Ma Duritamulu Vapi Mammu Gachu Taruda In Telugu – మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా

మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన : మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
సంఖ్య : 434
పుట: 292
రాగం: బౌళి

బౌళి

63 మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
శ్రీదేవిరమణుడ శ్రీ వేంకటేశ

||పల్లవి||

అంబరీషు పైకొన్న ఆపదలన్నియు బాపి
వెంబడి గాచే నీచే పెనుచక్రము
అంబరాననున్న ధ్రువు నజ్ఞానమెల్ల బాపి
పంబి నీచేతనుండిన పాంచజన్యము

||మా దురిత||

పక్కన జరాసంధు బలమెల్ల నుగ్గాడి
నిక్కము మధురనిల్పే నీచే గద
తొక్కి హిరణ్యకశిపు దునిమి ప్రహ్లాదు గాచే
నిక్కి నిక్కి మెరిసేటి నీ ఖడకగము

||మా దురిత||

వెడ రావణుని జంపి విభీషణుని గాచే
చిడుముడి పడక నీచే శాస్త్రము
యెడమీక శ్రీ వేంకటేశ నేడు నన్ను గాచె
బడిబడి నీ నామపఠన నేడిదిగో

||మా దురిత||434

అవతారిక:

ఓ శ్రీదేవివల్లభా! శ్రీవేంకటేశ్వరా! నీకు అన్ని ఆయుధాలు వున్నాయి కదా! ప్రభూ! మా పాపములను బద్దలుకొట్టి మమ్మల్ని కాపాడవయ్యా! అంటున్నారు అన్నమాచార్యులవారు. శ్రీహరి సుదర్శన చక్రము, పాంచజన్య శంఖమూ, కౌమోదకి గద నందకము అనే ఖడ్గము, శార్జము అనే ధనస్సు యెన్నెన్నో ఘనకార్యాలు చేశాయి ఇదివరలో. ఇప్పుడు ఈ కలియుగంలో మా పాపాలే మా పాలిటి రాక్షసులు. వీళ్ళని నిర్మూలించటానికి నీ ఆయుధాలతో పనిలేదు, నీ నామపఠనం చాలు. అదే బడిబడి (దృఢమైన) దై మమ్మల్ని రక్షిస్తుంది అంటున్నారు. పంబి అంటే అతిశయించి అని అర్థం.

భావ వివరణ:

శ్రీదేవీ వల్లభుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! మా దురితములు (పాపములు) వాపి (నిర్మూలించి) మమ్మున్ కాచుట (రక్షించుట) అరుదా? (అంత అపూర్వమైన విషయమా తండ్రీ!)

ఇదిగో నీచే (నీచేతిలోనున్న) ఈ పెనుచక్రము (గొప్ప సుదర్శన చక్రము) నీ భక్తుడు అంబరీష మహారాజుపై ఆగ్రహించిన దుర్వాసనికి బుద్ధిచెప్పి, పైకొన్న ఆపదలను బాపి వెంటనే రక్షించింది కదా! మరి, నీ వామహస్తముననున్న శంఖము కనిపిస్తున్నదే… దానిపేరు పాంచజన్యము. దానిధ్వని పామరుల అజ్ఞానం మాన్పి నీవైపు త్రోవచూపిస్తుంది. అదిగో అంబరాన (ఆకాశంలో) ధ్రువతారయై కాంతులు జిమ్ముతున్న నీ బాలభక్తుడు ధ్రువుని అజ్ఞానం తొలగించి, నీచేత పంబి (అతిశయించి) వున్నది.

అదిగో నీచేతిలోనున్న “గద” దానిపేరు కౌమోదకము. అది నీ శత్రువులను దంచి నుగ్గాడుతుంది (తుత్తునియలు చేస్తుంది). ఆనాడు నీపక్కలో బల్లెమువలె మాటిమాటికి మధురపై దండెత్తి నీకు చీకాకు కలిగించుచున్న కంసుని మామగారు… జరాసంధుని అనేకసార్లు బలహీనుని చేసిన పిమ్మట నీచేతిలో నిక్కము (స్ఫుటంగా) మెరయుచున్నది. అదిగో నీచేతిలో నిక్కి నిక్కి (తొంగిచూస్తూ) మెరిసే ఖడకగము (ఖడ్గము). దానిపేరు నందకము. ఆనాడు నీవు నృసింహుడవై హిరణ్యకశిపుని చీల్చి సంహరించి ప్రహ్లాదుని కాచినప్పుడు వాని అనుచరులు మూకుమ్మడిగా నీపై బడితే నీనందకం వారిని చీల్చి చెండాడినది. నేడు నీ చేతిలో మెరుస్తున్నది.

