Suprabatam – సుప్రభాతం

Suprabatam

సుప్రభాతం అనగ మంగళ ప్రభాతం లేదు శుభ ప్రబాతం. ఈ సుప్రబాతం అనేది భగవంతుని మేల్కులోపుటానికి వివిధ రకాల శ్లోకములు, మరియు స్తోత్రలతు దేవునిని ఆరదించడము. స్వామివారిణి పవిత్రమైన మంత్రాలు, శ్లోకాలు లేదా కవితలు స్తోత్రాలతో ఆరంభిస్తారు. సుప్రభాతంలో భగవన్ని అర్చించేవారిని సందర్శించే భావం ఉంటుంది. ఈ పాటను చదువుతూ, శుభోదయంలో భగవన్ని పూజించటం, సంధ్యాకాలంలో సంధ్యావందన చేయుటకు ఉపయోగపడుతుంది.

Suprabhatamulu – సుప్రభాతములు

Sri Satyanarayana Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ

Sri Satyanarayana Ashtottara Shatanamavali PDF

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ గురించి తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ

  1. ఓం నారాయణాయ నమః
  2. ఓం నరాయ నమః
  3. ఓం శౌరయే నమః
  4. ఓం చోంఅక్రపాణయే నమః
  5. ఓం జనార్ధనాయ నమః
  6. ఓం వాసుదేవాయ నమః
  7. ఓం జగద్యోనయే నమః
  8. ఓం వామనాయ నమః
  9. ఓం జ్ఞానపంజరాయ నమః
  10. ఓం శ్రీవల్లభాయ నమః
  11. ఓం జగన్నాథాయ నమః
  12. ఓం చతుర్మూర్తయే నమః
  13. ఓం వ్యోమకేశాయ నమః
  14. ఓం హృషీకేశాయ నమః
  15. ఓం శంకరాయ నమః
  16. ఓం గరుడధ్వజాయ నమః
  17. ఓం పరంజ్యోతిషే నమః
  18. ఓం ఆత్మజ్యోతిషే నమః
  19. ఓం శ్రీ వత్సాంకాయ నమః
  20. ఓం అఖిలాధారాయ నమః
  21. ఓం సర్వలోకపతిప్రభవే నమః
  22. ఓం త్రివిక్రమాయ నమః
  23. ఓం త్రికాలఙ్ఞానాయ నమః
  24. ఓం త్రిధామ్నే నమః
  25. ఓం కరుణాకరాయ నమః
  26. ఓం సర్వజ్ఞాయ నమః
  27. ఓం సర్వగాయ నమః
  28. ఓం సర్వస్మై నమః
  29. ఓం సర్వేశాయ నమః
  30. ఓం సర్వసాక్షికాయ నమః
  31. ఓం హరిణే నమః
  32. ఓం శార్జినే నమః
  33. ఓం హరయే నమః
  34. ఓం శేషాయ నమః
  35. ఓం హలాయుధాయ నమః
  36. ఓం సహస్రభాహవే నమః
  37. ఓం అవ్యక్తాయ నమః
  38. ఓం సహస్రాక్షాయ నమః
  39. ఓం అక్షరాయ నమః
  40. ఓం క్షరాయ నమః
  41. ఓం గజారిఘ్నాయ నమః
  42. ఓం కేశవాయ నమః
  43. ఓం నారసింహాయ నమః
  44. ఓం మహాదేవాయ నమః
  45. ఓం స్వయంభువే నమః
  46. ఓం భువనేశ్వరాయ నమః
  47. ఓం శ్రీధరాయ నమః
  48. ఓం దేవకీపుత్రాయ నమః
  49. ఓం అచ్యుతాయ నమః
  50. ఓం పార్థసారథయే నమః
  51. ఓం ఆచంచలాయ నమః
  52. ఓం శంఖపాణయే నమః
  53. ఓం కేశిమర్ధనాయ నమః
  54. ఓం కైటభారయే నమః
  55. ఓం అవిద్యారయే నమః
  56. ఓం కామదాయ నమః
  57. ఓం కమలేక్షణాయ నమః
  58. ఓం హంసశత్రవే నమః
  59. ఓం ఆధర్మశత్రవే నమః
  60. ఓం కాకుత్థాయ య నమః
  61. ఓం ఖగవాహనాయ నమః
  62. ఓం నీలాంబుదధ్యుతయే నమః
  63. ఓం నిత్యాయ నమః
  64. ఓం నిత్యతృప్తాయ నమః
  65. ఓం నిత్యానందదాయ నమః
  66. ఓం సురాధ్యక్షాయ నమః
  67. ఓం నిర్వకల్పాయ నమః
  68. ఓం నిరంజనాయ నమః
  69. ఓం బ్రహ్మణ్యాయ నమః
  70. ఓం పృథివీనాథాయ నమః
  71. ఓం పీతవాససే నమః
  72. ఓం గుహాశ్రయాయ నమః
  73. ఓం వేదగర్భాయ నమః
  74. ఓం విభవే నమః
  75. ఓం విష్ణవే నమః
  76. ఓం శ్రీమతే నమః
  77. ఓం త్రైలోక్యభూషణాయ నమః
  78. ఓం యజ్ఞమూర్తయే నమః
  79. ఓం అమేయాత్మనే నమః
  80. ఓం వరదాయ నమః
  81. ఓం వాసవానుజాయ నమః
  82. ఓం జితేంద్రియాయ నమః
  83. ఓం జితక్రోధాయ నమః
  84. ఓం సమదృష్టయే నమః
  85. ఓం సనాతనాయ నమః
  86. ఓం భక్తప్రియాయ నమః
  87. ఓం జగత్పూజ్యాయ నమః
  88. ఓం పరమాత్మనే నమః
  89. ఓం అసురాంతకాయ నమః
  90. ఓం సర్వలోకానా మంతకాయ నమః
  91. ఓం అనంతాయ నమః
  92. ఓం అనంతవిక్రమాయ నమః
  93. ఓం మాయాధారాయ నమః
  94. ఓం నిరాధారాయ నమః
  95. ఓం సర్వాధారాయ నమః
  96. ఓం ధరధరాయ నమః
  97. ఓం నిష్కళంకాయ నమః
  98. ఓం నిరాభాసాయ నమః
  99. ఓం నిష్ప్రపంచాయ నమః
  100. ఓం నిరామయాయ నమః
  101. ఓం భక్తవశ్యాయ నమః
  102. ఓం మహోదరాయ నమః
  103. ఓం పుణ్యకీర్తయే నమః
  104. ఓం పురాతనాయ నమః
  105. ఓం త్రికాలజ్ఞాయ నమః
  106. ఓం శ్రీ విష్టరశ్రవసే శ్రీ నమః
  107. ఓం చతుర్భుజాయ నమః
  108. ఓం శ్రీ సత్యనారాయణస్వామియే నమః

నానావిధ పరిమళ,పత్ర,పుష్ప పూజాం సమర్పయామి.

