Kakabhusundi Purvajanma Vrttantamu In Telugu – కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము

Kakabhusundi Purvajanma Vrttantamu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీతులసీదాస కృత రామచరితమానసము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము నీతికథ.

కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము

నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించెను. శ్రీరాముని మాయావశుడైన గరుడుడు ఇలా ఆలోచించసాగెను “సర్వవ్యాపకుడు నిర్వికారుడు వాగాధిపతి మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించెనని విన్నాను. శ్రీరామ నామమును జపించినంత మాత్రముననే మానవులు భవబంధవిముక్తులు అగుదురనీ విన్నాను. కానీ అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాశముచే బంధింపబడుట ఏమి”? ఇలా మాయామోహితుడై వ్యాకులచిత్తుడైన గరుడుడు బ్రహ్మర్షి అగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపఱచి కాపాడమని ప్రార్థించెను.

నారదుడు గరుడుని సందేహనివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికడకు పంపెను. తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు “ఓ విహగేశ్వరా! పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎఱుగును. కావున నీవు ఆ శంకరునే శరణువేడుము”. కుబేరుని కడకు వెళుతున్న మహాదేవుని కలిసి గరుడుడు తన సందేహమును చెప్పెను. “ఓ పక్షీంద్రా! ఎంతో కాలము సజ్జనుల సేవను చేసిగానీ జ్ఞానమును పొందలేము. నిన్ను నిరంతర రామకథాప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుశుండి ఆశ్రమమునకు పంపెదను” అని పార్వతీనాథుడు ఆనతిచ్చెను.

వేయి మందిలో ఒక్కడే ధర్మపథమును సర్వకాల సర్వావస్థలయందూ అనుసరించును. అట్టి కోటి ధర్మాత్ములలో ఒక్కడు పేరాశకు లోనుకాక విరాగి వలె ఉండును. అట్టి కోటి విరాగులలో ఒక్కడు జ్ఞాని అగును. అలాంటి జ్ఞానులలో కోటికొక్కడే జీవన్ముక్తుడగును. అట్టి వేయిమంది జీవన్ముక్తులలో అరుదుగా ఒక్కడు బ్రహ్మైక్యమును పొందును. అలా బ్రహ్మైక్యమును పొందినవారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణ ముగా మాయావిముక్తుడై శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును. అట్టి దుర్లభమైన నిష్కల్మష రామభక్తి ఉన్న కాకభుశుండి కడకు గరుడుడు వచ్చెను. వచ్చిన గరుడుని తగిన రీతిలో గౌరవించి కుశలమడిగి సముచిత ఆసనముపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలగు ఎన్నెన్నో అతిరహస్యములైన తత్త్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకభుశుండి.

“పూర్వము ఒకానొక కల్పములో కలియుగము ఆరంభమైనది. కలికాలము మిక్కిలి కలుషితమైనది. స్త్రీ పురుషులందఱూ పాపకర్మనిరతులై వేదవిరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలము కలిగియూ కల్పాంతములు దాటే గర్వము దంభము అహంకారమును కలిగియుందురు. పాషండులు తమవిపరీత బుద్ధులతో క్రొత్తక్రొత్త సాంప్రదాయాలను ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు. ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందురు. ఒక వైపు బ్రహ్మజ్ఞానము గూర్చి మాట్లాడుతూ మఱోక వైపు లోభముచే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు. తాము స్వయముగా భష్టమగుటే కాక సన్మార్గమున నడచువారినికూడా భృష్ణుపఱచెదరు. వర్ణాశ్రమధర్మాలు అడుగంటుతాయి. ప్రజలలో సామరస్యం సమైక్యభావం నశిస్తుంది. నిష్కారణ వైరములతో కక్షలతో ఉండెదరు. వేదశాస్త్ర పురాణములను గౌరవించరు. కుతర్కములతో వేదశాస్త్రపురాణ నిందచేసి అనంతపాపరాశిని సొంతం చేసుకుంటారు.

పూజలు దానధర్మాలు స్వార్థబుద్ధితో తామసముతో చేసెదరు. విద్యను అన్నమును అమ్ముకొనెదరు. ధనవంతులకే గౌరవమివ్వబడును. గురుశిష్య భార్యభర్త మాతాపితభ్రాత అను సంబధములకు విలులేకుండును. ఆడంబరముగా జీవించుచూ వేదమార్గమును త్యజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకమూ కపటత్వముతో నిండియున్న వారు గురువులై అధర్మబోధలు చేశాదరు. అమంగళకరమైన వేషభూషణాదులను ధరించి శిరోజములను విరియబోసుకొనెదరు. తినదగినది తినగూడనిది అను విచక్షణ తినుటకు సమయం అసమయం అను విచక్షణ చేయక అన్నింటిని అన్ని వేళలా తినెదరు. అలా పాపకూపములో పడి ఇహములో పరములో బహు క్లేశాలను అనుభవించెదరు.

కానీ ఈ కలియుగమున ఒక గొప్పగుణము కలదు. “కలౌ సంకీర్తనాన్ముక్తిః” యొగ యజ్ఞ పూజాదులకు ఆస్కారములేని ఈ యుగములో భగన్నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు. ఓ పన్నగాసనా! ఇంద్రజాలికుడు ప్రదర్శించుమాయ చూచువారిపైనే ప్రభావమును చూపును. కానీ అతనిసేవకులను అది ఏమీ చేయదు. అట్లే మాయకు మూలమైన భగంపంతుని శరణుజొచ్చిన వానికి ఆ అనూహ్యమైన మాయ అంటదు.

అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్యానగరములో ఒక శూద్రునిగా జన్మించినాను. మనోవాక్కర్మలచే నేను అఖండ శివభక్తుడను. కానీ నా బుద్ధిమాన్యముచే ఇతరదేవతలను దూషించుచుండెడి వాడను. అతిగర్వముతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కఱవు వచ్చింది. దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయినీ నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమ శివుని ఆరాధన కొనసాగించితిని. ఒక్కడ అతిదయాళువు నీతిమంతుడు పరమసాధువైన ఒక విప్రోత్తముడు వైదిక పద్ధితిలో అహర్నిశలూ శివుని ఏకాగ్రచిత్తముతో నిష్కల్మషముగా పూజించుచుండెను. అతడు ఎన్నడునూ విష్ణు నింద చేయలేదు.

కపటబుద్ధితో నేనతనికి సేవ చేయుచుండెడివాడను. ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యముతో చూచుచూ బోధించుచుండెను. శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నాకతడు బోధించెను. నేను ప్రతి దినమూ దేవాలయమునకు పోయి శివనామస్మరణము చేసెడివాడను కానీ నా అహంకారమును నేను విడువలేదు. హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించెడివాడను.

నా గురువు నా ప్రవర్తన చూసి చాల బాధపడి నిత్యమూ ఎన్నో సదుపదేశములిచ్చెడివాడు. ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచూ నాలోని కోపాగ్నిని ప్రజ్వలింప చేయుచూ జీవించుచుంటిని. ఇలా ఉండగా ఒక రోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వము బోధించి “పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మ శివుడు నమస్కరించెదరు. అట్టిది నీవు ద్వేషించుట తగదు” అని అనెను. అది వినడంతో నా కోపాగ్ని మింటికెగసెను. అనర్హుడనైన నాకు విద్యనొసగిన నా గురువునకే ద్రోహము తలపెట్టాను. అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రమూ కోపపడలేదు.

ఒక రోజు నేను శివాలయములో శివనామము జపించుచుండగా నా గురూత్తముడు అచటికి వచ్చెను. నా గర్వము వలన లేచి ఆయనకు నమస్కరించలేదు. దయానిధి అయిన నా గురువుకు నా దౌష్ట్యము చూచియు కొంచెముకూడా కోపమురాలేదు! కాని గురువును నిరాదరించుట మహాపాపము. పరమశివుడు ఇది చూసి సహింపలేక “ఓరీ మూర్ఖుడా! పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించినావు. నీవు క్షమార్హుడవు కాదు. సద్గురువుపై ఈర్షగొన్నవాడు కోట్లాది యుగములు రౌరవాది నరకములలో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపై వేలకొలది జన్మలు క్లేశములభవించును. నీ విప్పుడే అజగరముపై ఒక చెట్టుతొఱ్ఱలో పడివుండు” అని నన్ను శపించెను. భయకంపితుడనైన నన్ను చూసి నా గురువర్యుడు రుద్రాష్టకముతో శివుని ప్రసన్నుని చేసుకుని పశ్చాత్తాపముతో దుఃఖిస్తున్న నాకు శాపావశానము ప్రసాదించమని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు

“ఓ కృపానిధీ! మహాపకారికైనా మహోపకారము చేయు నిన్ను మెచ్చితిని. నీ శిష్యునికి శాపావశానమిచ్చెద” అని నన్ను చూసి “చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. నీవు దుర్భరమైన వేయి జన్మలెత్తుతావు. కానీ నీ గురువు మహిమవల్ల దివ్యమైన అయోధ్యానగరమున పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది. ప్రతి జన్మలో నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వత్సా! ఇంకెప్పుడూ సాధుసజ్జనవిపులను నిరాదరింపవద్దు.

