Ayodhya Kanda Sarga 95 In Telugu – అయోధ్యాకాండ పంచనవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 95 In Telugu

అయోధ్యాకాండం పంచనవతితమ (95వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలు తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి పాలన చేయాలనుకుంటాడు. ఈ సర్గలో, భరతుడు తన తల్లి కైకేయిని క్షమించి, ఆమెను ఆత్మీయంగా అంగీకరిస్తాడు. ప్రజలు భరతుని ధర్మ నిష్ఠను మెచ్చుకుంటారు. తరువాత, భరతుడు వశిష్ఠుడితో కలిసి సర్పసముద్రం అనే ప్రాంతానికి వెళ్ళి రాముని పాదుకలను గౌరవంగా తీసుకుని వస్తాడు. భరతుడు, రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముడు తిరిగి రాకముందు వరకు తాను పాలనను పర్యవేక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సర్గ భరతుని విధి నిష్ఠను, రాముడిపై ప్రేమను ప్రతిబింబిస్తుంది.

మందాకినీవర్ణనా

అథ శైలాద్వినిష్క్రమ్య మైథిలీం కోసలేశ్వరః |
అదర్శయచ్ఛుభజలాం రమ్యాం మందాకినీం నదీమ్ || ౧ ||

అబ్రవీచ్చ వరారోహాం చారుచంద్రనిభాననామ్ |
విదేహరాజస్య సుతాం రామో రాజీవలోచనః || ౨ ||

విచిత్రపులినాం రమ్యాం హంససారససేవితామ్ |
కమలైరుపసంపన్నాం పశ్య మందాకినీం నదీమ్ || ౩ ||

నానావిధైస్తీరరుహైర్వృతాం పుష్పఫలద్రుమైః |
రాజంతీం రాజరాజస్య నలినీమివ సర్వతః || ౪ ||

మృగయూథనిపీతాని కలుషాంభాంసి సాంప్రతమ్ |
తీర్థాని రమణీయాని రతిం సంజనయంతి మే || ౫ ||

జటాజినధరాః కాలే వల్కలోత్తరవాససః |
ఋషయస్త్వవగాహంతే నదీం మందాకినీం ప్రియే || ౬ ||

ఆదిత్యముపతిష్ఠంతే నియమాదూర్ధ్వబాహవః |
ఏతే పరే విశాలాక్షి మునయః సంశితవ్రతాః || ౭ ||

మారుతోద్ధూతశిఖరైః ప్రనృత్త ఇవ పర్వతః |
పాదపైః పత్రపుష్పాణి సృజద్భిరభితో నదీమ్ || ౮ ||

క్వచిన్మణినికాశోదాం క్వచిత్పులినశాలినీమ్ |
క్వచిత్సిద్ధజనాకీర్ణాం పశ్య మందాకినీం నదీమ్ || ౯ ||

నిర్ధూతాన్ వాయునా పశ్య వితతాన్పుష్పసంచయాన్ |
పోప్లూయమానానపరాన్ పశ్య త్వం జలమధ్యగాన్ || ౧౦ ||

తాంశ్చాతివల్గువచసో రథాంగాహ్వయనా ద్విజాః |
అధిరోహంతి కళ్యాణి వికూజంతః శుభా గిరః || ౧౧ ||

దర్శనం చిత్రకూటస్య మందాకిన్యాశ్చ శోభనే |
అధికం పురవాసాచ్చ మన్యే చ తవ దర్శనాత్ || ౧౨ ||

విధూతకలుషైః సిద్ధైస్తపోదమశమాన్వితైః |
నిత్యవిక్షోభితజలాం విగాహస్వ మయా సహ || ౧౩ ||

సఖీవచ్చ విగాహస్వ సీతే మందాకినీం నదీమ్ |
కమలాన్యవమజ్జంతీ పుష్కరాణి చ భామిని || ౧౪ ||

త్వం పౌరజనవద్వ్యాలానయోధ్యామివ పర్వతమ్ |
మన్యస్వ వనితే నిత్యం సరయూవదిమాం నదీమ్ || ౧౫ ||

లక్ష్మణశ్చాపి ధర్మాత్మా మన్నిదేశే వ్యవస్థితః |
త్వం చానుకూలా వైదేహి ప్రీతిం జనయథో మమ || ౧౬ ||

ఉపస్పృశంస్త్రిషవణం మధుమూలఫలాశనః |
నాయోధ్యాయై న రాజ్యాయ స్పృహయేఽద్య త్వయా సహ || ౧౭ ||

ఇమాం హి రమ్యాం మృగయూథశాలినీం
నిపీతతోయాం గజసింహవానరైః |
సుపుష్పితైః పుష్పధరైరలంకృతాం
న సోఽస్తి యః స్యాదగతక్లమః సుఖీ || ౧౮ ||

ఇతీవ రామో బహుసంగతం వచః
ప్రియాసహాయః సరితం ప్రతి బ్రువన్ |
చచార రమ్యం నయనాంజనప్రభమ్
స చిత్రకూటం రఘువంశవర్ధనః || ౧౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచనవతితమః సర్గః || ౯౫ ||

Ayodhya Kanda Sarga 95 Meaning In Telugu

రాముడు సీతతో కలిసి మందాకినీ నదీ తీరంలో విహరిస్తున్నాడు.
“సీతా! ఈ మందాకినీ నదీతీరము చూడు. ఎంత సుందరముగా ఉన్నదో! ఆఇసుక తిన్నెలు, నదీజలములలో ఈదుచున్న హంసలు, పైన ఎగురుచున్న సారస పక్షులు, జలముల మీద తేలుచున్న పద్మములు ఎంత శోభాయమానముగా ఉన్నవో చూడు! అదుగో ఆ లేళ్ల గుంపులు నదీజలములు తాగుటకు ఎలా వస్తున్నాయోచూడు! ఆవల తీరమున ఋషులు మందాకినీ నదిలో స్నానం చేస్తున్నారు. మరికొందరు సూర్యోపాసన చేస్తున్నారు. సీతా! ఆ చక్రవాక పక్షులు ఎంత మధురంగా కూయుచున్నవో.

ఇంతటి మనోహరముగా ఉన్న ఈ నదీప్రాంతమును విడిచి వెళ్లుటకు మనసు రాకున్నది. అయోధ్య కన్నా ఇక్కడే బాగుంది కదూ! సీతా నీవు కూడా ఈ నదిలో దిగి జలక్రీడలు ఆడుతావా! ఈ చిత్రకూట పర్వతమే అయోధ్య అనుకో. ఈ మందాకినీ నది సరయూనది. హాయిగా నదిలో దిగి జలకాలాడు. నీవు, లక్ష్మణుడు, తోడుగా ఉండగా ఇంతటిసుందర ప్రదేశములలో విహరిస్తూ నేను అయోధ్యనే మరిచిపోతున్నాను. ప్రస్తుతము నాకు అయోధ్య మీద కాని, ఆ రాజ్యము మీద కానీ ఆసక్తి లేదు. ఇక్కడే ఉండాలని ఉంది.” అని అన్నాడు రాముడు.

(ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. రాముడి గురించి వారి వనవిహారము గురించి వాల్మీకి ఇంతగా రాయాల్సిన పనిలేదు. దీని వెనక ఏదో చెప్పాలని ఆయన తాపత్రయం. ఈరోజుల్లో ఉన్న ఊరి నుండి మరో ఊరికి ట్రాన్సఫర్ అయితే చాలు ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టు బాధపడుతుంటారు కొందరు. ఉన్న ఊరు వదలడానికి తెగ బాధపడిపోతుంటారు. మరి కొంతమందికి ఏ ఊరిలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా తృప్తి ఉండదు. ఏం ఊరు వెధవ ఊరు అని తిడుతూ ఉంటారు. అటువంటి వారికి రాముని వనవాసము ఒక గుణపాఠము.

రాముడు అయోధ్యకు యువరాజు. పుట్టినప్పటినుండి ఎన్నో రాజభోగములు అనుభవించాడు. విధివశాత్తు అరణ్యవాసం చెయ్యాల్సివచ్చింది. సంతోషంగా అడవులకు వచ్చాడు. అరణ్యములోనే సుఖాలను వెతుక్కుంటున్నాడు. అరణ్యమునే అయోధ్యగా మార్చుకున్నాడు. పైగా అరణ్యములోనే ఎక్కువసుఖం ఉందని మనసుకు నచ్చచెప్పుకుంటున్నాడు. ఉన్నదానినతో తృప్తి చెందుతున్నాడు. నిరాశకు నిస్పృహకు చోటు ఇవ్వలేదు.

‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అని ఒక సినీ కవి అన్నట్టు, బాధలలో కూడా సుఖాలను వెతుక్కోవడం మానవులకు అలవడాలి. అప్పుడే జీవితం సుఖమయమవుతుంది. ఈ జీవితసత్యాన్ని రాముడు తాను అనుభవించి మనకు తెలియజేస్తున్నాడు. అని నా భావన. అందుకే రాముడు దేవుడు అయ్యాడు.)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత

అయోధ్యాకాండ షణ్ణవతితమః సర్గః (96)

Aranya Kanda Sarga 22 In Telugu – అరణ్యకాండ ద్వావింశః సర్గః

Aranya Kanda Sarga 22 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్వావింశః సర్గలో, రావణుని సోదరి శూర్పణఖ పంచవటికి వస్తుంది. రాముడిని చూసి ఆమె ఆకర్షితురాలవుతుంది. రాముని ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంది, కానీ రాముడు సీతమ్మను మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పాడు. నిరాశలో శూర్పణఖ తన రూపం మార్చుకుని లక్ష్మణుడి దగ్గరకు వెళుతుంది.

ఖరసంనాహః

ఏవమాధర్షితః శూరః శూర్పణఖ్యా ఖరస్తదా |
ఉవాచ రక్షసాం మధ్యే ఖరః ఖరతరం వచః ||

1

తవావమానప్రభవః క్రోధోఽయమతులో మమ |
న శక్యతే ధారయితుం లవణాంభ ఇవోత్థితమ్ ||

2

న రామం గణయే వీర్యాన్మానుషం క్షీణజీవితమ్ |
ఆత్మదుశ్చరితైః ప్రాణాన్ హతో యోఽద్య విమోక్ష్యతి ||

3

బాష్పః సంహ్రియతామేష సంభ్రమశ్చ విముచ్యతామ్ |
అహం రామం సహ భ్రాత్రా నయామి యమసాదనమ్ ||

4

పరశ్వధహతస్యాద్య మందప్రాణస్య సంయుగే |
రామస్య రుధిరం రక్తముష్ణం పాస్యసి రాక్షసి ||

5

సా ప్రహృష్టా వచః శ్రుత్వా ఖరస్య వదనాచ్చ్యుతమ్ |
ప్రశశంస పునర్మౌర్ఖ్యాద్భ్రాతరం రక్షసాం వరమ్ ||

6

తయా పరుషితః పూర్వం పునరేవ ప్రశంసితః |
అబ్రవీద్దూషణం నామ ఖరః సేనాపతిం తదా ||

7

చతుర్దశ సహస్రాణి మమ చిత్తానువర్తినామ్ |
రక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినామ్ ||

8

నీలజీమూతవర్ణానాం ఘోరాణాం క్రూరకర్మణామ్ |
లోకహింసావిహారాణాం బలినాముగ్రతేజసామ్ ||

9

తేషాం శార్దూలదర్పాణాం మహాస్యానాం మహౌజసామ్ |
సర్వోద్యోగముదీర్ణానాం రక్షసాం సౌమ్య కారయ ||

10

ఉపస్థాపయ మే క్షిప్రం రథం సౌమ్య ధనూంషి చ |
శరాంశ్చిత్రాంశ్చ ఖడ్గశ్చ శక్తీశ్చ వివిధాః శితాః ||

11

అగ్రే నిర్యాతుమిచ్ఛామి పౌలస్త్యానాం మహాత్మనామ్ |
వధార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిద ||