ధూపమ్

మం: యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయస్
ముఖం కిమస్య కౌ బాహూ కాపూరూ పాదావచ్యేతే

శ్లో: దశాంగం గుగ్గూలూపేతం సుగంధంసమనోహరం
ధూపం గృహాణ దేవేశ సర్వదేవనమస్కృత
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ధూపమాఘ్రాపయామి.

దీపమ్

మం: బ్రాహ్మణోస్యముఖమూసిత్ బాహూరాజన్యః కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత

శ్లో: ఘృతాక్తవర్తిసంయుక్తం వహ్నిన యోజితం ప్రియం
దీపం గృహాణ దేవేశ త్రైలోక్యమితిమిరాపహమ్
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.

నైవేద్యమ్

మం: చంద్రమా మనసోజాతః చక్షస్సూర్యో అజాయత
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు రజాయత

శ్లో: సౌవర్ణస్థాలిమధ్యేమణిగణఖచితే గోఘృతాక్తాస్ సుపక్వాస్
భక్ష్యాస్ భోజ్యాంశ్చ లేహ్యానపరిమితరసాస్ చోష్యంమన్నం నిధాయ
నానాశాకైరూపేతం దధిమధు సగుడక్షీర పానీయయుక్తం
తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివసమహం మానసే కల్పయామి
రాజాన్నం సూపసంయుక్తం శాకచోష్య సమన్వితం
ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్.

ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్.

సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి,
ఓం ప్రాణాయాస్వాహా – ఓం ఆపానాయస్వాహా – ఓం వ్యానాయస్వాహా –
ఓం ఉదానాయ స్వాహా – ఓం సమానాయ స్వాహా – ఓం బ్రహ్మణేస్వాహా
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, మహానైవేద్యం సమర్పయామి
అమృతాపిధానమసి, ఉత్తరపోశనం సమర్పయామి.
హస్తాప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలమ్

మం: నాభ్యా ఆసీదతరిక్షంశీర్ ర్ణోద్యౌస్సమ వర్తత
పద్భ్యాం భూమిధ్ధిశశోత్రాస్ తథాలోకాగం అకల్పయస్

శ్లో: పూగీఫలై స్సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ సత్యనారాయణస్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనమ్

శ్లో: నీరాజనం గృహాణేదేవం పంచవర్తి సమన్వితం
తేజో రాశిమయం దత్తం గృహాణత్వం సురేస్వర.

శ్రీ సత్యనారాయణస్వామినే నమః కర్పూర నీరాజనం సమర్ప

తదుపరి ఇక్కడ స్వామి మంత్రపుష్పం చదువవలెను.

నారాయణ మంత్రపుష్పం

మరిన్ని అష్టోత్తరములు

Sri Gayatri Ashtottara Shatanamavali In Telugu – శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి

Sri Gayatri Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో అష్టోత్తర అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. అష్టోత్తరములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…

శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి

అథ అష్టోత్తర శతనామ పూజా

    1. ఓం తరుణాదిత్యసంకాశాయై నమః
    2. ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః
    3. ఓం స్యందనోపరిసంస్థానాయై నమః
    4. ఓం ధీరాయై నమః
    5. ఓం జీమూత నిస్వనాయై నమః
    6. ఓం మత్తమాతంగ గమనాయై నమః
    7. ఓం హిరణ్య కమలాసనాయై నమః
    8. ఓం దీనజనోద్ధార నిరతాయై నమః
    9. ఓం యోగిన్యై నమః
    10. ఓం యోగధారిణ్యై నమః
    11. ఓం నటనాట్యైకనిరతాయై నమః
    12. ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః
    13. ఓం ఘోరాయై నమః
    14. ఓం ఆచార క్రియాసక్తాయై నమః
    15. ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
    16. ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః
    17. ఓం తురీయపదగామిన్యై నమః
    18. ఓం గాయత్ర్యై నమః
    19. ఓం గోమత్యై నమః
    20. ఓం గంగాయై నమః
    21. ఓం గౌతమ్యై నమః
    22. ఓం గరుడాసనాయై నమః
    23. ఓం గేయాయై నమః
    24. ఓం గానప్రియాయై నమః
    25. ఓం గౌర్యై నమః
    26. ఓం గోవిందపరిపూజితాయై నమః
    27. ఓం గంధర్వనగరాకారాయై నమః
    28. ఓం గౌరవర్ణాయై నమః
    29. ఓం గణేశ్వర్యై నమః
    30. ఓం గుణాశ్రయాయై నమః
    31. ఓం గుణవత్యై నమః
    32. ఓం గుహ్యకాయై నమః
    33. ఓం గణపూజితాయై నమః
    34. ఓం గుణత్రయసమాయుక్తాయై నమః
    35. ఓం గుణత్రయవివర్జితాయై నమః
    36. ఓం గుహావాసాయై నమః
    37. ఓం గుహాచారాయై నమః
    38. ఓం గుహ్యాయై నమః
    39. ఓం గంధర్వరూపిణ్యై నమః
    40. ఓం గార్ల్యప్రియాయై నమః
    41. ఓం గురుపదాయై నమః
    42. ఓం గుహ్యలింగాంకధారిణ్యై నమః
    43. ఓం సావిత్ర్యై నమః
    44. ఓం సూర్యతనయాయై నమః
    45. ఓం సుషుమ్నానాడిభేదిన్యై నమః
    46. ఓం సుప్రకాశాయై నమః
    47. ఓం సుఖాసీనాయై నమః
    48. ఓం సువ్రతాయై నమః
    49. ఓం సురపూజితాయై నమః
    50. ఓం సుషుప్త్యవస్థాయై నమః
    51. ఓం సుదత్యై నమః
    52. ఓం సుందర్యై నమః
    53. ఓం సాగరాంబరాయై నమః
    54. ఓం సుధాంశుబింబవదనాయై నమః
    55. ఓం సుస్తన్యై నమః
    56. ఓం సువిలోచనాయై నమః
    57. ఓం శుభ్రాంశుభాసాయై నమః
    58. ఓం సుశ్రోణ్యై నమః
    59. ఓం సంసారార్ణవతారిణ్యై నమః
    60. ఓం సామగానప్రియాయై నమః
    61. ఓం సాధ్వ్యై నమః
    62. ఓం సర్వాభరణభూషితాయై నమః
    63. ఓం సీతాయై నమః
    64. ఓం సర్వాశ్రయాయై నమః
    65. ఓం సంధ్యాయై నమః
    66. ఓం సఫలాయై నమః
    67. ఓం సుఖదాయిన్యై నమః
    68. ఓం వైష్ణవ్యై నమః
    69. ఓం విమలాకారాయై నమః
    70. ఓం మాహేంద్ద్యై నమః
    71. ఓం మాతృరూపిణ్యై నమః
    72. ఓం మహాలక్ష్మై నమః
    73. ఓం మహత్సిద్యై నమః
    74. ఓం మహామాయాయై నమః
    75. ఓం మహేశ్వర్యై నమః
    76. ఓం మోహిన్యై నమః
    77. ఓం మదనాకారాయై నమః
    78. ఓం మధుసూదనసోదర్యై నమః
    79. ఓం మీనాక్ష్యై నమః
    80. ఓం క్షేమసంయుక్తాయై నమః
    81. ఓం నగేంద్రతనయాయై నమః
    82. ఓం రమాయై నమః
    83. ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః
    84. ఓం త్రిస్వరాయై నమః
    85. ఓం త్రివిలోచనాయై నమః
    86. ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః
    87. ఓం చంద్రమండలసంస్థితాయై నమః
    88. ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః
    89. ఓం వాయుమండలసంస్థితాయై నమః
    90. ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః
    91. ఓం క్రస్థాయై నమః
    92. ఓం చక్రరూపిణ్యై నమః
    93. ఓం కాలచక్రవిధానజ్ఞాయై నమః
    94. ఓం చంద్రమండలదర్పణాయై నమః
    95. ఓం జ్తోత్స్నాత పేనలిప్తాంగ్యై నమః
    96. ఓం మహామారుతవీజితాయై నమః
    97. ఓం సర్వమంత్రాశ్రితాయై నమః
    98. ఓం ధీరాయై నమః
    99. ఓం పాపఘ్న్యై నమః
    100. ఓం పరమేశ్వర్యై నమః
    101. ఓం చతుర్వింశతివర్ణాఢ్యాయై నమః
    102. ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
    103. ఓం మందేహరాక్షసఘ్న్యై నమః
    104. ఓం షట్కుక్యై నమః
    105. ఓం త్రిపదాయై నమః
    106. ఓం శివాయై నమః
    107. ఓం జపపారాయణప్రీతాయై నమః
    108. ఓం బ్రాహ్మణ ఫలదాయిన్యై నమః

శ్రీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ దేవతాభ్యో నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి

శ్రీ గాయత్ర్యష్టోత్తర శతనామపూజా సమాప్తః

మరిన్ని అష్టోత్తరములు

Sri Krishnadevaraya Krta Amuktamalyada Loni katha In Telugu – శ్రీ కృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథ

శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథ - నీతికథలు

అది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5000 యేళ్ళ క్రితం) మనకందించిన, పేరు పొందిన పద్యాలలో ఒకటైనా పద్యం శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద, దానిలోని నీతికథలు మీ అందరికోసం…

నీతికథలు

శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యదలోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విష్ణుచిత్తుని అతిథిసేవ.

విష్ణుచిత్తుని అతిథిసేవ

పాండ్యదేశంలో శ్రీవల్లి పుత్తూరు అనే భవ్యనగరం ఉండేది. ఆ నగరం మింటినంటే మేడలతో హంసల క్రీంకారాలు ధ్వనించే కొలనులతో బాతులకు ఆశ్రయమైన కాలువలతో ఉద్యానవనాలతో మామిడి పనస అరిటి మెదలైన తోటలతో అతి రమణీయంగా ఉండేది. ఆ పట్టణములో వీధులన్నీ సూత్రపట్టినట్లు వంకరలులేక చక్కగావున్నాయి.

నాలుగు వర్ణస్థులు సుఖ శాంతులతో ఉండేవారు. ఆ ఊరి స్త్రీలు మేనికి పసుపు పూసుకుని చెరువులో స్నానమాడి ఆ ఊరి దేవుడైన శ్రీ మన్నారు కృష్ణస్వామి అభిషేకానికై బిందెలలో నీళ్ళు తీసుకొని పూజకు కలువలు కోసుకొనిపోయేవారు. గ్రంథాలను ప్రబంధాలను చదువుకుంటూ కాలక్షేపం చేసేవారు.

ఆ ఊరి ప్రజలు అతిథి కనబడగానే సాష్టాంగనమస్కారం చేసేవారు. స్వాగతం చెప్పి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సేద తీర్చేవారు. టెంకాయ ఆకుల చాపపై కూర్చోబెట్టి విశాలమైన అరటి ఆకు పఱచి భోజనం పెట్టేవారు. రాజన్నపు వరి అన్నం పప్పు నెయ్యి ఎన్నోరకాల కూరలు పాలు పెరుగు ఇచ్చేవారు.