ఇంద్రుని వజ్రాయుధముతో నాత్రిశూలముతో యముని దండముతో శ్రీహరి చక్రముతో చంపబడనివాడు సజ్జనద్రోహమనెడి అగ్నిలో పడి మాడిపోతాడు” అని చెప్పి నాపై కృపావర్షం కురిపించినాడు ఉమానాథుడు. అప్పటినుంచీ ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మఱువక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమశ మహర్షి వద్ద శ్రీరామచరితమానసము విని కాకభుశుండినై శ్రీరామునికి ప్రియుడనైనాను”.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. గురుద్రోహం శివకేశవులను భేదబుద్ధితో చూడడం సాధుసజ్జనులను అవమానించడం ఘోరపాపములని మహాశివుడు కాకభుశుండి తో చెప్పాడు. కావున మనము గర్వముతో ఇట్టి తప్పులెన్నడునూ చేయరాదు.
  2. కాకభుశుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి. శిష్యుడెన్ని అవమానాలుచేసినా తను చెప్పిన హితవాక్యాలను పెడచెవిన పెట్టినా ఏ మాత్రమూ కోపగించుకోలేదు.
  3. రామభక్తుడైన కాకభుశుండి కలియుగ వర్ణనము వలన మనకు చేయకూడనివి ఎన్నో తెలిసినాయి. ఇట్టి దుష్కృతాలకు దూరముగా ఉండి ధర్మమార్గములో నడచుచూ నిత్యం భగవన్నామస్మరణ చేయడమే మన కర్తవ్యము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Annadana Mahima Goppadi In Telugu – అన్నదాన మహిమ గొప్పది

Annadana Mahima Goppadi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అన్నదాన మహిమ గొప్పది నీతికథ.

అన్నదాన మహిమ గొప్పది

(ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనునిచే జనమేజయునికి చెప్పబడింది.)

ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షోహిణులసేనలో కురుపక్షంలో అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులయిదుగురు, కృష్ణుడూ, సాత్యకీ మిగిలారు.

ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్యమీద ఉన్న భీష్మపితామహుడు సర్వధర్మవిషయాలూ బోధించి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించగానే యోగమార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులూ అందరూ మరణిం చారనే బాధ ధర్మరాజు మనస్సుని వికలంచేస్తూనే ఉంది. ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించ మని విద్వాంసులు సలహా యిచ్చారు.

వారి ఆదేశానుసారం అశ్వమేధయాగం ఆరంభించాడు. దేశ దేశాలనుంచి చక్రవర్తులూ, విద్వాంసులూ ఎందరో వచ్చారు. వివిధ నగరాలనుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిల కించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతోపాటు నిర్విరామంగా అన్న దానం గూడా జరిపించాడు. యోగ్యులై నవారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు. అక్కడకు వచ్చినవారిలో సంతృప్తిపడకుండా ఉన్నవాడు ఒకడూ లేడు. అలా సర్వజన సంతృ ప్తికలిగించిన అశ్వమేధయాగం చూచిన దేవ తలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు.

అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిన వచ్చింది. వారందరూ ఈ శాలలోకి ముంగిన ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యంతో చూస్తున్నారు.

అప్పుడా ముంగిస నవ్వుతూ ‘దేవతలు కూడా అభినందించే యాగమా యిది’ అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒకభాగం బంగారు కాంతులీనుతోంది. రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది.

‘సక్తుప్రస్థుడి ధర్మ బుద్ధితో పోలిస్తే యీ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం’? అంది.

అందరూ తెల్లబోయారు. దానినిచూస్తూ : ‘ఎవరా మహనీయుడు । ఏవిటాయన కథ’ అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా : ‘సావధానంగా వినండి’ అని ఇలా చెప్పింది ముంగిస.

‘ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలాకాలం క్రితం సత్తు ప్రస్థుడనే పేరుగల గృహయజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారు డుండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయింది. వారు నలుగురూ సర్వభూత కోటిని దయతోచూస్తూ, కామ క్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకూ, కోడలూ ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవ్వరికీ హానిచేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికినదాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు.

పరబ్రహ్మమీదనే మనస్సునిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితంకూడా వరమేశ్వరధ్యానానికే అర్పించేవారు.
అలా ఉండగా ఒకనాడు :
వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి, అక్కడ రాలిన ధాన్యపుగింజలు ఏరి తెచ్చుకుని, దంచి, పండిచేసి, వండుకుని నలుగురూ సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో, ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయనకళ్ళు లోతుకు పోయాయి. ఎముకలు బయట పడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి, ఆకలి అని నీరసంగా అడిగాడు.

ఆయనను ఆదరంగా తీసుకునివచ్చి, తన పక్క కూర్చో పెట్టుకుని ఆర్యా ! తమరు కుశలమే కవ! మా ఆతిథ్యం స్వీకరించి, అనుగ్ర హించండి. ఏ ప్రాణికీ హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేంతెచ్చుకున్న ధాన్యపుగింజల పిండితో వండిన ఆహారం యిది. దీనితో మీ ఆకలిబాధ నివారించుకోండి అని గృహయజమాని తపభాగం ఆయ ఐకు వడ్డించాడు.

అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే ఆయనభార్య తనభాగం యిచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలిబాధ తీరలేదని తెలిసి కొడుకూ, కోడలూ కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి, ఆయన ఆనందంతో ‘నాయనా మీ అతిథిసత్కారం, అన్నదానం నాకు తృప్తి కలి గించాయి. నీతోపాటు నీకుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధ పడుతూకూడా మీరు తినబోయే ఆహారం దానంచేసి, పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి.

ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడి గడతాడు. అన్నంకోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు దయగలగుండె కలవారే ఆశకు దూరం అవుతారు. ఈ రెండూవున్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి యింత అన్నం పెట్టడంకంటే ఏ దానమూ గొప్పదికాదు. అటువంటి అన్న దానం చేసిన పుణ్యాత్ములు మీరు ‘ అంటూండగా దేవవిమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు.

ఇదంతా వింటూ చూసిననేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంత ములో ఆ అతిథిపాదాలు కడిగినచోట తిరిగాను. తిరిగినప్రక్క ఆ పాదాలు కడిగిన నీటితడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారు మయమయింది.
అనంతరం ఎన్నెన్నో దాన, ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండపప్రక్క దేహం యిలానే ఉండిపోయింది. ఇక్కడకూడా అంతే. నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగివ.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satyanarayana Swamy Vrata Vidhanam In Telugu – సత్యనారాయణ స్వామి వ్రత విధానము

Satyanarayana Swamy Vrata Vidhanam

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానము గురించి తెలుసుకుందాం…

సత్యనారాయణ స్వామి వ్రత విధానము

వ్రత విశిష్టత, విధానము

ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును.

మాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభదినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ధ ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించవచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదశినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను.

వ్రతమురోజు విధిగా చేయవలిసిన పనులు

ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యావందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలెను. పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్ధికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల మ్రుగ్గులు పెట్టవలెను. ఆ మ్రుగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు. కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో నుంచవలెను.

పూజాక్రమము:

గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్యష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన చేసి, సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజచేయవలెను.

నాలుగు వర్ణముల వారికి పూజావిధానము

బ్రాహ్మణ – క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక – పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశ్రద్ధలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను.

శ్రీ సత్యనారాయణ పూజ

శ్రీ పసుపు గణపతి పూజ

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ (గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

Satyanarayana Swamy Vratam

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిధౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్థ, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ధ్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, మహాలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా, పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.)

ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)
శ్లో // థ్యాయే త్సత్యం గుణాతీతం గుణత్రయసమన్వితం,
లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిమ్
పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితమ్
గీవిందం గోకులానందమ్ బ్రహ్మా దైర్యభిపూజితమ్
శ్రీ రమా సత్యనారాయణస్వామినే నమః ధ్యాయామి.
(పుష్పము వేయవలెను).

ఆవాహనం:

ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్,
స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ దశాంగులమ్.
శ్లో // జ్యోతి శ్శాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం
సాంగం శక్తిం సాయుధం భక్తసేవ్యం సర్వాకారం విష్ణు మావాహయామి.
రమా సత్యనారాయణ స్వామినే నమః, ఆవాహయామి.
(పుష్పము వేయవలెను).

ఆసనం:

ఓంపురుష ఏవేదగం సర్వం, య ద్భూతం యచ్ఛ భవ్యం,
ఉతామృతత్వ స్యేశానః యదన్నేనాతి రోహతి.

శ్లో// కల్పద్రుమూలే మణివేదిమధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం
విచిత్ర వస్త్రావృత మచ్యుత ప్రభో – గృహాణ లక్ష్మీ ధరణీ సమన్విత
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః రత్న సింహాసనం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను.)

Satyanarayana Swamy Vratam telugu pdf

పాద్యం:

ఏతావా నస్య మహిమా, అతో జ్యాయాగ్ శ్చపూరుషః,
పాదోస్య విశ్వభూతాని, త్రిపాదస్యామృతం దివి.

శ్లో// నారాయణ నమోస్తుతే నరకార్ణవతారక
పాద్యం గృహేణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ
శ్రీ రమా సత్యనారాయణ అవామినే నమః, పాదయోః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః, పాదో స్యేహాభవాత్పునః,
తతోవిష్వజ్ వ్యక్రామత్, సాశనానశనే అభి.

శ్లో // వ్యక్తావ్యక్తస్వరూపాయ హృషీకపతయే నమః
మయా నివేదితో భక్త్యా హ్యర్హ్యోయం ప్రతిగృహ్యతామ్
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, హస్తయో రర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

ఆచమనం:

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియంలోకేదేవజుష్టా ముదారం
తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే.
తస్మా ద్విరా డజాయత, విరాజో అధిపూరుషః, స జాతో అత్యరిచ్యత, పశ్చా ద్భూమి మథో పురః.

శ్లో// మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం
తదిదం కల్పితం దేవ సమ్య గాచమ్యతాం విభో
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

స్నానం:

యత్పురుషేణ హవిషా, దేవా యజ్ఞ మతన్వత, వసంతో అస్యాసీదాజ్యం, గ్రీష్మ ఇధ్మ శ్శర ద్ధవిః.

శ్లో // తీర్ధోదకైః కాంచనకుంభసంస్థై స్సువాసితైర్దేవ కృపారసార్డైః
మయార్పితం స్నానవిధిం గృహాణ పాదాబ్జనిఘ్యాతనదీప్రవాహ
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, స్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

శుద్ధోదకస్నానం:

అపోహిష్టామయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే, యో వశ్శివతమోరస స్తస్యభాజయతేహనః ఉశతీరివ మాతరః, తస్మా అరంగ మామవో యస్యక్షయాయ జిన్వథ, అపో జనయథా చ నః .

శ్లో// నదీనాం చైవ సర్వసా మానీతం నిర్మలోదకం
స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, శుద్దోదక స్నానం సమర్పయామి.
స్నానాంతరం సుద్ధాచమనీయం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

వస్త్రం:

సప్తాస్యాస న్పరిధయః, త్రిస్సప్త సమిధః కృతాః, దేవా య ద్యజ్ఞం తన్వానాః, అబధ్న స్పురుషం పశుమ్.

శ్లో// వేదసూక్తసమాయుక్తే యజ్ఞసామ సమన్వితే
సర్వవర్ణప్రదే దేవ వాససీ ప్రతిగృహ్యతామ్
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్ష్న, పురుషం జాతమగ్రతః, తేన దేవా అయజంత, సాధ్యా ఋషయశ్చ యే.

శ్లో // బ్రహ్మవిష్ణు మహేశైశ్చ నిర్మితం బ్రహ్మసూత్రకం
గృహాణ భగవన్ విష్ణో సర్వేష్టఫలదో భవ
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

తస్మా ద్యజ్ఞా త్సర్వ హుతః, సంభృతం పృషదాజ్యం, పశూగ్ స్తాగ్ శ్చక్రేవాయవ్యాన్, అరణ్యాన్ గ్రామాశ్చయే.

శ్లో // శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, దివ్య శ్రీ చందనం సమర్పయామి.
(గంధం చల్లవలెను.)

ఆభరణములు:

తస్మా ద్యజ్ఞా త్సర్వహుతః, ఋచ స్సమాని జజ్ఞిరే తస్మాత్, తస్మా జ్జాతా ఆజావయః.

శ్లో// మల్లికాది సుగంధీని మాలత్యాదీనివైప్రభో
మయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతామ్
శ్రీ రమా సత్యనారాయణ అవామినే నమః, పుష్పాని సమర్పయామి.
(పుష్పములు సమర్పించవలెను)

పుష్పసమర్పణం (పూలమాలలు):

తస్మాదశ్వా అజాయన్త| యేకేచో భయాదతః||
గావోహజిజ్జిరే తస్మాత్ | యస్మాజ్జాతా అజావయః
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, పుష్పై పూజయామి
తులసీ కుందమన్దార పారిజాతాం బుజైర్యుతాం|
వనమాలాం ప్రదాస్యామి గృహాన జగదీస్వరా
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, వనమాలాం సమర్పయామి
(పుష్పాములు వేయవలెను)

అథాంగ పూజా:

ఓం కేశవాయ నమః, పాదౌ పూజయామి
ఓం గోవిందాయ నమః, గుల్ఫౌ పూజయామి
ఓం అనఘాయ నమః, జానునీ పూజయామి
ఓం ఇందిరాపతయే నమః, జంఘే పూజయామి
ఓం జనారధనాయ నమః, ఊరూ పూజయామి
ఓం జనార్దనాయ నమః, కటిం పూజయామి
ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః, ఉదరం పూజయామి
ఓం లక్ష్మీవక్షస్థలాలయాయ నమః, హృదయం పూజయామి
ఓం శంఖచక్రగదా శార్ ఙ్గ పాణయే నమః, బాహున్ పూజయామి
ఓం కంబుకంఠాయ నమః, కంఠం పూజయామి
ఓం కుందకుట్మలదంతాయ నమః, దంతా న్ఫూజయామి

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

తదుపరి ఇక్కడ స్వామి అష్టోత్తరము చదువవలెను.

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ

మరిన్ని వ్రతాలు:

Dharmavarulanu Varabhavincha Vaddu In Telugu – ధర్మవరులను వరాభవించ వద్దు

Dharmavarulanu Varabhavincha Vaddu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మవరులను వరాభవించ వద్దు నీతికథ.

ధర్మవరులను రాభవించ వద్దు

(ఈ కథ అరణ్యపర్వంలో ఉంది)

పాండవులు జూదంలో ఓడిపోయి, అడవులకు వచ్చారు. వారితో పాటు ఎందరో వేదవిదులు కూడా అనుపరించి రాగా, వీరందరి పోషణ భారం ఎలా నిర్వహించగలనా అని ధర్మరాజు విచారంలో మునిగాడు.

అప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుడు:

‘ధర్మనందనా ! రాజవంశీయుడు తనను ఆశ్రయించిన వారికి అన్నపానాలు సమకూర్చి వారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. మీ ప్రాచీను అందరూ ఈ ధర్మ నిర్వహణ సాగించారు. తపస్సుతో, యోగశక్తితో వారు తమ ప్రజలకు ఈ రక్షణ సాగించారు.

అంతకంటే ముఖ్యాంశం ఉంది :

ఈ సృష్టి ప్రారంభం వేళ జీవకోటి అంతా ఆకలి బాధతో కటకట లాడుతుంటే అది చూసిన సూర్యభగవానుడు తాము ఉత్తరంగా వయ నించి భూమిలోని సారాన్ని గ్రహించి, అనంతరం దక్షిణంగా తిరుగుతూ ఆ సారాన్ని మళ్ళీ భూమికి అందిచ్చేవాడు. అదే సమయంలో చంద్రుడు మేఘ రూపంలో ఉన్న సూర్యతేజస్సును వర్షంగా మార్పి, ఆ జలధార లతో ఓషధులను అందించేవాడు. ఆ ఓషధులలోని ఆరు రసాలూ షడ్రు చులుగా జీవకోటికి ఆహారం ఆయాయి.