12

ఇతి తస్య బ్రువాణస్య సూర్యవర్ణం మహారథమ్ |
సదశ్వైః శబలైర్యుక్తమాచచక్షేఽథ దూషణః ||

13

తం మేరుశిఖరాకారం తప్తకాంచనభూషణమ్ |
హేమచక్రమసంబాధం వైడూర్యమయకూబరమ్ ||

14

మత్స్యైః పుష్పైర్ద్రుమైః శైలైశ్చంద్రసూర్యైశ్చ కాంచనైః |
మంగళైః పక్షిసంఘైశ్చ తారాభిరభిసంవృతమ్ ||

15

ధ్వజనిస్త్రింశసంపన్నం కింకిణీకవిరాజితమ్ |
సదశ్వయుక్తం సోమర్షాదారురోహ ఖరో రథమ్ ||

16

నిశామ్య తు రథస్థం తం రాక్షసా భీమవిక్రమాః |
తస్థుః సంపరివార్యైనం దూషణం చ మహాబలమ్ ||

17

ఖరస్తు తాన్మహేష్వాసాన్ ఘోరవర్మాయుధధ్వజాన్ |
నిర్యాతేత్యబ్రవీద్దృష్టో రథస్థః సర్వరాక్షసాన్ ||

18

తతస్తద్రాక్షసం సైన్యం ఘోరవర్మాయుధధ్వజమ్ |
నిర్జగామ జనస్థానాన్మహానాదం మహాజవమ్ ||

19

ముద్గరైః పట్టిశైః శూలైః సుతీక్ష్ణైశ్చ పరశ్వధైః |
ఖడ్గైశ్చక్రైశ్చ హస్తస్థైర్భ్రాజమానైశ్చ తోమరైః ||

20

శక్తిభిః పరిఘైర్ఘోరైరతిమాత్రైశ్చ కార్ముకైః |
గదాసిముసలైర్వజ్రైర్గృహీతైర్భీమదర్శనైః ||

21

రాక్షసానాం సుఘోరాణాం సహస్రాణి చతుర్దశ |
నిర్యాతాని జనస్థానాత్ఖరచిత్తానువర్తినామ్ ||

22

తాంస్త్వభిద్రవతో దృష్ట్వా రాక్షసాన్ భీమవిక్రమాన్ |
ఖరస్యాపి రథః కించిజ్జగామ తదనంతరమ్ ||

23

తతస్తాన్ శబలానశ్వాంస్తప్తకాంచనభూషితాన్ |
ఖరస్య మతమాజ్ఞాయ సారథిః సమచోదయత్ ||

24

స చోదితో రథః శీఘ్రం ఖరస్య రిపుఘాతినః |
శబ్దేనాపూరయామాస దిశశ్చ ప్రదిశస్తదా ||

25

ప్రవృద్ధమన్యుస్తు ఖరః ఖరస్వనో
రిపోర్వధార్థం త్వరితో యథాఽంతకః |
అచూచుదత్ సారథిమున్నదన్ ఘనం
మహాబలో మేఘ ఇవాశ్మవర్షవాన్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్వావింశః సర్గః ||

Aranya Kanda Sarga 22 Meaning In Telugu PDF

శూర్పణఖ తనను అన్న సూటీ పోటీ మాటలు అన్నీ మౌనంగా విన్నాడు ఖరుడు. అవమానభారంతో కుమిలిపోయాడు. అతనిలో పౌరుషం పెల్లుబికింది. కోపం తారస్థాయికి చేరుకుంది. శూర్పణఖను చూచి ఇలా అన్నాడు.

” నీకు జరిగిన అవమానము నాకు జరిగినట్టే భావిస్తాను. నాకు పట్టలేనంతగా కోపం వస్తూ ఉంది. ప్రతీకార జ్వాలలలో రగిలిపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక మానవుడికి నేను భయపడడమా! ఆ మానవుడు ఒక అల్పాయుష్కుడు. వాడి ప్రాణాలు హరిస్తాను. నీవు ఏడవకు. వాడి మరణవార్తను నీకు త్వరలో తెలియజేస్తాను. ఇప్పుడే వాడితో యుద్ధానికి వెళుతున్నాను. నా గొడ్డలితో వాడిని నరుకుతాను. వాడి వెచ్చని రక్తాన్ని నీకు పానీయంగా అందిస్తాను. ఇది నా నిర్ణయము.” అని పలికాడు ఖరుడు.

“అదేంటి అన్నయ్యా! నీ పరాక్రమం గురించి నాకు తెలీయదా. నీకు సాటి వీరుడు ముల్లోకములలో ఎవరు ఉన్నారు. రాక్షస వీరులలో నీకు సాటిగలవారు ఎవరున్నారు.” అని పొగిడింది.

శూర్పణఖ మాటలతో ఉప్పొంగి పోయాడు ఖరుడు. వెంటనే తన సేనాపతులను పిలిచాడు.

“సేనాపతీ! మన దగ్గర 14 వేల మంది సైనికులు ఉన్నారు. కదా. వారినందరినీ యుద్ధమునకు సిద్ధం చేయండి. నేనే స్వయంగా వారికి నాయకత్వము వహిస్తాను. నా కొరకు ఒక రథము, ఆయుధములు, ధనుస్సులు, బాణములు సిద్ధం చేయండి. మనమందరమూ ఆ రాముని మీదికి యుద్ధానికి పోతున్నాము.” అని ప్రకటించాడు.

ఖరుడి మాట వినగానే దూషణుడు ఖరుడు కోరినట్టు రథం సిద్ధం చేసాడు. రథం తీసుకొచ్చి ఖరుడి ముందు నిలిపాడు. ఖరుడు ఆ రథం ఎక్కాడు. ఖరునికి దూషణునికి రక్షణగా రాక్షస వీరులు చుట్టు వలయాకారంలో నిలబడ్డారు. ఖరుడు అందరికీ బయలుదేరుటకు అనుజ్ఞ ఇచ్చాడు. జనస్థానమునుండి 14,000 మంది రాక్షసవీరులు ముద్గరలు, పట్టిసములు, శూలములు, పరశువులు, కత్తులు, చక్రాయుధములు, తోమరములు, శక్తి ఆయుధములు, పరిఘలు, కారుకములు (బాణములు), గదాయుధములు, ముసలములు, వజ్రాయుధములు ధరించి, రాముని మీదికి యుద్ధానికి బయలుదేరారు.

(ఇక్కడ కూడా 14 వేల మంది రాక్షస సైన్యము, బయలుదేరింది. ఇది మూడవ 14 సంఖ్య)

ముందు సైనికులు నడువగా ఖరుని రథము వారిని అనుసరించింది. ఖరుడు కోపంతో ఊగి పోతున్నాడు.

“త్వరగా పదండి. శత్రువును చంపండి. నరకండి” అని పెద్దగా అరుస్తున్నాడు.

ఖరుని అరుపులతో, రాక్షసవీరుల పదఘట్టనలతో ఆ అరణ్యము మార్మోగిపోయింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రయోవింశః సర్గః (23) >>

Ayodhya Kanda Sarga 94 In Telugu – అయోధ్యాకాండ చతుర్నవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 94

అయోధ్యాకాండం చతుర్నవతితమ (94వ) సర్గలో, భరతుడు వశిష్ఠ మహర్షితో కలిసి రాముని ఆశ్రమం వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అతని వెంట కౌసల్య, సుమిత్ర, కైకేయి మరియు ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణాన్ని రాముని చెబుతాడు. రాముడు తండ్రి మరణ వార్త విని శోకసంద్రుడవుతాడు. భరతుడు రాముడిని అరణ్యవాసం నుండి తిరిగి రావలసిందిగా ప్రార్థిస్తాడు. రాముడు తన కర్తవ్యాన్ని సమర్థిస్తూ, తన వాగ్దానం ప్రకారం అరణ్యవాసం పూర్తి చేస్తానని తేల్చి చెబుతాడు. భరతుడు రాముడి పాదుకలు తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచుతానని, రాముడు తిరిగి వచ్చేవరకు రాజ్యం పాలిస్తానని అంగీకరిస్తాడు.

చిత్రకూటవర్ణనా

దీర్ఘకాలోషితస్తస్మిన్ గిరౌ గిరివనప్రియః |
వైదేహ్యాః ప్రియమాకాంక్షన్ స్వం చ చిత్తం విలోభయన్ || ౧ ||

అథ దాశరథిశ్చిత్రం చిత్రకూటమదర్శయత్ |
భార్యామమరసంకాశః శచీమివ పురందరః || ౨ ||

న రాజ్యాద్భ్రంశనం భద్రే న సుహృద్భిర్వినాభవః |
మనో మే బాధతే దృష్ట్వా రమణీయమిమం గిరిమ్ || ౩ ||

పశ్యేమమచలం భద్రే నానాద్విజగణాయుతమ్ |
శిఖరైః ఖమివోద్విద్ధైర్ధాతుమద్భిర్విభూషితమ్ || ౪ ||

కేచిద్రజతసంకాశాః కేచిత్ క్షతజసన్నిభాః |
పీతమాంజిష్ఠవర్ణాశ్చ కేచిన్మణివరప్రభాః || ౫ ||

పుష్పార్కకేతకాభాశ్చ కేచిజ్జ్యోతీరసప్రభాః |
విరాజంతేఽచలేంద్రస్య దేశా ధాతువిభూషితాః || ౬ ||

నానామృగగణద్వీపితరక్ష్వృక్షగణైర్వృతః |
అదుష్టైర్భాత్యయం శైలో బహుపక్షిసమాయుతః || ౭ ||

ఆమ్రజంబ్వసనైర్లోధ్రైః ప్రియాలైః పనసైర్ధవైః |
అంకోలైర్భవ్యతినిశైర్బిల్వతిందుకవేణుభిః || ౮ ||

కాశ్మర్యరిష్టవరుణైర్మధూకైస్తిలకైస్తథా |
బదర్యామలకైర్నీపైర్వేత్రధన్వనబీజకైః || ౯ ||

పుష్పవద్భిః ఫలోపేతైశ్ఛాయావద్భిర్మనోరమైః |
ఏవమాదిభిరాకీర్ణః శ్రియం పుష్యత్యయం గిరిః || ౧౦ ||

శైలప్రస్థేషు రమ్యేషు పశ్యేమాన్ రోమహర్షణాన్ |
కిన్నరాన్ ద్వంద్వశో భద్రే రమమాణాన్మనస్వినః || ౧౧ ||

శాఖావసక్తాన్ ఖడ్గాంశ్చ ప్రవరాణ్యంబరాణి చ |
పశ్య విద్యాధరస్త్రీణాం క్రీడోద్ధేశాన్ మనోరమాన్ || ౧౨ ||

జలప్రపాతైరుద్భేదైర్నిష్యందైశ్చ క్వచిత్ క్వచిత్ |
స్రవద్భిర్భాత్యయం శైలః స్రవన్మద ఇవ ద్విపః || ౧౩ ||

గుహాసమీరణో గంధాన్ నానాపుష్పభవాన్వహన్ |
ఘ్రాణతర్పణమభ్యేత్య కం నరం న ప్రహర్షయేత్ || ౧౪ ||

యదీహ శరదోఽనేకాస్త్వయా సార్ధమనిందితే |
లక్ష్మణేన చ వత్స్యామి న మాం శోకః ప్రధక్ష్యతి || ౧౫ ||

బహుపుష్పఫలే రమ్యే నానాద్విజగణాయుతే |
విచిత్రశిఖరే హ్యస్మిన్ రతవానస్మి భామిని || ౧౬ ||

అనేన వనవాసేన మయా ప్రాప్తం ఫలద్వయమ్ |
పితుశ్చానృణతా ధర్మే భరతస్య ప్రియం తథా || ౧౭ ||

వైదేహి రమసే కచ్చిచ్చిత్రకూటే మయా సహ |
పశ్యంతీ వివిధాన్భావాన్ మనోవాక్కాయసమ్మతాన్ || ౧౮ ||

