కీర్తనలు భక్తి, ఆధ్యాత్మికత మరియు సంగీత సాహిత్య రంగాల్లో అత్యంత ప్రముఖమైన రూపంలో ఉంటాయి. ఇవి సామాజిక, ఆధ్యాత్మిక సంగతులను సమీపిస్తాయి, మనసును శుద్ధి చేస్తాయి, భక్తిని పెంచుకోవడంలో సహాయపడుతాయి. కీర్తనలు భక్తుల అంతరాళాల్లో అందిన ఆనందంలను విస్తరిస్తాయి, అవి దేవుని కీర్తనాలను గానం చేయడంలో ఉపయోగపడుతాయి.
కీర్తనలు సాహిత్య, సంగీత, నృత్యం వంటి విభిన్న కళల సముదాయాలు సమ్మేళనం చేసుకోవడానికి ఒక సాధన సహాయకంగా నిలుస్తాయి. ఇవి జనాలను ధర్మప్రచారమైనా, అధ్యాత్మిక ఆలోచనలను ప్రచారం చేయడమైనా, మానవ సమస్యలకు పరిష్కారం కల్పించడమైనా, మనసును శుద్ధి చేయడమైనా, భక్తి మరియు ఆనందాన్ని విస్తరిస్తాయి. కీర్తనలు మనసులను స్ఫూర్తిగా చేస్తాయి, మనసులను ప్రశాంతతో భక్తి భావాలని పెంపొందించుకోవడంలో సహాయపడుతాయి. మొదలగు కీర్తనల విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…
పండుగలు మన జీవితాల్లో విశేషంగా అవసరమైన సమయాలు. దేవుళ్ళు వారు సాధించిన విజయాలని, మరియు సంతోషాలని వ్యాపింపచేయడని చేయడానికి, మరికొన్ని కారణాలగా, పండుగలు మనకు ఉన్నాయి. అవి ఆనందించటం మానవ జీవితంలో అత్యంత ప్రముఖం. అవి బంధువులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలసి చేసుకొనే పండుగలు, మన చరిత్రలో ముందుకు చెందిన సందర్భాలు. పండుగలు సాంస్కృతిక వార్షికోత్సవాలు మరియు ధార్మిక అంశాల వెనుక విశ్వాసంగా ఉంటాయి. అవి సమృద్ధంగా ఆనందించడం మరియు జీవితంలో సంతోషం ఉంచుకోవడానికి అందిన సందర్భాలు. పండుగలు సమయంలో వాటిని అందుకున్న వ్యక్తులకు సంతోషం, ఉత్సాహం, మరియు ప్రీతిని కలిగిస్తాయి. అలాగే, పండుగలు భాగస్వామ్యంగా ఉంటాయి, మనకి ఆనందం మరియు సంతోషం అందిస్తాయి. మొదలగు పండుగల విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. దండకం అనేది దేవుని గుణాలను, ఆత్మని స్తుతించడానికి అనువదిస్తుంది. దండకాలు భక్తికి ఆధారంగా ఉంటాయి. ఇవి దేవుని విశేష లక్షణాలను, ఆత్మని శ్లాఘించడానికి సాధించటం లేదా మరియు స్తుతిస్తుంది. దండకాల రచనలు శివుని స్తుతిస్తున్నాయి, సర్వ దేవతలను ఆరాధించటానికి సహాయపడతాయి. భక్తుల మనసును శుద్ధి చేస్తాయి, దేవునిని అందుకోవడానికి ఉపయోగపడుతుంది. సాధకులు దండకాల విశేషత మరియు అనుభూతి అనుభవిస్తారు. ఈ రచనలు అనేక రచయితలకు చెందినవి. ప్రతి దేవునికి వారి స్వంత దండకం ఉంటుంది. దండకాలు శ్రేణిలో భక్తిని అతిశయంగా పెంచడంలో సహాయపడతాయి. మొదలగు దండకం విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…
చాలీసాలు, హిందూ ధర్మప్రకారం మూడుతల్లుగా రూపొందించే దివ్యాత్మ ప్రార్థనా స్తోత్రాలు, ఆధ్యాత్మిక చర్యలులో ప్రముఖ స్థానం ధరించుకొనుచున్నాయి. ఈ స్వర్గీయ రచనలు, కవిత్వ సౌందర్యం మరియు ఆళ్ళిక అర్థంతో అత్యంత భద్రమైన పద్యాలను కలిగి, వివిధ దేవతలకు సమర్పించబడుతున్నాయి. తెలుగు సంస్కృతిలో, చాలీసాలు భక్తులలో భక్తి, శాంతి మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని నిలుస్తాయని మానిస్తారు. ఈ వ్యాసం తెలుగు మాట్లాడే ప్రజల హృదయాల్లో, జీవితాలలో చాలు మరియు పరిమాణాలలో