అంటే సర్వ జీవకోటికి వెలుగునిచ్చే సూర్యుడే అన్న దాత. ఆయ నను ప్రార్థించి నీ కోరిక నెరవేర్చుకో ‘ అన్నాడు.

పురోహితులు ఆదేశమపారం ధర్మరాజు అరుణోదయానికి లేచి గంగాతీరానికి వెళ్లి స్నానం చేసి పవిత్ర హృదయంతో సూర్యుని ఆరాధించాడు.
ఆ నిర్మల హృదయుని తపోదీక్షకు సంతోషించి మార్యుడు ప్రస మడై వాని కోరిక ప్రకారం ఒక శామ్ పాత్ర యిచ్చి:

‘ధర్మనందనా! ఇది అక్షయ పాత్ర. ఎండరి కయినా ఇది అన్న పానాలు సమకూరుస్తుంది. అయితే, నీ భార్య పాంచాలి భోజనం చేసి, ఈ పాత్రను పరిశుద్ధం చేసిన అనంతరం ఆ పూటకు మరి భోజనం రాదు. అంటే అతిథి పూజలు పూర్తి చేసే వరకూ, ఆవిడ భుజించదు కదా! అందు చేత నీ కోరిక తీరింది. ఇది తీసుకు వెళ్లు’ అన్నాడు.

అపరిమితానందంతో ధర్మరాజు తిరిగి వచ్చి, ఆనాటి నుండి తనతో వచ్చిన వారికే కాక, అతిథి అభ్యాగతులకు కూడా అన్నదానం చేసి కీర్తి పొందుతున్నాడు.

ఈ కబురు విన్నాడు దుర్యోధనుడు.

ఆ సమయానికే అక్కడకు చేరిన దుర్వాసమహర్షిని ఆరాధించి పాండవులను ఏ విధంగా నయినా పరాభవించాలని కోరాడు.

దుర్వాస మునీంద్రుడు అంగీకరించి బయలుదేరి వచ్చాడు.
విషయం తెలిసిన వాడు కనుక పాండవులూ, పాంచాలీ కూడా భోజనం చేశాక వారిని చేరి, కుశల ప్రశ్నలు ముగించి

‘నా శిష్యులతో పాటు నాకు ఆతిథ్యం యివ్వాలి అన్నాడు.
ధర్మరాజు సంతోషంతో ఆ వార్త పాంచాలికి చెప్పాడు.
వంట యిల్లు కడుగుతున్న ఆ ఇల్లాలి గుండె గతుక్కుమంది,

‘ నదీస్నానం చేసి రాగలం. ఈ లోపున సర్వం సన్నద్ధం కావాలి ‘ అని పలికి మునీంద్రుడు వెళ్ళాడు.

రాజనందన రెండు చేతులూ జోడించి వాసుదేవుని ప్రార్థించింది. నిర్మల చి త్తంతో ఆమె ధ్యానించే వారికి దీనజన శరణ్యు డైన వాసుదేవుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై

‘ అమ్మాయీ ! ఈ నాటి శాక పాఠాలలో ఏ లేశమైనా ఉంటే నా చేతిలో వెయ్యి’ అన్నాడు.
‘అక్షయ పాత్ర కూడా శుద్ధి చేశాను. కృష్ణా: ఎందుకీ పరీక్ష ! ‘ అంది.

‘కాదమ్మా ! నా మాట విని ఒక్క మారు ఆ పాత్రలోకి చూడు, అన్నాడు.

ఆయన మాట కాదనలేక, అక్షయ పాత్రలో చెయ్యి పెట్టింది.

దాని అంచున ఒక అవిశ ఆకు దొరికింది. అది తీసి కృష్ణుని చేతిలోన దానిని నోట ఉంచుకొని :

‘ముల్లోకాలకూ తృప్తి!’ అని వెళ్ళిపోయాడు.
ద్రుపద రాజనందన అతిథుల కోసం ఎదురు చూస్తున్నది. ఎంత సేపయినా వారు రావడం లేదని భీముని పంపారు.

ఇక్కడ వాసుదేవుడు ‘ముల్లోకాలకూ తృప్తి’ అన్న క్షణంలో దుర్వాసునికి, ఆయన శిష్యులకూ, కడుపు నిండుగా భుజించిన ఆయాసం కలిగి వారు ఆటే వెళ్ళిపోయారు.

నదీ తీరానికి వచ్చిన భీమునికి అక్కడి మునులు:
“నాయనా! దుర్వాసుల వారు శిష్య సమేతం స్నానం చేస్తూనే సుష్టుగా భుజించిన తృప్తితో తేస్బుకుంటూ వెళ్ళిపోయారు’ అని చెప్పారు.

భీముడు తిరిగి వచ్చి ఆ వార్త చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు.
(‘ ధర్మపరులను పరాభవించడానికి ప్రయత్నిస్తే ధర్మ రక్షకుడు వారినే పరాభవం పాలుచేస్తాడు, అని మాతుడు భారతకథను వివి పించాడు.)

మరిన్ని నీతికథలు మీకోసం:

Brahmaraksasuni Vimukti In Telugu – బ్రహ్మరాక్షసుని విముక్తి

Brahmaraksasuni Vimukti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… బ్రహ్మరాక్షసుని విముక్తి నీతికథ.

బ్రహ్మరాక్షసుని విముక్తి

అది దండకారణ్యమ్. మహా దట్టమైన అడవీ ప్రాంతమ్. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టంగా వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి. ఆ భీకరారణ్యంలో ఓ మఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగా వచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “ఓ వ్యాఘేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?

“పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్భాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రేయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది” అని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు “జంతు వై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాం” అని పులి అన్నది.

సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు “ఒక ౧౦౦ వర హాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. ఆ రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. “రాజకుమారిని పెళ్ళాడాలి” అన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా “ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చాను” అన్నాడు బాటసారి.

“ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో “అవును. నీకెలా తెలుసు” అని అన్నాడు బాటసారి. “అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది ౫ం రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. “వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకో” అన్నాడు బాటసారి.

ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై “మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రా” అంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. దుష్కర్మలెన్నడునూ చేయరాదు. నేర్చిన విద్య యొక్క సారమును ఎవ్వరికీ పంచకుండా బ్రహ్మరాక్షసుడు సద్గురు దూషణ వలన శిష్యుని కి దుఃఖములు తప్పలేదు.
  2. పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకు తెలిపింది. కేవలం పరోపకారం ఒక్కటే తమని కాపాడగలదని తెలిసి బ్రహ్మరాక్షసుడు పులి ధృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలచినారు.
  3. దేశద్రోహం చాలా పాపకార్యం. అట్టి దేశద్రోహిని సంహరించి బ్రహ్మరాక్షసుడు ఊరికి ఉపకారం చేశాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sai Manasu Maniharamulu In Telugu – సాయి మనస్సు మణిహారములు

Sai Manasu Maniharamulu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి మనస్సు మణిహారములు గురించి తెలుసుకుందాం…

Sai Manasu Maniharamulu Telugu

సాయి మనస్సు మణిహారములు

పది కనులు పడకుండను పదిల పరచి
ముచ్చట గొలుపు తీరుగ మోము దిద్ది
భక్తి భావన లొలుకగా పరమ నిరతి
నిన్ను చేరితి మదిలోన నిలువు సాయి

1

గర్వపడుచుందు జనకుల గాంచి నేను
ఆది గురువులయిరి నాకు అమ్మ నాన్న
ఋణము దీర్చగ నాదంటు ఏమి గలదు
వారికొసగెద నతులను భక్తి సాయి

2

చూడుమయ్య ఈ మదిలోని చూపు లెల్ల
చిత్రములు చేయు చుండెను శిథిల మవగ
నవ్వినట్టి తారల వెంట నడిచి వెడల
అదుపు తప్పెడు మముమార్చు మయ్య సాయి

3

నిన్ను చూడకున్న కనులు నిలువ వాయె
అందమైన దేముండెనో అక్షయాత్మ
నిన్ను వదలగ ఈమది నిలువ బోదు
అంధకారమై తో రావయ్య సాయి