ఇదమేవామృతం ప్రాహుః రాజ్ఞి రాజర్షయః పరే |
వనవాసం భవార్థాయ ప్రేత్య మే ప్రపితామహాః || ౧౯ ||

శిలాః శైలస్య శోభంతే విశాలాః శతశోఽభితః |
బహులా బహుళైర్వర్ణైర్నీలపీతసితారుణైః || ౨౦ ||

నిశి భాంత్యచలేంద్రస్య హుతాశనశిఖా ఇవ |
ఓషధ్యః స్వప్రభాలక్ష్యా భ్రాజమానాః సహస్రశః || ౨౧ ||

కేచిత్ క్షయనిభా దేశాః కేచిదుద్యానసన్నిభాః |
కేచిదేకశిలా భాంతి పర్వతస్యాస్య భామిని || ౨౨ ||

భిత్త్వేవ వసుధాం భాతి చిత్రకూటః సముత్థితః |
చిత్రకూటస్య కూటోఽసౌ దృశ్యతే సర్వతః శుభః || ౨౩ ||

కుష్ఠపున్నాగస్థగరభూర్జపత్రోత్తరచ్ఛదాన్ |
కామినాం స్వాస్తరాన్ పశ్య కుశేశయదలాయుతాన్ || ౨౪ ||

మృదితాశ్చాపవిద్ధాశ్చ దృశ్యంతే కమలస్రజః |
కామిభిర్వనితే పశ్య ఫలాని వివిధాని చ || ౨౫ ||

వస్వౌకసారాం నళినీమత్యేతీవోత్తరాన్ కురూన్ |
పర్వతశ్చిత్రకూటోఽసౌ బహుమూలఫలోదకః || ౨౬ ||

ఇమం తు కాలం వనితే విజహ్రివాన్
త్వయా చ సీతే సహ లక్ష్మణేన చ |
రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధనీం
సతాం పథి స్వైర్నియమైః పరైః స్థితః || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్నవతితమః సర్గః || ౯౪ ||

Ayodhya Kanda Sarga 94 Meaning In Telugu

భరతుడు రాముని గురించి వెతుకుతుంటే, రాముడు సీతతో కలిసి వనవిహారం చేస్తున్నాడు. సీతకు చిత్ర విచిత్రములైన మొక్కలను వృక్షములను చూపించి వాటి గురించి వివరిస్తున్నాడు. “సీతా!ఇక్కడ ఉన్న సౌందర్యశోభలను, ఈ వనముల అందములను చూచిన తరువాత ఇక్కడి నుండి అయోధ్యకు పోవాలని అనిపించడంలేదు. ఈ పర్వతములు అనేకములైన ఓషధులకు, వన్యమృగములకు, పక్షులకు నిలయము. ఈ ప్రశాంత వాతావరణములో ఈ పర్వత శిఖరములను, వృక్షములను చూస్తూ ఎన్నాళ్లు ఉన్నా విసుగు అనిపించదు. ఈ అరణ్యములో వేప, మామిడి, నేరేడు, వేగిస, లోధ్ర, ప్రియాళ, పనస, చండ్ర, అంకోల, బిల్వ, తుమ్మ, వెదురు,కశ్మ, ఇప్ప, తిలక, బదరి, ఆమలక, పేము పొదలు, మద్ది మొదలగు వృక్షజాతులో నిండి ఉన్నది.

(వాల్మీకి తన రామాయణకావ్యంలో ఆనాడు ఉన్న వృక్షజాతులను తరువాతి తరాల వారికి పరిచయం చేస్తున్నాడు.)

ఓ సీతా! అటు చూడు, కిన్నరులు, గంధర్వులు, విద్యాధరులు ఆ పర్వత శిఖరముల మీద జంట జంటలుగా విహరిస్తున్నారు. నేను ఈ వనవాసము చేయడం వలన నా తండ్రి మాటను నిలబెట్టడం, భరతుని రాజ్యాభిషేకమునకు ఆటంకం తొలగి పోవడం లాంటి గొప్ప పనులు సాధించాను. దీని వలన నా పితృఋణము తీర్చుకున్నట్టు అయింది. నాతో పాటు నువ్వు కూడా నన్నుఅనుసరించి వచ్చి ఈ వనసౌందర్య మును ఆస్వాదించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. రాజులకు మరణానంతరము ఉత్తమ లోకములు లభించుటకు వనవాసమే ఉ త్తమైనది అయి పూర్వపు రాజర్షులు చెప్పి ఉన్నారు కదా!

సీతా! ఈ చిత్రకూటపర్వతము మీద ఎన్నోఓషధులు ఉ న్నాయి. ఆ ఓషధుల మీది నుండి వీచే గాలి అన్ని రోగములను పోగొడుతుంది అని పెద్దలు చెబుతారు. సీతా! అటు చూడు! ఇక్కడ కొన్ని ప్రదేశములు సహజముగా ఏర్పడిన ఉద్యానవనముల మాదిరి, మరి కొన్ని పూపొదరిళ్లు గృహముల మాదిరి, కనపడుతున్నాయి కదా! ఈ చిత్రకూట పర్వతము భూమిని చీల్చుకొని పైకి వచ్చినట్టు ఎలా గర్వంగా నిలబడిఉన్నదో చూడు! ఇక్కడ కామాతురు లైన స్త్రీపురుషులు, ఈ నిర్జన ప్రదేశములలో కుష్ఠ, పున్నాగ, భూర్జర చెట్ల ఆకులతో శయ్యలు ఏర్పరచుకొని ఉన్నారు చూడు. ఆ కాముకులు నలిపి పారవేసిన పూలమాలలు, తినగా మిగిలిన ఫలములు అక్కడక్కడా పడి ఉన్నాయి చూడు.” అని చిత్రకూటపర్వత విశేషములను సీతకు రాముడు చూపిస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచనవతితమః సర్గః (95) >>

Ayodhya Kanda Sarga 93 In Telugu – అయోధ్యాకాండ త్రినవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 93

అయోధ్యాకాండం త్రినవతితమ (93వ) సర్గలో, భరతుడు దశరథ మహారాజు మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందాడు. అతను తన తల్లి కైకేయి పై మహా కోపంతో తిట్టిపోస్తాడు. కైకేయి తన చర్యలను సమర్థించడానికి ప్రయత్నిస్తే, భరతుడు ఆమెను తీవ్రంగా గద్దించింది. అతను రాముడు తప్ప మరెవ్వరూ రాజ్యం పరిపాలించరని, రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయించాడు. ఆ తరువాత, భరతుడు తన సోదరుడు శత్రుఘ్నుడితో కలిసి గురు వశిష్ఠుని వద్దకు వెళ్లి సలహా కోరుతాడు. వశిష్ఠుడు రాముని తిరిగి పిలవడానికి సమ్మతిస్తాడు. భరతుడు, అల్లరి పరంగా ఉన్న ప్రజల వద్దకు వెళ్లి, రాముని తిరిగి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, రాముని పట్ల అతని అపార ప్రేమను ప్రతిబింబిస్తుంది.

చిత్రకూటవనప్రేక్షణమ్

తయా మహత్యా యాయిన్యా ధ్వజిన్యా వనవాసినః |
అర్దితా యూథపా మత్తాః సయూథాః సంప్రదుద్రువుః || ౧ ||

ఋక్షాః పృషతసంఘాశ్చ రురవశ్చ సమతంతః |
దృశ్యంతే వనరాజీషు గిరిష్వపి నదీషు చ || ౨ ||

స సంప్రతస్థే ధర్మాత్మా ప్రీతో దశరథాత్మజః |
వృతో మహత్యా నాదిన్యా సేనయా చతురంగయా || ౩ ||

సాగరౌఘనిభా సేనా భరతస్య మహాత్మనః |
మహీం సంఛాదయామాస ప్రావృషిద్యామివాంబుదః || ౪ ||

తురంగాఘైరవతతా వారణైశ్చ మహాజవైః |
అనాలక్ష్యా చిరం కాలం తస్మిన్కాలే బభూవ భూః || ౫ ||

స యాత్వా దూరమధ్వానం సుపరిశ్రాంతవాహనః |
ఉవాచ భరతః శ్రీమాన్ వసిష్ఠం మంత్రిణాం వరమ్ || ౬ ||

యాదృశం లక్ష్యతే రూపం యథా చైవ శ్రుతం మయా |
వ్యక్తం ప్రాప్తాః స్మ తం దేశం భరద్వాజో యమబ్రవీత్ || ౭ ||

అయం గిరిశ్చిత్రకూట ఇయం మందాకినీ నదీ |
ఏతత్ప్రకాశతే దూరాన్నీలమేఘనిభం వనమ్ || ౮ ||

గిరేః సానూని రమ్యాణి చిత్రకూటస్య సంప్రతి |
వారణైరవమృద్యంతే మామకైః పర్వతోపమైః || ౯ ||

ముంచంతి కుసుమాన్యేతే నగాః పర్వతసానుషు |
నీలా ఇవాతపాపాయే తోయం తోయధరా ఘనాః || ౧౦ ||

కిన్నరాచరితం దేశం పశ్య శత్రుఘ్న పర్వతమ్ |
మృగైః సమంతాదాకీర్ణం మకరైరివ సాగరమ్ || ౧౧ ||

ఏతే మృగగణా భాంతి శీఘ్రవేగాః ప్రచోదితాః |
వాయుప్రవిద్ధా శరది మేఘరాజిరివాంబరే || ౧౨ ||

కుర్వంతి కుసుమాపీడాన్ శిరస్సు సురభీనమీ |
మేఘప్రకాశైః ఫలకైర్దాక్షిణాత్యా యథా నరాః || ౧౩ ||

నిష్కూజమివ భూత్వేదం వనం ఘోరప్రదర్శనమ్ |
అయోధ్యేవ జనాకీర్ణా సంప్రతి ప్రతిభాతి మా || ౧౪ ||

ఖురైరుదీరితో రేణుర్దివం ప్రచ్ఛాద్య తిష్ఠతి |
తం వహత్యనిలః శీఘ్రం కుర్వన్నివ మమ ప్రియమ్ || ౧౫ ||

స్యందనాంస్తురగోపేతాన్ సూతముఖ్యైరధిష్ఠితాన్ |
ఏతాన్సంపతతః శీఘ్రం పశ్య శత్రుఘ్న కాననే || ౧౬ ||

ఏతాన్విత్రాసితాన్పశ్య బర్హిణః ప్రియదర్శనాన్ |
ఏతమావిశతః శీఘ్రమధివాసం పతత్త్రిణః || ౧౭ ||

అతిమాత్రమయం దేశో మనోజ్ఞః ప్రతిభాతి మా |
తాపసానాం నివాసోఽయం వ్యక్తం స్వర్గపథో యథా || ౧౮ ||

మృగా మృగీభిః సహితా బహవః పృషతా వనే |
మనోజ్ఞరూపా లక్ష్యంతే కుసుమైరివ చిత్రితాః || ౧౯ ||

సాధుసైన్యాః ప్రతిష్ఠంతాం విచిన్వంతు చ కాననే |
యథా తౌ పురుషవ్యాఘ్రౌ దృశ్యేతే రామలక్ష్మణౌ || ౨౦ ||

భరతస్య వచః శ్రుత్వా పురుషాః శస్త్రపాణయః |
వివిశుస్తద్వనం శూరాః ధూమం చ దదృశుస్తతః || ౨౧ ||

తే సమాలోక్య ధూమాగ్రమూచుర్భరతమాగతాః |
నామనుష్యే భవత్యాగ్నిర్వ్యక్తమత్రైవ రాఘవౌ || ౨౨ ||

అథ నాత్ర నరవ్యాఘ్రౌ రాజపుత్రౌ పరంతపౌ |
మన్యే రామోపమాః సంతి వ్యక్తమత్ర తపస్వినః || ౨౩ || [అన్యే]

తచ్ఛ్రుత్వా భరతస్తేషాం వచనం సాధుసమ్మతమ్ |
సైన్యానువాచ సర్వాంస్తానమిత్రబలమర్దనః || ౨౪ ||

యత్తా భవంతస్తిష్ఠంతు నేతో గంతవ్యమగ్రతః |
అహమేవ గమిష్యామి సుమంత్రో గురురేవ చ || ౨౫ ||

ఏవముక్తాస్తతః సర్వే తత్ర తస్థుః సమంతతః |
భరతో యత్ర ధూమాగ్రం తత్ర దృష్టిం సమాదధాత్ || ౨౬ ||

వ్యవస్థితా యా భరతేన సా చమూ-
-ర్నిరీక్షమాణాఽపి చ ధూమమగ్రతః |
బభూవ హృష్టా నచిరేణ జానతీ
ప్రియస్య రామస్య సమాగమం తదా || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రినవతితమః సర్గః || ౯౩ ||

Ayodhya Kanda Sarga 93 Meaning In Telugu

మహాసముద్రము వలె ఉన్న భరతుని సైన్యము పరివారము ఆ అడవులలో ప్రయాణం చేస్తూ ఉంటే అడవిలో ఉన్న మృగములు భయపడి పారిపోతున్నాయి. ఆ సైన్యము నడిచేటప్పుడు రేగిన ధూళితో ఆకాశం ఎర్రగా కవురు వేసినట్టు అయింది. వారందరూ చిత్రకూట పర్వతమును సమీపించారు. భరతుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “మహాత్మా! పరిసరములను బట్టి చూడగా మనకు చిత్రకూటపర్వతమును సమీపించినట్టు కనపడు చున్నది. అదుగో అదే మందాకినీ నది. ఇక్కడ కిన్నరులుసంచరిస్తూ ఉంటారని ప్రతీతి.

