పుష్పములు సమర్పించవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
చామరై ర్వీజయామి – అని చామరముతో వీచవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
గీతం శ్రావయామి – అని మధురముగా పాడవలెను
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
నానావిధరాజోపచారాన్ సమర్పయామి
అని కొన్ని పువ్వులను దేవిచెంత నుంచవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
నమస్కారాన్ సమర్పయామి.

అని తల్లిని మనస్సున ధ్యానించుకొనుచు నమస్కారము నొనరించవలెను.

శ్లో॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి।
తత్పర్వం క్షమ్యతాం దేవి! కాత్యాయని। నమో స్తుతే॥
సర్వం శ్రీ శ్రీ మంగళగౌరీ దేవ తార్పణమస్తు.

అనయా మయా కృతయా పూజయా శ్రీమంగళగౌరీదేవి సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు – అని జలాక్షతలను విడుచుట చేయవలెను.

తరువాత బెల్లము, శనగలు, రవికె గుడ్డ, పువ్వులు, పండ్లు తగు దక్షణ మొదలగువానితో నింపబడిన వెదురు బుట్టవంటి దానిని బ్రాహ్మణునకు భక్తి శ్రద్ధలతో దానమీయవలెను.

తరువాత, ముందు గౌరిదేవికి నివేదించిన శనగలు మొదలైన వానిని గ్రహించి …..

కాత్యాయనీ శివా గౌరీ సావిత్రీ సర్వమంగళా సువాసినీభ్యో దాస్యామి వాయనాని ప్రసీదతు ॥
అనుచు ముత్తయిదువులకును, తన మాతృదేవతకును వాయనముల నియవలయును.

అనంతరము 16 వత్తులు గల ఆవునేతి దీపాలు వెలుగజేసి తరువాత కథ వినవలెను. కాటుక ధరించి దేవీ ప్రసాదముగు పూవును తలయందును, కుంకుమను నుదుటను ధరించవలెను.

శ్రీమంగళగౌరీ పూజావిధానము సంపూర్ణము 

శ్రీ శ్రావణమంగళగౌరీ వ్రత కథ

ఒకప్పుడు సూత మహాముని శౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీ మహత్యమును, నారదమునీంద్రులు సావిత్రీదేవి కుపదేశించిన మంగళగౌరీ వ్రత కథయు, పూజావిధానమును, ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.

“ద్రౌపదీ! పరాశక్తియే మంగళగౌరీగ పేరు పొందింది. ఏ స్త్రీల పైనైతే మంగళగౌరీ దేవి కటాక్షము ఉంటుందో వారికి వైధవ్యము ఉండదు. సర్వవిధ సౌభాగ్యములు కలుగుతాయి. ఈ పూజను శ్రావణ మాసములో వచ్చే మంగళవారములు చేయాలి.

మంగళగౌరిదేవి పసుపు, కుంకుమ, పూలు, సుగంధం మొదలైన మంగళ ద్రవ్యాలలోను ఆవు నేతితో వెలిగించిన దీపంలోనూ భాసిల్లుతుంది. ఆమెను పూజించి పునీతులైన స్త్రీలెందరో ఉన్నారు.

త్రిపురాసురుని చంపటానికి వెళ్ళే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మను వంశజుడైన ‘మండు’ డనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావము వల్లనే చాలా కాలము భూలోకములో సర్వసంపదలతో రాజ్యమేలాడు.

అతనికి అటువంటి గౌరీదేవిని పూజించి, వైధవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను. చాలా కాలము కిందట మాహిష్మతీ నగరాన్ని జయపాలుడనే రాజు పాలించుచుండెను. అపైశ్వర్యములు ఉన్నా పిల్లలు లేరు. అందు కోసం అతను బాధపడని రోజు లేదు, చేయని పూజలు లేవు. నోచని నోములులేవు. మొక్కని దేవుడు లేడు, చేయని పుణ్యకార్యము లేదు. కాని ఫలితం మాత్రం శూన్యం.

చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగి, ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురం ముందు నిల్చుని ‘భవతీ భిక్షాం దేహి’ అని పిల్చాడు. కాని జయపాలుని భార్య పళ్ళెంలో అన్నీ సమకూర్చుకుని తెచ్చేలోగా వెళ్ళిపోయాడు. ఇలా వరసగా మూడు రోజులు జరిగింది. జయపాలుని భార్య ఈ విషయం భర్తకి చెప్పి బాధపడితే అతను ‘ఓ భార్యామణీ! అతడు ప్రతిరోజూ మధ్యాహ్నం కదా వస్తున్నాడు. అతను వచ్చే సమయానికి ముందే అన్నీ సిద్ధం చేసుకుని కూర్చో! అతను రాగానే వేయచ్చు’ అన్నాడు.

ఈ సలహా బాగుందనిపించి సరే అంది. అయినా ఆమె కర్మ పరిపక్వం కాలేదింకా! అట్లాగే సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పళ్ళెంతో ఎదురెళ్ళినా ఆ సన్యాసి ‘పుత్ర పౌత్రులు లేని నిర్భాగ్యులు మీరు! అలాంటి వారి దగ్గర ఆతిథ్యము కాని, భిక్షకాని స్వీకరించము’ అన్నాడు. అప్పుడు ఆమె సంతానము కలుగు మార్గము చెప్పి పుణ్యము కట్టుకోమని బతిమాలింది. అందుకా సన్యాసి ‘నేను చెప్పబోయేది శ్రద్ధగా విని వీభర్తకు చెప్పు నీకోరిక తీరుతుంది’ అన్నాడు.

‘నీ భర్తను తూర్పువైపు ఒంటరిగా వీల వస్త్రం ధరించి, వీలం గుఱ్ఱం పైన వెళ్ళమను. అతని గుఱ్ఱం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వనును. అక్కడ ఒక బంగారు దేవాలయముంటుంది. అందులోని భగవతిని పూజించితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్థాన మయ్యాడు. జయపాలుడు కూడా స్వామి చెప్పినదంతా తూచా తప్పకుండా పాటించి భవాని దేవాలయమున భవానిని ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చి భవాని ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు. అప్పుడు ఆ తల్లి! ‘వైధవ్యము కల కూతురు కావాలా ? అల్పాయుష్కుడు, సజ్జనుడైన కొడుకు కావాలా ?’ అంది. అతను ఆలోచించి పున్నామ నరకం నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు. అప్పుడాదేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గరనున్న మామిడిచెట్లు మీది ఫలాన్ని అతని భార్య కిమ్మని చెప్పి అంతర్ధాన మయింది. జయపాలుడు ఆశకొద్దీ దాని మీదున్న పండ్లవ్నీ కోసాడు. కాని అన్నీ మాయమయి ఒక్కటే మిగిలింది. గణపతికి అలాకోసి నందుకు కోపం వచ్చి నీ ఈ చర్యవల్ల నీకు పుట్టబోయే కొడుకు పదహారో ఏటనే పాము కాటువల్ల మరణిస్తాడని శాపం ఇచ్చాడు.

ఫల ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ‘శివుడు’ అని నామకరణ చేసారు. అతన్ని అల్లారుముద్దుగా పెంచు కుంటున్నారు. ఒకరోజు అతనికి ఆయుష్షు తీరిందని యమభటులు వచ్చారు. అప్పుడు జయపాలుని భార్య తన ముద్దుముచ్చట తీరనే లేదు కొన్నాళ్ళు ఆగి రమ్మని కోరింది. ‘ఈశ్వర వరప్రసాదుడు’ కాబట్టి యమభటులు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు.

తల్లి ఎందుకో దుఃఖిస్తూండటం చూసి శివుడు కారణమడిగాడు. తల్లి అతని జన్మ వృత్తాంతం చెప్పింది. వెంటనే శివుడు ‘నేను పోయి ఆ ఈశ్వరుడినే అడుగుతాను. నువ్వు చింతపడకు. నాకు తోడుగా మామయ్యని పంపు. కాశీకి పాయి విశ్వేశ్వరుని వేడుతాము’ అన్నాడు. ఇంట్లో ఒక తులసి మొక్కని నాటి దానికి రోజూ పూజచేయమని తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు.

త్రోవలో వాళ్ళు ప్రతిష్ఠాన పురము చేరారు. అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలుకోస్తూంటే అందులో ఒకమ్మాయి సుశీల అనే అమ్మాయిని ‘ముండ’ ‘రండ’ అని తిట్టింది. దానికా సుశీల మా అమ్మ మంగళ గౌరీ వ్రతం చేస్తుంది. కాబట్టి మా వంశంలో ఎవరూ ముండలు రండలు ఉండరు అని కోపంగా అంత వరకూ కోసిన పూలనునేల మీదికి విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్లమీదకి చేరిపోయాయి.
ఈ వింత చూసిన శివుడు ‘ఈ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది. ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండును” అనుకున్నాడు.
సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజచేసి ‘ఓ దేవదేవా! మా చిన్నారి తల్లికి తగ్గ భర్తని నీవే చూపించాలి!’ అని వేడుకున్నారు. అలా వేడుకుని గుడి బయటకి రాగానే కనిపించిన స్పురద్రూపి యైన శివుడ్ని చూసి, అతని పేరు ‘శివుడు’ ని తెలుసుకొని ఆ పరమ శివుడే ఈ శివుడ్ని పంపారని భావించి, అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్ళి జరిపించారు. వాళ్ళపెళ్ళిలో సుశీల తల్లి తన కూతురికి తను చేసిన మంగళగౌరి నోము ఉద్యాపన చేసింది.

తర్వాత భార్యా భర్తలు భోజనం చేసి బ్రహ్మచర్య వ్రతులై దర్భాసనం మీద పడుకున్నారు. ఆ రాత్రి మంగళగౌరి ముత్తయిదువు రూపంలో సుశీలకి కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు. ఈ రాత్రితో అతని ఆయువు మూడింది. నేను చెప్పినట్లు చేయి. కాసేపటికి ఒక కృష్ణసర్పము అతని కాలేయటానికి వస్తుంది. నువ్వు పాలున్న ఒక కుండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు. ఆ పాము ఆ కుండలో కెళ్ళగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి, మీ అమ్మకు దానిని వాయనంగా ఇయ్యి. నీ భర్తకి గండం గడుస్తుంది! అన్నది.

సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లే జరిగింది. కాళ్ళపారాణి ఇంకా ఆరని పాదం, తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగా నున్న కుండని తీసింది. సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపడిపోయింది. అతను చూసుకోలేదు. తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారక ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్ధికోసం బయలుదేరానన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపాయాడు, భార్యకి ఏవివరం చెప్పకుండానే. సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి ఖిన్నురాలై అతని చేతినుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది.