అదిగో సమీపమున నీచేత మెరయు నీ ధనస్సు. దానిపేరు శార్హము (సారంగము) అదే త్రేతాయుగంలో నీవు శ్రీరామచంద్రమూర్తివైనప్పుడు వెద (వేదించు) రావణాసురుని నిర్జించి నీ భక్తుడు విభీషణుని రక్షించి, చిడుముడి పడక (కలతపడకుండా) చేసినది. ఓ శ్రీవేంకటేశ్వరా! నేడు కలియుగంలో ఇదిగో, యెడమీ క (విశ్రాంతికూడా తీసికొనకుండా) నన్ను (నాబోటి ఆర్తులను…) బడిబడి (దృఢముగా) కాపాడుతున్న గొప్ప ఆయుధం. దానిపేరు “ఓం నమో వేంకటేశాయ” – ఆ నామపఠనమే నన్ను అనుక్షణం రక్షిస్తున్నది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Intata Harinekani Yendunanu Gana Nannu In Telugu – ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను

ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
సంఖ్య : 463
పుట: 312
రాగం: శ్రీరాగం

శ్రీరాగం

62 ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
కొంత నాకుఁ తదెలుపరో గురువులాల

||పల్లవి||

తనువూ హరియే తలఁపూ హరియే
వినికి మనికియును విష్ణుడే
కనుఁగొనుచూపులు కమలనాభుఁడే
యెనసి జీవునిశక్తి యేడనేడ నున్నదో

||ఇంత||

లోకమెల్ల మాధవుఁడే లోనెల్లఁ గేశవుఁడే
వాకును కర్మము శ్రీవైకుంఠుఁడే
చేకొని చైతన్యమెల్ల శ్రీనారాయణుఁడే
యీకడ నే ననువాఁడ నేడ నుండువాఁడనో

||ఇంత||

వెనకను కృష్ణుఁడే వెస ముం దచ్చుతుఁడే
కొనమొదలు నడుము గోవిందుఁడే
యెనయఁగ శ్రీవేంకటేశుమయ మింతాను
అనుగు నాస్వతంత్ర మది యేడనున్నదో

||ఇంత||463

అవతారిక:

“అంతయు నీవేహరి పుండరీకాక్ష” అని అన్నమాచార్యులవారు హరి శరణాగతి తెలిపారు. ఇప్పుడీ కీర్తనలోనూ “ఇంతటా హరినే (శ్రీహరియే)… కాని (అంతేకాని) నన్ను యెందుననుగాన” అంటున్నారు. “గురుతుల్యులైన పెద్దలారా! ఇప్పుడు కొంత నాకు దెలుపరో (నాక్కొంచెం వివరంగా చెప్పండయ్యా!) అంటున్నారు. పుట్టిన దేహానికి పెరుగుట తరుగుట మరణించుట యే శక్తివలన జరుగుతున్నది? ఆ శక్తి యెక్కడుంది? “నేను” అని పిలుచుకుంటున్నవాడు యెక్కడవున్నాడు? మొదలు, నడుము, కొన – అన్నీ గోవిందుడే. వెనుకా వాడే, ముందునా వాడే అచ్చుతుడు. ఇంతాను (ఇదంతా శ్రీవేంకటేశుని మయము. ఇక నా స్వతంత్రం యెక్కడుందయ్యా! అంటున్నారు.

భావ వివరణ:

ఓ గురువులాల! (గురు పుంగవులారా!) కొంత నాకు దెలుపరో (నాకు కొంచెము వివరించండయ్యా!) ఇంతటా హరినే (ఈ సృష్ఠిలోని ఇదంతా శ్రీహరియే వున్నాడు). కాని (అంతేకాని నన్ను యెందునను గానను.

తనువు పుట్టినదాది పెరిగి, ముసలిదై నశిస్తున్నది. దీంట్లో శ్రీహరి వుండకపోతే అది సాధ్యమా? కనుక తనువు హరియే ఒక క్షణంలో లెక్కించలేనన్ని ఆలోచనలలో హరిలేడనగలమా? కనుక తలమపులోనూ హరియే. వినికి (శ్రవణశక్తి), మనికి (జీవనాధారము) విష్ణువే. కనుగొనుచూపులలో కూడా కమలనాభుడైన హరివుండబట్టే అంతగొప్ప దృష్టిజ్ఞానం కలుగుతున్నది. ఎనసి (వ్యాపించు స్వభావముగల) జీవుని శక్తి ఏయేరూపాలలో వుంటుందో యెవరికి తెలుసు?