(ఇక్కడ వాల్మీకి ఒక శ్లోకం రాసాడు. అదేమిటంటే—-
కుర్వన్తికుసుమాపీడాన్ శిరస్సు సురభీనమీ।
మేఘప్రకాశై: ఫలకైర్దాక్షిణాత్యా యథానరా॥

ఈ పర్వత శిఖరములు, మేఘములతో సమానంగా, దాక్షిణాత్య నరుల వలె ప్రకాశిస్తున్నాయి. అని స్థూలంగా చెప్పుకోవచ్చు. దూరానికి మేఘములు, పర్వత శిఖరములు నల్లగా ఉంటాయి. అంటే దక్షిణదేశ నరులు నల్లగా ఉంటారని మనం అనుకోవచ్చునా. అలా కాకపోతే, ఇక్కడ దాక్షిణాత్యుల ప్రసక్తి తీసుకురావడం ఎందుకు? ఉత్తరదేశస్థులు తెల్లగా ఆజానుబాహులుగా ఉంటారని మనకు తెలిసిందే. కాబట్టి మన చరిత్రలో చెప్పినట్టు ఆర్యులు దస్యులు అనే రెండు తెగలు ఉన్నాయని స్పష్టం అవుతున్నట్టుగా ఉంది. ఇది కేవలము ఊహ మాత్రమే రూఢి కాదు.)

తరువాత భరతుడు శత్రుఘ్నుని చూచి “సోదరా! ఈ ప్రశాంత మైన అరణ్యమును చూస్తుంటే ఇక్కడ ఋషులు నివసిస్తున్నారు అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు మనము రాముని పర్ణశాల కొరకు వెతకవలెను. మన సైన్యమును నలుదిక్కులకు పంపి రాముని జాడ కనుగొనమని చెప్పు.” అని అన్నాడు.

భరతుని ఆదేశము మేరకు సైన్యము నలుదిక్కులకు వెళ్లారు. వారికి కొంచెం దూరంలో పొగ లేస్తున్నట్టు కనపడింది. వెంటనే వారు భరతుని వద్దకు వచ్చి “మహారాజా! ఈ అరణ్యములో ఆ ప్రదేశములో పొగవస్తోంది అంటే అక్కడ జనసంచారము ఉన్నట్టే. అక్కడే రామలక్ష్మణులు ఉండవచ్చు అని అనుమానంగా ఉంది. అలా కాకపోతే అక్కడ ముని ఆశ్రమములు ఉండవచ్చు. వారిని అడిగితే రాముని జాడలు చెప్పగలరు.” అని అన్నారు.

భరతుడు వారితో ఇలా అన్నాడు. “మీరందరూ ఇక్కడే ఉండండి. నేను, వసిష్ఠుడు సుమంత్రుడు పోయి చూచి వస్తాము. అంతదాకా మీరు ఇక్కడే వేచి ఉండండి.”అని అన్నాడు. తరువాత భరతుడు ఆపొగవస్తున్న దిక్కుగా చూచాడు. చాలారోజుల తరువాత తాను రాముని చూడబోవుచున్నానని ఎంతో సంతోషించాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్నవతితమః సర్గః (94) >>

Aranya Kanda Sarga 19 In Telugu – అరణ్యకాండ ఏకోనవింశః సర్గః

Aranya Kanda Sarga 19 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ఏకోనవింశః సర్గలో, శూర్పణఖ తన బాధాకరమైన కథను తన సోదరుడు ఖరకు ముఖ్యంగా సీతను నేరం చేస్తూ వివరిస్తుంది. సీత రక్తాన్ని తాగడానికి ఖరా యుద్ధం చేయాలని ఆమె కోరుకుంటుంది. ఖర తన సోదరిని శాంతింపజేయడానికి పద్నాలుగు రాక్షసులను రాముని అంతమొందించడానికి పంపుతాడు.

ఖరక్రోధః

తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితామ్ |
భగినీం క్రోధసంతప్తః ఖరః పప్రచ్ఛ రాక్షసః ||

1

ఉత్తిష్ఠ తావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమమ్ |
వ్యక్తమాఖ్యాహి కేన త్వమేవంరూపా విరూపితా ||

2

కః కృష్ణసర్పమాసీనమాశీవిషమనాగసమ్ |
తుదత్యభిసమాపన్నమంగుళ్యగ్రేణ లీలయా ||

3

కః కాలపాశమాసజ్య కంఠే మోహాన్న బుధ్యతే |
యస్త్వామద్య సమాసాద్య పీతవాన్ విషముత్తమమ్ ||

4

బలవిక్రమసంపన్నా కామగా కామరూపిణీ |
ఇమామవస్థాం నీతా త్వం కేనాంతకసమా గతా ||

5

దేవగంధర్వభూతానామృషీణాం చ మహాత్మనామ్ |
కోఽయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకార హ ||

6

న హి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్మమ విప్రియమ్ |
అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనమ్ ||

7

అద్యాహం మార్గణైః ప్రాణానాదాస్యే జీవితాంతకైః |
సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్నివ సారసః ||

8

నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్తమర్మణః |
సఫేనం రుధిరం రక్తం మేదినీ కస్య పాస్యతి ||

9

కస్య పత్రరథాః కాయాన్మాంసముత్కృత్య సంగతాః |
ప్రహృష్టా భక్షయిష్యంతి నిహతస్య మయా రణే ||

10

తం న దేవా న గంధర్వా న పిశాచా న రాక్షసాః |
మయాపకృష్టం కృపణం శక్తాస్త్రాతుమిహాహవే ||

11

ఉపలభ్య శనైః సంజ్ఞాం తం మే శంసితుమర్హసి |
యేన త్వం దుర్వినీతేన వనే విక్రమ్య నిర్జితా ||

12

ఇతి భ్రాతుర్వచః శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః |
తతః శూర్పణఖా వాక్యం సబాష్పమిదమబ్రవీత్ ||

13

తరుణౌ రూపసంపన్నౌ సుకూమారౌ మహాబలౌ |
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ||

14

ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ |
పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

15

గంధర్వరాజప్రతిమౌ పార్థివవ్యంజనాన్వితౌ |
దేవౌ వా మానుషౌ వా తౌ న తర్కయితుముత్సహే ||

16

తరుణీ రూపసంపన్నా సర్వాభరణభూషితా |
దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా ||

17

తాభ్యాముభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్య తామ్ |
ఇమామవస్థాం నీతాహం యథానాథాసతీ తథా ||

18

తస్యాశ్చానృజువృత్తాయాస్తయోశ్చ హతయోరహమ్ |
సఫేనం పాతుమిచ్ఛామి రుధిరం రణమూర్ధని ||

19

ఏష మే ప్రథమః కామః కృతస్తాత త్వయా భవేత్ |
తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయమహమాహవే ||

20

ఇతి తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలాన్ |
వ్యాదిదేశ ఖరః క్రుద్ధో రాక్షసానంతకోపమాన్ ||

21

మానుషౌ శస్త్రసంపన్నౌ చీరకృష్ణాజినాంబరౌ |
ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహ ||

22

తౌ హత్వా తాం చ దుర్వృత్తామపావర్తితుమర్హథ |
ఇయం చ రుధిరం తేషాం భగినీ మమ పాస్యతి ||

23

మనోరథోఽయమిష్టోఽస్యా భగిన్యా మమ రాక్షసాః |
శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమథ్య స్వేన తేజసా ||

24

యుష్మాభిర్నిర్హతౌ దృష్ట్వా తావుభౌ భ్రాతరౌ రణే |
ఇయం ప్రహృష్టా ముదితా రుధిరం యుధి పాస్యతి ||

25

ఇతి ప్రతిసమాదిష్టా రాక్షసాస్తే చతుర్దశ |
తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనా వాతేరితా యథా ||

26

తతస్తు తే తం సముదగ్రతేజసం
తథాపి తీక్ష్ణప్రదరా నిశాచరాః |
న శేకురేనం సహసా ప్రమర్దితుం
వనద్విపా దీప్తమివాగ్నిముత్థితమ్ ||

27

Aranya Kanda Sarga 19 In Telugu Pdf Download

ముక్కులలో నుండి చెవుల నుండి రక్తం కారుతూ తన ముందు నేల మీద పడి రోదిస్తూ ఉన్న చెల్లెలు శూర్పణఖను చూచాడు. ఖరుడు. ఆమెను రెండుచేతులతో లేవనెత్తాడు.

“చెల్లెలా శూర్పణఖా! ఏమిటీ ఘోరము. ఎవరు చేసారీ పని? నీవు ఎవరో తెలిసే ఈ పని చేసాడా! వాడు తాచు పాముతో ఆడుకుంటున్నాడు అని మరిచిపోయినట్టున్నాడు. వాడికి మూడింది. వాడికి కాలపాశం మెడకు చుట్టుకోబట్టే ఇలాంటి పని చేసాడు. ఎవడు వాడు! ఎక్కడ ఉంటాడు! ఉన్నది ఉన్నట్టు చెప్పు.

అయినా నీవు సహజంగా బలవంతురాలివి కదా! పైగా కామరూపివి. నిన్ను చూస్తే యముడిని చూచినట్టే కదా! అలాంటి నీకు ఈ గతి పట్టించిన వాడు ఎవడు? వాడు దేవతా! గంధర్వుడా! భూతమా! లేక ఎవరన్నా పరాక్రమ వంతుడైన ఋషిపుంగవుడా! ఎందుకంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా నాకు అపకారం చెయ్యడానికి వెనుకాడుతాడు. అటువంటిది నీవు నా చెల్లెలు అని తెలిసికూడా నీకు అవమానం చేసాడంటే వాడికి ఆయువు మూడింది.

ఇప్పుడే నేను వాడిని సంహరించి నీకు జరిగిన అవమానము నకు ప్రతీకారము చేస్తాను. వాడి శరీరమును కాకులు, గ్రద్దలు తింటాయి. దేవతలు గానీ, గంధర్వులు కానీ, రాక్షసులు గానీ, పిశాచములు గానీ ఎవరు అడ్డం వచ్చినా సరే వాడిని చంపకుండా విడువను. చెల్లెలా! చెప్పు. నీ భయందోళనలనుండి తేరుకొని అన్నీ వివరంగా చెప్పు.” అని అడిగాడు ఖరుడు.