అతిథి తృప్తిగా భుజించిన తరువాత తాంబూలమిచ్చి పాదసేవ చేసేవారు. అతిథి “వెళ్ళి వస్తాను” అనగానే శక్తికొలది అతని సత్కరించి కొంత దూరం అతనితో నడచి అతనిని సాగనంపేవారు. సేవ చేయటానికి అంత కొంచం అవకాశం దొరికిందని విచారిస్తూ తిరిగి వచ్చేవారు. ఈ విధముగా అతి శ్రద్ధతో ప్రతిదినమూ అతిథి అభ్యాగతుల సేవ చేసేవారు ఆ ఊళ్ళోని గృహస్థులు.

అలాంటి ఉన్నత జీవనం సాగిస్తున్న శ్రీవల్లిపుత్తూరు ప్రజల మధ్యలో గరుత్మంతుడి అంశతో భట్టనాథుడనే భాగవతోత్తముడు జన్మించినాడు. అతడు సమవర్తి స్థితప్రజ్ఞుడు. కష్టసుఖాలను లెక్కించేవాడు కాడు. భట్టనాథుడు నిత్యం తులసిమాలలు చెంగల్వదండలు కట్టి మన్నారు. కృష్ణస్వామికి సమర్పించేవాడు.

దేవాలయంలో ఉన్న వటపత్రశాయిని సేవించడం అతని నిత్యకృత్యము. ఏమి విద్యలూ అభ్యసించకపోయినా జ్ఞానం వైరాగ్యం కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ విష్ణువునే ధ్యానిస్తూ ఉండేవాడు. అతని నిష్కల్మష భక్తికి మెచ్చి శ్రీహరి అతని హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు. అందుకనే భట్టనాథునికి విష్ణుచిత్తుడనే సార్థకనామధేయం వచ్చింది.

“మానవ సేవే మాధవ సేవ భవతరణానికి నావ” అనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు విష్ణుచిత్తుడు. అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. వానాకాలంలో వరి అన్నం పప్పు నాలుగైదు కూరలు వరుగులు వడియాలు పెరుగు మొదలైన వాటితో అన్నం పెట్టేవాడు.

వేసవిలో ముందుగా అతిథికి శ్రీచందనం ఇచ్చేవాడు. తాపం తీరిన అతిథికి వేడి అన్నం తియ్యని చారు మజ్జిగ పులుసు చెఱుకురసం లేత టెంకాయనీళ్ళు భక్ష్యాలు ఫలాలు సుగంధభరితమైన చల్లని నీళ్ళు వడపిందెలు మజ్జిగ మొదలైన వాటితో విందు చేసేవాడు.

శీతాకాలంలో పునుగు వాసనగల రాజనపు అన్నం మిరియపుపొడి వేడి వేడి కూరలు ఆవపచ్చళ్ళు పాయసం ఊరగాయలు వేడిగావున్న నెయ్యి పాలు మొదలైనవాటినిచ్చి అతిథిని సంతృప్తి పఱచేవాడు. ఈతడు ఎంతటి భక్తుడంటే ఏ విద్యలూ నేర్వకుండానే ఆ దేశపురాజైన వల్లభదేవునికి నారాయణుని పరతత్త్వం బోధించగలిగినాడు. సాక్షాత్కరించిన విష్ణువుకి తన దృష్టి తగులుతుందేమో నని పరమాత్మకే మంగళశాసనం చేశాడు! గోదాదేవిని శ్రీహరికి కన్యాదానం చేసి లోకనాథునికే మామ అయినాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

1. ఏ కాలానికి హితమైన ఆహారము ఆ కాలంలో అతిథికి ఇచ్చి అద్వితీయ అతిథిసేవ చేసి మనకు మార్గదర్శి అయినాడు పరమ భక్తుడైన విష్ణుచిత్తుడు.

2. ప్రపంచం ఇంకా కన్నువిప్పనినాడే అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో ఉండదగిన శ్రీవల్సిపుత్తూరు వంటి నగరాలు ఎన్నెన్నో మన దేశంలో!
ఆధ్యాత్మికతలోనే కాక నాగరిక జీవనంలో కూడా ప్రపంచానికి గురువై బోధించిన భారతదేశంలో పుట్చిన మనం అదృష్టవంతులము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Bhakti Nipai Dokate Paramasukhamu In Telugu – భక్తి నీపై దొకటె పరమసుఖము

భక్తి నీపై దొకటె పరమసుఖము – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో భక్తి నీపై దొకటె పరమసుఖము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

భక్తి నీపై దొకటె పరమసుఖము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: భక్తి నీపై దొకటె పరమసుఖము
సంఖ్య : 322
పుట: 218
రాగం: శుద్ధవసంతం

శుద్ధవసంతం

76 భక్తి నీపైదొకటె పరమసుఖము
యుక్తిచూచిన నిజం బొక్కటే లేదు.

||పల్లవి||

కులమెంత గలిగె నది కూడించు గర్వంబు
చలమెంత గలిగె నది జగడమె రేఁచు
తలఁపెంత పెంచినాఁ దగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటా లేదు.

||భక్తి||

ధన మెంత గలిగె నది దట్టమౌ లోభంబు
మొనయుఁ జక్కందనంబు మోహములు రేఁచు
ఘనవిద్య గలిగినను కప్పుఁ బైపై మదము
యెనయఁగఁ బరమపద మించుకయు లేదు.

||భక్తి||

తరుణు లెందరుఅయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు
యిరవయిన శ్రీవేంకటేశ నినుఁ గొలువఁగా
పెరిగె నానందంబు బెళకు లిఁకలేవు.

||భక్తి||322

అవతారిక:

ప్రభూ! పరమసుఖమిచ్చేది ఈ ప్రపంచంలో యేదన్నా వున్నదంటే అది నీపై కలిగిన భక్తి మాత్రమే. అయితే ప్రాపంచిక సుఖాలు మాత్రమే అవసరం అనుకొన్నంత కాలమూ భక్తి రుచి మనిషి గ్రహించలేడు. యుక్తాయుక్త విచక్షణ వున్న వారికి నిజమైన సుఖము ఒక్క భక్తియేనని తెలుస్తుంది. శ్రీవేంకటేశ్వరుని కొలిచిన ఆనందము పెరగటమే కాదు ఆపైన ఇక బెళకులుండవుట. కులము, ధనము, పేరు ప్రతిష్ఠలు, విద్యావైశిష్ట్యమూ… యేవీ శ్రీహరి భక్తికి సాటిరావంటున్నారు.

