మానవ నేస్తాలు సూక్తులు

మానవ నేస్తాలు సూక్తులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • లక్షణంగా పెద్ద చదువులు చదువుకోవాలన్నా సలక్షణమైన ఉద్యోగం కావాలన్నా లక్షలకు లక్షలు సంపాదించాలన్నా ఆత్మవిశ్వాసం కావాలన్నా!
  • చెప్పేవాడు చాదస్త్రం చెపుతుంటే వ్రాసేవాడు వాస్తవాలు (వ్రాయకపోతే వివేకమున్నవాడెవడూ వినడు ఇంగిత జ్ఞానమున్నవాడెవడూ చదవడు!
  • వచ్చిన కష్టం పోదని భయపడితే బండలాంటి వాడిక్కూడా గుంట జబ్బొస్తుంది వచ్చిన సమస్యకు పరిమ్మారం దొరికితే ఎంత పెద్ద జబ్బయినా పారిపోతుంది!
  • గొప్పలు చెప్పుకోడంలో లేదు ప్రగల్భాలు పలకడంలో లేదు చేసేపని ఏదైనా భ్రద్దగా చేయటంలో వుంది నీ గొప్పతనం.
  • చేయగలిగిన వృత్తి చేపట్టు ఆ వృత్తి ఏదైనా ఫర్వాలేదు చేసే పనిలో సామర్ధ్యం చూపించి నీ వృత్తికి పదినుందిలో మెప్పు తెచ్చుకో.
  • వందమష్రళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభించినట్లే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నూరు మెట్లెక్కి నీ ఆశాసౌధం చేరుకో.
  • జీవితంలో సదా ఆనందం పండాలని ఆశించే మనిషీ అది లభించలేదని నిరుత్సాహంతో కృంగి పోయే బదులు మానవజన్మ వడ్డించిన విస్తరి కాదని తెలుసుకుంటే బాగుపడతావు ఓ మనిషీ.
  • అభిమానం చూపడం తప్పుకాదు దురభిమానం పనికిరాడు ప్రేమించడం తప్పుకాదు ద్వేషిచడం పనికిరాదు.
  • సంస్కారం తెలుపునది సంస్కృతి సంస్కృతి నేర్పునది సంస్కృతం అందుకే సంస్కృతం నేర్చుకో సంస్కారవంతుడవు కా!
  • ఇహపరాల గురించిన చర్చలతో ఇందుగల డందుగలడనే దండకంతో దరిద్రనారాయణుల కడుపులు ఎలా నింపగలము?