4

ఎంత చెప్పిన మారదు వింత మనసు
తనకు నచ్చిన దానికి తలను ఊపి
మాను దొరికి మురిసినట్టి మల్లె వోలె
ఎదిగి పోయి నేర్చెను వెక్కిరించ సాయి

5

దాచినంతన ప్రేమలు దాగబోవు
ముల్లెగట్టి మురియ చూడ ముసరి పోవు
మనసు విప్పనంతగనవి మాయమవవు
విప్పి చెప్పి చూడంగను విరియు సాయి

6

సంకట మొకటి వాటిల్లె సంశయముగ
మొదట ఈమది పరుగెత్తి మోస బోయె
తనకు నచ్చిన దెల్ల సొంతమని తలచి
నన్ను విడచి ఎడారిలో నడిచె సాయి

7

మధుర పిలుపుతో తాకిరి మనసునెవరో
మగువయో మణి మాణిక్య మాల ఏమొ
రాగమో బంధమో లేక రాణి చెలిమి
మహిమయో నాకు తెలుపుము మహిత సాయి

8

గాలిలోని దీపానికి గాఢమైన
మనసు కలిగెను నీపైన మంజునాథ
లోకమునకంత నీదు వెల్గులను నింపి
నిరతముగ మము బ్రోవుమా నిత్య సాయి

9

ఎప్పుడెటు పోవునో మది నెరుగు నెవరు
ముందెరుగని లోకాలతో మురియ చేసి
వెనక గోతులతో మాటు వేసి యుండు
ఆటలాడే మదిని గాంచు మయ్య సాయి

10

తలచి తలపోసి మాదైన తనువు సతము
పరితపించుచు నున్నది ప్రాణదాత
ఎదురు చూపులతో ప్రతి యెదయు గూడ
మూగ వోయె గొంతుకలన్ని సాగి సాయి

11

మానవతకు నిలయము నీ మందిరమట
అలజడుల నెదురించుచు అలసిపోయి
భక్తితో మమ్ము నీవె కాపాడుదువని
నిర్మలమ్మగు మది ముందు నిలిచె సాయి

12

మనసు నీకు మందిరముగ మలచియుంచి
పరచితిని నేను మమతల పాన్పునయ్య
సాధుమూర్తి సకల గుణశాలి దేవ
నిలువుమయ్య ఈ మది నిండ నీవు సాయి

13

మరిన్ని భక్తి గీతాలు

Anjani Devi Koduku Hanumantudu In Telugu – అంజినీదేవి కొడుకు హనుమంతుడు

అంజినీదేవి కొడుకు హనుమంతుడు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అంజినీదేవి కొడుకు హనుమంతుడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంజినీదేవి కొడుకు హనుమంతుడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : అంజినీదేవి కొడుకు హనుమంతుడు
సంఖ్య : 272
పుట : 182
రాగం : మాళవి

మాళవి

16 అంజినీదేవికొడుకు హనుమంతుఁడు
సంజీవినిదెచ్చినాఁడు సారె హనుమంతుఁడు

॥పల్లవి||

కలశాపురముకాడ కదలీవనాల నీఁడ
అలవాఁడె వున్నవాఁడు హనుమంతుఁడు
అలరుఁ గొండలకోనలందలిగుహలలోన
కొలువు సేయించుకొనీఁ గోరి హనుమంతుఁడు

|| అంజి||

పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతఁబట్టి
అసురలనెల్లఁ గొట్టీ హనుమంతుఁడు
వసుధఁ బ్రతాపించి వడిఁ దోఁక గదలించి
దెసలెల్లాఁ బాలించీ దివ్యహనుమంతుఁడు

|| అంజి||

వుద్దవిడి లంకచొచ్చి వుంగరము సీతకిచ్చి
అద్దివో రాము మెప్పించె హనుమంతుఁడు
అద్దుక శ్రీవేంకటేశు కటుబంటై వరమిచ్చి
కొద్ది మీర సంతోసాలే గుప్పీ హనుమంతుఁడు

|| అంజి|| 272

అవతారిక:

కలశాపురంలో వెలసిన హనుమంతునిపైచక్కటి కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. అంజినీదేవి కుమారుడైన ఈ రామబంటు సారెగా సంజీవని పర్వతం తీసికొని వచ్చాడు, అంటున్నారు. సారెగా అంటే పెట్టుబడిగా అని అర్థం చెప్పుకోవాలి. ఉద్ద విడి అంటే చాలా గొప్పగా అని భావించవచ్చును. ఈయన ఆయుధం ఏమిటో తెలుసా? ‘పండ్లగుత్తి’ అంటే ముళ్ళలాంటి పొలుసులున్న గద అన్నమాట. ఆయనతోక కదులుతున్నట్లు భావించగలిగిన ఈ పదకవితాపితామహుడు నిజంగా ధన్యజీవి

భావ వివరణ:

ఓ ప్రజలారా! అంజినీదేవి కుమారుడైన ఈ హనుమంతుడు, రామలక్ష్మణులను రక్షించుటకు సారెగా (పెట్టుబడిగా.. లేక… అర్పణగా) సంజీవినీ పర్వతము తీసికొని వచ్చినాడు.

అల (అదిగో) కలశాపురం అనే ఈ వూరిలో కదలీవనాల నీడ (అరటి తోటల చల్లని నీడలలో) వున్న వాడే హనుమంతుడు. ఈ మహానుభావుడు యెక్కడో కొండల కోనలలో వున్న గుహలో వెలసి, కోరి తన భక్తుల ద్వారా కొలువు చేయించుకొనినాడు. ఈ హనుమంతుడు ఈ రీతిని అలరుచున్నాడు.

పసలుగా (మృదువుగా) జంగవెట్టి (కాళ్ళఅంగజాచి), పండ్లగుత్తి (ముళ్ళవంటి పండ్లు వున్న గదను) చేతిలో పట్టుకొని రాక్షసులనందరినీ ఈ హనుమంతుడు చావబాదినాడు. దివ్యత్వముగల ఈ హనుమంతుడు, ప్రతాపించి (ప్రతాపమును చూపి) తనతోకను వడిన్ కదలించి (వేగముగా వూపి) పాలించీ, దెసలెల్లా (దిక్కులన్నీ ఏలుచున్నాడు).

ఆనాడు త్రేతాయుగంలో ఈయన యేమి చేశాడో తెలుసా? వుద్దవిడి (చాలా గొప్పగా) లంకలోకి చొచ్చి (దూరి) శ్రీరామముద్రికయైన వుంగరమును సీతాదేవికిచ్చి అద్దివో (అదిగో ఆయన శ్రీరామచంద్రుని మెప్పించినాడు. ఈనాడు కలియుగంలో, అటు (ఆ తిరుమల శిఖరాలపై) శ్రీవేంకటేశ్వరునకు బంటై తన భక్తులకు వరమిచ్చి కొద్దిమీర (అశేషముగా) సంతోషములను గుప్పించుచున్నాడు. ఈ స్వామిని సేవించి తరించండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Durasa Dukhamulaku Chetu In Telugu – దురాశ దుఃఖములకు చేటు

Durasa Dukhamulaku Chetu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీరామచరిత మానసము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దురాశ దుఃఖములకు చేటు నీతికథ.

దురాశ దుఃఖములకు చేటు

కైకయ రాజైన ప్రతాపభానుడు సద్గుణసంపన్నుడు మరియు గొప్పయోధుడు. అతని ప్రియసోదరుడు అరిమర్దనుడు. అరి మర్దనుడు మహాబలశాలి వీరుడు. ప్రతాపభానుని మంత్రి ధర్మరుచి. అతడు నీతజ్ఞుడు బుద్ధిమంతుడు రాజనీతిలో శుక్రుని తోటివాడు శ్రీహరి భక్తుడు రాజుకు హితైషి. దిగ్విజయయాత్రలో ఆ రాజు సప్తద్వీపాలనూ జయించి సమస్త భూమండలమునకు ఏకైకచక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి ప్రభావమువలన ఆ రాజు గురువులను దేవతలను సాధుసజ్జనులను పితరులను భూసురులను భక్తివిశ్వాసాలతో సేవించుచుండెడివాడు. రాజధర్మములను వేదోక్తముగా పాటిస్తూ నిత్యమూ అనేక దానధర్మాలు చేసేవాడు. పురాణేతిహాసములను భక్తిశ్రద్ధలతో వినేవాడు. ఎన్నో బావులు చెఱువులు ఉద్యానవనాలు దేవతా మందిరాలు కట్టించి ప్రజారంజకముగా రాజ్యపాలన చేసేవాడు.