భావ వివరణ:

ఓ దేవదేవా! మాకు నీపై భక్తియొక్కటే పరమ సుఖము (దైవికమైన సౌఖ్యమును) ప్రసాదించును. యుక్తి జూచిన (విచక్షణతో పరికించిన) ఆ పరమసుఖము ఒక్కటే నిజమైనది. మరియేదియును లేదు.

ఎవ్వరి“కులమై”నా యెంతగొప్పదైనా ప్రయోజనమేమిటి? దానివల్ల గర్వం పెరుగుతుంది, అంతేకద! జగడమెందుకువస్తుంది? యెంత ‘చలము’ (ద్వేషము) వుంటే, అది అంత వస్తుంది. ‘తలపు’ అధికమయిందంటే కోరిక తగులుకొంటుంది. అవన్నీ పీడిస్తున్నవాడికి యెలమి (అతిశయించిన విజ్ఞానము (భగవత్సంబంధమైన జ్ఞానము)
యెలాకలుగుతుంది?

ఇంకొక వింత యేమిటంటే ధనమెంత పెరుగుతుంటే లోభత్వం అంత యెక్కువవుతుంది. స్త్రీ పురుషులలో సౌందర్యమెక్కువైతే మోహము వారిపై పెరుగుతుంది. పోనీ విద్య వలన కూడా మంచి జరుగదు. భక్తిలేనివాడికి యెంత విద్యవున్నా అది మదమును పెంచటానికి తప్పించి ఇంకెందుకు ఉపయోగిస్తుంది? ఎనయగ (అవన్నీ వృద్ధిచెందివున్నచోట) పరమపదము ఇంచుకయినా సాధ్యంకాదు.

తరుణులు (స్త్రీలు) యెంతమందివున్నా పురుషులకు మదనతాపము కలుగుతూనే వుంటుంది. ఏమాత్రం తగ్గదు. సిరిసంపదలెన్నివున్నా చింతలు (దిగులు) పెరుగుతుందేకాని తరుగదు. స్థిరమైన శ్రీవేంకటేశ్వరా! నిన్ను కొలిచినయెడల ఆనందము పెరుగుతూనే వుంటుంది. వారికి బెళకులు (చలించిపోవుటలు) లేవు (వుండవు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Shirdi Sai Ekadasa Sutralu In Telugu – శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

Shirdi Sai Ekadasa Sutralu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము
2. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు
3. ఈ బౌతికదేహానంతరం నేను అప్రమత్తుడను.
4. నాభక్తులకు రక్షణ నాసమాధినుండియే వెలువడుచుండును. 5. నా సమాధినుండియే నామనుష్యరూపము మాట్లాడును.
6. నన్నాశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
7. నా యందు యెవరికి దృష్టికలదో, వారియందే నా కటాక్షము. 8. మీ భారములు నా పై పడవేయుడు. నేను మోసెదను.
9. నా సహాయముగాని, సలహాగాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
10. నా భక్తుల యింట ‘లేమి’ యను శబ్దము పొడసూపదు.
11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.

మరిన్ని:

Sri Anjaneya Suprabhatam In Telugu – శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్

Sri Anjaneya Suprabhatam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ ఒక తెలుగు భక్తి గీతంగా తెలుగు వారు ప్రధానంగా పాడే భక్తి సంగీత క్రియలలో ఒకటి. ఈ సుప్రభాతం ఆంజనేయ స్వామిని స్తుతించడానికి సమర్థమైనది. ఈ గీతం భక్తులకు మాత్రమే కాదు, ప్రత్యేకంగా తెలుగు సాంస్కృతిక వ్యవహారాలలో ప్రచురించబడుతుంది. అది భక్తి, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సమృద్ధికి ప్రధాన పాత్రని ప్రదర్శిస్తుంది.

శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్

అమల కనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం
సరసిజనిభవక్త్రం సర్వదా సుప్రసన్నం
పటుతరఘనగాత్రం కుండలాలంకృతాంగం
రణజయకరవాలం రామదూతం నమామి ॥

అంజనా సుప్రజా వీర పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ హరిశార్దూల కర్తవ్యం దైవమాహ్పికం ॥
ఉత్తిష్టోత్తిష్ఠ హనుమన్ ఉత్తిష్ఠ విజయధ్వజ
ఉత్తిష్ఠ రవిజాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥

శ్రీరామచంద్ర చరణాంబుజ మత్తభృంగ
శ్రీరామమంత్రజపశీల భవాబ్ధిపోత
శ్రీ జానకీ హృదయతాపనివారమూర్తే
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ||

శ్రీ రామదివ్య చరితామృతపానలోల
శ్రీ రామకింకర గుణాకర దీనబంధో
శ్రీ రామభక్త జగదేక మహోగ్రశౌర్య
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్యమూర్తే
సుగ్రీవ రాఘవసమాగమ దివ్యకీర్తే
సుగ్రీవ మంత్రివర శూరకులాగ్రగణ్య
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

భక్తార్తి భంజన దయాకర యోగివంద్య
శ్రీ కేసరీ ప్రియతనూజ సువర్ణదేహ శ్రీ
భాస్కరాత్మజ మనోంబుజచంచరీక
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

శ్రీ మారుత ప్రియతనూజ మహాబలాఢ్య
మైనాకవందిత పదాంబుజ దండితారిన్
శ్రీ ఉష్ణవాహన సులక్షణ లక్షితాంగ
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ |

పంచాననాస్య భవభీతిహరస్య రామ
పాదాబ్జ సేవనపరస్య పరాత్పరస్య
శ్రీ అంజనాప్రియసుతస్య సువిగ్రహస్య
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ||

గంధర్వ యక్ష బుజగాధిప కిన్నరాశ్చ
ఆదిత్య విశ్వ వసురుద్ర సురర్షిసంఘాః
సంకీర్తయంతి తవ దివ్యసునామపంక్తిం
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