శూర్పణఖ కళ్లనుండి నీళ్లు కారుతున్నాయి. కళ్లు తుడుచుకుంటూ ఖరునితో ఇలా చెప్పింది. “ఎవరో అయోధ్యను పరిపాలించే దశరథమహారాజు కుమారులట. పేరు రాముడు, లక్ష్మణుడు. వారు సుకుమారులు. సుందరాకారులు. కాని మంచి బలంగా ఉన్నారు. మునివేషములో ఉన్నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. వారి ముఖంలో రాజసం తొణికిసలాడుతూ ఉంది. వారు దేవతలో మనుష్యులో చెప్పలేను. వారి పక్కనే ఒక సౌందర్యవతి అయిన స్త్రీ ఉంది. ఆ స్త్రీమూలంగానే నాకు ఈ అవమానము జరిగింది. నువ్వు వెళ్లి ఆ స్త్రీని, ఆ ఇద్దరు యువకులనుచంపి వారి రక్తముతో నా దాహము తీర్చు. అప్పటి దాకా నా పగ చల్లారదు.” అని రోషంతో పలికింది శూర్పణఖ.

ఆమె మాటలకు రగిలిపోయాడు ఖరుడు. వెంటనే తన వద్ద ఉన్న అత్యధిక బలసంపన్నులైన 14 మంది రాక్షస వీరులను పిలిపించాడు. (ఇక్కడ గమనించండి. రామాయణంలో ఈ 14 అంకె విశిష్టమైనది. రాముని వనవాసము 14 సంవత్సరములు. ఖరుడు పంపిన వారు 14 మంది. ఇంకా ఈ 14 సంఖ్య వస్తూనే ఉంటుంది. భారతంలో 18 అంకె ఉన్నట్టు రామాయణంలో 14 అంకెకు ప్రాధాన్యత ఉన్నట్టు ఉంది.).

“ఓ రాక్షసవీరులారా! ముని వేషములో ఉన్న ఇద్దరు క్షత్రియ కుమారులు, ఒక స్త్రీ దండకారణ్యములో ప్రవేశించారట. మీరు వెళ్లి ఆ ముని కుమారులను, ఆ స్త్రీని చంపండి. వారి రక్తము నా సోదరి శూర్పణఖ తాగవలెనని కోరుతూ ఉంది. వెళ్లండి. వాళ్లను చంపి వారి రక్తమును పట్టి తీసుకురండి.” అని ఆజ్ఞాపించాడు ఖరుడు.

ఆ 14 మంది రాక్షసవీరులూ శూర్పణఖను తీసుకొని రామలక్ష్మణులను వెతుక్కుంటూ వెళ్లారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ వింశః సర్గః (20) >>

Aranya Kanda Sarga 21 In Telugu – అరణ్యకాండ ఏకవింశః సర్గః

Aranya Kanda Sarga 21 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకవింశః సర్గలో, రాముడు, సీతమ్మ మరియు లక్ష్మణులు పంచవటి ప్రాంతంలో నివాసం ప్రారంభిస్తారు. పంచవటిలో వాతావరణం అందంగా ఉంటుంది. అక్కడ వారు చిన్న ఆశ్రమాన్ని నిర్మించి నివసిస్తారు. ఈ సుందర వాతావరణంలో సీతమ్మ పూలతో అలంకరణలు చేస్తూ సంతోషంగా గడుపుతుంది.

ఖరసంధుక్షణమ్

స పునః పతితాం దృష్ట్వా క్రోధాచ్ఛూర్పణఖాం ఖరః |
ఉవాచ వ్యక్తయా వాచా తామనర్థార్థమాగతామ్ ||

1

మయా త్విదానీం శూరాస్తే రాక్షసా రుధిరాశనః |
త్వత్ప్రియార్థం వినిర్దిష్టాః కిమర్థం రుద్యతే పునః ||

2

భక్తాశ్చైవానురక్తాశ్చ హితాశ్చ మమ నిత్యశః |
ఘ్నంతోఽపి న నిహంతవ్యా న న కుర్యుర్వచో మమ ||

3

కిమేతచ్ఛ్రోతుమిచ్ఛామి కారణం యత్కృతే పునః |
హా నాథేతి వినర్దంతీ సర్పవల్లుఠసి క్షితౌ ||

4

అనాథవద్విలపసి నాథే తు మయి సంస్థితే |
ఉత్తిష్ఠోత్తిష్ఠ మా భైషీర్వైక్లబ్యం త్యజ్యతామిహ ||

5

ఇత్యేవముక్తా దుర్ధర్షా ఖరేణ పరిసాంత్వితా |
విమృజ్య నయనే సాస్రే ఖరం భ్రాతరమబ్రవీత్ ||

6

అస్మీదానీమహం ప్రాప్తా హృతశ్రవణనాసికా |
శోణితౌఘపరిక్లిన్నా త్వయా చ పరిసాంత్వితా ||

7

ప్రేషితాశ్చ త్వయా వీర రాక్షసాస్తే చతుర్దశ |
నిహంతుం రాఘవం క్రోధాన్మత్ప్రియార్థం సలక్ష్మణమ్ ||

8

తే తు రామేణ సామర్షాః శూలపట్టిశపాణయః |
సమరే నిహతాః సర్వే సాయకైర్మర్మభేదిభిః ||

9

తాన్ దృష్ట్వా పతితాన్భూమౌ క్షణేనైవ మహాబలాన్ |
రామస్య చ మహత్కర్మ మహాంస్త్రాసోఽభవన్మమ ||

10

అహమస్మి సముద్విగ్నా విషణ్ణా చ నిశాచర |
శరణం త్వాం పునః ప్రాప్తా సర్వతోభయదర్శినీ ||

11

విషాదనక్రాధ్యుషితే పరిత్రాసోర్మిమాలిని |
కిం మాం న త్రాయసే మగ్నాం విపులే శోకసాగరే ||

12

ఏతే చ నిహతా భూమౌ రామేణ నిశితైః శరైః |
యేఽపి మే పదవీం ప్రాప్తా రాక్షసాః పిశితాశనాః ||

13

మయి తే యద్యనుక్రోశో యది రక్షస్సు తేషు చ |
రామేణ యది తే శక్తిస్తేజో వాఽస్తి నిశాచర ||

14

దండకారణ్యనిలయం జహి రాక్షసకంటకమ్ |
యది రామం మమామిత్రం న త్వమద్య వధిష్యసి ||

15

తవ చైవాగ్రతః ప్రాణాంస్త్యక్ష్యామి నిరపత్రపా |
బుద్ధ్యాఽహమనుపశ్యామి న త్వం రామస్య సంయుగే ||

16

స్థాతుం ప్రతిముఖే శక్తః సబలశ్చ మహాత్మనః |
శూరమానీ న శూరస్త్వం మిథ్యారోపితవిక్రమః ||

17

మానుషౌ యౌ న శక్నోషి హంతుం తౌ రామలక్ష్మణౌ |
రామేణ యది తే శక్తిస్తేజో వాఽస్తి నిశాచర ||

18

దండకారణ్యనిలయం జహి తం కులపాంసన |
నిఃసత్త్వస్యాల్పవీర్యస్య వాసస్తే కీదృశస్త్విహ ||

19

అపయాహి జనస్థానాత్త్వరితః సహబాంధవః |
రామతేజోఽభిభూతో హి త్వం క్షిప్రం వినశిష్యసి ||

20

స హి తేజః సమాయుక్తో రామో దశరథాత్మజః |
భ్రాతా చాస్య మహావీర్యో యేన చాస్మి విరూపితా ||

21

ఏవం విలప్య బహుశో రాక్షసీ వితతోదరీ |
భ్రాతుః సమీపే దుఃఖార్తా నష్టసంజ్ఞా బభూవ హ |
కరాభ్యాముదరం హత్వా రురోద భృశదుఃఖితా ||

22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకవింశః సర్గః ||

Aranya Kanda Sarga 21 Meaning In Telugu

పదునాలుగు మంది రాక్షస వీరులను వెంటబెట్టుకొని వెళ్లిన శూర్పణఖ వెంటనే ఒంటరిగా రావడం చూచి ఆశ్చర్యపోయాడు ఖరుడు.

“ఏంటి శూర్పణఖా! ఏమయింది. నీవు కోరితేనేకదా నీ వెంట 14 మంది రాక్షస వీరులను పంపాను. మరలా ఏడుస్తూ వచ్చావెందుకు. ఊరికే అలా భయపడితే ఎలాగా! నేను ఉన్నాగా నీకెందుకు భయం. ఏం జరిగిందో చెప్పు” అన్నాడు ఖరుడు.

ఖరుని చూచి వ్యంగ్యంగా ఇలా అంది శూర్పణఖ. “ముక్కు, చెవులూ కోయించుకొని రక్తంకారుకుంటూ ఏడ్చుకుంటూ నీదగ్గరకు వచ్చానా! నీవు నన్ను ఓదార్చావు కదా! రామలక్ష్మణులను చంపడానికి 14 మంది రాక్షస వీరులను పంపావు కదా! మహావీరుల మాదిరి శూలాలు ధరించి ఆ 14మంది నా వెంట వచ్చారు కదా! క్షణకాలంలో రాముడిచేతిలో గుండెలు పగిలి చచ్చారు. ఇదీ మనవాళ్ల ప్రతాపం. ఇంక భయపడక చస్తానా! వాళ్లందరూ అలా క్షణకాలంలో నేలమీద పడగానే నాకు వణుకు పుట్టింది. పరుగెత్తుకుంటూ వచ్చాను.

ఓ ఖరా! నాకు భయంగా ఉంది. రామలక్ష్మణులు ఏవైపు నుంచి అన్నా రావచ్చు. నిన్ను, నన్ను చంపవచ్చు నీకు నా మీద జాలి దయ ఉంటే, ఆ రామలక్ష్మణులను ఎదిరించే శక్తి, బలము ఉంటే, దండకారణ్యములో నివాసమేర్పరచుకొన్న ఆ రామలక్ష్మణులను వెంటనే చంపు. వాళ్లు సామాన్యులు కాదు. రాక్షసులను చంపడానికి వచ్చిన దేవతలు. నీవు కనక రాముడిని చంపకపోతే నేను నీ ఎదుటనే ఆత్మహత్య చేసుకొని చస్తాను.

అయినా నీకు ఇంత సైన్యము, ఇంత బలము, పరాక్రమములు ఉండి ఏం ప్రయోజనం. ఇద్దరిని చంపలేకపోయావు. అసలు నువ్వు అయినా రాముని ఎదుట నిలిచి యుద్ధం చెయ్యగలవా అని నా అనుమానము.

ఖరా! వాళ్లు సామాన్య మానవులు. నీ సైన్యము ఆ మానవులను చంపలేకపోయాయి. నీవేదో పెద్ద పరాక్రమవంతుడవని డంబాలు పలుకుతున్నావు. నీ పరాక్రమము శూరత్వము ఎందుకు తగలపెట్టనా! నా మాటవిని ఈ జనస్థానము వదిలి ఎక్కడికన్నా వెళ్లి బతుకు పో! నువ్వు రాక్షసకులంలో చెడ బుట్టావు. అందుకే మానవులకు భయపడుతున్నావు.

ఓ ఖరా! ఆఖరుసారిగా చెబుతున్నాను విను. నీకు రాముని ఎదిరించే వీరత్వము ఉంటే, నీ సైన్యంతో వెళ్లి రామలక్ష్మణులను చంపు. లేకపోతే, నీ బంధుమిత్రులతో ఈ జనస్థానము వదిలి పారిపో! అదే ఉత్తమము. రాముని తేజస్సు ముందు నీవు నిలువలేవు. అందుకే నా ముక్కు చెవులు కోసినా ఇంకా రామలక్ష్మణులు బతికే ఉన్నారు.” అని సూటిపోటీ మాటలతో ఖరుని రెచ్చగొట్టింది శూర్పణఖ.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓతత్సత్.

అరణ్యకాండ ద్వావింశః సర్గః (22) >>

Aranya Kanda Sarga 10 In Telugu – అరణ్యకాండ దశమః సర్గః

Aranya Kanda Sarga 10 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ దశమ సర్గలో, శ్రీరాముడు, సీతమ్మ మరియు లక్ష్మణులు తమ కష్టాలకు పరిష్కారం కోసం రుషి శరభంగుడి ఆశ్రమానికి వెళతారు. రాముడు శరభంగుడి ఆశీస్సులతో సుఖంగా గడుపుతాడు. శరభంగుడు తన చివరి క్షణాల్లో రామునికి పుణ్యాలను వివరించి, దివ్య లోకాలకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు.

రక్షోవధసమర్థనమ్

వాక్యమేతత్తు వైదేహ్యా వ్యాహృతం భర్తృభక్తయా |
శ్రుత్వా ధర్మే స్థితో రామః ప్రత్యువాచాథ మైథిలీమ్ ||

1

హితముక్తం త్వయా దేవి స్నిగ్ధయా సదృశం వచః |
కులం వ్యపదిశంత్యా చ ధర్మజ్ఞే జనకాత్మజే ||

2

కిం తు వక్ష్యామ్యహం దేవి త్వయైవోక్తమిదం వచః |
క్షత్రియైర్ధార్యతే చాపో నార్త శబ్దో భవేదితి ||

3

మాం సీతే స్వయమాగమ్య శరణ్యాః శరణం గతాః |
తే చార్తా దండకారణ్యే మునయః సంశితవ్రతాః ||

4

వసంతో ధర్మనిరతా వనే మూలఫలాశనాః |
న లభంతే సుఖం భీతా రాక్షసైః క్రూరకర్మభిః ||

5

కాలే కాలే చ నిరతా నియమైర్వివిధైర్వనే |
భక్ష్యంతే రాక్షసైర్భీమైర్నరమాంసోపజీవిభిః ||

6

తే భక్ష్యమాణా మునయో దండకారణ్యవాసినః |
అస్మానభ్యవపద్యేతి మామూచుర్ద్విజసత్తమాః ||

7

మయా తు వచనం శ్రుత్వా తేషామేవం ముఖాచ్చ్యుతమ్ |
కృత్వా చరణశుశ్రూషాం వాక్యమేతదుదాహృతమ్ ||

8

ప్రసీదంతు భవంతో మే హ్రీరేషా తు మమాతులా |
యదీదృశైరహం విప్రైరుపస్థేయైరుపస్థితః ||

9

కిం కరోమీతి చ మయా వ్యాహృతం ద్విజసన్నిధౌ |
సర్వైరేతైః సమాగమ్య వాగియం సముదాహృతా ||

10

రాక్షసైర్దండకారణ్యే బహుభిః కామరూపిభిః |
అర్దితాః స్మ దృఢం రామ భవాన్నస్తత్ర రక్షతు ||

11

హోమకాలేషు సంప్రాప్తాః పర్వకాలేషు చానఘ |
ధర్షయంతి సుదుర్ధర్షా రాక్షసాః పిశితాశనాః ||

12

రాక్షసైర్ధర్షితానాం చ తాపసానాం తపస్వినామ్ |
గతిం మృగయమాణానాం భవాన్నః పరమా గతిః ||

13

కామం తపః ప్రభావేన శక్తా హంతుం నిశాచరాన్ |
చిరార్జితం తు నేచ్ఛామస్తపః ఖండయితుం వయమ్ ||

14

బహువిఘ్నం తపో నిత్యం దుశ్చరం చైవ రాఘవ |
తేన శాపం న ముంచామో భక్ష్యమాణాశ్చ రాక్షసైః ||

15

తదర్ద్యమానాన్రక్షోభిర్దండకారణ్యవాసిభిః |
రక్ష నస్త్వం సహ భ్రాత్రా త్వన్నాథా హి వయం వనే ||

16

మయా చైతద్వచః శ్రుత్వా కార్త్స్న్యేన పరిపాలనమ్ |
ఋషీణాం దండకారణ్యే సంశ్రుతం జనకాత్మజే ||

17

సంశ్రుత్య చ న శక్ష్యామి జీవమానః ప్రతిశ్రవమ్ |
మునీనామన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా ||

18

అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణామ్ |
న తు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః ||

19

తదవశ్యం మయా కార్యమృషీణాం పరిపాలనమ్ |
అనుక్తేనాపి వైదేహి ప్రతిజ్ఞాయ తు కిం పునః ||

20

మమ స్నేహాచ్చ సౌహార్దాదిదముక్తం త్వయాఽనఘే |
పరితుష్టోఽస్మ్యహం సీతే న హ్యనిష్టోఽనుశిష్యతే ||

21

సదృశం చానురూపం చ కులస్య తవ చాత్మనః |
సధర్మచారిణీ మే త్వం ప్రాణేభ్యోఽపి గరీయసీ ||

22

ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా
సీతాం ప్రియాం మైథిలరాజపుత్రీమ్ |
రామో ధనుష్మాన్సహ లక్ష్మణేన
జగామ రమ్యాణి తపోవనాని ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే దశమః సర్గః ||

Aranya Kanda Sarga 10 Meaning In Telugu

తన భార్య సీత చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. సీతతో ఇలా అన్నాడు.“ఓ జనకరాజపుత్రీ! సీతా! నీకు అన్ని ధర్మాలూ తెలుసు. నీవు పలికిన పలుకులు నీ సాత్విక ప్రవృత్తికి తగినట్టుగానూ, ధర్మబద్ధంగానూ, యుక్తియుక్తంగానూ ఉన్నాయి.

దీనులను రక్షించడానికే క్షత్రియులు ఆయుధములు చేపడతారని నీవే చెప్పావు కదా! ఈ దండకారణ్యములో ఎంతో మంది మునులు ఉన్నారు. వారికి తపస్సు తప్ప వేరొక పని లేదు. వారందరూ పూజనీయులు. గౌరవింపతగ్గవారు. అటువంటి వారిని రాక్షసులు అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు. చంపుతున్నారు. ఆ పరిస్థితులలో ఆ మునులు తమ బాధలనుండి రక్షించమని నన్ను శరణుకోరారు.

ఆ మునులు ఎవరికీ అపకారముచెయ్యరు. దొరికిన కందమూలములు, ఫలములు తిని తపస్సు చేసుకుంటున్నారు. అటువంటి వారికి ఈ రాక్షసుల వలన శాంతి, సుఖము లేకుండా పోయాయి. నరమాంస భక్షకులైన రాక్షసులు ఎప్పుడు ఎవరిని చంపుతారో అని భయంతో వణికిపోతున్నారు. వారందరూ రాక్షసుల బారినుండి తమను కాపాడమని నన్ను అర్ధించారు.

ఒక క్షత్రియుడుగా, ఒక రాజుగా నేనే వారి వద్దకుపోయి, “మీకు నేను ఏమి సేవ చేయాలి” అని అడగడం పోయి, వారే నా
దగ్గరకు వచ్చి తమను కాపాడమని నన్ను అర్థించారు. అందుకు ఒక రాజుగా నేను సిగ్గుపడాలి. నేను వారిని “నేను మీకు ఏమిసేవ చేయగలను” అని అడిగినప్పుడు వారు చెప్పిన మాటలను నీకు చెబుతున్నాను.

“రామా! ఈ దండకారణ్యములో కామరూపులైన రాక్షసులు స్థావరములు ఏర్పరచుకొని ఉన్నారు. వారు నరమాంసభక్షకులు. మేము హోమాలు, యాగాలు చేస్తుంటే వాటిని పాడుచేస్తున్నారు. అదేమని అడిగితే చంపుతున్నారు. మా తపోబలముచేత వారిని మేము ఎదుర్కోగలము, చంపగలము. కాని ఎంతో కష్టపడి ఆర్జించిన మా తపోమహిమలను ఈ నీచుల కోసరం వెచ్చించడం మాకు ఇష్టం లేదు. అందుచేత, ఆ రాక్షసులు మమ్ములను ఎన్ని బాధలు పెడుతున్నా, మా యజ్ఞులు పాడుచేస్తున్నా, మమ్ములను చంపుతున్నా, భరిస్తున్నాము, సహిస్తున్నాము. ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి, నిన్ను అర్ధిస్తున్నాము. ఈ ప్రాంతము నీరాజ్యములో ఉన్నది కాబట్టి నీవే మాకు రక్షకుడవు.”

సీతా! ఈ ప్రకారంగా వారు నాతో పలికిన పలుకులు విని నేను ఊరుకోలేకపోయాను. వారికి అపకారము చేస్తున్న రాక్షసులను సంహరిస్తానని వారికి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేర్చడం క్షత్రియునిగా నా కర్తవ్యం. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకూ వారికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను. అవసరం అయితే మీ అందరినీ, నా ప్రాణాలను సైతం విడిచిపెడతాను కానీ ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను. ఇదే నా నిశ్చయము. ఒక క్షత్రియునిగా, ఒక రాజుగా, వారు అడగకపోయినా, నేను వారి కష్టాలు తీర్చాలి. వారికి రక్షణ కల్పించాలి. వారే అడిగినప్పుడు ఇంక వేరుచెప్పాలా!

ఓ సీతా! నీకు తగినట్టు నీవు చెప్పావు. అందులో తప్పులేదు. నిన్ను నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. మునులకు ఇచ్చిన మాటనుకూడా నెరవేరుస్తాను.” అని అన్నాడు రాముడు.

తరువాత అందరూ దండకారణ్యములోనికి ప్రవేశించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ ఏకాదశః సర్గః (11) >>

Aranya Kanda Sarga 18 In Telugu – అరణ్యకాండ అష్టాదశః సర్గః

Aranya Kanda Sarga 18 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” అష్టాదశః సర్గలో, రాముడు శూర్పణఖ తన వైపుకు వెళ్లడాన్ని అడ్డుకుంటాడు మరియు బదులుగా లక్ష్మణుడిని వెతకమని కోరతాడు. లక్ష్మణుడు ఆమెను తన మాటల్లోనే తిప్పికొట్టడంలో పదజాలాన్ని ఉపయోగిస్తాడు. కానీ ఆమె లక్ష్మణుడి మాటల అర్థాన్ని గ్రహించి సీతను తినడానికి పరుగెత్తుతుంది. లక్ష్మణుడు ఆమెను అపవిత్రం చేస్తాడు మరియు ఆమె అక్కడ నుండి శబ్దంతో పారిపోతుంది, హింసాత్మక రాక్షసుడైన తన సోదరుడు ఖరాకు నివేదించడానికి మాత్రమే. ఇది రాముడు మరియు రామాయణానికి మరో రౌండ్ ఇబ్బందులను ప్రేరేపించే పరిస్థితి.