వనాలలో ఆశ్రమములను నిర్మించుకొన్న మహర్షులు తమ తపశ్శక్తిలో ఆఱవభాగము రాజులకు ధారపోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధ ముగా రాజ్యపాలన చేయుచుందురు. కావున లోకహితైషులైన మహర్షులను క్రూరమృగములనుండి కాపాడంటం రాజుల విధి. ఒకసారి ప్రతాపభానుడు వింధ్యాటవికి శాస్త్రప్రకారము చంపదగిన మృగములను వేటాడుటకై వెళ్ళెను. ఆ సుందరారణ్యములో ఒక పెద్ద అడవిపందిని చూసి దానివెంటబడ్డాడు రాజు. ఆ వనవరాహము ఎంత ప్రయత్నించినా తనకి చిక్కలేదు. ఎంతో దూరం పరుగెత్తి ప్రవేశించుటకే దుర్గమమైన ఘనారణ్యములోకి వెళ్ళిపోయింది ఆ వరాహము. ధీరుడైన ప్రతాపభానుడు తనప్రయత్నం మానక ఆ దట్టమైన అడివిలోకి ఏకాకిగా ప్రవేశించాడు. చివరికి ఆ వరాహం ఒక గుహలోకి దూరింది. గుహలోకి వెళ్ళుటకు వీలులేక నిరాశతో ప్రతాపభానుడు వెనుకకు మఱలాడు. కాని ఆ ఘోరారణ్యములో దారితప్పిపోయాడు.

ఆ వనములో తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని నిర్మానుష్యమైన అడవిలో ఒక ఆశ్రమాన్ని కనుగొన్నాడు. ఆ ఆశ్రమము ఒక కపటసన్యాసిది. ఆ కపటవేషధారి పూర్వం ప్రతాపభానునిచే యుద్ధములో ఓడిపోయి పాఱిపోయిన శత్రురాజు. హృదయములో ప్రతాపభానునిపై ద్వేషమును నింపుకొని ఆ అడవిలో ఉంటున్నాడు. ప్రతాపభానుని చూడగానే అతనిని గుర్తు పట్టాడు. కానీ అలసిపోయి ఉన్న ప్రతాపభానుడు వాడిని గుర్తించలేదు! దాహముతో బాధపడుతున్న రాజుకు ఒక సరోవరం చూపించాడు. ప్రతాపభానుడు సరోవరములో స్నానముచేసి శుచి అయ్యి నీరు త్రాగినాడు. ప్రతాపభానుని ఆశ్రమములోపలికి ఆహ్వానించాడు ఆ కుహనాసన్యాసి.

“నాయనా! నీవెవఱు? ప్రాణాలకు తెగించి ఈ ఘోరాటవిలోకి ఎందులకు వచ్చావు”? అని అడిగినాడు కపటసన్యాసి. రాజనీతి తెలిసిన ప్రతాపభానుడిలా సమాధానమిచ్చినాడు “ఓ మహాత్మా! మీ సహాయమునకు కృతజ్ఞుడను. నేను ప్రతాపభానుడనే రాజు యొక్క మంత్రిని. వేటకై వచ్చి తప్పిపోయాను. నీ దర్శభాగ్యము కలుగుట నా అదృష్టము”. “ఓ సజ్జనుడా! బాగా చీకటి పడినది. నీ రాజ్యము ఇక్కడికి డెబ్బది యోజనములున్నది. కావున నీవు ఈ రాత్రికి నా ఆశ్రమములో విశ్రాంతి తీసుకుని తేపు వెళ్ళు” అని చెప్పాడు ఆ కపటుడు. సన్యాసి దయాగుణాలను ఎన్నో విధాల పొగిడి ఆ రాత్రికి అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు రాజు.

మాయమాటలతో రాజును తనను నమ్మేలా చేసి ఈర్షాగ్నితో కాలిపోతున్న ఆ కపట సన్యాసి నిర్మలుడైన ప్రతాపభానుడు ఆర్థించుటచే తన వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు “సోదరా! వినుము. నేనిచట చాలా కాలముగా ఉంటున్నాను. ఇంతవఱకూ నా వద్దకు ఎవరూ రాలేదు. నా గురించి నేనెవరికీ చెప్పుకోలేదు. లోపప్రతిష్ఠ తపస్సును దగ్ధముచేసే అగ్నివంటిది కాదా! అందుకనే ప్రపంచానికి దూరముగా ఉంటున్నాను. శ్రీహరితో తప్ప నాకింకెవరితోను పనిలేదు”. వైరాగ్యబుద్ధి కలిగి శ్రీహరిభక్తుడై ఉన్నాడని తెలియగానే ప్రతాపభానునికి ఆ బకధ్యానిమీద గౌరవం పెరిగిపోయింది. ప్రతాపభానుడు పూర్తిగా తన వశుడైనాడని తెలుసుకొని “పుత్రా! నా పేరు ఏకతనుడు.

సృష్టిప్రారంభములో నేను జన్మించాను. తరువాత మఱియొక దేహము దాల్చలేదు అందుకే నన్ను ఏకతనుడంటారు”. ఆశ్చర్యముగా వింటున్న ప్రతాపభానునికి అప్పుడు కపట సన్యాసి ఎన్నో ప్రాచీనగాథలు పురాణేతిహాసములు సృష్టిస్థితిలయములను గూర్చిన వింత వింత కథలెన్నో చెప్పాడు. జ్ఞానవైరాగ్యాల మీద వ్యాఖ్యానాలిచ్చాడు. ఇవన్నీ విని పరవశుడై రాజు “స్వామీ! నేను ప్రతాపభానుడను” అని చెప్పాడు. “రాజా! గురుకృపవల్ల నాకు అంతా తెలుసు. మీ తండ్రి పేరు సత్యకేతువు. నీ రాజనీతి మెచ్చుకుంటున్నాను. తెలియని వానితో పేరు చెప్పిన రాజ్యమునకే అపాయము అని తెలిసి నీవు ఇందాక నీ పేరు చెప్పలేదు. నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకొక వరమిస్తాను కోరుకో” అని అన్నాడు ఆ కపటసన్యాసి.

సద్గుణ సంపన్నుడైనా ప్రతాపభానునకు ఒక తీరనికోరిక ఉండేది. దురాశ అనే హాలాహలముచే బాధింపబడుతున్న ఆ రాజు ఇలా కోరాడు “ఓ దయాసాగరా! నా శరీరము జరామరణదుఃఖ రహితమగుగాక. యుద్ధములో నన్నెవరూ జయింపకుండు కాక. భూమిపై నూఱుకల్పములు నా ఏకచ్ఛత్రాధిపత్యము నిలిచియుండుగాక”. ధర్మరుచి ప్రభావము వలన తాను చేసే కర్మ అంతా శ్రీహరికి అర్పించి “సర్వం కృష్ణార్పణమ్” అని అంటున్నా ప్రతాపభానుడు ఆ సూక్తిలోని ఆంతర్యమును అర్థంచేసుకోలేదు. పూర్వం హరణ్యకసిపుడు కోరిన వరము వెలెనున్న ఈ దురాశాభూయిష్టమైన వరమును కోరినాడు. నిజమైన సన్యాసి అయితే ఈ కోరిక విని “నాయనా! ఈ శరీరము శాశ్వతము కాదు.

ఎందులకు దీనిమీద ఇంత మక్కువ? భగవద్భక్తి ఒక్కటే శాశ్వతము శ్రీహరిని శరణు వేడు” అని హితవు చెప్పేవాడు. కానీ కపటుడగుటచే ఆ సన్యాసి “తథాస్తు. నిన్ను సర్వప్రాణులనుండి కాపాడతాను. నా ప్రభావం వల్ల యముడు కూడా నీ దగ్గరకు రాలేడు. కానీ ఒక్క విప్రశాపం నుండి నేను నిన్ను రక్షించలేను” అని అన్నాడు. “గురూత్తమా! విపులను ప్రసన్నము చేసుకునే ఉపాయము దయతో నాకు నెలవీయ్యండి” అని ప్రార్థించాడు రాజు. “సరే. కానీ నీవీ విషయము చాలా రహస్యముగా ఉంచాలి. నన్ను కలుసుకున్నట్టు ఎవరితో నైనా చెపితే నీకు బహుదుఃఖములు కలుగుతాయి. నీ మంచి కోరే చెపుతున్నాను. మూడోకంటికి ఈ విషయము తెలిసిందా నీవు నశిస్తావు” అని అన్నాడు సన్యాసి.

“గురువర్య! త్రిమూర్తులు కోపగించినా గురు రక్షిస్తాడు కానీ గురువే కోపిస్తే రక్షించేవాడుండడు. మీ ఆజ్ఞ అతిక్రమించను. ఆజ్ఞ ఇప్పండి. శిరసావహిస్తాను” అని అన్నాడు ప్రతాపభానుడు. ఆహా! ఆశ ఎంత దారుణమైనది! ఇన్ని ఏండ్లుగా విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారాన్ని ప్రసాదించిన తన నిజగురువును ఒక్క నిమిషములో వదిలేసి కపట సన్యాసి గురించి ఏమీ తెలియకుండానే వాడిని నమ్మి “గురూత్తమా!” అని సంబోధించేలా చేసింది. అప్పుడు ఆ బకధ్యాని “విపులను స్వాధీనపఱచుటకు అనేక మార్గములు కలవు. నీకు అన్నిటికన్నా సులభ మార్గము చెప్పెదను. ఒక సంవత్సరముపాటూ ప్రతిరోజు లక్షమంది ఉత్తములైన విపులను కుటుంబసహితముగా అహ్వానించు. నేను నా తపశ్శక్తిచే మీ పురోహితుని వేషముదాల్చి వారికి వండిపెట్టెదను. ఇప్పుడు నీవు విశ్రాంతి తీసుకో. నా తపశ్శక్తిచే నిన్ను నీ అంతఃపురములో చేరుస్తాను. సరిగ్గా మూడు రోజుల తరువాత నీ పురోహితుని రూపములో నీకు దర్శనమిస్తాను. అన్ని ఏర్పాట్లు చేసివుంచు” అని అన్నాడు. రాజు ఎంతో సంతోషించి బాగా అలసిపోయినందు వలన గాఢనిద్రపోయాడు.

ఇంతలో కపటసన్యాసి స్నేహితుడైన కాలకేతు రాక్షసుడు వచ్చాడు. వాడే వరాహవేషము దాల్చి ప్రతాపభానుని దారిమఱల్చినాడు. స్త్రీలను సజ్జనులను దేవతలను హింసిస్తున్న కాలకేతు నూర్గురుకుమారులను పదిమంది సోదరులను యుద్ధములో చంపి దుష్టసంహారం చేశాడు. ప్రతాపభానుడు. దీనిని గుర్తుపెట్టుకుని అతనిపై ద్వేషం పెంచుకున్నాడు కాలకేతువు. కపటసన్యాసి కాలకేతువు కలిసి నాటకమాడి ప్రతాపభానుని నాశనం చేయదలచారు! కాలకేయుడు తన మాయతో ప్రతాపభానుని అంతఃపురంలో చేర్చి పురోహితుని ఒక గుహలో బంధించి తానే పురోహితునిగా కామరూపం ధరించాడు. తరువాతరోజు ప్రతాపభానుడు నిద్రమేల్కొని తాను అంతఃపురములో ఉన్న విషయము గ్రహించి ఆ కపటసన్యాసి శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. మూడురోజులు క్షణమొక యుగముగా గడిపినాడు. శ్రీహరి ధ్యానం వదిలి ప్రతిక్షణం ఆ కుహనాసన్యాసి పాదాలనే ధ్యానించసాగినాడు.

అనుకున్న ప్రకారం లక్షమంది ఉత్తమ విపులను ఆహ్వానించాడు ప్రతాపభానుడు. ఆ కుహనాపురోహితుడు తన మాయచేత లెక్కలేనన్ని వ్యంజనములు నాలుగురకాలైన పంటలను పాకశాస్త్రమును అనుసరించి షడ్రసోపేతముగా సిద్ధంచేసినాడు. కానీ వానిలో అనేకజంతువుల మాంసములేకాక బ్రాహ్మణులమాంసము కూడా కలిపి వడ్డించినాడు. భోజనార్ధము విప్పులు సిద్ధమగుతుండగా కాలకేతుడు ఆకాశవాణిని సృష్టించి “ఓ విప్రోత్తములారా! ఈ భోజనము హానికరము. దీనిలో జంతువిప్రు మాంసమున్నది. దీనిని భుజింపవద్దు” అని పలికించెను. ఆకాశవాణి వినగానే ఆ లక్షమంది విపులు “ఓ క్షత్రియాధమా! మమ్ము సపరివారముగా భృష్టులను చేయ తలచితివి. నీవు కుటుంబ సహితముగా రాక్షసుడవై జన్మించు. ఒక్క సంవత్సరములో నీవు నీవంశంతో సహా నశిస్తావు.

మీకు తిలోదకాలిచ్చెడివారు కూడా ఉండరు” అని ఘోరశాపాన్నిచ్చారు. తమయుక్తి సఫలమైనదని కాలకేతుడు కపటసన్యాసి సంతోషించారు. కపట సన్యాసి శత్రురాజులందఱిని కూడబెట్టుకోని ప్రతాపభానునిపై దండెత్తినాడు. వీరుడైన రాజు అరిమర్దనుడు ఎంతో కాలం వారితో యుద్ధం చేశారు. చివరికి ఒక సంవత్సరం తరువాత తన వంశముతో సహా ప్రతాపభానుడు నశించినాడు. కొలది కాలము తరువాత వారందఱూ రాక్షసులై జన్మించినారు. ప్రతాపభానుడు రావణునిగా అరిమర్దనుడు కుంభకర్ణునిగా ధర్మరుచి విభీషణునిగా జన్మించిరి. ఒకానొక కల్పములో శ్రీరామావతారమునకు ఇదియే నాంది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. మానవునకు ఆశ ఉండవచ్చు. కాని “అతి సర్వత్ర వర్ణతే”. సమస్త భూమండలానికి ఏకచ్ఛత్రాధిపతి అయికూడా ప్రతాపభానుడు కపట సన్యాసిని అడగరాని వరంకోరి చివరికి నాశనమైనాడు.
  2. మన శాస్త్రాలలో గురువుని ఎలా వెతకాలో వివరించారు. ఎంతో అన్వేషించి ఉత్తముడైన వానిని గురువుగా స్వీకరించాలి. ప్రతాపభానుడు తన దురాశ వలన ఒక్క రాత్రి పరిచయంతోనే కపటుని గురువుగా స్వీకరించాడు.
  3. బహిశ్శత్రువులైనా అంతశ్శత్రువులైనా (కామ క్రోధాదులు) హాని చేయకమానవు. కావున ఎల్లప్పుడూ అప్రమత్తులమై ఉండాలి. ప్రతాపభానుడు శత్రువులైన కాలకేతు కపటసన్యాసులను గమనించక వారిచేత మోసగించబడినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Chataka Pakshi Diksha In Telugu – చాతక పక్షి దీక్ష

Chataka Pakshi Diksha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చాతక పక్షి దీక్ష నీతికథ.

చాతక పక్షి దీక్ష

అది గ్రీష్మం. సూర్యుడు నడినెత్తిన ఉండి ఠీవిగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పిల్ల పక్షులతో ఒక తల్లి చాతకం గగనతలంలో ఎగురుతోంది. పసి చాతకాలు వేడిమికి తాళలేకపోతున్నాయి. తల్లి చాతకం నెలవు కోసం గాలిస్తోంది. నేల పై ఒక పెద్ద మఱి వృక్షం కనబడింది. దాని పేరు బొఱియలలో ఎలుకల చీమల పుట్టలు. తొఱఱ్ఱలలో పాములు. కొమ్మలు రెమ్మలు ఆశ్రయించి వందలాది పక్షులు. నేలమీదనున్న ఒక వృక్షమే ఇన్ని వేల ప్రాణులకు ఆశ్రయం ఇస్తే ఇక సాధన దీక్ష లక్ష్యం ఉన్న ఓ సజ్జనుడు ఎన్ని జీవులను తరింపచేయగలడు!

సామాజిక విలువ తేలిసో లేక సహజీవనం అనివార్యం అని గ్రహించో ఏమో ఆ వృక్షాన్ని కాపురమున్న పక్షి జంట పిల్లలు తమ తల్లితో “అయ్యో పాపం! వాటికి ఇల్లు లేదే” అన్నాయి. “ఇన్నాళ్ళకికదా మా జీవనం సార్థకమైనది. మేము పెంచిన పిల్లలు ఎదుటివారి కష్టాన్ని గుర్తించాయి” అన్న ఆనందంతో ఆ పక్షి జంట ఆ చాతక పక్షులను ఆహ్వానించాయి.