శ్రీ గౌతమ చ్యవన తుంబుర నార దాత్రి
మైత్రేయ కృష్ణజనకాది మహర్షి సంఘాః
గాయంతి హర్షభరితా స్తవ దివ్యకీర్తిం
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

భృంగావళీ చ మకరందరసం పిబే ద్వై
కూజం త్యుతార్ధమధురం చరణాయుధాశ్చ
దేవాలయే ఘన గభీర సుశంఖ ఘోషాః
నిర్యాంతి వీర హనుమం స్తవ సుప్రభాతమ్ ॥

పంపాసరోవర సుపుణ్య పవిత్ర తీర్థ
మాదాయ హేమకలశైశ్చ మహర్షిసంఘాః
తిష్ఠంతి శ్రీ చరణపంకజ సేవనార్థం
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

శ్రీ సూర్యపుత్రిప్రియనాథ మనోజ్ఞమూర్తే
వాతాత్మజాత కపివీర సుపింగళాక్ష
సంజీవరాయ రఘువీరసుభక్తవర్య
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

మరిన్ని సుప్రభాతములు

Sri Mahalakshmi Ashtakam In Telugu | శ్రీ మహాలక్ష్మి అష్టకం

Sri Mahalakshmi Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Mahalakshmi Ashtakam Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ||

నమస్తే గరుడారూఢ డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ |
సర్వపాపహ రే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవీ భుక్తి ముక్తి ప్రదాయినీ |
మంత్రమూర్తే సదాదేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

ఆద్యంత రహితే, దేవీ ఆదిశక్తి మ హేశ్వరీ |
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోసుతే ||

స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాహ రే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

పద్మాసన స్థితే దేవీపరబ్రహ్మస్వరూపిణీ |
పరమేశీ జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే ||

శ్వేతాంబర ధరే దేవీ నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే ||

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భ క్తిమాన్నర: |
సర్వసిద్ధిమవాప్నోతిరాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్వం మహాపాపవినాశనమ్ |
ద్వికాలం య: పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితమ్ ||

త్రికాలం య: పఠేన్నిత్యం మహాశతృ వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నావరదా శుభా ||

మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నావరదా శుభా |
ఇత్యేంద్రకృత మహాలక్ష్మ్యష్టకస్తవం సంపూర్ణం ||

ఫలశ్రుతి:

సర్వసంకటనాశనము, ఇష్టకామ్యార్థ సిద్ధి, ఉద్యోగలాభం, రాజభోగం, సర్వపాపవినాశనము, అష్టయిశ్వర్య ప్రాప్తి.

మరిన్ని అష్టకములు:

Akshaya Tritiya Adhyatma Darshan In Telugu – అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము

Akshaya Tritiya Adhyatma Darshan

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము గురించి తెలుసుకుందాం.

Akshaya Tritiya Adhyatma Darshan Telugu

అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము (వైశాఖ శుక్ల తృతీయాతిథి)

వైశాఖమాస శుక్లపక్ష తృతీయాతిథిని అక్షయ తృతీయ అనియు, ఆఖాతృతీయ అనియు, ఆఖాతీజ అనియు అందురు.

అక్షయ మనగా ఎన్నిటికి నశించనిది అని, సత్యమైనది. యేది సర్వదా సత్యమైనదో అదియే పరమాత్మ ఈశ్వరుడు, అక్షయ అఖండ సర్వవ్యాపకుడు. ఈ అక్షయ తృతీయాతిథి ఈశ్వరతిథి. ఈ అక్షయతిథి పరశురాముని జన్మదినమైన కారణమున “పరశురామతిథి” అనియు అందురు. పరశురాముడు మహాత్ములైన చిరంజీవుల లెక్కలోనికి వచ్చి వాడుగాన ఈ తిథిని చిరంజీవి తిథి అనియు అందురు. నాలుగు యుగములలో (సత్య, త్రేతా, ద్వాపర, కలియుగ) త్రేతాయుగ ప్రారంభము ఈ తిథి నుండే ప్రారంభమైనది. అందువలన ఈ తిథిని యుగాది తిథి యందురు.

బదరీనారాయణ దర్శన తిథి నాలుగు థామములలో నొకటైన బదరీనారాయణ దర్శనతిథియు నిదియే. భక్తులు ఈ దినమిచట త్యాగ దాన దక్షిణ, జప, తప హోమ హవన గంగాస్నానాది కార్యములు చేయుదురు. భగవానుని ప్రసాదమును భక్తులు భక్తితో గ్రహించెదరు.

అక్షయ తృతీయనాడు భక్తజనులు భగవానుని చరణ దర్శనమునకు బృందావనము వచ్చెదరు. ఇది “సత్యమేవజయతే” అను సందేశమిచ్చును. ఈ తిథియందు వివాహాది శుభకార్యములు చేయుదురు. అక్షయ గ్రంథమైన గీత అమర నిధివంటిది. దీనిని చదివినను వినినను, జీవితము సఫలమగును. అక్షయత్త్వము ప్రాప్తించును.

మరిన్ని పండుగలు:

Gautama Maharshi Katha In Telugu – గౌతమ మహర్షి కథ

Gautama Maharshi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

వివిధ పురాణాల లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గౌతమ మహర్షి కథ.

గౌతమ మహర్షి కథ

ఒకసారి సృష్టికర్త అయిన చతుర్ముఖుడు సరస్వతీదేవిని మెప్పించటానికి అహల్యను సృష్టించాడు. “న హల్యతి ఇతి అహల్య”. అంటే ఎందులో నూ అఱకొఱలు లేనిది సాటిలేనిది అని అర్థము. బ్రహ్మదేవుడు ఆ అపూర్వ గుణవతి సౌందర్యవతికి వరుడెవ్వడని యోచించి తీవ్ర బ్రహ్మచర్య నిష్ట నిగ్రహం ఉన్న సంయమీంద్రుడే ఆమె భర్తకాగలడని నిశ్చయించినాడు. గౌతమ మహర్షి అట్టి ధీరుడని కనుగొని ఆతనిని పరీక్షించుటకై “నాయనా! ఈ అతిలోక సుందరి నా పుత్రిక అహల్య.