ఈలోకమంతా మాధవుడే. లోనెల్లా (నాలో అంతా) మాథవుడే, వాకును కర్మము (చేయించిన కర్మయు) వైకుంఠుడే (విష్ణువే). చేకొని (నిర్వహించి) మా చైతన్యము (చేతనాశక్తి) అంతా శ్రీనారాయణ మూర్తియే. ఈకడ (ఇదిట్లయిన) ‘నేను’ అనేవాడు నాలో యెక్కడున్నాడో కదా! ఎందుకంటే చేతనలేని సుషుప్తి (గాఢనిద్ర)లో నాగురించిన జ్ఞానమే నాకులేదే. మరి అప్పుడు ఆ ‘నేను’ ఏడీ. ఎవరన్నా తట్టి లేపగానే, నన్నెందుకు లేపావు అంటున్నానే… ఎవడా “నేను”?

నా వెనుకనున్నదీ కృష్ణుడే. ముందరవున్నదీ కేశవుడే. నామొదలు, మధ్య, తుది గోవిందుడే. ఆ విధంగా నన్నంతా ఆవరించి అచ్యుతుడే అయి వున్నాడు అతిశయించగా, ఇదంతా శ్రీవేంకటేశుని మయమే. ఇటువంటి పరిస్థితుల్లో నేనేం చేసినా, నేనేం ఆలోచించినా, నేనేం మాట్లాడినా నేను కర్తనా? కానే కాదు. నా అనుగు స్వతంత్రము (నాకు ప్రియమైన స్వేచ్ఛ) యేదీ? లేనే లేదు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Sainatha Ashtakam In Telugu – శ్రీ సాయినాథ అష్టకం

Sri Sainatha Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ అష్టకం గురించి తెలుసుకుందాం.

శ్రీ సాయినాథాయ నమః

షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే,
సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం.
రఘుపతి రాఘవ రాజారాం, పతితపావన సాయీరాం,
ఈశ్వర్ అల్లా తేరానాం, సబ్కో సమ్మతే భగవాన్.

శ్రీ సాయినాథ అష్టకం

పత్రి గ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తా బీష్టప్రదం దేవం సాయినాధం నమామ్యహం.

మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమేశుభే
ద్విజరాజం తమోఘాతం సాయినాధం నమామ్యహం.

జగదుద్ధారణార్ధంయోనర రూప ధరోవిభుః
యోగినంచ మహాత్మానం సాయినాధం నమామ్యహం.

సాక్షాత్కారంచయోలభేస్వాత్మా రామోగురోర్ముఖాత్
నిర్మలంచ మమతాఘాతం సాయినాధం నమామ్యహం.

యస్య దర్శన మాత్రేణ నశ్యంతి వ్యాధికోటయః
సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాధం నమామ్యహం.

నరసింహాది శిష్యాణాం దదే యోనుగ్రహం గురుః
భవ బంధాపహర్తారం సాయినాధం నమామ్యహం.

ధనహీన దరిద్రాన్యః సమదృక్షైవ వశ్యతి
కరుణాసాగరం దేవం సాయినాధం నమామ్యహం.

సమాధిస్థా2 పియో భక్త్యాసమభీష్టార్థ దానతః
అచింత్య మహిమానంతం సాయినాథం నమామ్యహం.

మరిన్ని అష్టకములు

Vishnudokkade Vishwatmakudu In Telugu – విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు

విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు సరియా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు
సంఖ్య : 345
పుట: 232
రాగం: నాట

నాట

59 విష్ణుఁ డొక్కఁడే విశ్వాత్మకుఁడు
వైష్ణవమే సర్వంబును

||పల్లవి||

పరమేష్ఠి సేయు బ్రహ్మాండసృష్టియు
హరునిలోని సంహారశక్తి
పరగఁగ నింద్రుని పరిపాలనమును
అరిసిచూడ శ్రీహరిమహిమ

||విష్ణుఁ||

యిలఁబంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరఁగ నారాయణుని మహిమలే

||విష్ణుఁ||

అంతటఁ గలమాయావిలాసములు
పొంతఁ బరమపదభోగములు
మంతుకునెక్కి నమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే

||విష్ణుఁ||

అవతారిక:

ఈ విశ్వమే తన ఆత్మవలె వున్న సర్వేశ్వరుడు విష్ణువు ఒక్కడే. సృష్ఠిలో సమస్తమూ ఆయనచే, ఆయన కొఱకు ఆయనదే అయివున్నది. అందుకనే సర్వమూ వైష్ణవమే అంటున్నారు అన్నమాచార్యులవారు. హరుడు, విరించి, సురపతీ… వారివారి బాధ్యతలను శ్రీహరిమహిమవల్లనే నెరవేరుస్తున్నారు. పంచభూతాలు, నవగ్రహాలు, త్రికాలములూ, నారాయణుని మహిమవల్లనే తమ ధర్మం నెరవేరుస్తున్నాయి. ఆఖరికి పరమపదప్రాప్తి దక్కాలన్నా తిరుమలేశుని దీవెన వుండాల్సిందే. ఇంతయూ శ్రీవేంకటేశుమహిమ అంటున్నారు.