ఆశ్రయం కోసం వెతుకుతున్న చాతకాలకి ఆ ఆహ్వానం పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు. “ఈ వృక్షం మొదటి స్వాతి వాన చినుకులతోనేనా పుట్టినది?” అని అడిగి కాదు అని తెలుసుకోని ముందుకుసాగిపోతున్న ఆ చాతకాల దీక్ష చూసి విభ్రాంతిచెంది “ఔరా!” అని ముక్కున వ్రేలిడికొని చూశారా పిల్లలూ దీక్షా రూపం అని కళ్ళతోనే సైగచేసి బోధించింది తల్లి పక్షి పిల్లలకు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

చాతక పక్షులు మనకి దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను చూపినాయి. చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహమేసినా ఇంకేవీ త్రాగవు. ఈ స్వాభావిక గుణాన్ని విడువక కథలోని చాతకం కూడా మొదటి వాన చినుకులతో మొలకెత్తిన వృక్షం పైనే ఉండాలనుకున్నది.

హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః
కోకః కోకనద ప్రియం ప్రతిదినం చనం చకోరస్తథా |
చేతొ వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదం ॥

జగద్గురువులైన ఆది శంకరాచార్యులు ఒక భక్తుడు శివసాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తున్నాడు. హంస తామర తూళ్ళనే తింటుంది. అందుకనే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది. చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతుంది. అందుకే ఘనమేఘాలకై ఎదురుచూస్తుంది. చక్రవాక పక్షి జంటలు ప్రొద్దులలో జంటగా ఉంటాయి. రాత్రిళ్ళు విరహవేదనను అనుభవిస్తాయి. అందుకని చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షిస్తాయి. చకోర పక్షులకి కేవలం వెన్నెల ఆహారం. అందుకని చకోరాలు చంద్రోదయానికై పరితపిస్తాయి. అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు. అన్యములేవీ అతనికి అక్కరలేదు!

పుత్రోత్సాహం తల్లితండ్రులకు తమ పిల్లలు నలుగురికీ ఉపయోగపడ్డప్పుడు కాని పుట్టినప్పుడు కలుగదు అన్న సూక్తిని గుర్తుచేశాయి పక్షులు. తమ పిల్లలు ఎదుటివారి కష్టాలని చూసి “అయ్యో పాపం!” అని జాలిచూపినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆనందించారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Anjaneya Ashtottara Shatanamavali In Telugu – శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి

Sri Anjaneya Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి

  • ఓం ఆంజనేయాయ నమః
  • ఓం మహావీరాయ నమః
  • ఓం హనుమతే నమః
  • ఓం మారుతాత్మజాయ నమః
  • ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః
  • ఓం సీతాదేవీముద్రాప్రదాయ నమః
  • ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః
  • ఓం సర్వమాయావిభంజనాయ నమః
  • ఓం సర్వబంధవిమోక్తే నమః
  • ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
  • ఓం పరవిద్యాపరిహారాయ నమః
  • ఓం పరశౌర్యవినాశకాయ నమః
  • ఓం పరమంత్ర నిరాకర్యై నమః
  • ఓం పరమంత్రప్రభేదకాయ నమః
  • ఓం సర్వ గ్రహవినాశినే నమః
  • ఓం భీమసేనసహాయకృతే నమః
  • ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
  • ఓం సర్వయంత్రాత్మికాయ నమః
  • ఓం కపీశ్వరరాయ నమః
  • ఓం మహాకాయాయ నమః
  • ఓం సర్వరోగహరాయ నమః
  • ఓం ప్రభవే నమః
  • ఓం బలసిద్ధికరాయ నమః
  • ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయ నమః
  • ఓం కపిసేనానాయకాయ నమః
  • ఓం భవిష్వచ్చతురాననాయ నమః
  • ఓం కుమార బ్రహ్మాచారిణే నమః
  • ఓం రత్నకుండల దీప్తిమతే నమః
  • ఓం సంచలద్వాల సన్నద్ధలంబ
    మానశిఖోజ్వలాయ నమః
  • ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమః
  • ఓం మహాబలపరాక్రమాయ నమః
  • ఓం సర్వదుఃఖహరాయ నమః
  • ఓం సర్వలోక చారిణే నమః
  • ఓం మనోజవాయ నమః
  • ఓం పారిజాత మూలస్థాయ నమః
  • ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
  • ఓం ప్రతాపవతే నమః
  • ఓం వానరాయ నమః
  • ఓం కేసరీసూనవే నమః
  • ఓం సీతాశోకనివారకాయ నమః
  • ఓం అంజనాగర్భసంభూతాయ నమః
  • ఓం బాలార్కసదృశాననాయ నమః
  • ఓం విభీషణ ప్రియకరాయ నమః
  • ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
  • ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః
  • ఓం వజ్రకాయాయ నమః
  • ఓం మహాద్భుతాయ నమః
  • ఓం చిరంజీవినే నమః
  • ఓం రామభక్తాయ నమః
  • ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
  • ఓం అక్షహంత్రే నమః
  • ఓం కాంచనాభాయ నమః
  • ఓం పంచవక్రాయ నమః
  • ఓం మహాతపసే నమః
  • ఓం లంకినీభంజనాయ నమః
  • ఓం శ్రీమతే నమః
  • ఓం సింహికా ప్రాణ భంజనాయ నమః
  • ఓం గంధమాదనశైలస్థాయ నమః
  • ఓం లంకాపురవిదాహకాయ నమః
  • ఓం సుగ్రీవసచివాయ నమః
  • ఓం ధీరాయ నమః
  • ఓం సూరాయ నమః
  • ఓం కారాగృహవిమోక్రై నమః
  • ఓం శృంఖలాబంధమోచకాయ నమః
  • ఓం సాగరోత్తరకాయ నమః
  • ఓం ప్రాజ్ఞాయ నమః
  • ఓం రామదూతాయ నమః
  • ఓం పింగళాక్షాయ నమః
  • ఓం పూజితాయ నమఃనమః
  • ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః
  • ఓం విజితేంద్రియాయ నమః
  • ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
  • ఓం మహారావణమర్దనాయ నమః
  • ఓం స్ఫటికాభాయ నమః
  • ఓం వాగధీశాయ నమః
  • ఓం నవవ్యాకృతిపండితాయ నమః
  • ఓం చతుర్భాహవే నమః
  • ఓం దీనబంధవే నమః
  • ఓం మహాత్మనే నమః
  • ఓం భక్తవత్సలాయ నమః
  • ఓం సంజీవననగాహర్రె నమః
  • ఓం శుచయే నమః
  • ఓం వాజ్మినే నమః
  • ఓం దృఢవ్రతాయ నమః
  • ఓం కాలనేమి ప్రమథనాయనమః
  • ఓం హరిమర్కట మర్కటాయ నమః
  • ఓం దాంతాయ నమః
  • ఓం శాంతాయ నమః
  • ఓం ప్రసన్నాతనే నమః
  • ఓం శతకంఠమదాపహృతే నమః
  • ఓం యోగినే నమః
  • ఓం రామకథాలోలాయ నమః
  • ఓం చైత్యకులాంతకాయ నమః
  • ఓం సురార్చితాయ నమః
  • ఓం మహాతేజసే నమః
  • ఓం రామ చూడామణిప్రదాయ నమః
  • ఓం కామరూపిణే నమః
  • ఓం లోకపూజ్యాయ నమః
  • ఓం పార్ధధ్వజాగ్రసంవాసినే నమః
  • ఓం శరపంజర భేదకాయ నమః
  • ఓం దశబాహవే నమః
  • ఓం సీతాన్వేషణపండితాయ నమః
  • ఓం వజ్రదంష్ట్రాయ నమః
  • ఓం వజ్రనఖాయ నమః
  • ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః
  • ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర
    వినివారకాయ నమః
  • ఓం జాంబవత్రీతి వర్ధనాయ నమః
  • ఓం సీతాసమేత శ్రీ రామ పాద సేవా
    దురంధరాయ నమః

శ్రీఆంజనేయ నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి॥

మరిన్ని అష్టోత్తరములు