ఈమెను నీ ఆశ్రమములో వదిలి వెళుతున్నాను. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వచ్చి ఆమెను తీసుకువెళతాను” అని ఆజ్ఞాపించాడు. ఆ పరమేష్టికి ప్రీతిచేయుట కంటే అధికమేమున్నది తలచి గౌతముడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఎంతో కాలము గడచిపోయింది. అయినా ఎన్నడూ సంయమీంద్రుడైన ఆ గౌతముడు అహల్యను చూసి చలించలేదు. పరమశివభక్తుడైన ఆ గౌతముడు పంకజాసనుని పరీక్షలో నెగ్గాడు. గౌతముని నిగ్రహాన్ని మెచ్చుకొని అహల్యను అతనికి అర్థాంగిగా అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు.

మహర్షులు తపస్సుకై అనేక ప్రాంతాలు సంచరిస్తూ కొన్ని చోట్ల నివసించి తమ తపశ్శక్తి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం పునీతం చేసి మరొకప్రాంతానికి వెళుతుంటారు. అలా ఒకసారి గౌతమ ఆహల్య దంపతులు త్ర్యంబకేశ్వరుని సన్నిధి వద్దనున్న బ్రహ్మగిరిపై ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండసాగినారు.

గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో నిపుణుడు. భారతీయుల వేదవిజ్ఞానం భౌతికమైన విజ్ఞానమే కాక దానికి ఆధారమైన ఆధ్యాత్మిక దైవిక విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందఱినో ఆదుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన ఉన్న ప్రాంతములో క్షామము వచ్చింది. యోగీశ్వరులు తప్ప మిగిలినవారంతా ప్రాణాలు కాపాడుకోవటానికి తాలా ఒక వైపుకి వెళ్ళిపోయారు. దయాళువైన గౌతముడు ప్రజల పశుపక్షాదుల బాధలు చూడలేకపోయాడు. అనివార్యమైన ప్రారబ్ధాన్ని కూడా మార్చగలిగే శక్తి తపస్సుకున్నదని తెలిసిన గౌతముడు ఆఱు నెలలు వరుణదేవునికై తీవ్ర తపస్సు చేసినాడు.

గౌతముడి పరోపకారబుద్ధికి మెచ్చి వచ్చిన వరుణుడిని గౌతముడు వర్షాన్ని ప్రసాదించమని కోరినాడు. అప్పుడు ఆ వరుణుడు “ఓ మునీంద్ర! కాలధర్మమును అతిక్రమించి వర్షించలేను కదా! మహాకాలుడైన ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుబద్ధులము మేము. జీవుల పాపపుణ్యాలను అనుసంధానము చేసి ఆ మహేశ్వరుడు మా ద్వారా ప్రకృతిని శాసిస్తాడు. ఇప్పుడు కొంతకాలము క్షామము తప్పదు” అని అన్నాడు. ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు అక్షయజలం కోరాడు. వరుణుడు అక్షయజలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు.

అహల్యా గౌతమ దంపతులు నిరంతర అతిథిసేవా పరాయణులు. గౌతముడు తన వ్యవయాస శాస్త్ర విజ్ఞానముతో శిష్యుల సహాయముతో వరి కాయగూరలు మొదలైన పంటలు పండించేవాడు. పరమసాధ్వి పతివ్రత అయిన అహల్య ఆ పంటలనుండి వచ్చిన వాటిని వండి అతిథులకు ఆర్తులకు పెట్టేది. అపర అన్నపూర్ణ వలె విరాజిల్లేది ఆ అహల్య.

ఇలా ఉండగా గౌతమ అహల్యల అద్వితీయ అతిథిసేవ వారి ధర్మనిరతి చూసి ఈర్ష చెందారు కొందరు మునులు! ఆహా! ఈర్ష అతి దారుణామైనది. అది మహామేధావులైన మునులను సైంతం విడువదు. “ఈ జలం తాము తెచ్చిందేననే అహంకారంతో విర్ర వీగుతున్నారీ అహల్యాగౌతములు” అంటూ కువ్యాఖ్యానాలు చేసేవారు. ఈర్ష మత్సరముగా మారి చివరికి వాళ్ళు గౌతముని అక్కడనుండి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. అన్నం పెట్టిన గౌతమునికి కృతజ్ఞత చూపక పోవటమేకాక అతనికి కీడు చేయాలని అనుకున్నారు. మత్సర ముతో బాధ పడుతున్నవాడు ఎంత పాపకార్యము చేయటానికైనా వెనుకాడడు కదా!

గౌతముడు తప్పస్సును లోకహితార్థము ఉపయోగించితే ఈ మునులు మత్సరముతో అతనికి హానిచేయటానికి ఉపయోగించారు. పవిత్రమైన మంత్రములను లౌకిక స్వార్థ ప్రయోజనాలకై వాడకూడదని తెలిసికూడా ఆ మునులు గౌతమునికి కీడు చేయాలనే ఉద్దేశ్యముతో మహాగణపతిని మంత్రబద్ధముగా ఉపాసనచేశారు. ప్రత్యక్షమైన విఘ్నేశ్వరునితో తమ కోరిక చెప్పారు. ఆ వినాయకుడు ఆశ్చర్యపడి “ఔరా! ఏమి చిత్రము!

ప్రాణదాతకి ప్రత్యుపకారం చేయకపోగా అతనికి అపకారం చేస్తున్నారే! ఇట్టి కృతఘ్నుల పాపానికి నిష్కృతి ఉండదు” అని తలచి “నాయనలారా! అపకారికి ఉపకారము చేయమని మన శాస్త్రాలు ఘోషిస్తుంటే మీరు కనీసము కృతజ్ఞతా ధర్మాన్ని కూడా పాటించుట లేదెందులకు? ఈ ప్రయత్నం మానండి. కృఘ్నతకు మించిన పాపం లేదు” అని హితవు చెప్పాడు. “స్వామి! నీవు నిజంగా మంత్రబద్ధుడవే అయితే మా కోరిక తీర్పు” అని సమాధానం చెప్పారు ఆ మునులు. “ఎవరి కర్మకు వారే బాధ్యులు. అటులనే అగుగాక” అని అంతర్ధానమయ్యాడు మహాగణపతి.