భావ వివరణ:

అనంతమైన ఈ విశ్వమంతా, అణురూపుడై ఆత్మరూపుడై విలసిల్లుతున్నది విష్ణువు మాత్రమే. స్థావరజంగములన్నింటిలో అనగా కదలికవున్న వాటిల్లోను కదలిక లేనివాటిల్లోనూ కూడా ఆ విశ్వాత్మకుడే. సర్వమూ వైష్ణవమే (విష్ణువునకు సంబంధించినదే).

పరమేష్ఠి (బ్రహ్మదేవుడు) బ్రహ్మాండమున సృష్ఠి వ్యాపారము చేయుచున్నాడు. హరునిలోని సంహారశక్తి చేత జీవకోటి నశించుచున్నది. పరగగా (ఒప్పుగా) ఇంద్రుడు జగత్పరిపాలనా బాధ్యత చేపట్టినాడు. ఆయన క్రింద వివిధ దేవతలు వివిధ శాఖలను నిర్వహింతురు. హరునికి కూడ కాలుడు, యముడు, నవగ్రహములు, భూతపిశాచగణములు ఇత్యాదివి లయకార్యమున సహకరించును. అరసి చూడ (పరికించి చూడగా) ఈ నియమబద్ధపాలనమెల్లా శ్రీహరి మహిమయే అనుననది సుస్పష్టము.

విశ్వరచనా నిర్వహణములలో పంచభూతములదే (భూమి, గాలి, నీరు, కాంతి, ఆకాశము) ప్రధానపాత్ర. ఆ పంచభూతముల గుణములన్నియు నిబద్ధతతోవున్న కారణము విష్ణువే. నవగ్రహముల విహారము (గమనకు) నియంత్రింపజేయుచున్నదీ విష్ణువే. భూత, వర్తమాన భవిష్యత్కాలములను కాలత్రయమందురు. తలకొను (పూనుకొను) ఆ కాలధర్మములను నియంత్రించుచున్నదీ ఈ నారాయణుని దివ్య మహిమయే.

అంతటగల (ఈజగమునందంతా నెలకొన్న) మాయ విష్ణుమాయ. దాని విలాసము (తీరు) తెలియుట యెవరికీ సాధ్యముకాదు. పరమపదభోగము యెవరికి, యెప్పుడు, యెలా దక్కుతుందో, యే పొఒత (యెక్కడైనా) తెలియలేరు. మంతుకునెక్కిన (ప్రసిద్ధికెక్కిన) సమస్తమూ శ్రీవేంకటేశ్వరుని మహిమవల్లనే ఆస్థితిలో వున్నవని తెలుసుకోండి. దాన్ని తెలుసుకోటానికే ఒక జీవితకాలం చాలదు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vishwanath Ashtakam In Telugu – విశ్వనాథాష్టకమ్

విశ్వనాథాష్టకమ్ - Vishwanathashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు విశ్వనాథాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Vishwanath Ashtakam Lyrics

విశ్వనాథాష్టకమ్

గంగాతరంగ కమనీయజటాకలాపం
గౌరీనిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మదాపహారం
వారాణసీపురపతింభజవిశ్వనాథమ్

1

వాచామగోచర మనేక గుణస్వరూపం
వాగీశవిష్ణుసుర సేవిత పాదపీఠమ్
వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

2

భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్।
పాశాంకుశాభయవర ప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

3

శీతాంశుశోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానలవిశోషిత పంచబాణమ్|
నాగాధిపద్రచితభాసుర కర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

4

పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుఙ్గవపన్నగానామ్|
దావాలనం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.

5

తేజోమయం సగుణనిర్గుణ మద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయమ్
నాగాత్మకం సకలనిష్కళ మాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

6

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రవేశం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.

7

రాగాదిరోషరమితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.

8

వారణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాసోక్త మష్టక మిదం పఠితా మనుష్య
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్యదేహవిలయే లభతే చ మోక్షమ్.

విశ్వనాథాష్టక మిదం యఃపఠే చ్ఛివసన్నిధౌ శివలోక మవాప్నోతి శివేనసహమోదతే.॥

మరిన్ని అష్టకములు

Itani Kitadaekaaka Yitarulu Sariyaa In Telugu – ఇతని కితడేకాక యితరులు సరియా

ఇతని కితడేకాక యితరులు సరియా – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఇతని కితడేకాక యితరులు సరియా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇతని కితడేకాక యితరులు సరియా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : ఇతని కితడేకాక యితరులు సరియా
సంఖ్య : 405
పుట: 273
రాగం: నాట

నాట

58 ఇతని కితఁడేకాక యితరులు సరియా
మితి లోకా లితనిమేనిలోనేకావా

||పల్లవి||

కమలనాభుని భయంకర కోపముతోడ
రమణ వేరొకరివరంబులు సరియా
తమితోడఁ దల దుంచి తగినవరము లిచ్చె
అమరఁగ నరకాసురాదులకు నితఁడు

||ఇత||

కరివరదుని పేరుగలసిన తిట్లతో
పరదేవతలమంత్రపఠనలు సరియా
నిరతి శిశుపాలునినిందకు శిక్షించి
పరలోక మిచ్చినట్టిభావము వినరా

||ఇత||

చలిమి శ్రీవేంకటేశు శరణాగతితోడ
బలిమి మించిన బ్రహ్మపట్టము సరియా
నొలిసిన ధ్రువునకు వున్నతలోక మిచ్చె
అలబ్రహ్మలోకమున కదె మీఁ దెఱఁగరా

||ఇత||

అవతారిక:

అనుగ్రహించుటలో ఇతనికితడే సాటి. లోకాలన్నీ ఈయనలోనే వున్నాయి కనుక ఇతనికి మరొకరు సరియెట్లగుదురు? అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈయన కోపగించిన అన్యదేవతల అనుగ్రహంకంటే నయమే; ఈయనకు నిందకూడా పరదేవతల మంత్రపఠనకన్నామేలు చేస్తుంది; ఈయన శరణాగతి బ్రహ్మపట్టముకంటే బలమైనది. ఈ నా మాటలు నోటిమూటలు కావు సాక్ష్యంకూడా వున్నది. నరకాసురుడు, శిశుపాలుడు, ధ్రువుడు… వీళ్ళంతా సాక్షులే అని తన వాదనను వినిపిస్తున్నారు. అన్నమయ్య వైష్ణవ పక్షపాతి అనిపించినా ఆయనవాదన అమోఘం. హరి మురిసెడి కీర్తనములు అమ్మకు చెల్లా!!

భావ వివరణ:

ఓ భక్తులారా! ఇతనికితడే సాటి. ఇతరులు ఈతని సరియౌదురా? పరిమితిలేని లోకములన్నియును ఇతని మేనిలోనివే (దేహంలో వున్నాయి) కావా? (వున్నవి కదా! అని అర్థం)

ఆ పద్మనాభుని భయంకరమైన కోపముతో, అన్యదేవతల వరదానములకంటే మంగళమే జరుగుతుంది. వారి వరములు ఈయన ఆగ్రహంతో సమానం కాదు. ఎందుకంటే నరకాసురుడి విషయంలో యేం జరిగిందో చూడండి. తమితో (ఆసక్తితో) శ్రీకృష్ణుడు నరకుని తల తెగనరికినా ఆయన వరప్రభావముచే నరకచతుర్దశి ఒక పండుగై జత్ప్రసిద్ధమైనది. కాబట్టి ఈ శ్రీహరి అమరిన ఆగ్రహమే గొప్ప మేలు చేస్తుంది.

కరివరదుడు (గజేంద్రరక్షకుడు) అయిన శ్రీహరి పేరుతో జతకలిసిన వారినిందలే మనకు అధికమైన మేలు కలుగజేస్తాయి. పరదేవతల మంత్ర పఠనం హరినింద చేసే పాటి మేలు కూడా చేయదు. నిరతి (విశేషంగా) శిశుపాలుడు శ్రీకృష్ణుని తిట్టీ తిట్టీ చివరికి మేలే పొందాడు కదా! శిశుపాలుని శిరస్సు సుదర్శన చక్రంతో తెగిక్రిందపడ్డా వాడికి హరిద్వార – పాలకపదవీ వైకుంఠ ప్రాప్తి దక్కాయి కదా!

చలిమి (చల్లని) శ్రీవేంకటేశ్వరుని శరణాగతితో, మించిన (శ్రేష్ఠమైన) బ్రహ్మపట్టము (బ్రహ్మపదవి) కూడా సరిపోదు. ఒలిసిన ధ్రువునకు (తనకు కావలసిన ధ్రువునకు) శ్రీహరి ఉన్నత లోకాలిచ్చాడు. ఎందుకంటే బ్రహ్మలోకముపైనున్న ధ్రువమండలాన్ని స్థిరలోకంగా తన భక్తునికిచ్చాడు ఆ నారాయణుడు. నేటికీ పలువురికి మార్గదర్శకమయ్యాడు ఆ చిన్నారి బాలుడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Peru Narayanudavu Bembaadichetalu Neevi In Telugu – పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి

పేరు నారాaయణుడవు బెంబాడిచేతలు నీవి – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి
సంఖ్య : 162
పుట: 109
రాగం: సాళంగనాట

సాళంగనాట

57 పేరు నారాయణుఁడవు బెంబాడిచేఁతలు నీవి
నోరు మూసుకున్నఁ బోదు నున్నని నీసుద్దులు

||పల్లవి||

వేసులు మాకుఁ జెప్పె విన భారతముగాఁగ
మోస నీపాలముచ్చిమి మొదలుగాను
రాసికెక్క శుకుఁడు రవ్వగాఁ బొగడఁ జొచ్చె
ఆసలఁ బరకాంతల నంటిననీసుద్దులు

||పేరు||

రంతున వాల్మీకి చెప్పె రామాయణముగాను
సంతగాఁ దాటకాదులఁ జంపినదెల్లా
అంతకముందె నారదుఁ డవి దండెమీటి చెప్పె
యింతటా వేఁటాడి జీవహింసలు సేసినది

||పేరు||

వేడుక నజుఁడు చెప్పె వేదముగా నీవు దొల్లి
వోడక మీనై కొన్నాళ్ళుండితివంటా
తోడనే సప్తరుషులు తొల్లియునుఁ జెప్పి రదె
యీడనే శ్రీవేంకటాద్రి నిరవైతి వనుచు

||పేరు||162

అవతారిక:

నారాయణుడు అంటే నరశరీరమును పొందు భగవంతుడు అని అర్థం. ఈయన పేరు నారాయణుడు కాని ఈయన చేతలు మాత్రం బెంబాడి చేతలు. బెంబేలెత్తిపోయే పనులు చేస్తాడట ఆయన. ఆ నున్నని సుద్దులు నోరుమూసుకుంటే మాయమైపోవు. యుగయుగాలుగా అవి ప్రచారమవుతూనే వుంటాయి. భారతం వ్రాసిన వేసులు (వ్యాసులవారు), భాగవతం చెప్పిన శుకుడు, రామాయణ కావ్యకర్త వాల్మీకి, వాటిని అంతకుముందె గానంచేసి నారదుడు శ్రీహరి లీలలు పొగిడారు. సప్తఋషులు కూడా తిరుమలలో ఆయనను సేవిస్తూనేవున్నారుకదా! నీకథలు యెన్నని చెప్పగలము యెంతని చెప్పగలం, అంటున్నారు అన్నమాచార్యులవారు.

భావ వివరణ:

ఓదేవదేవా! నీపేరు నారాయణుడు. అంటే నరరూపం ధరించినవాడవు. కాని నీ చేతలు (పనులు) బెంబాడి చేతలు. (బెంబేలెత్తించే పనులు). నున్నని నీ సుద్దులు (మనోహరమైన నీ కథలు) నోరుమూసుకున్నన్ పోదు (ఇంకొకరికి చెప్పనంతమాత్రాన తెలియకుండాపోవు). ఎందుకంటే యుగానికి ఒకడు పుట్టి వాటిని ప్రచారం చేస్తూనే వుంటాడు.

ద్వాపరయుగంలో వేసులు (వేదవ్యాసులవారు) పుట్టి మాకు వినుటకు భారతగాధను చెప్పినారు. నీవు పాలు వెన్న దొంగిలించటం, మోసంతో యుద్ధంలో పాండవులకు సాయం చేయటం మొదలైన కథలన్నీ చదివాం. రాసికెక్క (ప్రసిద్ధుడైన) శుకమహర్షి రవ్వగా (నాణ్యమైన విధమున) ఆసల (వ్యామోహంతో) నీవు పరకాంతలనంటిన సుద్దులు (పరాయిస్త్రీల పొందునాసించితివని కథలు కథలుగా) బొగడ జొచ్చె (కీర్తించాడు). అదే భాగవతమై జగత్ప్రసిద్ధమైనది.

త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి సంతగా (వల్లెవేసినట్లు) నీవు రామచంద్రునిగా తాటక మొదలైన రాక్షసులను జంపినదెల్లా రామాయణములో రంతున (పెద్దగా ధ్వనించునట్లు) చెప్పినాడు. (అంతకు ముందే (కృతయుగారంభంలోనే) నారదుడు బ్రహ్మమానసపుత్రుడై అవతరించి దండె మీటి (మహతి అనే తన వీణను మీటుతూ) నీవు వేటాడి జీవహింస (దుష్టసంహారం) చేస్తావని, యింతటా (ఈలోకమంతా) చాటినాడు.

అసలు వేదకాలంలోనే అజుడు (బ్రహ్మ) వేదమువలె నీవు మీనై కొన్నాళ్ళుండితివంటా మత్స్యపురాణంలో నీ చేతలన్నీ వోడక (వదలక) కీర్తించాడు. తోడనే (దానితోపాటే) తొల్లియును (అనాదిగా) సప్తఋషులు, యీడనే ఈ తిరుమల శిఖరాలమీద, ఈ శ్రీవేంకటాద్రిపై ఇరవైతివని (నెలకొంటివని) అనుచూ అదె (ఆ మాటనే) చెప్పిరి. మరి ఈ నాటికీ మేము తెల్లవారింది మొదలు నీపై పాడుతున్నామంటే… అది వారందరి చలువవల్లనే తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sai Baba Pooja Vidhanam In Telugu – సాయిబాబా పూజా విధానం

Sai Baba Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

సాయిబాబా పూజా విధానం

పూజా విధానము

శ్రీ మహా గణాపతయే నమః, శ్రీగురుభ్యోనమః, అపవిత్రః పవిత్రోవా సర్వావస్థామ్ గతోపివా. యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష (నీరు శిరస్సున చల్లుకొనవలెను.)

ఆచమనము

ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. (ప్రతిసారి ఉద్ధరిణతో నీరు తీసుకొని త్రాగవలెను. నమస్కారము చేస్తూ ఈ క్రింది విధంగా చదవండి.)

ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః

ఉత్తిష్ఠన్తు భూత పిశాచ, ఏతే భూమి భారకాః,
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
(అక్షతలుగాని నీరుగాని ఎడమవైపు వెనుకకు చల్లవలెను.)

ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం తత్సవితుర్వ రేణ్యం ఓం తపః ఓగ్ంసత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి, ధి యోయోనః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భవస్సువ రోం దురితక్షయద్వారా శ్రీసాయినాథ ప్రీత్యర్ధం…

సంకల్పము

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీసాయినాథ మద్దిశ్య, శ్రీసాయినాథ ప్రీత్యర్థం. శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పా దే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు వ్యప్రదేశే కృష్ణా గోదావరోర్మధ్యప్రదేశే సమస్త దేవతా హరిహర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన… నామసంవత్సరే . యినే… ఋతౌ.. మాసే… పక్షే… తిధౌ… వాసరే… శుభనక్షత్రే శుభయోగే శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్… గోత్రః … నామ ధేయః ధర్మపత్నీ సమేతః మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వ రప్రీత్యర్థం – అస్మాకం సహాకుటుంబానాం క్షేమస్థైర్య, విజయధైర్య, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థమ్ – ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీసాయినాథ (ఇష్టదేవతా ప్రీత్యర్థం యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే (ఉదకమును తాకవలెను.)

కలశారాధన

తదంగ కలశారాధనం కరిష్యే
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలేతత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్స ర్వే సప్తద్వీపా వసుంధరా.
ఋగ్వేదోఽధయజుర్వేదస్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేఽస్మిన్ సన్నింధింకురు.
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య – దేవం – ఆత్మానం – సంప్రోక్ష్య (పువ్వుతోగాని,తమలపాకుతోగాని, కలశములో నీరు పూజాద్రవ్యముల మీదను – దేవుని మీదను చల్లుకొనవలెను.)

అథాంగపూజా

ఓం షిరిడీశ్వరాయ నమః పాదౌ పూజయామి
ఓం ద్వారకామాయివాసాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం భక్తవత్సలాయ నమః జంఘే పూజయామి
ఓం పత్రిగ్రామోద్భవాయ నమః జానునీ పూజయామి
ఓం సమాధి స్వరూపాయ నమః ఊరూ పూజయామి
ఓం చావిడీ నివాసాయ నమః కటిం పూజయామి
ఓం నింబవృక్ష స్వరూపాయ నమః ఉదరం పూజయామి
ఓం భక్తవశ్యాయ నమః వక్షస్థలం పూజయామి
ఓం అభయహస్తాయ నమః బాహూన్ పూజయామి
ఓం జ్ఞానప్రదాయ నమః కంఠం పూజయామి
ఓం సర్వమతసమ్మతాయ నమః వక్త్రం పూజయామి
ఓం వెంకూసామనోల్లాసాయ నమః దంతాన్ఫూజయామి
ఓం సర్వాంతర్యామినే నమః నాసికాం పూజయామి
ఓం సూర్య చంద్రాక్షాయ నమః నేత్రా పూజయామి
ఓం శ్యామ హృదయ నివాసాయ నమః శిరః పూజయామి
ఓం సాయిరామాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

షోడశోపచార పూజ

శ్రీసాయినాధపరబ్రహ్మణేనమః ఆసనం సమర్పయామి
(సాయినాథుని ఆవాహనము చేసి పూజించాలి. అక్షతలుంచాలి)
పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి
(ఉదకము సమర్పించాలి)
సువర్ణ వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంథంధారయామి (అక్షతలతో పూజచేయాలి )

మరిన్ని పూజా విధానాలు:

Varalakshmi Vratha Katha In Telugu | వరలక్ష్మీ వ్రత కథ

Varalakshmi Vratha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్ట మైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అష్టైశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతారు. ముత్తయిదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈవ్రతం ఆచరించడంవలన తమ కోరికలు నెరవేరతాయని స్త్రీలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత కథ మీకోసం…

వ్రత పూర్వ వృత్తాంతం

శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్నే వరలక్ష్మీ వ్రతమని అంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడారు.ఆ ఆటలో పార్వతి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు. ఇరువురి వాదనలూ విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పాడు. దానితో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్టు రోగం ప్రాప్తించేటట్లు శపించింది… చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. వరలక్ష్మీ వ్రతమును శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే నీ రోగం పోతుందని పార్వతీదేవి శాపవిమోచనం తెలియజేసింది. చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతమును ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మీ వ్రతమును పార్వతీదేవి కూడా ఆచరించగా కుమార స్వామి జన్మించాడు. నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతమును చేసి రాజ్యాలను పొందారని చెబుతారు. ఇది స్థూలంగా వరలక్ష్మీ వ్రతం పూర్వ చరిత్ర.

శ్రీ వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభం

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మునులరా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి” అని అడిగింది. అందుకా త్రినేత్రుడు “దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలి.” అని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి “దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. “కాత్యాయనీ! పూర్వకాలంలో మగధ దేశంలో విష్ణుకుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆపట్టణంలో చారుమతి అనే ఒక బ్రహ్మణ స్త్రీ ఉండేది. అమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాత: కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాత:కాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో చారుమతికి కలలో సాక్షాత్కారించింది. “ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు ఇస్తానని” చెప్పి అంతర్థానమైంది. చారుమతి చాలా సంతోషించింది. “హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నలను పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది.” అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహనికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపం పై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో “సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకన్నారు. (శక్తి కొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును జేయవచ్చును. అట్లు చేసినచో సర్వసౌభాగ్యములును కలిగి సుఖముగానుందురు. ఈ కథను వినువారలకు, చదువువారలకు వరలక్ష్మీ వ్రత ప్రసాదము వలన సకల సుఖములు
కలుగును.

మరిన్ని వ్రతాలు:

Achyutashtakam In Telugu- అచ్యుతాష్టకమ్

Achyutashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అచ్యుతాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Achyutashtakam Lyrics Telugu

అచ్యుతాష్టకమ్

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్,
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే.

1

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితమ్,
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే.

2

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే,
వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః.

3

కృష్ణ ! గోవింద ! హేరామ ! నారాయణ !
శ్రీపతే ! వాసుదేవాజిత ! శ్రీనిధే !
అచ్యుతానంత ! హే మాధవాధోక్షజ !
ద్వారకానాయక ! ద్రౌపదీరక్షక !

4

రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్య భూపుణ్యతాకారణః,
లక్ష్మణేనాన్వితో వానరైః సేవితో
గస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్.

5

ధేను కారిష్టకృద్ ద్వేషిహా
కేశిహా కంసహృద్వంశికావాదకః,
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా.

6

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్రోల్లసద్విగ్రహమ్,
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రద్వయం వారిజాక్షం భజే.

7

కుంచితైః కుంతలైః భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయోః
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే.

8

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషస్సస్పృహమ్,
వృత్తతః సుందరం కర్తృవిశ్వంభర
స్తస్యవశ్యో హరిర్జాయతే సత్వరమ్.

ఇతి శ్రీ మచ్ఛంకరాచార్యకృతమచ్యుతాష్టకం సంపూర్ణమ్

మరిన్ని అష్టకములు