చిరకాలం ప్రముఖంగా నిలుస్తాయి. చాలీసాల ఆవిష్కరణ, ప్రాముఖ్యత మరియు తెలుగు మాట్లాడే సముదాయాలలో చిరస్థాయిత్వం పరిచయాన్ని అన్వేషిస్తుంది. మొదలగు చాలీసా విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు అష్టలక్ష్మీ స్తోత్రం గురించి తెలుసుకుందాం. అష్టలక్ష్మీ స్తోత్రం ఒక ప్రముఖమైన హిందూ ప్రార్థనా సంస్కృతిలో ఒక పవిత్ర స్తోత్రము. ఈ స్తోత్రం మహాలక్ష్మిని స్తుతిస్తుంది, అష్టలక్ష్మీలు మహాలక్ష్మి దేవికి అంగములగా అనిపిస్తాయి. ఈ స్తోత్రంలో లక్ష్మీదేవికి అనుగ్రహించే స్వర్ణదాత మహాలక్ష్మీకి అర్పించిన స్తుతులు ఉన్నాయి. ఈ స్తోత్రంలో ఆధ్యాత్మికత, ఐశ్వర్యం, ప్రేమ, క్షమా, శాంతి, సౌందర్యము, శక్తి, ధర్మము, కీర్తి, ధన సంపాదన, ఆరోగ్య లభ్యం లక్ష్మీ అనుగ్రహాన్ని చెందడంలో అందరికీ ఆశీస్సులు నివసించటం వంటి విషయాలు చెప్పబడినవి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హనుమత్ పంచరత్నం పఠించడం వల్ల మేధస్సు, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత, అనారోగ్యాల నుండి విముక్తి, తెలివి యొక్క పదును మరియు మెరుగైన వక్తృత్వం మరియు సంభాషణ నైపుణ్యాలు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు హనుమాన్ పంచరత్నం గురించి తెలుసుకుందాం.
Hanuman Pancharatnam Sthotram In Telugu – శ్రీ హనుమత్పంచరత్నం స్తోత్రం (తెలుగు)
ఈ పోస్ట్ లో ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన : ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు
సంఖ్య : 461
పుట: 311
రాగం: సాళంగనాట
సాళంగనాట
61 ఇహమెట్టో పరమబెట్టో ఇంక నాకు
సహజమై హరియే శరణము నాకు
||పల్లవి||
చిత్తమిది యొకటే చింత వేనేలసంఖ్య
పొత్తుల హరిఁదలఁచఁ బొద్దులేదు
జొత్తుల కన్నులు రెండు చూపులైతే ననంతాలు
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు
||ఇహ||
చేతు లివియు రెండే చేష్టలు లక్షోపలక్ష
యీతల హరిఁ బూజించ నిచ్చ లేదు
జాతి నాలిక వొకటే చవులు కోటానఁగోటి
రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు
||ఇహ||
వీను లివి రెండే వినికి కొలఁదిలేదు
పూని హరిభక్తి విన బుద్ధి లేదు
యీనటన శ్రీవేంకటేశుఁ డిటు చూచినను
తానే యేలె నిఁకఁ దడఁబాటు లేదు.
||ఇహ||461
అవతారిక:
నాకు ఇహలోకంతోకాని, పరలోకంతోకాని పనిలేదయ్యా! నా సహజగుణం ఒక్కటే. అది హరియే దిక్కని శరణాగతితో జీవితాంతం గడుపుట, అంటున్నారు అన్నమాచార్యులవారు. మానవజీవితం అన్నాక… మనస్సులో చింతలు తప్పవు, అనవసరమైన వాటినుంచి చూపులను మరల్చలేము, చేతులతో ఏవేవో వ్యర్థమైన పనులు చేస్తూనేవుంటాము, దేన్నిపడితే దాన్ని లొట్టలేసుకొని తింటాననే దౌర్భాగ్యపు నా నాలుకవున్నది, ఉన్నవి రెండే అయినా అంతేలేకుండా అన్నీ వినే చెవులున్నాయి. ఇవన్నీ భ్రష్టు పట్టిస్తూనేవున్నాయి. హరిభక్తి మీద బుద్ధినిలవటం లేదు. ఓ శ్రీవేంకటేశ్వరా! శరణు మహాప్రభో శరణు… అంటున్నారు.
భావ వివరణ:
ఓ మానవులారా! ఇక నాకు ఇహమెట్టో (ఇహలోకంలో ఏమవుతుందో) పరమెట్టో (ఊర్ధ్వలోకాలలో ఏమవుతుందో) పనిలేదు. నాకు సహజమైన (సహజసిద్ధంగా నిజాయితీగల) శరణాగతి హరియే (శ్రీహరి మాత్రమే).