ఉంగరం వదిలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతన్ని తాను గుర్తించటానికి వీలుగా అతనికి అతిధిమర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకి రోజూ కాళ్ళు కడుగు తుండేది. దాదాపు ఏడాది అవుతుండగా కాశీ వెళ్ళిన శివుడు అతని మేనమామ వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దోవలో అతనికి, తను చనిపోతునట్లూ అప్పుడు మంగళగౌరియు, యమదూతలు తన విషయంలో వాదించుకుంటున్నట్లు కల వచ్చింది. వాళ్ళు మరలా ప్రతిష్ఠాన పురం కొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు. సుశీల అతని కాళ్ళు కడుగుతుండగా గుర్తుపట్టి, అతనే తన భర్త అని తల్లిదండ్రులకి చెప్పింది. తన స్వప్న వృత్తాంతం చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవకృపవల్ల ఆ కాళ్ళపారాణి ఆరని కాలిగుర్తు అతని తొడమీద కనబడింది. శివుడు కూడా తను ఎందుకుఅలా వెళ్ళాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు.

పుట్టింట్లో మంగళగౌరీ నోము నోచుకుని, భర్తతో కలిసి అత్తమామల ఊరు వచ్చింది సుశీల. అన్నాళ్ళుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లితండ్రులు అంధులై పోయారు. సుశీల మంగళ గౌరీ నోములో పట్టిన కాటుక వారి కళ్ళకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది. కొడుకుని తిరిగి కళ్ళారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుష్షు ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు.

దానికంతా కారణం తాను నోచిన నోములేనని మంగళగౌరీ కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది. పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు. ఆపురుషుడికి మంచి ఆయుష్షు లేకపోయినా అతన్ని చేసుకున్న భార్యాశిరోమణి చేసిన పుణ్యకార్యాలవల్ల పూజా విధముల వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతోంది.

ఓ ద్రౌపదీ! మంగళగౌరీ వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసికొనవచ్చు అని చెప్పాడు కృష్ణుడు. ఓ ద్రౌపదీ! మంగళగౌరీ వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసికొనవచ్చు అని చెప్పాడు కృష్ణుడు.

వ్రత ఉద్యాపనం

ఈ వ్రతం పెళ్ళి అయిన సంవత్సరం నుంచి ప్రారంభించి, అయిదు సంవత్సరాలు చేయాలి అయిదవ సంవత్సరం ఆఖరి శ్రావణ మంగళ వారమున పగటి వేళ మంగళగౌరిని యథావిధిగా పూజించాలి. దంపతులు ఉపవాసం ఉండాలి. రాత్రివేళ మంటపము మొదలైనవి పెట్టి, అక్కడ 16 కలశాలు పెట్టాలి. అందులో ఉమా మహేశ్వరులని, బ్రహ్మని, విఘ్నేశ్వరుని, స్కందుని, శేవీ పురందరులని, సప్త మాతృకలను, సావిత్రిని, లక్ష్మీనారాయణులని, సర్వ దేవతలను, నవగ్రహములను పూజించాలి. శక్తి లేకపోతే 5 కలశాలే చాలు. లేదా 2 పెట్టినా చాలు. మర్నాడు స్నానం చేసి బెల్లము, జీలకఱ్ఱ, పరమాన్నము, నెయ్యి, రావి సమిధలు, గరికపోచలతో హోమము చేయాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే, శరణ్యే త్ర్యంబకే దేవి ! నారాయణి నమోస్తుతే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవిజ్ఞాన సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధనా శ్శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ అను మంత్రమే ప్రధానము. 6 పాత్రలలో, మంగళ ద్రవ్యాలతో ముల్లై దువులకు వాయనములు ఇవ్వాలి.

16 వత్తుల దీపములు పదహారింటిని వెలిగించాలి. ముత్తైదు వులను, దంపతులను భోజన చందన తాంబూలాది సత్కారములతో పూజించి ఆనంద పరచాలి. ఇది చాలా మహిమగల వ్రతము. ఈ నోము నోచుకున్న వారందరూ మంగళగౌరి కృపతో ‘యావజ్జీవ మాంగల్య సౌభాగ్య పుత్ర పౌత్ర ఆయురారోగ్యములతో వర్థిల్లుగాక.’ ప్రతి సంవత్సరం మొదటి మంగళవారం చేసిన పసుపు గౌరిని, గణపతిని అన్ని వారాలకి వాడచ్చు. అన్ని వారాలు అయ్యాక ‘మహాగణపతయే సర్వమంగళ రూప మంగళ గౌర్యై ఉద్యాపన సమర్పయామి’ అని ఉద్యాపన చేయాలి.

మరిన్ని వ్రతాలు:

Ayodhya Kanda Sarga 14 In Telugu – అయోధ్యాకాండ చతుర్దశః సర్గః

Ayodhya Kanda Sarga 14

“రామాయణం” లో అయోధ్యాకాండ చతుర్దశః సర్గం (14వ సర్గ) చాలా ముఖ్యమైనది. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణులు వనవాసానికి బయలుదేరడం ప్రారంభమవుతుంది. రాముడు తన తల్లి కౌసల్యతో వీడ్కోలు చెబుతాడు. కౌసల్య తన బాధను వ్యక్తం చేస్తుంది, కానీ రాముడు ఆమెను సాంత్వన చేస్తాడు మరియు ధర్మాన్ని పాటించాల్సిన అవసరాన్ని వివరిస్తాడు. తదుపరి, రాముడు తన సోదరి శాంతాతో మరియు సుమిత్రతో కూడా వీడ్కోలు చెప్పి ఆశీర్వాదాలను పొందుతాడు. సుమిత్ర తన కుమారుడు లక్ష్మణుని ధైర్యాన్ని ప్రశంసిస్తుంది మరియు రాముని సేవ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణులు రథంలో బయలుదేరి, అయోధ్య నగరాన్ని విడిచిపోతారు. ప్రజలు తీవ్ర విచారంలో వీరి వెంబడి నడుస్తారు, కానీ రాముడు వారిని సాంత్వన చేస్తాడు. రాముడి ధైర్యం, విధేయత మరియు ధర్మపరమైన కట్టుబాట్లు ఈ సర్గలో స్పష్టంగా కనిపిస్తాయి.

కైకేయ్యుపాలంభః

పుత్రశోకార్దితం పాపా విసంజ్ఞం పతితం భువి |
వివేష్టమానముద్వీక్ష్య సైక్ష్వాకమిదమబ్రవీత్ || ౧ ||

పాపం కృత్వైవ కిమిదం మమ సంశ్రుత్య సంశ్రవమ్ |
శేషే క్షితితలే సన్నః స్థిత్యాం స్థాతుం త్వమర్హసి || ౨ ||

ఆహుః సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనాః |
సత్యమాశ్రిత్య హి మయా త్వం చ ధర్మం ప్రచోదితః || ౩ ||

సంశ్రుత్య శైబ్యః శ్యేనాయ స్వాం తనుం జగతీపతిః |
ప్రదాయ పక్షిణో రాజన్ జగామ గతిముత్తమామ్ || ౪ ||

తథా హ్యలర్కస్తేజస్వీ బ్రాహ్మణే వేదపారగే |
యాచమానే స్వకే నేత్రే ఉద్ధృత్యావిమనా దదౌ || ౫ ||

సరితాం తు పతిః స్వల్పాం మర్యాదాం సత్యమన్వితః |
సత్యానురోధాత్సమయే వేలాం స్వాం నాతివర్తతే || ౬ ||

సత్యమేకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్ఠితః |
సత్యమేవాక్షయా వేదాః సత్యేనైవాప్యతే పరమ్ || ౭ ||

సత్యం సమనువర్తస్వ యది ధర్మే ధృతా మతిః |
స వరః సఫలో మేఽస్తు వరదో హ్యసి సత్తమ || ౮ ||

ధర్మస్యేహాభికామార్థం మమ చైవాభిచోదనాత్ |
ప్రవ్రాజయ సుతం రామం త్రిః ఖలు త్వాం బ్రవీమ్యహమ్ || ౯ ||

సమయం చ మమాద్యేమం యది త్వం న కరిష్యసి |
అగ్రతస్తే పరిత్యక్తా పరిత్యక్ష్యామి జీవితమ్ || ౧౦ ||

ఏవం ప్రచోదితో రాజా కైకేయ్యా నిర్విశంకయా |
నాశకత్పాశమున్మోక్తుం బలిరింద్రకృతం యథా || ౧౧ ||

ఉద్భ్రాంతహృదయశ్చాపి వివర్ణవదనోఽభవత్ |
స ధుర్యో వై పరిస్పందన్యుగచక్రాంతరం యథా || ౧౨ ||

విహ్వలాభ్యాం చ నేత్రాభ్యామపశ్యన్నివ భూపతిః | [భూమిపః]
కృచ్ఛ్రాద్ధైర్యేణ సంస్తభ్య కైకేయీమిదమబ్రవీత్ || ౧౩ ||

యస్తే మంత్రకృతః పాణిరగ్నౌ పాపే మయా ధృతః |
తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం త్వయా సహ || ౧౪ ||

ప్రయాతా రజనీ దేవి సూర్యస్యోదయనం ప్రతి |
అభిషేకం గురుజనస్త్వరయిష్యతి మాం ధ్రువమ్ || ౧౫ ||

రామాభిషేకసంభారైస్తదర్థముపకల్పితైః |
రామః కారయితవ్యో మే మృతస్య సలిలక్రియామ్ || ౧౬ ||

త్వయా సపుత్రయా నైవ కర్తవ్యా సలిలక్రియా |
వ్యాహంతాఽస్యశుభాచారే యది రామాభిషేచనమ్ || ౧౭ ||

న చ శక్తోఽస్మ్యహం ద్రష్టుం దృష్ట్వా పూర్వం తథా సుఖమ్ | [శక్నోమ్యహం]
హతహర్షం నిరానందం పునర్జనమవాఙ్ముఖమ్ || ౧౮ ||

తాం తథా బ్రువతస్తస్య భూమిపస్య మహాత్మనః |
ప్రభాతా శర్వరీ పుణ్యా చంద్రనక్షత్రశాలినీ || ౧౯ ||

తతః పాపసమాచారా కైకేయీ పార్థివం పునః |
ఉవాచ పరుషం వాక్యం వాక్యజ్ఞా రోషమూర్ఛితా || ౨౦ ||

కిమిదం భాషసే రాజన్వాక్యం గరరుజోపమమ్ |
ఆనాయయితుమక్లిష్టం పుత్రం రామమిహార్హసి || ౨౧ ||

స్థాప్య రాజ్యే మమ సుతం కృత్వా రామం వనేచరమ్ |
నిఃసపత్నాం చ మాం కృత్వా కృతకృత్యో భవిష్యసి || ౨౨ ||

స నున్న ఇవ తీక్ష్ణేన ప్రతోదేన హయోత్తమః |
రాజా ప్రచోదితోఽభీక్ష్ణం కైకేయీమిదమబ్రవీత్ || ౨౩ ||

ధర్మబంధేన బద్ధోఽస్మి నష్టా చ మమ చేతనా |
జ్యేష్ఠం పుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్ఛామి ధార్మికమ్ || ౨౪ ||