శూర్పణఖావిరూపణమ్

తాతః శూర్పణఖాం రామః కామపాశావపాశితామ్ |
స్వచ్ఛయా శ్లక్ష్ణయా వాచా స్మితపూర్వమథాబ్రవీత్ ||

1

కృతదారోఽస్మి భవతి భార్యేయం దయితా మమ |
త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖా ససపత్నతా ||

2

అనుజస్త్వేష మే భ్రాతా శీలవాన్ ప్రియదర్శనః |
శ్రీమానకృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ ||

3

అపూర్వీ భార్యయా చార్థీ తరుణః ప్రియదర్శనః |
అనురూపశ్చ తే భర్తా రూపస్యాస్య భవిష్యతి ||

4

ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ |
అసపత్నా వరారోహే మేరుమర్కప్రభా యథా ||

5

ఇతి రామేణ సా ప్రోక్తా రాక్షసీ కామమోహితా |
విసృజ్య రామం సహసా తతో లక్ష్మణమబ్రవీత్ ||

6

అస్య రూపస్య తే యుక్తా భార్యాఽహం వరవర్ణినీ |
మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి ||

7

ఏవముక్తస్తు సౌమిత్రీ రాక్షస్యా వాక్యకోవిదః |
తతః శూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్ ||

8

కథం దాసస్య మే దాసీ భార్యా భవితుమిచ్ఛసి |
సోఽహమార్యేణ పరవాన్ భ్రాత్రా కమలవర్ణినీ ||

9

సమృద్ధార్థస్య సిద్ధార్థా ముదితామలవర్ణినీ |
ఆర్యస్య త్వం విశాలాక్షి భార్యా భవ యవీయసీ ||

10

ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీమ్ |
భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామేవైష భజిష్యతి ||

11

కో హి రూపమిదం శ్రేష్ఠం సంత్యజ్య వరవర్ణిని |
మానుషీషు వరారోహే కుర్యాద్భావం విచక్షణః ||

12

ఇతి సా లక్ష్మణేనోక్తా కరాళా నిర్ణతోదరీ |
మన్యతే తద్వచస్తథ్యం పరిహాసావిచక్షణా ||

13

సా రామం పర్ణశాలాయాముపవిష్టం పరంతపమ్ |
సీతయా సహ దుర్ధర్షమబ్రవీత్ కామమోహితా ||

14

ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీమ్ |
వృద్ధాం భార్యామవష్టభ్య మాం న త్వం బహుమన్యసే ||

15

అద్యేమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషీమ్ |
త్వయా సహ చరిష్యామి నిఃసపత్నా యథాసుఖమ్ ||

16

ఇత్యుక్త్వా మృగశాబాక్షీమలాతసదృశేక్షణా |
అభ్యధావత్ సుసంక్రుద్ధా మహోల్కా రోహిణీమివ ||

17

తాం మృత్యుపాశప్రతిమామాపతంతీం మహాబలః |
నిగృహ్య రామః కుపితస్తతో లక్ష్మణమబ్రవీత్ ||

18

క్రూరైరనార్యైః సౌమిత్రే పరిహాసః కథంచన |
న కార్యః పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవతీమ్ ||

19

ఇమాం విరూపామసతీమతిమత్తాం మహోదరీమ్ |
రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయితుమర్హసి ||

20

ఇత్యుక్తో లక్ష్మణస్తస్యాః క్రుద్ధో రామస్య పార్శ్వతః |
ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాసం మహాబలః ||

21

నికృత్తకర్ణనాసా తు విస్వరం సా వినద్య చ |
యథాగతం ప్రదుద్రావ ఘోరా శూర్పణఖా వనమ్ ||

22

సా విరూపా మహాఘోరా రాక్షసీ శోణితోక్షితా |
ననాద వివిధాన్నాదాన్ యథా ప్రావృషి తోయదః ||

23

సా విక్షరంతీ రుధిరం బహుధా ఘోరదర్శనా |
ప్రగృహ్య బాహూ గర్జంతీ ప్రవివేశ మహావనమ్ ||

24

తతస్తు సా రాక్షససంఘసంవృతం
ఖరం జనస్థానగతం విరూపితా |
ఉపేత్య తం భ్రాతరముగ్రదర్శనం
పపాత భూమౌ గగనాద్యథాఽశనిః ||

25

తతః సభార్యం భయమోహమూర్ఛితా
సలక్ష్మణం రాఘవమాగతం వనమ్ |
విరూపణం చాత్మని శోణితోక్షితా
శశంస సర్వం భగినీ ఖరస్య సా ||

26

Aranya Kanda Sarga 18 In Telugu Pdf Download

కామంతో కాలిపోతున్న శూర్పణఖను చూచాడు. రాముడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. “ఓ సుందరీ! నీవు నన్ను పెళ్లిచేసు కుంటాను అన్నావు. కాని నాకు ఇదివరకే పెళ్లి అయింది. ఈమే నా భార్య. ఈమె అంటే నాకు ప్రాణము. నీవు మళ్లీ నన్ను పెళ్లిచేసుకుంటే నీకు సవతి పోరు తప్పదు. నాతో కోరికలు తీర్చుకోవాలి అని గాఢంగా కోరుకున్న నీకు సవతి పోరు ఉండటం నీవు సహించగలవా! నీవంటి కాముకులు సవతి పోరు అస్సలు సహించలేరు.

అడుగో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన నా తమ్ముడు లక్ష్మణుడు. మంచి అందగాడు.

(ఇక్కడ వాల్మీకి ‘అకృతదారశ్చ’ అని వాడాడు. దీనికి అర్థం పెళ్లికానివాడు, అనీ, భార్య దగ్గరలేని వాడు అనీ అర్థం చెప్పుకోవచ్చు. పెళ్లికాని వాడు అంటే రాముడు అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా! అందుకని ఒంటరి వాడు. భార్య దగ్గర లేని వాడు అని అర్థం చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది అని నా భావన)

పాపం అతనికి భార్యాసౌఖ్యము లేదు. ప్రస్తుతము అతనికి భార్య అవసరము ఉంది. కాబట్టి అతడు నీకు తగిన భర్త. పైగా నీవు అతనిని పెళ్లిచేసుకుంటే నీకు సవతి బాధ ఉండదు. కాబట్టి నన్ను విడిచిపెట్టి అతని వద్దకు పో!” అని అన్నాడు రాముడు.

ఇద్దరూ అందగాళ్లే. ఎవరైనా ఒకటే అనుకుంటూ శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్లింది. శూర్పణఖ మొదట రాముని వద్దకు పోవడం, ఆయనతో మాట్లాడటం, తరువాత తన వద్దకు రావడం చూస్తున్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ చకా చకా లక్ష్మణుని వద్దకు వెళ్లింది.

“ఓ సుందరాకారా! నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటే నీకు అమర సుఖాలు అందిస్తాను. ఈ వనసీమలలో మనం హాయిగా విహరిద్దాము. రా! నాతోరా!” అని తొందరపెట్టింది శూర్పణఖ.

లక్ష్మణుడు ఆమెను చూచి ఇలా అన్నాడు. “ఓ లలనా! నేను నా అన్న రామునికి సేవకుడను. నా అన్నకు వదినకు దాసుడను. నేనే వారికి సేవలు చేస్తుంటే, నువ్వు కూడా నన్ను పెళ్లిచేసుకొని వారికి సేవలుచేస్తావా! ఎవరైనా రాణి కావాలని కోరుకుంటారు కానీ సేవకురాలు కావాలని కోరుకుంటారా చెప్పు. కాబట్టి నేను నీకు తగినవాడను కాను. నీవు రాముని వద్దకు వెళ్లు. ఆయనకు చిన్నభార్యగా ఉన్నా, ఆనందం అనుభవిస్తావు. అప్పుడు నేనేనీకు సేవలు చేస్తాను.

రాముని భార్యను చూడు. ఎంత అందవికారంగా ఉందో! పైగా ముసలిది. పొట్టలోపలికి పోయి ఎంత వికృతంగా ఉందో చూడు! ఇంకొక్కసారి అడిగావనుకో రాముడు తన అందవికారి అయిన భార్యను విడిచి నిన్నే పెళ్లాడతాడు. రామునితో అమర సుఖాలు అనుభవించు. అయినా లోకోత్తర సుందరి అయిన నిన్ను వదిలి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఆ మనుష్యకాంతను కోరుకుంటారా చెప్పు! కాబట్టి వెంటనే రాముని వద్దకు వెళ్లు. నీ మంచికోరి చెబుతున్నాను. విను.” అని బంతిని తిరిగి రాముని వద్దకు నెట్టాడు.

లక్ష్మణుడు తనను ఆట పట్టిస్తున్నాడు అని దాని మట్టి బుర్రకు తోచలేదు. ఇదేదో బాగానే ఉందనుకొని, శూర్పణఖ తిరిగి రాముని వద్దకు పోయింది.

“రామా! నన్ను చూడు. నీ భార్యను చూడు. నేను లోకోత్తర సౌందర్యవతిని. నీ భార్య కురూపి. పైగా ముసలిది. దానితో ఏం సుఖపడతావు. నాతో రా. నన్ను పెళ్లిచేసుకో. నీకు అమరసుఖాలు రుచి చూపిస్తాను.

(సీతను చూపిస్తూ) ఈ అందవికారిని చూచా నన్ను వద్దంటున్నావు. ఇది ఉండబట్టి కదా నువ్వు నన్ను కాదంటున్నావు. చూస్తూ ఉండు. ఇప్పుడే దీనిని కరా కరా నమిలి తింటాను. అప్పుడు నాకు సవతి పోరు ఉండదుగా! రా రామా! మనం హాయిగా పెళ్లిచేసుకొని సుఖిద్దాము.” అని రాముని బలవంతం చేసింది. శూర్పణఖ. సీతను చంపడానికి ఆమె మీదికి వెళ్లింది. వెంటనే రాముడు శూర్పణఖను అడ్డుకున్నాడు. పక్కకు నెట్టాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! ఇలాంటి దుష్టులతోనా నీ పరిహాసాలు. ఇప్పుడు చూడు ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే ఈ దుష్టురాలు సీతను చంపి ఉండేది. సీత చూడు భయంతో ఎలా వణికిపోతూ ఉందో! లక్ష్మణా! దీనికి దీని అందం చూచుకొని గర్వం. ఆ గర్వం పోగొట్టు. దీనిని అంగవిహీనురాలిగా, అందవిహీనురాలిని చెయ్యి. లేకపోతే ఇది సీతను చంపుతుంది.” అని అన్నాడు రాముడు.

అప్పుడు లక్ష్మణుడు కత్తి తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసి అంగవిహీనురాలిని, అందవిహీనురాలిని చేసాడు లక్ష్మణుడు. హటాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తట్టుకోలేకపోయింది శూర్పణఖ. పైగా తెగి పడిన ముక్కు, చెవుల నుండి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంది. వెంటనే రాముని వదిలి అడవిలోకి పారిపోయింది.

(ఇటీవల కొంత మంది విమర్శకులు, స్త్రీవాదులు ఈ సంఘటనను విమర్శిస్తుంటారు. శూర్పణఖ ఒక స్త్రీ. ఇష్టంలేకపోతే ఇష్టంలేదని చెప్పవచ్చుకాని, ముక్కు చెవులు కోయడం అమానుషం, దారుణం అని వాదిస్తుంటారు. కాని ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. శూర్పణఖ ఆటవికురాలు. రాక్షసి. నరమాంసభక్షకి. సీతను చంపడానికి ఆమె మీదికి ఉరికింది. అప్పుడు ఏం చెయ్యాలి. ” అయ్యో! శూర్పణఖ స్త్రీ. ఆమెను ఏమీ చేయకూడదు”అని ఊరుకోవాలా! అలా ఊరుకుంటే శూర్పణఖ సీతను మిరపకాయ బజ్జీ తిన్నట్టు కరా కరా నమిలి తిని ఉండేది. తన భార్య అయిన సీతను రక్షించుకోవడం రాముని ధర్మం కాదా!

“తనకు కానీ, తన వారికి కానీ, తన ఆస్తికి కానీ ఆపద కలిగినప్పుడు, ఆ ఆపద కలిగించేవారిని చంపినా, గాయపరిచినా అది నేరం కాదు.” అని నేటి న్యాయశాస్త్రం కూడా చెబుతుంది. దానిని రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. రాముడు కూడా అదే పని చేసాడు. అయినా రాముడు శూర్పణఖను చంపలేదు. కేవలం ముక్కు చెవులుకోయించాడు. సీత ప్రాణాలు రక్షించాడు. కాబట్టి నేటి విమర్శకులు అనుకుంటున్నట్టు రాముడుకానీ, లక్ష్మణుడుకానీ శూర్పణఖ ముక్కు చెవులు కోయడంలో అనుచితంగా ప్రవర్తించలేదు. పైగా న్యాయసూత్రాలు పాటించారని చెప్పుకోవచ్చు.)

ఆ ప్రకారంగా ముక్కునుండి చెవుల నుండి రక్తం కారుతుంటే శూర్పణఖ పరుగెత్తిపోయింది. జన స్థానములో తన చుట్టు రాక్షస సేనలు ఉండగా, శూర్పణఖ అన్న ఖరుడు కూర్చొని ఉన్నాడు. శూర్పణఖ సరాసరి తన అన్న ఖరుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ నేలమీద పడిపోయింది.