మానవ సూక్తులు

  • ఆకలితో నకనకలాడిపోతున్నాను ఇంత అన్నం పెట్టు తల్దీ అని ఆర్ధిస్తే రేపురా బాబూ పరమాన్నం పెడ్డాను అన్నదట ఓ పుణ్యా్మురాలు !
  • కష్టం చేయకుండా క్రమశిక్షణ లేకుండా ప్రపంచంలో ఏది సాధించాలన్నా కష్టమే ధనలక్ష్మి కావాలన్నా, జయలక్ష్మి కావాలన్నా కార్యోన్ముఖుడవై కర్తవ్య పాలన చేయాలన్నా.
  • పది ఇస్తే పరమ మిత్రుడు వంద ఇస్తే పరము పూజ్యుడు వేయి అడిగినపుడు ఇవ్వలేకపోతే ఆ పరమ పూజ్యుదే పరమ – దుర్మార్లుడు.
  • మనిషి మనస్సు మహావిచిత్రమైనది అన్నీ అనుభవించి తీరాలంటుంది కానీ దీనికో అద్భుతప్పున గుణమున్నది ఏది అలవాటుబేస్తే అదే కావాలంటుంది.
  • హంగామా చేస్తే పని అవుతుందనుకుంటాం బెదిరిస్తే ఎదుటివాడు పారిపోతాడనుకుంటాం కోర్టుకెక్కితే న్యాయం జరుగుతుందనుకుంటాం చివరకు అప్పులపాలై అన్నీ పోగొట్టుకుంటాం.
  • ఒక దినం పెళ్ళికొరకు సంవత్సరం పొడుగునా హడావిడి చేసినట్ల జీవితమంతా నానా హంగమా చేస్తున్నాం ఒక దినం ప్రాణం వదలిపోవడానికి !
  • లోభిని చూసీ డబ్బు నవ్వుతుంది భోగిని చూస్ ఇంద్రియములు నవ్వుచున్నవి క్షణికమైన శరీరమును చూసుకొని మురిసే మూర్షున్ని చూసీ మృత్యువు నవ్వుచున్నది.
  • బియ్యంలో కల్తీ నెయ్యిలో కల్తీ ఉప్పులో కల్తీ పప్పులో కల్తీ ప్రాణదానం చేసే మందులో కల్తీ అసలు వీళ్ళ బ్రతుకులే కల్తీ.
  • కల్తీ కల్తీ ఎటు చూసినా కల్తీయే కల్తీలేని-నికార సైనదొక్కటే స్వార్థం – స్వార్థం.
  • నేను – నా ఇల్లు నా ఆస్తి – నా పిల్లలు అనే మత్తు అంతా ఒక్కసారే దిగిపోతుంది ఆ మృత్యుదేవత పిలుపు రాగానే!
  • ఇంటి ఇల్లాలుకు ఆభరణాలపై మోజు యజమానికి క్లబ్బులో పేకాట మోజు పిల్లకు సినిమాలు, టీవీలపై మోజు ఈ మోజులతో ఆ సంసారం ఈ బాగుపడేదేరోజు?
  • నదిలో కొట్టుకుపోతున్న వాడొకడు తదేక దీక్షతో దేవున్ని ప్రార్థిస్తూ ఆ ప్రక్కనే వెళ్ళే పడవను పట్టించుకోక ప్రాణాలు పోగొట్టుకున్నాడు స్వర్గాని కెళ్ళాక ‘నిన్ను నమ్ముకుంటే నన్ను నట్టేట ముంచావేమి స్వామీ’ అని అడిగితే పంపించిన పడవను కాదని కళ్ళు మూసుకుని జపం చేసుకునేంత మూర్ఖుడవనుకోలేదు భక్తా అన్నాడట ఆ దేవుడు.
  • చిన్న పిల్లాడిని వూరికే కొట్టొద్దురా అన్నాడట తండ్రి తన కొడుకుతో నా బిడ్డను హద్దులో పెట్టుకునే హక్కు నాకు లేదా అన్నాడట కొడుకు తండ్రితో నా కొడుకును హద్దులో పెట్టే హక్కు నాకు లేకుండా పోయిందన్నాడట ఆ తండ్రి ఆ వేదనతో.
  • ఎన్నిరోజుల నుంచి త్రాగుతున్నాను ఎన్ని సీసాలు ఖాళీ చేశాను నా పిచ్చి కానీ త్రాగితే పోయేదా ఈ మనోవ్యధ?
  • ఎందుకు బాబూ నన్ను అంతగా దూషిస్తున్నావు నాకు తెలిసి నీకెప్పుడూ సాయం చేసినట్టు లేదే!

మరిన్ని సూక్తులు మీకోసం:

Kavachalu – కవచాలు

Kavachalu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాస అన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించిన చో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… కవచముల గురించి క్లూప్తం గా ఈ క్రింద ఇచ్చిన లింకుల నందు ఇవ్వబడినది. అవి ఏమిటో తెలుసుకుందాం…

Kavachalu – కవచాలు

Kapotha Kapothi Katha In Telugu – కపోత కపోతి కథ

Kapotha Kapotha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కపోత కపోతి కథ.

కపోత కపోతి కథ

అడవిలో వేటకోసం వెళ్ళిన ఓ బోయవాడు కుండపోతగా వర్షం పడటంతో ఓ చెట్టు నీడలో ఆశ్రయం తీసుకున్నాడు. ఆ చెట్టు మీద ఓ పావురాల జంట కాపురముంటున్నాయి. ప్రొద్దుననగా వెళ్ళిన కపోతి తిరిగి రాకపోవడంతో ఎంతో దిగులుగా ఉన్నది కపోతం. ఆ పావురం అలసి ఉన్న బోయవాడిని చూసింది. పక్కనే ఉన్న వలను వేట సామాను చూసి భయపడింది. “ఎప్పుడో ప్రొద్దుననగా వెళ్ళింది. ఎక్కడున్నదో ఎలాగున్నదో? నా ప్రాణేశ్వరికి ఎట్టి ఆపద సంభవించలేదు కదా? అది లేని నా జీవనం శూన్యం శోకమయం. నా హృదయేశ్వరి ఏ బోయవాడి చేతులోనో చిక్కలేదు. కదా” అని బాధపడింది. ఇంతలో వాన తగ్గుముఖం పట్టిందికానీ చలి మృత్యుదేవతలా ఆ వనాన్ని కబళించింది. పావురం యొక్క శోకం విని ఆడ పావురం “ఇక్కడ ఈ బోయవాడి వలలో ఉన్నాను ప్రాణనాథ”! అని అన్నది. “హతవిధి! ఈ వలలో చిక్కుకున్నావా” అని బిగ్గరగా ఏడ్వసాగింది. మగ పాపురం.

“శరీరాలు శాశ్వతాలు కావు. మంచి ఒక్కటే మిగిలివుండేది. ఎల్లప్పుడూ మనకు తోడు పుండేదదే. ఆర్హుడైనవాని శరణుజొచ్చిన వాని కాపాడటం కంటే గొప్ప ధర్మం లేదని పెద్దలంటారు. పాపం! ఈ బోయవాడు ఆర్హుడై మన గూటి దగ్గరకు వచ్చాడు. నా గురించి విచారణ మాని అతిథి ఐన ఈతని సంగతి చూడు” మని ఆడ పావురం అమృత వాక్యాలు పలికింది.

వెంటనే ఆ బోయవాని ముందు నిలిచి ఆ కపోతశ్రేష్ఠుడిలా అన్నాడు “అయ్యా! నీవు బాగా అలసినట్టున్నావు. నేనేమి సేవ చేయగలనో చెప్పండి”. బోయవాడు “ఓ పావురమా! నీవెంత దయగలదానవు! చలితో నా శరీరం గడ్డకట్టుకు పోతున్నట్టుంది. ఈ చలినుండి నన్ను కాపాడు” అన్నాడు. పావురం వెంటనే గూటిలో దాచుకున్న ఎండు పుల్లలు తెచ్చి చలిమంట చేసింది. ఆ పావురం చేసిన సహాయానికెంతో సంతోషించి ఆ బోయవాడు చలి కాచుకున్నాడు. చలి తగ్గిన బోయవాడు “గువ్వా! ఎంతో ఆకలిగా వుంది” అన్నాడు. కొంతసేపాలోచించి “అయ్యా! పక్షుల దగ్గర దాచిపెట్టుకునే ఆహారం ఉండదుకదా. “పరోపకారార్థం ఇదం శరీరం” అని మా పెద్దలు చెప్పారు. నా శరీరాన్ని తప్ప నేనేదీ ఇవ్వలేను. దీన్ని తీసుకుని మీ క్షుద్బాధ తీర్చుకోండి” అని బోయవాడు ఆశ్చర్యపోయి చూస్తుండగా ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో దూకింది పావురము.

ఆ దృశ్యం చూసి బోయవాడికి జ్ఞానోదయం అయ్యింది. “ఆహా! ఈ పావురము ఎంత గొప్పది! నా ఆకలి తీర్చుటకు తన శరీరాన్ని భార్యాపిల్లల్ని ప్రలోభాన్ని విడిచి శరీరం తృణప్రాయంగా ఎంచి ఆహుతిచ్చింది. ఏమి త్యాగం! ఏమి దయ! రూపంలో చిన్నదే ఐనా గుణంలో మేటిది. ఇక నేను హింస చేయను. మోహం విడుస్తాను” అని అనుకున్నాడు. వలలోని పక్షులన్నిటినీ విడిచి పెట్టాడు. వెంటనే అగ్ని దగ్గరకు వెళ్ళి ఆ ఆడ పావురం ఇలా ఏడ్చింది “నీవు లేనిది క్షణమైనా మనజాలను. నాకెవరు దిక్కు? బ్రతుకులోను మరణంలోను నీతోనే ఉంటాను”. అగ్ని ప్రదక్షిణం చేసి శరీరత్యాగం చేసింది ఆ కపోతి. ఇంతలో ఓ దివ్య విమానము వచ్చి ఆ పావురాల జంటను ఊర్ధ్వలోకాలకు తీసుకొని వెళ్ళడం పూర్వ జన్మసుకృతం వలన ఆ బోయవాడు చూడగలిగాడు. కడకు అతడూ దివ్యత్వం పొందాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

దయ కరుణ పరోపకారం త్యాగం అనే పదాలకు నిర్వచనం చెప్పాయి పావురాలు. తనకు హాని చేసిన వేటగాడి సైతం కాపాడమని “అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ” అని హితబోధ చేసింది. ఆకలిగొన్న వాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించిన పావురం యొక్క త్యాగం అద్వితీయం.

మరిన్ని నీతికథలు మీకోసం:

Raghumaharaju Kautsudu In Telugu | రఘుమహారాజు – కౌత్సుడు

raghumaharaju-kautsudu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రఘుమహారాజు – కౌత్సుడు నీతికథ.

రఘుమహారాజు – కౌత్సుడు

పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. వరతంతుడనే ముని యొక్క గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.

శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరువేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.

గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు. అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజిత్ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టిపాత్రలలో పూలు పెట్టుకుని దైవపూజ చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. “జేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.

పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్ర చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు. రాచబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.

తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి 14 రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. “మరి ఈ ధనమెవరిది?” అని రఘుమహారాజు మిగిలినదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురుపుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
  2. రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
  3. కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satyasandhah In Telugu – సత్యసంధః

satyasandhah

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…సత్యసంధః నీతికథ.

సత్యసంధః

మునివేష ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీ రాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీ రామ చంద్రుని దర్శనార్థం శరభంగ ముని ఆశ్రమమునకు వచ్చినారు.

ఆ మునీంద్రులను చూచి మాయామానుష రూపుడైన శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా వారందఱికి సాష్టాంగ ప్రణామములు చేసెను. ఆ మునులు సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని స్తుతించి సమస్త ముని ఆశ్రములు చూచి వారిని అనుగ్రహించమని కోరిరి. మునీంద్రుల వెంట సీతారామలక్ష్మణులు తపోవనములను చూచుటకు బయలుదేరిరి. ఆ ప్రదేశములలో చాలా చోట్ల పుజ్జెలు ఎముకల గుట్టలు కానవచ్చెను. “పవిత్రమైన ఈ తపోభూములలో ఈ అస్థికలు ఎలా వచ్చాయి”? అని ప్రశ్నించాడు స్వామి. వారు “సర్వేశ్వరా! సమాధిస్థితిలో ఉన్న మునీశ్వరులను దుష్టులైన రాక్షసులు తనివేయగా మిగిలిన ఎముకలివి” అని తమ దైన్యత వ్యక్తపఱచినారు. కళ్ళు చెమ్మగిల్లిన స్వామి “ఈ దండకారణ్యమును రాక్షసులనుండి విముక్తము చేసెదను” అని ప్రతిజ్ఞ చేసెను. పరమానందముతో మునులు ధర్మస్థాపకుడైన శ్రీ రామునికి జయ జయ ధ్వానాలు చేసినారు.

సీతారామలక్ష్మణులు అగస్త్యమునిని సేవించి సుతీక్షుని వద్ద నెలవు తీసుకుని పంచవటికి వస్తుండగా పరమ సాధ్వీమణి లోకమాత జానకీ ఈ విధముగా భర్తతో మధుర సంభాషణము చేసినది “ప్రాణనాథా! ధర్మవర్తనము అతి సూక్షమైన పద్ధతిని అవలంభించవలెను. ఎవడైతే ప్రలోభాలకు వ్యసనాలకూ దూరముగా ఉంటాడో వాడే సర్వదా ధర్మపరుడై ఉండగలడు. మనము ప్రస్తుతము మునివేషములలో ఉన్నాము. తపము ఆచరించుట మన కర్తవ్యం. తపస్సునకు శాంతి పునాది. అయిననూ మనము ధనుర్బాణములు ఏల ధరించి రాక్షసులను సంహరించుచున్నాము?”. రాక్షసులతో ప్రత్యక్షముగా వైరము లేకుండానే మునులను రక్షించుట అనే “వ్యసనంతో” రాక్షసులను సంహరించుట తనకు ఇష్టములేద న్నట్టు సూచిస్తూ ఆ పతివ్రతాశిరోమణి శ్రీ రామునకు ఈ నీతికథ చెప్పినది.

“పూర్వం ఒక మునివల్లభుడు ప్రశాంతమైన ఓ ఆశ్రమములో తపమాచరిస్తూ ఉండేవాడు. అతడు సత్యవాది. ఆయన సత్యప్రభావముచే జంతువులు కూడా సహజ వైషమ్యాలను మఱచి హాయిగా సహజీవనం చేసేవి. అలా ఉండగా దేవేంద్రుడు అతని పరీక్షించుటకై భటుని వేషంలో పచ్చి “స్వామీ! ఈ కత్తిని మీ వద్ద భద్రంగా ఉంచండి. మళ్ళీ వచ్చి నేను తీసుకుంటాను” అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆయుధములు పట్టరాదని శాస్త్రము. ఎంతో కాలము ఆ ఆయుధం సమీపంలో ఉన్న కారణముగా ఆ మునిలో క్రూర లక్షణాలు బైటపడ్డాయి! ఆయుధం దగ్గర ఉండుటచే ఆ ముని తన కర్తవ్యాన్ని విస్మరించి హింసమీద అభిరుచి కలిగినవాడై కూర కృత్యాలుచేసి చివరికి ఘోర నరకమును పొందినాడు. తపస్సు చేసే మనమెక్కడ? దుష్టసంహారం చేసే క్షత్రియ ధర్మమెక్కడ? స్వామీ! చపల బుద్ధితో నాకు తెలిసినది చెప్పాను. నీవు సత్యసంధుడవు. ఏది సత్యమో ఏది అసత్యమో నీవే నిర్ణయించు” అని అనిన జానకితో శ్రీ రాముడిలా ఉన్నాడు.

“దండకారణ్యము లోని మునులు నిరాడంబరముగా తపస్సు చేయుచుండగా మాంసభక్షకులైన రాక్షసులు వారిని భక్షిస్తున్నారు. ఈ మునీశ్వరులు ఆ మదాంధులకు శాపం ఇచ్చుటకు సమర్థులై కూడా శాపం ఇవ్వలేదు. వారిని చంపినా కూడా కోపము తెచ్చుకోకుండా పరమశాంత చిత్తంతో తపమాచరిస్తున్నారు. దీనులై నన్ను ఆశ్రయించినప్పుడు రాక్షస సంహారము చేసెదనని ప్రతిజ్ఞ చేసినాను. అసలు ఆ యోగులు అడిగేవరకూ నేను ఆగనక్కరలేదు. ఎందుకంటే నా తండ్రిగారు భరతునకు నగర రాజ్యము నాకు వనరాజ్యము ప్రసాదిస్తున్నానని స్పష్టముగా చెప్పిరి. కావున తపముచేసినా దుష్టులను శిక్షించటం ఆర్తులను రక్షించటం వనరాజుగా నా కర్తవ్యం.

సీతా! నేను నా ప్రాణాలనైనా వదులుతా. నా ప్రియభాత అయిన లక్షణునైనా విడనాడుతాను. చివరకు నా హృదయేశ్వరివైన నిన్నైనా వదులుతాను కానీ సత్యమును మాత్రమూ ఎన్నడునూ వీడజాలను! అందునా ఇట్టి తాపసులకు ఇచ్చిన ప్రతిజ్ఞ ఎప్పటికీ విడువలేను”. ఇలా అద్భుతంగా సంభాషణము చేసి సుందరములైన వనభూముల వైపు నడువసాగారు. ఇట్టి సత్యసంధుడైన శ్రీ రాముని పాద స్పర్శ పొందిన ఈ భారతభూమి ధన్యం. భారతీయులు ధన్యులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. వ్యాస భగవానుడు చెప్పినట్టు సత్యం ఈ 13 విధాలైనది: నిష్పక్షపాతం ఆత్మనిగ్రహం అణకువ సిగ్గు ఓరిమి తాలిమి సంయమం దయ అహింస అనసూయత త్యాగం చింతన శీలసంపద. ఇన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి వీటిని అనుసంధానము చేసుకుని ఎల్లవేళలా సత్యమే ఆచరించినాడు శ్రీ రాముడు. ధర్మసమ్మతమైన ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను కాపాడటానికి ఏమైనా వదులుతాను కానీ సత్యాన్ని మాత్రము విడువనని అన్నాడు.
  2. మంచైనా చెడైనా చాలాకాలం సహవాసం చేస్తే ఆ గుణాలకు దెగ్గరవుతాయనే నీతికథను మనకు సీతమ్మ చెప్పినది. అందుకే మన పెద్దలు సత్సంగత్యమే చేయమని అంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Vrathalu – వ్రతాలు

Vrathalu

వ్రతములు మనస్సును ఆరోగ్యకరముగా, ధర్మప్రియముగా, సామాజిక సహజముగా నిర్వహించే మార్గములు. ఇవి ఆత్మశుద్ధి, మానసిక శాంతి, అంతర్ముఖ సౌమ్యత, సమాజ భద్రత మరియు భగవద్భక్తిని ఉన్నతముగా చేస్తాయి. వ్రతములు మన జీవితాన్ని సరళముగా, సాధారణముగా మరియు మొండిగా ఉంచుతాయి. వ్రతములు మనస్సును ద్యానంలో, ధర్మపథములో, సంయవనంలో ఉంచుతాయి.

ఇవి మన జీవితంలో నేర్పించిన ప్రతీ అదృష్టం ఒక అత్యంత ప్రాముఖ్యత మరియు అద్భుతమైన మూలకము. వ్రతములు మన మనసును సరళముగా మరియు శుద్ధిగా చేస్తాయి, మన సమాజానికి కల్యాణం, సమృద్ధి, శాంతి మరియు సౌమ్యతను అందిస్తాయి. ఏ ఏ వ్రతాలు చేస్తే ఏమి ఫలితం వస్తుంది ఈ క్రింది లింకులను అనుసరించండి.

Vrathalu – వ్రతాలు

Sukti – సూక్తి

Suktulu

సూక్తులు వేదాన్ని ఆధారం పొందిన సంహితలు, మంత్రములు. ఇవి సూక్తి, ఆదర్శాలను, ధర్మం, జ్ఞానం, అర్థం మరియు మోక్షము వంటి అంశాలను బోధిస్తాయి. సూక్తులు మనసును పరమ ధ్యానంలో ఉంచుతాయి, అంతర్ముఖ జ్ఞానంలో అనుభవం చేస్తాయి. ఇవి మన జీవితంలో శాంతి, సమాధానం మరియు సమృద్ధిని తెలుపుతాయి. సూక్తులు సామాజిక మరియు ఆధ్యాత్మిక ప్రగతిని ప్రోత్సహిస్తాయి, మన జీవితాన్ని సంతోషంగా, ప్రేమతో, ఆనందంగా నిర్వహిస్తాయి.

సూక్తులు ఆధ్యాత్మిక మార్గాన్ని మార్గదర్శకంగా చూపిస్తాయి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మరియు సాధారణ మనుషులుగా ఉంటే అనంత ప్రేమ మరియు గౌరవాన్ని అనుభవించగలిగే విధానమును ప్రదర్శిస్తాయి. మరిన్ని సూక్తుల కోసం ఈ క్రింద ఇవ్వబడిన లింకులను అనుసరించండి…

Suktulu – సూక్తులు

Vinayam Viveka Lakshanam In Telugu – వినయం వివేక లక్షణమ్‌

Vinayam Viveka Lakshanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వినయం వివేక లక్షణమ్‌.

వినయం వివేక లక్షణమ్‌

పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమళాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్లీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ట మహర్షి వద సకల ళాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్తద్రుష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద బల అతిబలాది విద్యలు మజీయు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్పులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్నమును ప్రసాదించెను.

ఒక్క బాణముతో శ్రీ రామ చంద్రు మూర్తి మహాబలళాలియైన తాటకను నేలకూల్చెను. ఒకేసారి మానవాస్త్రము ఆగ్నేయాస్త్యము ప్రయోగించి సుబాహుని సంహారము చేసి మారీచుని నూరుయోజనముల దూరములో పడవేశను. మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విజిగెను. శ్రీ రాముడొక్కడే ప్రహరార్శకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి పధ్నాలుగు వేలసేనలను సంహరించెను.

ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలీదు. ఆ దయార్హ హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘటము. శ్రీ రాముని సైన్యము సముద్హ లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్బ్ఞుడైన రాముడు ఉపాయము ఎజిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్ర్తములనైనను శుష్కింప చేయగలదు. అయినను సముద్దునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.

రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్మబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద అప్పటికి పట్టుమని 30 రోజులుకూడాలేవు. అయినను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్పార్భింప నిశ్చయించెను.

శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్సెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్టార్భించెను. ఇట్లు 3 దివసములు సముద్దునికై ప్టార్భించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి. వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాశువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్వుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్పముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం జౌషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. శ్రీ రాముడు ఎంత బలళాలి అయిననూ సముద్చునివై బలప్రదర్శనము చేయక వినయముతో ప్పార్శించెను. వినయము సజ్బనుని భూషణము.
  2. మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణము. అందుకనే శ్రీ రాముడు విభీషణుని సలహా అడిగెను.
  3. దయాగుణం ఉత్తమగుణము. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీ రాముడు అతనిని కాచెను.
  4. సజ్బనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లొకహితమే అవుతుంది. శ్రీ రాముడు సముద్దుని పై కినుకబూని అస్తృం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Dharmagnyah In Telugu – ధర్మజ్ఞః

Dharmagnyah

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మజ్ఞః నీతికథ.

ధర్మజ్ఞః

“శరణు శరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతి వల్లభా!” అంటూ భక్తశిఖామణియైన విభీషణుడు రావణునిచే తరస్కరింపబడ్నవాడై శ్రీ రామ చంద్పుని శరణువేడినాడు. విభీషణుడు తన మంత్పులతో వచ్చి ఆకాశమార్నాన నిలిచి శ్రీ రాముని శరణు కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు. ఆ వార్త విని వినయకోవిదుడైన రఘురాముడు సుగ్తీవుని “మిత్రమా! నీ అభిషప్పాయమేమి”? అని అడిగినాడు. రాజశ్రేష్ముడైన సుగ్రీవుడిలా అన్నాడు “ప్రభూ! రాక్షసులు మాయావులు కామరూపధారులు. వారి నిజస్వరూపం గుర్తించడం కష్టము. పైగా వచ్చినది సీతాపహారి ఐన రావణుని తమ్ముడు. ఈతడు బలళాలి. సాయుధులైన నలుగురు మంత్పులతో వచ్చాడు. మన రహస్యములు తెలుసుకొనుట వారి ఆంతర్యం కావచ్చు. ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్చేశ్యం”.