తతః ప్రభాతాం రజనీముదితే చ దివాకరే |
పుణ్యే నక్షత్రయోగే చ ముహూర్తే చ సమాహితే || ౨౫ ||

వసిష్ఠో గుణసంపన్నః శిష్యైః పరివృతస్తదా |
ఉపసంగృహ్య సంభారాన్ప్రవివేశ పురోత్తమమ్ || ౨౬ || [ఉపగౄహ్యాశు]

సిక్తసమ్మార్జితపథాం పతాకోత్తమభూషితామ్ |
విచిత్రకుసుమాకీర్ణాం నానాస్రగ్భిర్విరాజితామ్ || ౨౭ ||

సంహృష్టమనుజోపేతాం సమృద్ధవిపణాపణామ్ |
మహోత్సవసమాకీర్ణాం రాఘవార్థే సముత్సుకామ్ || ౨౮ ||

చందనాగరుధూపైశ్చ సర్వతః ప్రతిధూపితామ్ |
తాం పురీం సమతిక్రమ్య పురందరపురోపమామ్ || ౨౯ ||

దదర్శాంతఃపురం శ్రేష్ఠం నానాద్విజగణాయుతమ్ |
పౌరజానపదాకీర్ణం బ్రాహ్మణైరుపశోభితమ్ || ౩౦ ||

యజ్ఞవిద్భిః సుసంపూర్ణం సదస్యైః పరమద్విజైః |
తదంతఃపురమాసాద్య వ్యతిచక్రామ తం జనమ్ || ౩౧ ||

వసిష్ఠః పరమప్రీతః పరమర్షిర్వివేశ చ |
సత్వపశ్యద్వినిష్క్రాంతం సుమంత్రం నామ సారథిమ్ || ౩౨ ||

ద్వారే తు రాజసింహస్య సచివం ప్రియదర్శనమ్ |
తమువాచ మహాతేజాః సూతపుత్రం విశారదమ్ || ౩౩ ||

వసిష్ఠః క్షిప్రమాచక్ష్వ నృపతేర్మామిహాగతమ్ |
ఇమే గంగోదకఘటాః సాగరేభ్యశ్చ కాంచనాః || ౩౪ ||

ఔదుంబరం భద్రపీఠమభిషేకార్థమాహృతమ్ | [మాగతమ్]
సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ || ౩౫ ||

క్షౌద్రం దధి ఘృతం లాజాః దర్భాః సుమనసః పయః |
అష్టౌ చ కన్యా రుచిరాః మత్తశ్చ వరవారణః || ౩౬ ||

చతురశ్వో రథః శ్రీమాన్నిస్త్రింశో ధనురుత్తమమ్ |
వాహనం నరసంయుక్తం ఛత్రం చ శశిసన్నిభమ్ || ౩౭ ||

శ్వేతే చ వాలవ్యజనే భృంగారశ్చ హిరణ్మయః |
హేమదామపినద్ధశ్చ కకుద్మాన్పాండరో వృషః || ౩౮ ||

కేసరీ చ చతుర్దంష్ట్రో హరిశ్రేష్ఠో మహాబలః |
సింహాసనం వ్యాఘ్రతనుః సమిద్ధశ్చ హుతాశనః || ౩౯ ||

సర్వవాదిత్రసంఘాశ్చ వేశ్యాశ్చాలంకృతాః స్త్రియః |
ఆచార్యా బ్రాహ్మణా గావః పుణ్యాశ్చ మృగపక్షిణః || ౪౦ ||

పౌరజానపదశ్రేష్ఠాః నైగమాశ్చ గణైః సహ |
ఏతే చాన్యే చ బహవః ప్రీయమాణాః ప్రియంవదాః || ౪౧ || [నీయమానాః]

అభిషేకాయ రామస్య సహ తిష్ఠంతి పార్థివైః |
త్వరయస్వ మహారాజం యథా సముదితేఽహని || ౪౨ ||

పుణ్యే నక్షత్రయోగే చ రామో రాజ్యమవాప్నుయాత్ | [పుష్యే]
ఇతి తస్య వచః శ్రుత్వా సూతపుత్రో మహాత్మనః || ౪౩ ||

స్తువన్నృపతిశార్దూలం ప్రవివేశ నివేశనమ్ |
తం తు పూర్వోదితం వృద్ధం ద్వారస్థా రాజసమ్మతమ్ || ౪౪ ||

న శేకురభిసంరోద్ధుం రాజ్ఞః ప్రయచికీర్షవః |
స సమీపస్థితో రాజ్ఞస్తామవస్థామజజ్ఞివాన్ || ౪౫ ||

వాగ్భిః పరమతుష్టాభిరభిష్టోతుం ప్రచక్రమే |
తతః సూతో యథాకాలం పార్థివస్య నివేశనే || ౪౬ ||

సుమంత్రః ప్రాంజలిర్భూత్వా తుష్టావ జగతీపతిమ్ |
యథా నందతి తేజస్వీ సాగరో భాస్కరోదయే || ౪౭ ||

ప్రీతః ప్రీతేన మనసా తథాఽఽనందఘనః స్వతః |
ఇంద్రమస్యాం తు వేలాయామభితుష్టావ మాతలిః || ౪౮ ||

సోఽజయద్దానవాన్సర్వాంస్తథా త్వాం బోధయామ్యహమ్ |
వేదాః సహాంగవిద్యాశ్చ యథాహ్యాత్మభువం విభుమ్ || ౪౯ ||

బ్రహ్మాణం బోధయంత్యద్య తథా త్వాం బోధయామ్యహమ్ |
ఆదిత్యః సహ చంద్రేణ యథా భూతధరాం శుభామ్ || ౫౦ ||

బోధయత్యద్య పృథివీం తథా త్వాం బోధయామ్యహమ్ |
ఉత్తిష్ఠాశు మహారాజ కృతకౌతుకమంగళః || ౫౧ ||

విరాజమానో వపుషా మేరోరివ దివాకరః |
సోమసూర్యౌ చ కాకుత్స్థ శివవైశ్రవణావపి || ౫౨ ||

వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రదిశంతు తే |
గతా భగవతీ రాత్రిః కృతం కృత్యమిదం తవ || ౫౩ ||

బుద్ధ్యస్వ నృపశార్దూల కురుకార్యమనంతరమ్ |
ఉపతిష్ఠతి రామస్య సమగ్రమభిషేచనమ్ || ౫౪ || [ఉదతిష్ఠత]

పౌరజానపదైశ్చాపి నైగమైశ్చ కృతాంజలిః |
అయం వసిష్ఠో భగవాన్బ్రాహ్మణైః సహ తిష్ఠతి || ౫౫ || [స్వయం]

క్షిప్రమాజ్ఞాప్యతాం రాజన్రాఘవస్యాభిషేచనమ్ |
యథా హ్యపాలాః పశవో యథా సేనా హ్యానాయకా || ౫౬ ||

యథా చంద్రం వినా రాత్రిర్యథా గావో వినా వృషమ్ |
ఏవం హి భవితా రాష్ట్రం యత్ర రాజా న దృశ్యతే || ౫౭ ||

ఇతి తస్య వచః శృత్వా సాంత్వపూర్వమివార్థవత్ |
అభ్యకీర్యత శోకేన భూయ ఏవ మహీపతిః || ౫౮ ||

తతః స రాజా తం సూతం సన్నహర్షః సుతం ప్రతి |
శోకరక్తేక్షణః శ్రీమానుద్వీక్ష్యోవాచ ధార్మికః || ౫౯ ||

వాక్యైస్తు ఖలు మర్మాణి మమ భూయో నికృంతసి |
సుమంత్రః కరుణం శ్రుత్వా దృష్ట్వా దీనం చ పార్థివమ్ || ౬౦ ||

ప్రగృహీతాంజలిః కించిత్ తస్మాద్దేశాదపాక్రమత్ |
యదా వక్తుం స్వయం దైన్యాత్ న శశాక మహీపతిః || ౬౧ ||

తదా సుమంత్రం మంత్రజ్ఞా కైకేయీ ప్రత్యువాచ హ |
సుమంత్ర రాజా రజనీం రామహర్షసముత్సుకః || ౬౨ ||

ప్రజాగరపరిశ్రాంతో నిద్రాయా వశమేయివాన్ |
తద్గచ్ఛ త్వరితం సూత రాజపుత్రం యశస్వినమ్ || ౬౩ ||

రామమానయ భద్రం తే నాత్ర కార్యా విచారణా |
స మన్యమానః కళ్యాణం హృదయేన ననంద చ || ౬౪ ||

నిర్జగామ చ సంప్రీత్యా త్వరితో రాజశాసనాత్ |
సుమంత్రశ్చింతయామాస త్వరితం చోదితస్తయా || ౬౫ ||

వ్యక్తం రామోఽభిషేకార్థమిహాయాస్యతి ధర్మవిత్ |
ఇతి సూతో మతిం కృత్వా హర్షేణ మహతాఽఽవృతః || ౬౬ ||

నిర్జగామ మహాబాహూ రాఘవస్య దిదృక్షయా |
సాగరహ్రదసంకాశాత్సుమంత్రోంతఃపురాచ్ఛుభాత్ |
నిష్క్రమ్య జనసంబాధం దదర్శ ద్వారమగ్రతః || ౬౭ ||

తతః పురస్తాత్సహసా వినిర్గతో
మహీభృతో ద్వారగతాన్విలోకయన్ | [పతీన్]
దదర్శ పౌరాన్వివిధాన్మహాధనా-
-నుపస్థితాన్ద్వారముపేత్య విష్ఠితాన్ || ౬౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశః సర్గః || ౧౪ ||

Ayodhya Kanda Sarga 14 Meaning In Telugu

కైక మరలా తన ధోరణిలో దశరథునితో ఇలా అంది.
“ఓ దశరథమహారాజా! నీవు నీ ప్రాణాపాయ దశలో నాకు ఇస్తాను అన్న వరాలు రెండింటి ఈనాడు నేను కోరాను. ఆ మాత్రానికే ఇలా నేల మీదపడి దొర్లి దొర్లి ఏడవవలెనా! ఇది ఒక మహారాజుకు మర్యాదగా ఉంటుందా! ఆడిన మాట తప్పకపోవడం, ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడటం ఏనాటినుంచో ఉన్న ధర్మము. నేను అదే చెబుతున్నాను. తమరిని సత్యము ధర్మమును పాటించమంటున్నాను. ఆడినమాట తప్పవద్దు అని అంటున్నాను. ఇదేనా నేను చేసిన తప్పు. మీపూర్వులైన శిబిచక్రవర్తి, అలర్కుడు అనుసరించిన మార్గమునే మీరూ అనుసరించి కీర్తి ప్రతిష్టలు పొందమంటున్నాను. అదేనా నేను చేసిన పాపం.

“సత్యము పరబ్రహ్మస్వరూపము. ధర్మమునకు సత్యమే మూలము” అని మీకు నేను చెప్పదగిన దానిని కాదు. తాము సర్వజ్ఞులు. తమరికి అన్నీ తెలుసు. ఆ సత్యనిష్టను, ధర్మనిరతిని నేను పాటించమంటున్నాను. అన్న మాటను నిటబెట్టుకోమంటున్నాను. ధర్మము పాటించమంటున్నాను. నాకు ఇస్తానన్న వరాలు ప్రసాదించండి. అదే నేను కోరేది. నేనేమీ కొత్తగా కోరడం లేదు. నీవు ఆనాడు ఇస్తాను అన్న వరాలే ఈ నాడు అడుగుతున్నాను. అదే ధర్మము. ఆ ధర్మాన్ని నిలపడం కోసం రాముని అడవులకు పంపండి. మరొక మాట వద్దు. “రాముని అడవులకు పంపాలి”, “రాముని అడవులకు పంపాలి” “రాముని అడవులకు పంపాలి” అని మూడు మార్లు నొక్కి చెబుతున్నాను.

ఓ దశరథమహారాజా! మీరు నాకు ఇచ్చిన వరములను తీర్చకపోయినట్టయితే మీరు నన్ను వదిలివేసినట్టే భావిస్తాను. భర్త వదలిన భార్యకు మరణమే శరణ్యము అందుకని నేను మీ ఎదురుగుండా ప్రాణత్యాగము చేసుకుంటాను. ఇది తథ్యము.” అని నిక్కచ్చిగా చెప్పింది కైక. దశరథునికి ఆఖరు ఆశ కూడా అడుగంటి పోయింది. రామునికి వనవాసము తథ్యము అనుకున్నాడు. కుప్పకూలిపోయాడు. అతని హృదయము బరువెక్కింది. ముఖము వివర్ణమయింది. కళ్లు కనిపించడం లేదు.

మరలా ధైర్యము కూడగట్టుకున్నాడు. కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు. ” ఓసీ పాపీ! కైకా! అగ్నిసాక్షిగా నేను నీ పాణిగ్రహణము చేసాను. నీ పాణిగ్రహణము రోజు నేను ఏ చేతిని పట్టుకున్నానో ఆ చేతిని వదిలివేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుని కూడా వదిలివేస్తున్నాను. ఇంక నీకూ నాకూ సంబంధం లేదు. నీవునా భార్యవు కావు. భరతుడు నా కుమారుడూ కాడు. నీవు నా కుమారుడు రాముని పట్టాభిషేకము చెడగొట్టావు. నేను మరణించిన తరువాత నీ కుమారుడు నాకు తిలోదకములు వదల నవసరము లేదు. రాముడే నాకు ఉత్తరక్రియలు నిర్వర్తిస్తాడు.

రాముని పట్టాభిషేకము అని నేను ప్రకటించగానే జనము హర్షధ్వానాలు చేసారు. ఇప్పుడు నేను రాముని అడవులకు పంపుతున్నాను అని తెలిసి అయోధ్యలో ఉన్న జనము దు:ఖములో మునిగిపోతారు. వారి దుఃఖము నేను చూడలేను. అందుకే రాముడు అరణ్యములకు పోకముందే నేను ప్రాణములు విడుస్తాను.” అని అన్నాడు దశరథుడు. ఇంతలో తెల తెల వారుతూ ఉంది.పక్షులు కిల కిలారావాలు చేస్తున్నాయి. కాని కైకకు ఇవేమీ పట్టలేదు. తనపట్టు నెగ్గించు కోవాలనే కోరిక తప్ప. అందుకే దీనంగా నేలమీద పడి ఉన్న దశరథుని చూచి ఇలా అంది.

” ఓ దశరథమహారాజజా! ఎందుకు చెప్పిన మాటలే చెప్పి నీవు బాధపడి అందరినీ బాధపెడతావు. జరగాల్సిన కార్యక్రమం చూడు. రాముని పిలిపించు. అతనికి నీ నిర్ణయాన్ని వినిపించు. రాముని వనవాసమునకు పంపించు. భరతునికి పట్టాభిషేకము ప్రకటించు. తూర్పు తెల్లవారుతోంది. త్వరగా కానివ్వండి.” అని తొందరపెట్టింది.

ఆ మాటలకు దశరథుడు చెళ్లున కొరడాతో కొట్టిన గుర్రము మాదిరి పైకి లేచాడు. నిర్వేదంగా ఉన్నాడు. ఆయన బుద్ధిపనిచేయడం మాని వేసింది.
“నేను ధర్మానికి కట్టుబడ్డాను. ధర్మబద్ధుడను. నేను రాముని చూడాలని అనుకుంటున్నాను. రాముని పిలిపించండి.” అని అన్నాడు. అప్పటికే తెల్లవారింది. శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. వసిష్ఠుడు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు తన శిష్యులు తీసుకొని వస్తుంటే అయోధ్యలో ప్రవేశించాడు.

అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు. పతాకాలు కట్టారు. తోరణాలు కట్టారు. రాజవీధులన్నీ రకరకాల పూలతో అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాలనుండి వచ్చిన ప్రజలతో, అయోధ్య ప్రజలతో వీధులు క్రిక్కిరిసిపోయాయి. ప్రజలందరూ రామ పట్టాభిషేకము చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నారు.

వసిష్ఠుడు రాజమందిరము దగ్గరకు వచ్చాడు. అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూచి వసిష్ఠుడు ఎంతో సంతోషించాడు. వారి మధ్యనుండి దారి చేసుకుంటూ రాజభవనము లోకి ప్రవేశించాడు. సుమంత్రుడు వసిష్ఠునికి ఎదురుగా వచ్చాడు. సుమంత్రుడు వసిష్ఠునికి నమస్కరించాడు. “సుమంత్రా! నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు పోయి నేను వచ్చినట్టు వారికి మనవి చెయ్యి. రామ పట్టాభిషేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంగా ఉన్నాయి. అభిషేకమునకు గంగాజలమూ, పుణ్య నదీజలములు, సముద్రజలము సిద్ధంగా ఉన్నాయి. నవధాన్యాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలూ, పూలు, పాలు, కన్యముత్తయిదువలు, ఏనుగులు, రథములు, ఖడ్గములు, ధనుర్బాణములు, పల్లకీలు, ఛత్రచామరములు, వింజామరములు, బంగారు కలశములు, తెల్లని ఎద్దు, తెల్లని గుర్రములు, పులి చర్మమూ, అగ్నిహోత్రము, రకరకాల వాద్య విశేషములు, చక్కగా అలంకరించుకున్న స్త్రీలు, గురువులు, విప్రులు, గోవులు, అయోధ్యాప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ రామ పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉన్నారు. సూర్యోదయము అయింది.

శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. కాబట్టి సుమంత్రా! నీవు రాజు గారి వద్దకు పోయి మేము వచ్చామని చెప్పి, తొందరగా సిద్ధంకమ్మను.” అని అన్నాడు వసిష్ఠుడు. ఆ మాటలు విన్న సుమంత్రుడు వసిష్ఠునికి నమస్కరించి దశరధుని వద్దకు వెళ్లాడు. అప్పటిదాకా జరిగిన విషయములు ఏవీ తెలియవు సుమంత్రునకు. అందుకని దశరథుని స్తుతించడం మొదలెట్టాడు. “మహారాజు దశరథులవారికి జయీభవ. విజయీభవ. ఈ పట్టాభిషేక మహోత్సవము తమరికి అపరిమితమైన సంతోషించు గాక! దేవేంద్రుని సారధి మాతలి ఇంద్రుని స్తుతించి నట్టు నేను దేవేంద్ర సమానుడైన తమరిని స్తుతిస్తున్నాను. స్వయంభువు, వేదవేదాంగ ములను సృష్టించిన వాడూ అయిన బ్రహ్మను స్తుతించినట్టు నేను తమరిని స్తుతిస్తున్నారు. ఉదయమే సూర్యుడు, రాత్రి చంద్రుడూ వచ్చి భూదేవిని మేల్కొలిపి నట్టు నేను తమరిని మేల్కొలుపుతున్నాను.

ఓ మహారాజా! సూర్యోదయము అయింది. రామ పట్టాభి షేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంచేయబడ్డాయి. ఓ దశరథమహారాజా! తమరు వెంటనే మేల్కొని మంగళ స్నానం చేసి, రామ పట్టాభిషేకమునకు సిద్ధం కావాలని వసిష్ఠులవారి ఆదేశము. ఓ మహారాజా! తమరికి సూర్య చంద్రులు, శివకేశవులు, అగ్ని వరుణుడు, ఇంద్రుడు తమరికి సకలైశ్వర్యములు కలిగించుగాక! ఓ దశరథమహారాజా! వసిష్ఠులవారు బ్రాహ్మణసమూహములతో రాజద్వారము వద్ద తమరి రాక కోసం వేచిఉన్నారు. తమరు తొందరగా వచ్చి రామ పట్టాభిషేకమునకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా వేడుకొనుచున్నాను.” అనిపలుకుతున్న సుమంత్రుని పలుకులు విన్న దశరథునికి దు:ఖము ఇంకా ఎక్కువ అయింది. అమంగళము జరగబోతూ ఉంటే సుమంత్రుని మంగళవాచకములు దశరథునికి కర్ణకఠోరంగా వినిపించాయి.

“ఆపు. ఇంక చాలు” అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు సుమంత్రుడు భయపడిపోయాడు. ఒక పక్కకు ఒదికి నిలబడ్డాడు. ఇదంతా చూస్తూ ఉన్న కైక అక్కడకు వచ్చింది. “సుమంత్రా! రాత్రి అంతా మహారాజుగారు పట్టాభిషేక సన్నాహముల గురించి చర్చించి చర్చించి రాత్రి అంతా నిద్రలేకుండా గడిపారు. అందువలన కొంచెం చిరాకుగా ఉన్నారు. నీవు పోయి మహారాజు గారు రమ్మన్నారని చెప్పి శీఘ్రముగా రాముని ఇక్కడకు తీసుకొని రా.” అని ఆజ్ఞాపించింది కైక.

“అలాగే మహారాణీ! తమ ఆజ్ఞ నెరవేరుస్తాను. రాముని ఇక్కడకు వెంటనేరమ్మని మనవిచేస్తాను.” అని పలికి సుమంత్రుడు అక్కడినుండి వెళ్లిపోయాడు. అప్పటికే రాజద్వారము వద్ద నిలబడి ఉ న్న సామంతరాజులను, అయోధ్యలోని ధనవంతులను, పౌరులను చూచాడు సుమంత్రుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ పంచదశః సర్గః (15) >>

Ayodhya Kanda Sarga 21 In Telugu | అయోధ్యాకాండ ఏకవింశః సర్గః

Ayodhya Kanda Sarga 21 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ రామాయణ కావ్యంలో రెండవ విభాగము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. అయోధ్య కాండ సర్గ 21 లో, రాముని వనవాసానికి సిద్ధమైన సందర్భంగా సీతా దేవి, లక్ష్మణుడు మరియు ఆయనను కలిసి ప్రస్థానం చేస్తారు. ఈ అధ్యాయంలో, వారి వనవాసానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, సంభాషణలు మరియు పరిణామాలు వివరించబడతాయి. సీతా దేవి తన భర్త రాముని తో పాటు వనవాసం చేయడానికి నిర్ణయించుకుంటుంది మరియు లక్ష్మణుడు తన అన్నను వదిలి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇది కుటుంబ బంధాలు, నిబద్ధత మరియు ధర్మం పట్ల వారికి ఉన్న కట్టుబాటును ప్రతిబింబిస్తుంది.

కౌసల్యాలక్ష్మణప్రతిబోధనమ్ 

తథా తు విలపంతీం తాం కౌసల్యాం రామమాతరమ్ |
ఉవాచ లక్ష్మణో దీనస్తత్కాలసదృశం వచః ||

1

న రోచతే మమాప్యేతదార్యే యద్రాఘవో వనమ్ |
త్యక్త్వా రాజ్యశ్రియం గచ్ఛేత్ స్త్రియా వాక్యవశం గతః ||

2

విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రధర్షితః |
నృపః కిమివ న బ్రూయాచ్చోద్యమానః సమన్మథః ||

3

నాస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధమ్ |
యేన నిర్వాస్యతే రాష్ట్రాద్వనవాసాయ రాఘవః ||

4

న తం పశ్యామ్యహం లోకే పరోక్షమపి యో నరః |
స్వమిత్రోఽపి నిరస్తోఽపి యోఽస్య దోషముదాహరేత్ ||

5

దేవకల్పమృజుం దాంతం రిపూణామపి వత్సలమ్ |
అవేక్షమాణః కో ధర్మం త్యజేత్పుత్రమకారణాత్ ||

6

తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః |
పుత్రః కో హృదయే కుర్యాద్రాజవృత్తమనుస్మరన్ ||

7

యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః |
తావదేవ మయా సార్ధమాత్మస్థం కురు శాసనమ్ ||

8

మయా పార్శ్వే సధనుషా తవ గుప్తస్య రాఘవ |
కః సమర్థోఽధికం కర్తుం కృతాంతస్యేవ తిష్ఠతః ||

9

నిర్మనుష్యామిమాం సర్వామయోధ్యాం మనుజర్షభ |
కరిష్యామి శరైస్తీక్ష్ణైర్యది స్థాస్యతి విప్రియే ||

10

భరతస్యాథ పక్ష్యో వా యో వాఽస్య హితమిచ్ఛతి |
సర్వానేతాన్వధిష్యామి మృదుర్హి పరిభూయతే ||

11

ప్రోత్సాహితోఽయం కైకేయ్యా స దుష్టో యది నః పితా |
అమిత్రభూతో నిఃసంగం వధ్యతాం బధ్యతామపి ||

12

గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః |
ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్ ||

13

బలమేష కిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ |
దాతుమిచ్ఛతి కైకేయ్యై రాజ్యం స్థితమిదం తవ ||

14

త్వయా చైవ మయా చైవ కృత్వా వైరమనుత్తమమ్ |
కాఽస్య శక్తిః శ్రియం దాతుం భరతాయారిశాసన ||

15

అనురక్తోఽస్మి భావేన భ్రాతరం దేవి తత్త్వతః |
సత్యేన ధనుషా చైవ దత్తేనేష్టేన తే శపే ||

16

దీప్తమగ్నిమరణ్యం వా యది రామః ప్రవేక్ష్యతి |
ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వమవధారయ ||

17

హరామి వీర్యాద్దుఃఖం తే తమః సూర్య ఇవోదితః |
దేవీ పశ్యతు మే వీర్యం రాఘవశ్చైవ పశ్యతు ||

18

హనిష్యే పితరం వృద్ధం కైకేయ్యాసక్తమానసమ్ |
కృపణం చ స్థితం బాల్యే వృద్ధభావేన గర్హితమ్ ||

19

ఏతత్తు వచనం శ్రుత్వా లక్ష్మణస్య మహాత్మనః |
ఉవాచ రామం కౌసల్యా రుదంతీ శోకలాలసా ||

20

భ్రాతుస్తే వదతః పుత్ర లక్ష్మణస్య శ్రుతం త్వయా |
యదత్రానంతరం కార్యం కురుష్వ యది రోచతే ||

21

న చాధర్మ్యం వచః శ్రుత్వా సపత్న్యా మమ భాషితమ్ |
విహాయ శోకసంతప్తాం గంతుమర్హసి మామితః ||

22

ధర్మజ్ఞ యది ధర్మిష్ఠో ధర్మం చరితుమిచ్ఛసి |
శుశ్రూష మామిహస్థస్త్వం చర ధర్మమనుత్తమమ్ ||

23

శుశ్రూషుర్జననీం పుత్రః స్వగృహే నియతో వసన్ |
పరేణ తపసా యుక్తః కాశ్యపస్త్రిదివం గతః ||

24

యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథా హ్యహమ్ |
త్వాం నాహమనుజానామి న గంతవ్యమితో వనమ్ ||

25

త్వద్వియోగాన్న మే కార్యం జీవితేన సుఖేన వా |
త్వయా సహ మమ శ్రేయస్తృణానామపి భక్షణమ్ ||

26

యది త్వం యాస్యసి వనం త్యక్త్వా మాం శోకలాలసామ్ |
అహం ప్రాయమిహాసిష్యే న హి శక్ష్యామి జీవితుమ్ ||

27

తతస్త్వం ప్రాప్స్యసే పుత్ర నిరయం లోకవిశ్రుతమ్ |
బ్రహ్మహత్యామివాధర్మాత్సముద్రః సరితాం పతిః ||

28

విలపంతీం తదా దీనాం కౌసల్యాం జననీం తతః |
ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మసంహితమ్ ||

29

నాస్తి శక్తిః పితుర్వాక్యం సమతిక్రమితుం మమ |
ప్రసాదయే త్వాం శిరసా గంతుమిచ్ఛామ్యహం వనమ్ ||

30

ఋషిణా చ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణా |
గౌర్హతా జానతా ధర్మం కండునాఽపి విపశ్చితా ||

31

అస్మాకం చ కులే పూర్వం సగరస్యాజ్ఞయా పితుః |
ఖనద్భిః సాగరైర్భూమిమవాప్తః సుమహాన్వధః ||

32

జామదగ్న్యేన రామేణ రేణుకా జననీ స్వయమ్ |
కృత్తా పరశునాఽరణ్యే పితుర్వచనకారిణా ||

33

ఏతైరన్యైశ్చ బహుభిర్దేవి దేవసమైః కృతమ్ |
పితుర్వచనమక్లీబం కరిష్యామి పితుర్హితమ్ ||

34

న ఖల్వేతన్మయైకేన క్రియతే పితృశాసనమ్ |
ఏతైరపి కృతం దేవి యే మయా తవ కీర్తితాః ||

35

నాహం ధర్మమపూర్వం తే ప్రతికూలం ప్రవర్తయే |
పూర్వైరయమభిప్రేతో గతో మార్గోఽనుగమ్యతే ||

36

తదేతత్తు మయా కార్యం క్రియతే భువి నాన్యథా |
పితుర్హి వచనం కుర్వన్న కశ్చిన్నామ హీయతే ||

37

తామేవముక్త్వా జననీం లక్ష్మణం పునరబ్రవీత్ |
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్ ||

38

తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమమ్ |
విక్రమం చైవ సత్త్వం చ తేజశ్చ సుదురాసదమ్ ||

39

మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షణ |
అభిప్రాయమవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ ||

40

ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితమ్ |
ధర్మసంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమమ్ ||

41

సంశ్రుత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య వా |
న కర్తవ్యం వృథా వీర ధర్మమాశ్రిత్య తిష్ఠతా ||

42

సోఽహం న శక్ష్యామి పితుర్నియోగమతివర్తితుమ్ |
పితుర్హి వచనాద్వీర కైకేయ్యాఽహం ప్రచోదితః ||

43

తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిమ్ |
ధర్మమాశ్రయ మా తైక్ష్ణ్యం మద్బుద్ధిరనుగమ్యతామ్ ||

44

తమేవముక్త్వా సౌహార్దాద్భ్రాతరం లక్ష్మణాగ్రజః |
ఉవాచ భూయః కౌసల్యాం ప్రాంజలిః శిరసా నతః ||

45

అనుమన్యస్వ మాం దేవి గమిష్యంతమితో వనమ్ |
శాపితాఽసి మమ ప్రాణైః కురు స్వస్త్యయనాని మే ||

46

తీర్ణప్రతిజ్ఞశ్చ వనాత్పునరేష్యామ్యహం పురీమ్ |
యయాతిరివ రాజర్షిః పురా హిత్వా పునర్దివమ్ ||

47

శోకః సంధార్యతాం మాతర్హృదయే సాధు మా శుచః |
వనవాసాదిహైష్యామి పునః కృత్వా పితుర్వచః ||

48

త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా |
పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనాతనః ||

49

అంబ సంహృత్య సంభారాన్ దుఃఖం హృది నిగృహ్య చ |
వనవాసకృతా బుద్ధిర్మమ ధర్మ్యాఽనువర్త్యతామ్ ||

50

ఏతద్వచస్తస్య నిశమ్య మాతా
సుధర్మ్యమవ్యగ్రమవిక్లబం చ |
మృతేవ సంజ్ఞాం ప్రతిలభ్య దేవీ
సమీక్ష్య రామం పునరిత్యువాచ ||

51

యథైవ తే పుత్ర పితా తథాఽహం
గురుః స్వధర్మేణ సుహృత్తయా చ |
న త్వానుజానామి న మాం విహాయ
సుదుఃఖితామర్హసి గంతుమేవమ్ ||

52

కిం జీవితేనేహ వినా త్వయా మే
లోకేన వా కిం స్వధయాఽమృతేన |
శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం
మమేహ కృత్స్నాదపి జీవలోకాత్ ||

53

నరైరివోల్కాభిరపోహ్యమానో
మహాగజోఽధ్వానమనుప్రవిష్టః |
భూయః ప్రజజ్వాల విలాపమేనం
నిశమ్య రామః కరుణం జనన్యాః ||

54

స మాతరం చైవ విసంజ్ఞకల్పా-
-మార్తం చ సౌమిత్రిమభిప్రతప్తమ్ |
ధర్మే స్థితో ధర్మ్యమువాచ వాక్యం
యథా స ఏవార్హతి తత్ర వక్తుమ్ ||

55

అహం హి తే లక్ష్మణ నిత్యమేవ
జానామి భక్తిం చ పరాక్రమం చ |
మమ త్వభిప్రాయమసన్నిరీక్ష్య
మాత్రా సహాభ్యర్దసి మాం సుదుఃఖమ్ ||

56

ధర్మార్థకామాః కిల తాత లోకే
సమీక్షితా ధర్మఫలోదయేషు |
తే తత్ర సర్వే స్యురసంశయం మే
భార్యేవ వశ్యాఽభిమతా సుపుత్రా ||

57

యస్మింస్తు సర్వే స్యురసన్నివిష్టాః
ధర్మో యతః స్యాత్తదుపక్రమేత |
ద్వేష్యో భవత్యర్థపరో హి లోకే
కామాత్మతా ఖల్వపి న ప్రశస్తా ||

58

గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః
క్రోధాత్ప్రహర్షాద్యది వాపి కామాత్ |
యద్వ్యాదిశేత్కార్యమవేక్ష్య ధర్మం
కస్తం న కుర్యాదనృశంసవృత్తిః ||

59

స వై న శక్నోమి పితుః ప్రతిజ్ఞా-
-మిమామకర్తుం సకలాం యథావత్ |
స హ్యావయోస్తాత గురుర్నియోగే
దేవ్యాశ్చ భర్తా స గతిః స ధర్మః ||

60

తస్మిన్పునర్జీవతి ధర్మరాజే
విశేషతః స్వే పథి వర్తమానే |
దేవీ మయా సార్ధమితోఽపగచ్ఛే-
-త్కథం స్విదన్యా విధవేవ నారీ ||

61

సా మాఽనుమన్యస్వ వనం వ్రజంతం
కురుష్వ నః స్వస్త్యయనాని దేవి |
యథా సమాప్తే పునరావ్రజేయం
యథా హి సత్యేన పునర్యయాతిః ||

62

యశో హ్యహం కేవలరాజ్యకారణా-
-న్న పృష్ఠతః కర్తుమలం మహోదయమ్ |
అదీర్ఘకాలే న తు దేవి జీవితే
వృణేఽవరామద్య మహీమధర్మతః ||

63

ప్రసాదయన్నరవృషభః స్వమాతరం
పరాక్రమాజ్జిగమిషురేవ దండకాన్ |
అథానుజం భృశమనుశాస్య దర్శనం
చకార తాం హృది జననీం ప్రదక్షిణమ్ ||

64

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 21 Meaning In Telugu

రాముడు అరణ్యములకు పోతాను అని చెప్పడం, ఆ మాటలు విని కౌసల్య భోరున ఏడవడం అంతా చూస్తున్నాడు లక్ష్మణుడు. వారిని చూచి ఇలా అన్నాడు.

“అమ్మా కౌసల్యా! అన్నా రామా! ఒక స్త్రీ కోరిన కోరికలు నెరవేర్చడం కోసరం రాముడు అడవులకు వెళ్లడం నాకు అసలే ఇష్టం లేదు. మన తండ్రి దశరథుడు కామపీడితుడు, భోగలాలసుడు. విషయ వాంఛలకు లోబడ్డవాడు. అలాంటి రాజు, కైక మాటలకు లోబడి ఏమైనా మాట్లాడవచ్చును. కాని అది ఆచరణయోగ్యము కాదు. ఎందుకంటే రాముడు అయోధ్యనుండి వెడలగొట్టబడవలసిన తప్పు ఏమీ చేయలేదు. చేయడు కూడా. అటువంటప్పుడు రాముడు అడవులకు ఎందుకు వెళ్లాలి.

రామునికి పరమ శత్రువు కూడా రాముని గురించి చెడ్డగా మాట్లాడడు. ధర్మాచరణము చేయు వాడు ఎవరూ గుణవంతుడు, ఋజువర్తనుడు అయిన కుమారుని అడవులకు పంపడు. రాజధర్మము తెలిసిన వాడు ఎవడూ దశరథ మహారాజు మాటలను ధర్మ సమ్మతము గా అంగీకరింపడు. ధర్మసమ్మతము కాని రాజు ఆదేశములను మనము పాటించ నవసరము లేదు. రాజ్యం వీరభోజ్యము. నాకు అనుమతి ఇవ్వండి బలప్రయోగంతో రాజ్యము స్వాధీనము చేసుకుంటాను. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను.

రామా! నేను నీ పక్క ధనుస్సు పట్టుకొని నిలబడి ఉండగా నీ నీడను కూడా ఎవరూ తాకలేరు. రామా! ఈ అయోధ్యా నగరము నీది. ఈ అయోధ్యలో నీకు ఎవరైనా అపకారము చేయడానికి సాహసిస్తే, ఈ అయోధ్యానగరాన్నే నేలమట్టం చేస్తాను.
రామా! ఈ లోకం తీరే అంత. మెతకగా ఉంటే నెత్తికెక్కుతారు.

భరతునికి పట్టాభిషేకము చెయ్యాలి అనే వాడు ఎవడినైనాసరే భరతుని పక్షానమాట్లాడే ఎవడి నైనా సరే వాడిని వధిస్తాను. కైక పక్షము వహించి, కైక మీది ప్రేమతో నిన్ను అడవులకు పంపుతున్న మన తండ్రి దుర్మార్గుడు. దుర్మార్గుడు బంధింపతగినవాడు. అందుకని దశరథుని బంధించెదను. అవసరమైతే వధిస్తానుకూడా. గురువు అయినా సరే, దుర్మార్గుడు అయితే అతడు శిక్షార్హుడు.

రామా! మన తండ్రి ఎవరి అండచూచుకొని, పెద్దవాడైన నిన్ను కాదని రాజ్యమును భరతునికి ఇవ్వదలచుకున్నాడో అర్థం కావడం లేదు. నీతో నాతో విరోధము పెట్టుకొని భరతునికి రాజ్యాభిషేకము చేసే ధైర్యము దశరధునికి ఎక్కడిది?

అమ్మా! కౌసల్యాదేవీ! నాకు రాముడు అంటే ప్రాణము. నా ధనుస్సు మీద నేను చేసిన యజ్ఞయాగముల మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. రాముడు సామాన్యుడు కాడు. రాముడు అరణ్యములలోనూ అగ్నిలోనూ ప్రవేశింపగలడు. కానీ, దేనికైనా సరే,

రాముని కన్నా ముందు నేను ఉంటాను. నేను ఉండగా మీకు ఎలాంటి భయము లేదు. నిశ్చింతగా ఉండండి.” అని ఆవేశంతో పలికాడు అక్ష్మణుడు.

ఆవేశంతో పలికిన లక్ష్మణుని మాటలు విన్న కౌసల్య రాముని తో దు:ఖిస్తూ ఇలాఅంది. “రామా! నీ తమ్ముడు లక్ష్మణుని మాటలు విన్నావు కదా! నీకు ఇష్టం అయితే ఆ ప్రకారము చెయ్యి. అధర్మపరురాలు అయిన నా సవతి కైకేయీ మాటలు మనము పాటించ నవసరము లేదు. నీవు అరణ్యములకు వెళ్ల నవసరము లేదు.

రామా! నీకు అన్ని ధర్మములు తెలుసు. మాతృసేవ చెయ్యడం పరమ ధర్మము. కాబట్టి నీవు అయోధ్యలో ఉండి ఈ వృద్యాప్యంలో నా దగ్గర ఉండి నాకు సేవలు చెయ్యి. నీ ధర్మమును ఆచరించు. రామా! పూర్వము కాశ్యపుడు తన తల్లికి సేవలు చేసి తరించాడు. రామా! నీకు నీ తండ్రి ఎంతటి పూజనీయుడో, నేనూ అంతటి పూజనీయురాలనే కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీవు అరణ్యములకు వెళ్ల నవసరము లేదు. అరణ్యములకు వెళ్లుటకు నేను అనుమతి ఇవ్వను. నీవు నా దగ్గర ఉండి నాకు సేవలు చేసుకో.

నీవు అరణ్యములలో ఉంటే నేను ఇక్క మృష్టాన్నములు ఎలా భుజించగలను. నీతోపాటు ఉంటూ ఆకులు అలములు తినడం నాకు ఎంతో ఇష్టం. అలా కాకుండా నీవు అరణ్యములకు వెళితే నేను అన్నపానీయములను తీసుకోకుండా ప్రాయోపవేశము చేస్తాను. క్రుంగి, కృశించి మరణిస్తాను. నీ కోసరం నిన్ను తల్చుకుంటూ నేను మరణిస్తే నీకు దుర్గతులు కలుగుతాయి. తర్వాత నీ ఇష్టం.” అని పలికింది.

కౌసల్య తమ్ముడు లక్ష్మణుని మాటలూ, తల్లి కౌసల్య మాటలూ సావధానంగా విన్నాడు రాముడు. వారితో ఇలా అన్నాడు.

“అమ్మా! నాకు నా తండ్రి దైవసమానుడు. ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి నాకు లేదు. కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను. నన్ను అరణ్యములకు వెళ్లనీ. పూర్వము పితృవాక్య పరిపాలన కొరకు కండు మహర్షి గోవును కూడా చంపాడు. మన వంశములోని సగర కుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు భూమి నంతా తవ్వారు. ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అంతెందుకు, తన తండ్రి జమదగ్ని ఆజ్ఞమేరకు, పరశు రాముడు, తన తల్లి రేణుకను గొడ్డలితో నరికి చంపాడు. అమ్మా!

మన పూర్వీకులందరూ పితృవాక్పరిపాలనకు తమ ప్రాణాలు కూడా అర్పించారు. నేను నా తండ్రి మాట మేరకు కేవలం అరణ్యములకు పోతున్నాను. నా పూర్వీకులు ఆచరించిన ధర్మమునే నేనూ ఆచరిస్తున్నాను.

ఈనాడు నేను నా స్వార్థము కొరకు, పితృవాక్యమును పాటించకుండా, కొత్త ధర్మమును సృష్టించలేను. తండ్రి మాటను పాటించిన వాడికి దోషము అంటదు. తండ్రిమాటను ధిక్కరించి నేను నా పూర్వీకులముందు దోషిగా నిలబడలేను.” అని తల్లితో పలికిన రాముడు తమ్ముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“తమ్ముడా లక్ష్మణా! నీకు నా మీద ఎంత ప్రేమ, వాత్సల్యము గౌరవము ఉన్నాయో నాకు తెలుసు. నా తల్లికి ధర్మసూక్ష్మములు వేదాంత రహస్యములు తెలియక పోవడం వలన, పామరత్వం చేత దుఃఖము పొందుతూ ఉంది.

లక్ష్మణా! ఈ లోకంలో ధర్మాచరణ ఎంతో ముఖ్యము. ధర్మము నందే సత్యము ప్రతిష్ఠితమై ఉన్నది. తండ్రిగారు తన ధర్మమును తాను పాటించారు. తల్లికి వరాలు ఇస్తాను అన్నారు. ఆమె కోరుకొన్నది ఇవ్వడం రాజు ధర్మము. ఆ ధర్మమును ఆయన నిర్వర్తించాడు.

పితృవాక్పరిపాలన నా ధర్మము. కాబట్టి నా ధర్మమును నేను నిర్వర్తించాలి కదా! ధర్మమును ఆశ్రయించిన వాడు తండ్రికి, తల్లికి, గురువుకు ఇచ్చిన మాటను తప్పకూడదు. నా తండ్రి మాటలను నా తల్లి కైకేయీ నాకు చెప్పింది. ఇందులో ఆమె తప్పేముంది. తండ్రి మాటలను ఆచరించడం నా ధర్మము.

కాని క్షత్రియ ధర్మము వేరుగా ఉంటుంది. బలవంతంగా రాజ్యము ఆక్రమించుకోడం క్షత్రియ ధర్మము. ప్రస్తుతము మనకు కులధర్మమే ముఖ్యము. క్షత్రియ ధర్మము కాదు. నీవు కూడా క్షత్రియ ధర్మమును పక్కనపెట్టి ధర్మాచరణము చెయ్యి. నీ కోపము వదిలి పెట్టు. నేను చెప్పిన మాటలను ఆచరించు.” అని అన్నాడు రాముడు.

తరువాత తల్లి కౌసల్యను చూచి చేతులు జోడించి ఇలా అన్నాడు. “అమ్మా! నేను అరణ్యములకు పోవడానికి నాకు అనుమతి ఇవ్వు. దీనికి మారు పలికితే నా మీద ఒట్టు. నా ప్రయాణమునకు కావలసిన వస్తువులను సేకరించు. అమ్మా! పదునాలుగు సంవత్స రములు ఎంతలో అయిపోతాయి. ఇలా వెళ్లి అలాతిరిగి వస్తాను. నామాట నమ్ము. అమ్మా! నీ మనసులో నా గురించి దుఃఖించకు.

తండ్రిమాట ప్రకారము వెళుతున్నాను. నీ మాట ప్రకారము తిరిగి వస్తాను. అమ్మా! మనకందరకూ పెద్ద తండ్రి గారు. నీవు, నేను, సీత లక్ష్మణుడు, అందరమూ తండ్రిగారి మాటను గౌరవించాలి కదా! అదియే కదా సనాతనధర్మము. అమ్మా! ఇంక నా పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయడం ఆపి, నా వనవాసమునకు ఏర్పాట్లు చెయ్యి.” అని అన్నాడు రాముడు.

రాముడు అలా మాట్లాడుతుంటే కౌసల్యకు ఏమనాలో తోచలేదు. రాముని చూచి ఇలా అంది. “రామా! నీవు సనాతన ధర్మము గురించి చెప్పావు. సనాతన ధర్మములో తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో తల్లి మాటకూ అంతే విలువ ఇవ్వాలి కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీ తల్లి మాట ప్రకారము నీ తల్లిని విడిచి నీవు వెళ్లవద్దు. నన్ను దు:ఖముల పాలు చెయ్యవద్దు. నేను నీకు తల్లిని, గురువును. నేను నీకు వనములకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వను. నీవు వెళ్లడానికి వీలు లేదు.

రామా! నీవు లేని ఈ బ్రతుకు నిరర్థకము. నేను చచ్చి స్వర్గానికి వెళ్లినా, అక్కడ లభించే అమృతము కూడా నీకుసాటి రాదు. నీవు ముహూర్తకాలము నా ఎదుట ఉంటేచాలు, ఏ స్వర్గసుఖములు దానికి సమానం కావు. రామా! నన్ను విడిచి వెళ్లకు.” అంటూ దీనంగా ఏడుస్తున్న తల్లిని చూచి రాముని మనస్సు ద్రవించి పోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు రామునికి. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! నీవు కూడా తల్లిగారితో చేరి నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ధర్మమా! తల్లిగారు చూడు ఎలా పరితపిస్తూ ఉందో. ఆమెను ఊరడించాల్సింది పోయి, ఆమెను, నన్ను, నీ మాటలతో బాధపెట్టావు.

లక్ష్మణా! అర్థకామములు ధర్మ సమ్మతము లైనపుడే అవి మంచి ఫలములను ఇస్తాయి. అందుకని అర్థకామముల కంటే ధర్మమునకే ప్రాధాన్యము. ధర్మాచరణము అత్యంత ఆవశ్యకము. మనము ఎల్లప్పుడూ ధర్మసమ్మతములైన పనులను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండాలి.

కేవలము అర్థము, కామము తో కూడిన పనులను చేయడం వలన రాగ ద్వేషములు ప్రబలుతాయి. అవి ధర్మపరులకు మంచివి కావు. మన తండ్రి వృద్ధుడు. మనకు పూజ్యుడు. ఆయన కామ ప్రకోపంతో గానీ, కోపంతో గానీ మనలను ఒక పనిచెయ్యమని చెప్పినప్పుడు, అది ధర్మంకాదు అని మనం నిరాకరించడం, ధర్మాచరణము అనిపించుకోదు. కేవలము దుష్టులు మాత్రమే అలా చేస్తారు.

లక్ష్మణా! మన తండ్రిగారు నీకు, నాకు తండ్రి, గురువు, దైవము. అలాగే మన తల్లి గారికి ఆయన భర్త. భర్త మాట భార్యకు శిరోధార్యము. కాబట్టి మనందరికీ దశరథ మహారాజు ఆజ్ఞను పాటించడం తప్ప మరోమార్గము లేదు. పైగా, తన భర్త అయిన దశరథమహారాజు గారు జీవించిఉండగా, భర్తను వదిలిపెట్టి, తల్లిగారు నా వెంట అడవులకు ఎలా రాగలరు. అది ధర్మము కాదు.”

అని తల్లి వంక తిరిగి“అమ్మా! నాకు అరణ్యములకు వెళ్లుటకు అనుమతి ఇవ్వు. పదునాలుగు సంవత్సరముల తరువాత నేను క్షేమంగా అయోధ్యకు తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించు. నా తండ్రి మాటను పాటించడం, నాపూర్వీకులు నడిచిన బాటలో నడవడం–వీటితో పోలిస్తే, ఈ తుచ్ఛమైన రాజ్యభోగములు నాకు తృణప్రాయములు. కేవలం రాజ్యం కోసరం శాశ్వత కీర్తి ప్రతిష్టలను వదులుకోలేను.

అమ్మా! ఈ జీవితము నీటి బుడగ వంటిది. నాలుగు రోజులు రాజ్యం పాలించడం కోసరం, ధర్మము తప్పి, అధర్మంగా రాజ్యమును కైవసం చేసుకోవడం మంచిది కాదు.” అని తన మనస్సులో ఉన్న మాటను అమ్మకు, తమ్ముడికి స్పష్టం చేసాడు. తల్లికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారముచేసాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వావింశః సర్గః (౨౨) >>

Ayodhya Kanda Sarga 4  In Telugu – అయోధ్యాకాండ చతుర్థః సర్గః

Ayodhya Kanda Sarga 4  In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. చతుర్థ సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది. ఈ విధంగా చతుర్థ సర్గ రాముని ధర్మ నిష్ఠ, కర్తవ్య నిబద్ధత మరియు తన కుటుంబ సభ్యులపై ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది.

మాత్రాశీఃపరిగ్రహః

గతేష్వథ నృపో భూయః పౌరేషు సహ మంత్రిభిః |
మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞః స నిశ్చయమ్ ||

1

శ్వ ఏవ పుష్యో భవితా శ్వోఽభిషేచ్యస్తు మే సుతః |
రామో రాజీవతామ్రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభుః ||

2

అథాంతర్గృహమావిశ్య రాజా దశరథస్తదా |
సూతమాజ్ఞాపయామాస రామం పునరిహానయ || [మంత్రయామాస]

3

ప్రతిగృహ్య స తద్వాక్యం సూతః పునరుపాయయౌ |
రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః ||

4

ద్వాఃస్థైరావేదితం తస్య రామాయాగమనం పునః |
శ్రుత్వైవ చాపి రామస్తం ప్రాప్తం శంకాన్వితోఽభవత్ ||

5

ప్రవేశ్య చైనం త్వరితం రామో వచనమబ్రవీత్ |
యదాగమనకృత్యం తే భూయస్తద్బ్రూహ్యశేషతః ||

6

తమువాచ తతః సూతో రాజా త్వాం ద్రష్టుమిచ్ఛతి |
శ్రుత్వా ప్రమాణమత్ర త్వం గమనాయేతరాయ వా ||

7

ఇతి సూతవచః శ్రుత్వా రామోఽథ త్వరయాన్వితః |
ప్రయయౌ రాజభవనం పునర్ద్రష్టుం నరేశ్వరమ్ ||

8

తం శ్రుత్వా సమనుప్రాప్తం రామం దశరథో నృపః |
ప్రవేశయామాస గృహం వివక్షుః ప్రియముత్తమమ్ ||

9

ప్రవిశన్నేవ చ శ్రీమాన్రాఘవో భవనం పితుః |
దదర్శ పితరం దూరాత్ప్రణిపత్య కృతాంజలిః ||

10

ప్రణమంతం సముత్థాప్య తం పరిష్వజ్య భూమిపః |
ప్రదిశ్య చాస్మై రుచిరమాసనం పునరబ్రవీత్ ||

11

రామ వృద్ధోఽస్మి దీర్ఘాయుర్భుక్తా భోగా మయేప్సితాః |
అన్నవద్భిః క్రతుశతైస్తథేష్టం భూరిదక్షిణైః ||

12

జాతమిష్టమపత్యం మే త్వమద్యానుపమం భువి |
దత్తమిష్టమధీతం చ మయా పురుషసత్తమ ||

13

అనుభూతాని చేష్టాని మయా వీరసుఖాన్యపి |
దేవర్షిపితృవిప్రాణామనృణోఽస్మి తథాఽఽత్మనః ||

14

న కించిన్మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ |
అతో యత్త్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి ||

15

అద్య ప్రకృతయః సర్వాస్త్వామిచ్ఛంతి నరాధిపమ్ |
అతస్త్వాం యువరాజానమభిషేక్ష్యామి పుత్రక ||

16

అపి చాద్యాశుభాన్రామ స్వప్నే పశ్యామి దారుణాన్ |
సనిర్ఘాతా మహోల్కాశ్చ పతితా హి మహాస్వనాః || [దివోల్కా]

17

అవష్టబ్ధం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః |
ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాంగారకరాహుభిః ||

18

ప్రాయేణ హి నిమిత్తానామీదృశానాం సముద్భవే |
రాజా హి మృత్యుమవాప్నోతి ఘోరాం వాఽఽపదమృచ్ఛతి ||

19

తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ | [విముహ్యతి]
తావదేవాభిషించస్వ చలా హి ప్రాణినాం మతిః ||

20

అద్య చంద్రోఽభ్యుపగతః పుష్యాత్పూర్వం పునర్వసూ |
శ్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః ||

21

తతః పుష్యేఽభిషించస్వ మనస్త్వరయతీవ మామ్ |
శ్వస్త్వాఽహమభిషేక్ష్యామి యౌవరాజ్యే పరంతప ||

22

తస్మాత్త్వయాఽద్యప్రభృతి నిశేయం నియతాత్మనా |
సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాయినా ||

23

సుహృదశ్చాప్రమత్తాస్త్వాం రక్షంత్వద్య సమంతతః |
భవంతి బహువిఘ్నాని కార్యాణ్యేవంవిధాని హి ||

24

విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః |
తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ ||

25

కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతః స్థితః |
జ్యేష్ఠానువర్తీ ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః ||

26

కిం తు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః |
సతాం చ ధర్మనిత్యానాం కృతశోభి చ రాఘవ ||

27

ఇత్యుక్తః సూఽభ్యనుజ్ఞాతః శ్వోభావిన్యభిషేచనే |
వ్రజేతి రామః పితరమభివాద్యాభ్యయాద్గృహమ్ ||

28

ప్రవిశ్య చాత్మనో వేశ్మ రాజ్ఞోద్దిష్టేఽభిషేచనే |
తత్క్షణేన చ నిష్క్రమ్య మాతురంతఃపురం యయౌ || [వినిర్గమ్యే]

29

తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీమ్ |
వాగ్యతాం దేవతాగారే దదర్శాయాచతీం శ్రియమ్ ||

30

ప్రాగేవ చాగతా తత్ర సుమిత్రా లక్ష్మణస్తథా |
సీతా చ నాయితా శ్రుత్వా ప్రియం రామాభిషేచనమ్ ||

31

తస్మిన్కాలే హి కౌసల్యా తస్థావామీలితేక్షణా |
సుమిత్రయాఽన్వాస్యమానా సీతయా లక్ష్మణేన చ ||

32

శ్రుత్వా పుష్యేణ పుత్రస్య యౌవరాజ్యాఽభిషేచనమ్ |
ప్రాణాయామేన పురుషం ధ్యాయమానా జనార్దనమ్ ||

33

తథా సన్నియమామేవ సోఽభిగమ్యాభివాద్య చ |
ఉవాచ వచనం రామో హర్షయంస్తామనిందితాం ||

34

అంబ పిత్రా నియుక్తోఽస్మి ప్రజాపాలనకర్మణి |
భవితా శ్వోఽభిషేకో మే యథా మే శాసనం పితుః ||

35

సీతయాఽప్యుపవస్తవ్యా రజనీయం మయా సహ |
ఏవమృత్విగుపాధ్యాయైః సహ మాముక్తవాన్పితా ||

36

యాని యాన్యత్ర యోగ్యాని శ్వోభావిన్యభిషేచనే |
తాని మే మంగళాన్యద్య వైదేహ్యాశ్చైవ కారయ ||

37

ఏతచ్ఛ్రుత్వా తు కౌసల్యా చిరకాలాభికాంక్షితమ్ |
హర్షబాష్పకలం వాక్యమిదం రామమభాషత ||

38

వత్స రామ చిరం జీవ హతాస్తే పరిపంథినః |
జ్ఞాతీన్మే త్వం శ్రియా యుక్తః సుమిత్రాయాశ్చ నందయ ||

39

కళ్యాణే బత నక్షత్రే మయి జాతోఽసి పుత్రక |
యేన త్వయా దశరథో గుణైరారాధితః పితా ||

40

అమోఘం బత మే క్షాంతం పురుషే పుష్కరేక్షణే |
యేయమిక్ష్వాకురాజ్యశ్రీః పుత్ర త్వాం సంశ్రయిష్యతి ||

41

ఇత్యేవముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ |
ప్రాంజలిం ప్రహ్వమాసీనమభివీక్ష్య స్మయన్నివ ||

42

లక్ష్మణేమాం మాయా సార్ధం ప్రశాధి త్వం వసుంధరామ్ |
ద్వితీయం మేంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా ||

43

సౌమిత్రే భుంక్ష్వ భోగాంస్త్వమిష్టాన్రాజ్యఫలాని చ |
జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే ||

44

ఇత్యుక్త్వా లక్ష్మణం రామో మాతరావభివాద్య చ |
అభ్యనుజ్ఞాప్య సీతాం చ జగామ స్వం నివేశనమ్ ||

45

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్థః సర్గః ||

Ayodhya Kanda Sarga 4 Meaning In Telugu

తరువాత దశరథుడు మంత్రులతో మరలా దీర్ఘంగా ఆలోచించాడు. మరునాడే పుష్యమీ నక్షత్రము. అందుకని, ఆలస్యం లేకుండా రాముని మరునాడు పుష్యమీ నక్షత్రము ఘడియలలో పట్టాభిషిక్తుని చేయవలెనని నిశ్చయించాడు. మంత్రులందరూ ఆ నిర్ణయానికి తమ ఆమోదము తెలిపారు.

తరువాత దశరథుడు సభాభవనము నుండి తన అంతఃపురమునకు వెళ్లాడు. సుమంత్రుని పిలిచి రాముని తన మందిరమునకు తీసుకొని రమ్మని ఆదేశించాడు. దశరథుని ఆదేశాను సారము సుమంత్రుడు రాముని వద్దకు వెళ్లాడు.

“ఇప్పుడేగా తండ్రి గారి వద్దనుండి వచ్చాను మరలా ఎందుకు వచ్చావు?” అని అడిగాడు.

“దశరథమహారాజుగారు తమరిని చూడాలని అనుకుంటున్నారు. మీరు మీ తండ్రి గారి వద్దకు వెళ్లాలో లేదో మీరే నిర్ణయించు కోండి.” అని అన్నాడు సుమంత్రుడు. మారు మాటాడకుండా రాముడు సుమంత్రునితో కూడా దశరథుని వద్దకు వచ్చాడు. తండ్రి గారికి నమస్కరించి, ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు రాముడు. దశరథుడు రాముని ప్రేమగా లేవనెత్తి కౌగలించుకొని, పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టాడు.

“రామా! నేను చెప్పబోవు మాటలు శ్రద్ధగా విను. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. రాజభోగాలు తనివిదీరా అనుభవించాను. ఎన్నో యజ్ఞములు, యాగములను చేసాను. ఈ భూలోకంలో సాటిలేని మేటి వీరులను సంతానంగా కలిగి ఉన్నాను. దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణము, విప్ర ఋణము, ఆత్మఋణము తీర్చుకున్నాను. ఇంక నీ పట్టాభిషేకము మాత్రము మిగిలి ఉన్నది. నీవు ఈ అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకని నిన్ను యౌవరాజ్యాభిషిక్తుని చేయ సంకల్పించాను.

ఎందుకనో నాకు కొన్ని దుశ్శకునములు పొడసూపుతున్నాయి. నా జాతకములో చెడ్డ గ్రహము లైన సూర్య, అంగారక, రాహు గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో నాకు మరణము కానీ, లేక తీవ్రమైన ఆపద కాని సంభవించే అవకాశం ఉంది. మనస్సు చంచల మైనది. ఏ నిముషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు. అందుకే నాకు చాలా తొందరగా ఉంది. నా మనసులో మరొక ఆలోచన పొడసూపక ముందే నీ యౌవరాజ్యపట్టాభిషేకము జరిగిపోవాలి అని అనుకుంటున్నాను.

ఈ రోజు పునర్వసు నక్షత్రము. రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రములో ఉంటాడు. ఆ శుభ ముహూర్తము లో నీ పట్టాభిషేకము జరిగిపోవాలి. ఈ సందర్భములో నీవు ఈ రోజు రాత్రి అంతా నీ భార్య సీతతో సహా ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రపోవాలి.

ప్రస్తుతము భరతుడు అయోధ్యలో లేడు. భరతుడు అయోధ్యలో లేని సమయములోనే నీ పట్టాభిషేకము జరగాలని నా కోరిక. అంటే భరతుడు దుర్మార్గుడు అనికాదు. నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమమునే కోరుతుంటాడు. పైగా భరతుడు ధర్మాత్ముడు, దయాళువు. ఇంద్రియములను జయించిన వాడు. కానీ, మనస్సు చంచలమైనది. ఎటువంటి ధర్మాత్ముల మనస్సులు కూడా చలింపవని నమ్మకము లేదు కదా. ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధిపుడుతుందో ఎవరికి తెలుసు! నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భరతుని మనస్సు కూడా మారుతుందే మో అని నా అనుమానము. అందుకని ఈ తొందర. ఇంక నీవు వెళ్లవచ్చు.” అని పలికాడు దశరథుడు.

తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు, తండ్రి గారి వద్ద సెలవు తీసుకొని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురమునకు వెళ్లాడు. రాముని పట్టాభిషేక వార్త అంతకు మునుపే కౌసల్యకు తెలియడంతో, ఆమె సీతను, సుమిత్రను, లక్ష్మణుని తన వద్దకు పిలిపించుకొంది. కౌసల్య పట్టుబట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజచేస్తూ ఉంది. ఆమె పక్కనే సుమిత్ర, సీత, లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు.

రాముడు వచ్చి తల్లి కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించాడు. ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! తండ్రిగారు నన్ను ఇంక నుంచి ప్రజాపాలన చూడమన్నారు. అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. రేపే యౌవరాజ్య పట్టాభిషేకము. ఈ రోజు రాత్రి అంతా నేను నా భార్య సీత ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రించవలెనని ఋత్తిక్కులు, తండ్రిగారు ఆదేశించారు. అమ్మా! నీవు నాకూ, సీతకూ, రేపు జరగబోవు శుభకార్యమునకు చేయవలసిన మంగళకర కార్యక్రములు జరిపించు.” అని అన్నాడు.

తన కుమారునికి యౌవరాజ్యపట్టాభిషేకము అని తన కుమారుని నోటి నుండి విని ఆ తల్లి పొంగిపోయింది. ఆమె కండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “వత్సా! రామా! చిరంజీవ, చిరంజీవ చిరంజీవిగా వర్ధిల్లు. నీవు నీ తమ్ములకు, నీ తల్లి సుమిత్రకు సంతోషము కలుగచెయ్యి. నాయనా! నీవు పుట్టిన వేళా విశేషము చాలామంచిది. నీవు నీ మంచి గుణములతో నీ తండ్రిని సంతోషింప జేసావు. నేను శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసిన పూజలు అన్నీ ఫలించాయి. అందుకే ఇక్ష్వాకు వంశానికి రాజువు అవుతున్నావు. సుఖంగా వర్థిల్లు.” అని మనసారా దీవించింది.

తల్లి దీవనలు అందుకున్న రాముడు, లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “సోదరా! లక్ష్మణా! ఈ పట్టాభిషేకము నాకు కాదు. మన ఇద్దరికీ. మనం ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము. నీవు నాకు రెండో ఆత్మ. అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజువు. నీ ఇష్టంవచ్ని రాజభోగములు అనుభవించు. పరిపాలన సాగించు. అసలు నీ కోసమే నేను ఈ యౌవరాజ్య పట్టాభిషేకము చేసుకుంటున్నాను.” అని అన్నాడు.

తరువాత సీతా రాములు కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించి, తమ మందిరమునకు వెళ్లిపోయారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచమః సర్గః (5) >>