తన చెల్లి అలా పడిపోవడం చూచి సహించలేక పోయాడు ఖరుడు. ఆమె వద్దకు వచ్చి ఆమెను లేవనెత్తాడు. ఆమె చెవుల నుండి, ముక్కునుండి రక్తం కారడం చూచాడు. ఏం జరిగింది అని అడిగాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనవింశః సర్గః (19) >>

Sri Ramadasu Keerthanalu In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

Sri Ramadasu Keerthanalu

శ్రీ రామదాసు కీర్తనలు

  1. వరాళిరాగం ఆదితాళం
  2. అసావేరి ఆదితాళం
  3. శ్రీకరముగ రామదాసును
  4. కాంభోజి ఆదితాళం
  5. వరాళి ఆదితాళం
  6. నాదనామక్రియ ఆదితాళం
  7. కల్యాణిరాగము రూపకతాళము
  8. పున్నాగరావళి చాపుతాళం
  9. నాదనామక్రియ ఏకతాళం
  10. యమునా కల్యాణి ఆదితాళం
  11. కాఫీ ఆదితాళం
  12. నాట ఖంజాతి ఏకతాళం
  13. నాదనామక్రియ ఆదితాళం
  14. గౌళీ పంతు ఏకతాళం
  15. ధన్యాసి ఆదితాళం
  16. కల్యాణి రాగము ఆదితాళం
  17. ఆనందభైరవి ఆదితాళం
  18. యదుకుల కాంభోజి ఆదితాళం
  19. పంతువరాళి ఆదితాళం
  20. మధ్యమావతి ఆదితాళం
  21. అసావేరి చాపుతాళం
  22. బిళహరి చాపుతాళం
  23. నాదనామక్రియ ఆదితాళం
  24. గౌళీ పంతు ఆదితాళం
  25. సావేరి ఆదితాళం
  26. వరాళి రూపతాళం
  27. బేగడ ఆదితాళం
  28. ధన్యాసి చాపు తాళం
  29. వరాళి రూపకతాళం
  30. అసావేరి ఆదితాళం
  31. అసావేరి రూపకతాళం
  32. నాదనామక్రియ ఆదితాళం
  33. కాంభోజి చాపుతాళం
  34. ఆనందభైరవి ఏకతాళం
  35. వరాళి రూపకతాళం
  36. కల్యాణి చాపుతాళం
  37. వరాళి రూపకతాళం
  38. ఆనందభైరవి చాపుతాళం
  39. వరాళి చాపుతాళం
  40. బిలహరి ఆదితాళం
  41. నాదనామక్రియ ఏకతాళం
  42. మధ్యమావతి చాపుతాళం
  43. ఆనందభైరవి ఆదితాళం
  44. నాదనామక్రియ ఆదితాళం
  45. బేగడ ఏకతాళం
  46. మధ్యమావతి ఆదితాళం
  47. శంకరాభరణము రూపకతాళం
  48. కాంభోజి ఏకతాళం
  49. సౌరాష్ట్ర ఆదితాళం
  50. కన్నడ ఆదితాళం
  51. సావేరి చాపుతాళం
  52. మోహన ఆదితాళం
  53. ఆనందభైరవి రూపకతాళం
  54. కళ్యాణి ఆదితాళం
  55. నాదనామక్రియ రూపకతాళం
  56. మాయామాళవగౌళ ఏకతాళం
  57. నాదనామక్రియ ఆదితాళం
  58. కాంభోజి ఆదితాళం
  59. మధ్యమావతి చాపుతాళం
  60. మోహన ఆదితాళం
  61. నాదనామక్రియ రూపకతాళం
  62. ఆనందభైరవి రూపకతాళం
  63. పున్నాగవరాళి ఏకతాళం
  64. బిళహరి ఆదితాళము
  65. శంకరాభరణ ఆదితాళము
  66. సౌరాష్ట్ర చాపుతాళము
  67. పున్నాగవరాళి ఆదితాళము
  68. ముఖారి ఆదితాళము

Ayodhya Kanda Sarga 84 In Telugu – అయోధ్యాకాండ చతురశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 84 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ చతురశీతితమః సర్గ, “గుహాగమనమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో భరతుడు మరియు గుహా మధ్య జరిగిన సంభాషణలు, భరతుడి రాముడి పట్ల ఉన్న ప్రేమను మరియు గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. గుహా, భరతుడికి రాముడి స్మృతులను వివరించి, అతడికి సహాయం చేయడానికి సన్నద్ధత వ్యక్తం చేస్తాడు. ఈ సర్గ, భక్తి, స్నేహం, మరియు విధేయతను హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది.

గుహాగమనమ్

తతర్నివిష్టాం ధ్వజినీం గంగామన్వాశ్రితాం నదీమ్ |
నిషాదరాజో దృష్ట్వైవ జ్ఞాతీన్ సంత్వరితోఽబ్రవీత్ ||

1

మహతీయమితః సేనా సాగరాభా ప్రదృశ్యతే |
నాస్యాంతమధిగచ్ఛామి మనసాపి విచింతయన్ ||

2

యథా తు ఖలు దుర్బుద్ధిర్భరతః స్వయమాగతః |
స ఏష హి మహాకాయః కోవిదారధ్వజో రథే ||

3

బంధయిష్యతి వా దాశాన్ అథవాఽస్మాన్ వధిష్యతి |
అథ దాశరథిం రామం పిత్రా రాజ్యాద్వివాసితమ్ ||

4

సంపన్నాం శ్రియమన్విచ్చన్ తస్య రాజ్ఞః సుదుర్లభామ్ |
భరతః కైకేయీపుత్రః హంతుం సమధిగచ్ఛతి ||

5

భర్తా చైవ సఖా చైవ రామర్దాశరథిర్మమ |
తస్యార్థకామాః సన్నద్ధా గంగాఽనూపే ప్రతిష్ఠత ||

6

తిష్ఠంతు సర్వ దాశాశ్చ గంగామన్వాశ్రితా నదీమ్ |
బలయుక్తా నదీరక్షా మాంసమూలఫలాశనాః ||

7

నావాం శతానాం పంచానాం కైవర్తానాం శతం శతమ్ |
సన్నద్ధానాం తథా యూనాం తిష్ఠన్త్విత్యభ్యచోదయత్ ||

8

యదా తుష్టస్తు భరతః రామస్యేహ భవిష్యతి |
సేయం స్వస్తిమతీ సేనా గంగామద్య తరిష్యతి ||

9

ఇత్యుక్త్వోపాయనం గృహ్య మత్స్యమాంసమధూని చ |
అభిచక్రామ భరతం నిషాదాధిపతిర్గుహః ||

10

తమాయాంతం తు సంప్రేక్ష్య సూతపుత్రః ప్రతాపవాన్ |
భరతాయాఽచచక్షేఽథ వినయజ్ఞో వినీతవత్ ||

11

ఏష జ్ఞాతిసహస్రేణ స్థపతిః పరివారితః |
కుశలో దండకారణ్యే వృద్ధో భ్రాతుశ్చ తే సఖా ||

12

తస్మాత్పశ్యతు కాకుత్స్థ త్వాం నిషాదాధిపో గుహః |
అసంశయం విజానీతే యత్ర తౌ రామలక్ష్మణౌ ||

13

ఏతత్తు వచనం శ్రుత్వా సుమంత్రాద్భరతః శుభమ్ |
ఉవాచ వచనం శీఘ్రం గుహః పశ్యతు మామితి ||

14

లబ్ధ్వాఽభ్యనుజ్ఞాం సంహృష్టః జ్ఞాతిభిః పరివారితః |
ఆగమ్య భరతం ప్రహ్వో గుహో వచనమబ్రవీత్ ||

15

నిష్కుటశ్చైవ దేశోఽయం వంచితాశ్చాపి తే వయమ్ |
నివేదయామస్తే సర్వే స్వకే దాసకులే వస ||

16

అస్తి మూలం ఫలం చైవ నిషాదైః సముపాహృతమ్ |
ఆర్ద్రం చ మాంసం శుష్కం చ వన్యం చోచ్చావచం మహత్ ||

17

ఆశంసే స్వాశితా సేనా వత్స్యతీమాం విభావరీమ్ |
అర్చితః వివిధైః కామైః శ్వస్ససైన్యో గమిష్యసి ||

18

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతురశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 84 Meaning In Telugu

గంగానదీతీరమున ఉన్న శృంగిబేరపురమునకు రాజు గుహుడు. రామునికి ఆప్తమిత్రుడు. గంగానది పొడుగునా విడిది చేసిన సైన్యములను చూచాడు గుహుడు. వెంటనే తన మంత్రులను, బంధువులను సమావేశపరిచాడు.

“మీరంతా చూచి ఉంటారు. గంగానదీ తీరాన అశేష సైన్యము విడిది చేసి ఉన్నది. దీని లెక్క నాకు ఊహకు అందడం లేదు. ఈ సైన్యము అయోధ్యనుండి వచ్చినట్టు కనపడుతూ ఉంది. భరతుడు రాముని వెదుకుతూ వచ్చాడేమో తెలియదు. మనము రాముని మిత్రులమని మనలను బంధించడానికి వచ్చాడా! లేక మనలనందరినీ చంపుతాడా! రాముడు బతికి ఉంటే శాశ్వతముగా తనకు రాజ్యము లభించదని రాముని కూడా చంపడానికి వచ్చాడా! రాముడు మనకు రాజే కాదు. మనకు మిత్రుడు కూడా. అందుచేత రాముని రక్షించడం మన కర్తవ్యము.

అందుకని మీరందరూ ఆయుధములను చేత బట్టి గంగానదీ తీరములో నిలబడండి. మనము కేవలము గంగాతీరమును రక్షిస్తున్నాము అనే మిషతో అక్కడ ఉండండి. మనసేనలను కూడా సమాయత్తము చేయండి. మనకు ఐదువందల పడవలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క పడవలో నూరుగురు సైనికులు ఉండండి. గంగా తీరమును రక్షిస్తూ ఉన్నట్టు పడవల మీద తిరగండి. భరతుడు ఏ బుద్ధితో వచ్చాడో తెలియదు. భరతుడు రాముని క్షేమం కోరే వాడయితే అతనిని వెళ్లనిద్దాము. లేని ఎడల అతనిని అడ్డుకుందాము. దీనికి మీరు సంసిద్ధంగా ఉండండి.” అని పలికాడు.

తరువాత సాంప్రదాయ ప్రకారము తన శక్తికొద్దీ కానుకలు తీసుకొని గుహుడు భరతుని వద్దకు వెళ్లాడు. గుహుని రాకను సుమంత్రుడు చూచాడు. ఆ విషయము భరతునికి చెప్పాడు.

“మహారాజా! గుహుడు తన బంధుమిత్రులతో తమ దర్శనానికి వచ్చాడు. గుహుడు రామునికి మంచి మిత్రుడు. రాముడు అడవులకు వెళ్లేటప్పుడు రామునికి ఆతిధ్యము ఇచ్చాడు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో గుహునికి తెలిసి ఉంటుంది. కాబట్టి గుహుని ఆదరించు.” అని అన్నాడు సుమంత్రుడు. ఆ మాటలకు భరతుడు చాలా సంతోషించాడు. “సుమంత్రా! వెంటనే గుహుని నా వద్దకు తీసుకొని రా!” అని ఆదేశించాడు. సుమంత్రుడు గుహుని భరతుని వద్దకు తీసుకొని వెళ్లాడు. గుహుడు భరతునికి వినయంగా నమస్కరించాడు. “ఈ శృంగిబేర పురమునకు నేను రాజును. నాపేరు గుహుడు. మీకు దాసుడను. ఈ పురము మీ పురమే అనుకొనుడు. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండండి. మేము నీ కోసరము ఫలములు, దుంపలు, మాంసము తీసుకొని వచ్చాము. మా సపర్యలను స్వీకరించి మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించండి.” అని అన్నాడు గుహుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచాశీతితమః సర్గః (85) >>