స్మితపూర్వభాషి అయిన శ్రీ రాముడు ఇట్టు ధర్మ్యము పల్కెను “సుగ్రీవా! తన భార్యను వలపన్ని పట్సిన బోయవాడు ఆర్హుడైవచ్చినప్పుడు ఆకపోతరాజు బోయవానికి శరణమీయలేదా! (కపోత కపోతి కథ చూడండి) అదే అట్లు చేసిన ఇక మానవులైన మన సంగతేమిటి? పూర్వం కండువ మహర్షి ఈ కథను పల్కి ధర్మసమ్మతమైన గాధలు గానం చేశాడు:

దీనుడై ప్పార్భించుచు శ్రణుజొచ్చిన శత్తువునైనా చంపకూడదు. సజ్బనుడు తన ప్పాణాలసైతం ఇచ్చి శరణార్చి ఐన శత్రువు నైనా కాపాడతాడు”. ఇలా కండువ మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తుచేసి రఘువరుడిలా అన్నాడు “ఎవడైనా వచ్చి నేను నీవాడను అని ఒక్క మాట అన్న చాలు వానిని సకల ప్పాణులనుండి అభయమిచ్చెదను. ఇది నా వ్రతం.

అతడే సితిలోనున్నను ఏ ఉద్చేశ్యముతో వచ్చినను వెంటనే అతనిని ఇక్కడకు తీసుకురండి. వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను”. ఎక్కడా కనీ వినీ ఎజుగని ధర్మజ్నతను శ్రీ రాముని లో చూసి వానరులు “శ్రీ రామ చంద్ర, మూర్తి కీ జై” అని జయజయ ధ్వానాలు చేశారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఒకడు లోక నిందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు. అలాగే సమాజధర్మం గృహధర్మం కులధర్మం పాటించటానికి ఏదో ఒక హేతువుండచ్చు. కానీ వ్రతం (నియమం) అనేది తనకు తానుగా నియమించుకున్నది. అది పాటించకపోయినా ఎవ్వరూ అడగరు. అందుకే వ్రతధర్మం పరమోత్కృష్టమ్‌. ఎటువంటి హేతువూ లేకుండా కేవలం ధర్మసమ్మతమైన ప్రతనియమం పాటిస్తూ శ్రీ రాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్ట
  2. ఇదే సందేశం ధర్మరాజు కూడా ఇస్తాడు: ఒక సారి పరమసాధ్వి ఐన ద్వౌపదీ దేవి రాజసూయయాగం చేసి రాజులచే జీ జీ లందుకున్న ధర్మరాజు కష్టాలు పడటం చూసి బాధతో ఇలా అడిగింది “స్వామీ! మీరు ధర్మంకోసం ఇన్ని త్యాగాలు చేశారు. ధర్మం పాటించడం వల్స మీకేమి వచ్చింది”? భారతీయుని హృదయాన్ని వ్యక్తపజుస్తూ ధర్మరాజు ఇలా అన్నాడు:
  3. “ద్హాపదీ! ధర్మం ఆచరించడం నా స్వభావం. అంతే కాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు. అలాగే కనక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడినౌతాను. ధర్మంతో వాణిజ్యం చేసినవాడు నీచుడు పురుషాధముడు”. కనుక స్వాభావికంగా ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీ రాముడు ధర్మరాజు మనకి చెప్పారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Slokalu – స్లోకాలు

Slokalu

స్లోకాలు సంస్కృత శాస్త్రములో ఒక అత్యంత ప్రముఖమైన భాగము. ఇవి దేవుళ్ళ కృపను, మనస్సును శుద్ధిగా చేసేవి, ఆధ్యాత్మిక ప్రగతిని కల్గిస్తాయి. ఇవి దేవుళ్ళ గుణములను, జీవన మార్గములను, ధర్మమును, అర్థమును, కామమును మరియు మోక్షమును తెలుపేవి. స్లోకాలు మనస్సును శాంతిగా ఉంచుతాయి, సమాధానంగా మరియు ఆనందంగా ఉంచుతాయి. ఇవి మనసును ధ్యానం లోపలించి, ఆధ్యాత్మిక ప్రేరణను పొందిస్తాయి, మరియు జీవన మార్గాన్ని వెల్లడిస్తాయి. స్లోకాలు మన జీవితంలో ఒక మహత్వపూర్ణ స్థానము పడుతాయి, సనాతన సత్యములను బోధిస్తాయి, మరియు మనసును దేవుని సమీపములో తీసుకోగలిగేవి. మొదలగు స్లోకాలు కోసం ఈ క్రింది లింకులు ద్వారా తెలుసుకుందాం…

Slokalu – స్లోకాలు