నాది యెంత విచిత్రమైన పరిస్థితి అంటే… నాకున్న చిత్తము (మనస్సు) ఒక్కటే కాని దానికున్న చింతలు మాత్రం వేవేలు (వేలసంఖ్యలో వున్నాయి). నేను పెట్టుకొన్న పొత్తులతో (సంగత్వంతో) హరిని తలచుటకు పొద్దులేదు (తీరికేలేదు), జొత్తులకన్నులు (ఎఱ్ఱబారిన కళ్ళు) రెండే, కాని అవి చూచే చూపులకు అనవసరమైన వ్యాపకాలు మాత్రం అనంతం. కాని తత్తరించి (ఆరాటపడి) హరిని దగ్గరనుంచి చూడాలని మాత్రం వాటికుండదు.
నా ఈ చేతులు చూశారా! నాకున్నవి రెండే చేతులు. కాని ఇవి చేసే చేష్టలున్నాయే, అవి లక్షోపలక్ష (అనేక లక్షలు). కాని ఈతల (ఇటుచూస్తే) శ్రీహరిని పూజించాలంటేమాత్రం ఈ చేతులకి ఇచ్చలేదు (కోరిక పుట్టదు). ఇక, జాతి నాలిక (అతిసామాన్య ఔన్నత్యంగల నాలిక) నాకూ ఒక్కటే వున్నది. కాని దానికి కావలసిన చవులు (రుచులు) మాత్రం కోటానుకోట్లు. కాని రీతి (విధాయకంగా) హరినామాన్ని వుచ్చరించటానికి (అనుటకు) వేళలేదు (సమయం దొరకడంలేదు).
వీనులివి రెండే (నాకున్న చెవులు రెండు మాత్రమే). కాని ఇవి వినాలనుకొనే మాటలకి అంతుపొంతులేదు. వాటికి పూనికతో హరిభక్తి గురించి వినండి అంటే వాటికి బుద్ధిలేదు. ఇట్లాంటి నటన (నడవడితో) వున్న నన్ను శ్రీవేంకటేశుడు, ఇటుచూచి, తానే పోనీలే వీడు అర్భకుడు అని జాలిపడి యేలె నన్ను (స్వీకరించి పాలించాడు). అమ్మయ్య! ఇక తడబాటు (తత్తరబాటు) లేదు. ఆయన రక్షణలో బ్రతికేస్తున్నాను. భయం వదిలేశాను.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ ఆంజనేయ దండకము గురించి తెలుసుకుందాం. శ్రీ ఆంజనేయ దండకం ఎంతో ప్రాచీనమైనది మరియూ వాడకలో ఉన్నది. స్వామి వారి మహిమలు అమోఘమైనవి, అలాగే వారి యొక్క మంచి గుణాలు, సాహస కృత్యములు, మరియు భక్తులకు అనుగ్రహించేటటువంటి వంటి విషయములు అన్నీయు ఇందులో క్లుప్తముగా పొందుపరచడమైనది. ఈ దండకములోని పదాలు, సంస్కృతము, మరియు లయబద్దంగా వుండడము చేత వీటిని శబ్దపారాయణం చేయడము వల్ల మనసులో వున్న కోర్కెలన్నిటిని అయిన నేరవేర్చుతాడని, సుఖసంతోషాలు చేకూరుతాయని అనేది భక్తుల యొక్క గొప్ప నమ్మకం.
(ఈ దండకము బహు నిష్ఠతో బఠించినట్లయిన సర్వపాపములు నశించును. భయ, రోగ బాధలుండవు. భాగ్యములు గల్గును. సకల సామ్రాజ్యములు, సకల సంపత్కరములు గలుగును. భూతప్రేత పిశాచ రోగ శాకినీ ఢాకినీ గాలిదయ్యంబులు దగ్గరకు చేరవు.)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ స్కాంద పురాణము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఆశ్రయ పరిత్యాగ దోషము.
ఆశ్రయ పరిత్యాగ దోషము
ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్చాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొజకు తీర్భయాత్రులకు బయలుదేరారు. అట్ని మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్తాలు తీర్ధాలు ఉన్న మన భారతదేశం ధన్యము. అట్బి అమ్మ కడుపున పుట్సిన మనము ధన్యులము.
మహదానందంతో వారెన్నో తీర్ధాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొజ్బలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్దాది దేవతలు “ఓ శుకవరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది
“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్స ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరము? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి తీదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.
ఇలా ధర్మం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్దోహం చేయలేదు. తల్శిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూనుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్నానం కలిగింది”.
చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకము బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు. తీర్భయాత్రులు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్పాప్తించింది.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్నిన నేలతల్సిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్టు త్యజించినవాడు కృతఘ్నుడొతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్న వారందరితో కృతజ్నతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.