గణేశుడు ఒక మాయాధేనువును సృష్టించినాడు. అది గౌతముడి పొలాన్ని పాడుచేయసాగినది. పవిత్రమైన గోమాతను ఎన్నడు ఆదిలించరాదని తెలిసిన గౌతముడు ఆ మాయాధేనువును పక్కకి పంపాలని గడ్డి పరకలు తీసుని గోవుపై వేశాడు. దానికే అది మృతిచెందినది. గౌతముడు దుఃఖిస్తూ “పరమేశ్వరా! నేనేమి అపరాధము చేసినాను? గడ్డిపరకలు తగిలి గోవు మృతిచెందుటేమి? నన్ను ఈ ఘోరమైన గోహత్యాపాతకము నుండి రక్షించు స్వామి!” అని ఆక్రోశించాడు. ఇలా బాధపడుతున్న గౌతముని చూసి ఆ మునులు “గోహత్య వంటి మహాపాతకము చేసిన మీరు పవిత్రమైన ఈ ఆశ్రమములో ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోండి” అని తూలనాడి రాళ్ళు విసిరి వెళ్ళగొట్టారు.

మహాపాపము చేశానే అనే దుఃఖంతో గౌతముడు అహల్య ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. సకల ధర్మసూక్ష్మాలు తెలిసిన ఆ గౌతమ మహర్షి ప్రాయశ్చిత్త విధానము తెలిసికూడా పండిత మండలిచే ఆమోద ముద్ర వేయించుకోవాలనే ఉద్దేశ్యముతో క్రోశదూరం వెళ్ళినా తిరిగివచ్చి తనకు అపకారం చేసిన మునులకు నమస్కరించి “అయ్యా! నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించండి” అని ప్రార్థించాడు! “గౌతమా! చేసిన తప్పు చెప్పుకుంటూ పృథ్వికి ముమ్మార్లు ప్రదక్షిణము చేసి ఇక్కడ మాసవ్రతము చేయాలి. లేదా ఈ బ్రహ్మగిరికి నూటొక్కమార్లు ప్రదక్షిణములు చేసి కోటి పార్థివలింగారాధన చేసి గంగాస్నానము చేయాలి” అని ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించారు. గౌతమ మహర్షి అటులనే చేశాడు. అప్పుడు పరమశివుడు సంతోషించి.

“నాయనా! గౌతమా! నీవు ధన్యుడవు. ఆజన్మ శుద్ధుడవైన నీకు పాపము లేదు. ఇదంతా ఆ మునుల కుతంత్రము. ఈ కృతఘ్నులకు ప్రాయశ్చిత్తము లేదు. వీరు భ్రష్టులై వేదమార్గాన్ని వదిలి నాకు దూరమవుతారు. వీరి వంశములోని వారంతా పతితులవుతారు. వత్సా! ఏదైనా వరం కోరుకో. ప్రసాదిస్తాను.” అని అన్నాడు. కరుణామయుడైన గౌతముడు “స్వామి! ఈ మునివరులు నాకు ఉపకారమే చేసినారు. వీరివల్లనే కదా నేడు నాకు నీ దర్శన మహద్భాగ్యము కలిగినది!” అని అన్నాడు. పరమశివుడు గౌతముని క్షమాగుణము చూసి సంతోషించాడు. “స్వామి! లోకకళ్యాణార్థము గంగను ప్రసాదించు” అని కోరాడు గౌతముడు. పరమశివుని సంకల్ప మాత్రాన ప్రత్యక్షమైన గంగాభవానిని స్తుతించి గౌతముడు “భాగీరథిపై ఉత్తర భారతమును అనుగ్రహించినట్టే గోదావరిపై దక్షిణ భారతాన్ని ఆంధ్రభూమిని పునీతము చేయి తల్లీ!” అని ప్రార్థించాడు.

గంగాదేవి కోరిక పై స్వామి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపుడై గోదావరినది జన్మస్థానములో అవతరించాడు. గౌతమ మహర్షి పేఱున ఆ నది గౌతమీనదిగా ప్రసిద్ధికెక్కినది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఈ ప్రపంచానికి ఆధారమైన నాలుగు పుణ్యస్తంభాలు: భూతదయ నిరహంకారం పరోపకారం ఇంద్రియ నిగ్రహమ్. ఈ గుణాలు నిండుగా ఉన్న గౌతముడు మనకు ఆదర్శపురుషుడు. బ్రహ్మదేవుని పరీక్షలో నెగ్గి గౌతముడు తన అఖండ మనోనిగ్రహాన్ని మనకు చూపినాడు. క్షామము నుండి ప్రాణులను కాపాడి తన దయ పరోపకార బుద్ధి చూపినాడు. సకల ధర్మరహస్యాలు తెలిసినా పండితుల వద్దకు వెళ్ళి ప్రాయశ్చిత్త విధానము తెలుసుకొని తన వినయవైభవాన్ని చాటినాడు.
  2. ప్రకృతిని క్షోభించకుండా మానవకళ్యాణము సాధించే విజ్ఞానము భారతీయులది. గౌతముడు భౌతిక విజ్ఞానానికి దైవికశక్తిని జోడించి ప్రజాశ్రేయస్సును కల్పించాడు.
  3. అహల్యాగౌతములు అసామాన్యమైన అతిథిసేవ చేసి మనకు మార్గదర్శకులైనారు. వారు రోజూ పరి కూరలు మొదలైనవి పండించి పండి ఆర్తులకు వడ్డించేవారు.
  4. కృతఘ్నతకు మించిన పాపములేదని పరమశివుడు చెప్పాడు. అట్టి వారి పాపానికి నిష్కృతిలేదని మనకు చెప్పాడు పరమేశ్వరుడు. కావున మనము ఎల్లప్పుడు కృతజ్ఞులమై ఉండాలి.
  5. ఈర్ష అసూయ మత్సరము మానవునిచే ఎట్టి దారుణపాపకృత్యాన్నైనా చేయిస్తాయి. కాబట్టి మనను ఈర్షకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని నీతికథలు మీకోసం: