Sri Mallikarjuna Prapatti In Telugu – శ్రీ మల్లికార్జున ప్రపత్తిః

Sri Mallikarjuna Prapatti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మల్లికార్జున ప్రపత్తిః గురించి తెలుసుకుందాం…

Sri Saila Mallikarjuna Prapatti In Telugu Lyrics

శ్రీ మల్లికార్జున ప్రపత్తిః

జయ జయ జయ శంభో ! జంభభిత్పూర్వదేవ
ప్రణతపదసరోజద్వంద్వ ! నిర్ద్వంద్వ ! బంధో !
జయ జయ జయ జన్మస్థేమసంహారకార !
ప్రణయసగుణమూర్తే ! పాలయాస్మాన్ ప్రపన్నాన్.

టీక. శంభో! = ఓ శంకర! జంభభిత్ = ఇంద్రుఁడు, పూర్వదేవ = రాక్ష శులు మొదలగువారిచేత, ప్రణత = నమస్కరింపఁబడిన, పదసరోజిద్వంద్వ = పాదపద్మమాల జంటగలఁవాడా! నిర్ద్వంద్వ = ద్వంద్వభావము లేనివాఁడా!బంధో! = ఆపద్బాంధవుఁడా! జయ, జయ, జయ! = ముమ్మాటికి నీకు జయమగుఁగాక ! జన్మమ సంహారకార! = జన్మస్థితిలయకార = కుఁడైనవాఁడా! ప్రణయ సగుణమూర్తే! = భక్తియే గుణముగాఁగల మూర్తీ! జయ, జయ, జయ = ముమ్మాటికి జయము నొందుమ!, ప్రశన్నాన్ = నిన్ను శరణన్న, ఆస్మాన్ = మమ్ము, పాలయ= పరిపాలిం పుము !

తా. దేవాసురులచే నమస్కరింపఁబడు పాదపద్మయుగళము గలవాఁడా! అద్వైతమూర్తి ! ఆపద్బాంధవ! జన్మస్థితి లయ కారక ప్రపన్నులమగు మమ్ము పాలింపుమ ! నీకు జయ మగుఁ గాక !

వధూముఖం వల్గదపాంగరేఖం
అఖండితానందకరప్రసాదమ్,
విలోకయన్ విస్ఫురదాత్మభావ
స్స మే గతిశ్శ్రీగిరిసార్వభౌమః.

టీక. వల్గదపొంగరేఖం = ఏటవాలుగనున్న క్రీగంటి రేఖలఁ గలిగినట్టిదగ్గు, వధూముఖం = తన కాంతాముఖమును, అఖండితానందకర ప్రసాదం = అమితానందానుగ్రహము గలుగునట్లుగా, విలోకయన్ = చూచుచు, విస్ఫురదాత్మభావః = ప్రకాశించు నాత్మస్వరూపముగానున్న, సః = ఆ, శ్రీగిరిసార్వభౌమః = శ్రీశైలసార్వభౌముఁడైన శివుఁడు, మే = నాకు, గతిః = దిక్క గుఁగాక !

తా. క్రీఁగన్నులఁజూచుచున్న ఆత్మకాంతాముఖము నమితా నందానుగ్రహములతోఁ జూచుచు నాత్మస్వరూపియై ప్రకాశించు నా మల్లికార్జున ప్రభువు నాకు గతియగుఁగాక!

కురంగపాణిః కరుణావలోకః
సురోత్తమశ్చంద్రకళావతంసః,
వధూసహాయస్సకలేష్టదాతా
భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః.

టీక. కురంగపాణి = లేడిని చేతియందుఁగలవాఁడును, కరుణావలోకః = దయా వీక్షణములు గలవాఁడును, సురోత్తమః = దేవతలలో నుత్తముఁడును, చంద్రకళావతంసః = చంద్రకళను శిరోమణిగ ధరించినవాఁడును, వధూసహాయః = వామభాగార్ధమున నాఁడుతోఁడుగలవాఁడును, అగు, అసౌ = ఈ, శ్రీగిరిభాగ్యరాశిః = శ్రీశైలేశ్వరుఁడు, సకలేష్టదా = సమస్తాభీష్టము లిచ్చువాఁడు, భవతి = అగుచున్నాఁడు.

తా. దేవోత్తముఁడు నర్ధనారీ రూపుఁడగు చంద్రకళాశేఖరుడు తేడి నొకచేతథరించి దయారస మొలుకు చూపులతో నీ శ్రీశైల వాసుఁడుగా నుండెను, అట్టి యీ దేవుఁడు మాకు సకలాభీష్టము లొసఁగుగాక !

Sri Saila Mallikarjuna Prapatti In Telugu

సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్,
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున  మహాలింగం శివాలింగితమ్.

టీక. సంధ్యారంభ = సంధ్యానట నారంభ సమయమునందు, విజృంభితమ్ = ప్రకటితమైనట్టియు; శ్రుతిశిరస్థాన = ఉపనిషత్ప్రదేశములయొక్క, అంతర = నడుమ, ఆధిష్ఠితం = నిండియున్నట్టియు, సప్రేమ = ప్రీతితో గూడిన, భ్రమరా = భ్రమరాదేవితో, అభిరామం = మనోహరమైనట్టియు, అసకృత్ = మాటిమాటికి, సద్వాసనా = సువాసనచే, శోభితం = ప్రకాశించునట్టియు, భోగీంద్రాభరణం = సర్పరాజాభరణముల గల్గినట్టియు, సమస్తసుమనఃపూజ్యం = పండితుఅందఆకు (ఎల్లదేవతలకు) పూజ్యం = పూజింపఁజగినట్టియు, గణావిష్కృతమ్ = సత్త్వరజోగుణ ములచేఁ బ్రకటిత మైనదియు, శివాలింగితం = పార్వతిచే నాలింగితమైన, శ్రీశైలమల్లికార్జున మహాలింగం = శ్రీ శైలమల్లికార్జున మహాలింగమును, సేవే = సేవించుచున్నాను.

తా. సంధ్యానటన విజృంభితమును, ఉపనిషత్సం వేద్యమును, భ్రమరాంబా ప్రేమాభిశోభితమును, సగుణనిర్గుణోపేతమును, శేషాహిభూషితమును, సర్వదేవతాపూజ్యమును పార్వతీప్రియమైన శ్రీగిరి మల్లికార్జున లింగమును నేను. సేవించుచున్నాను.

యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ
వ్యక్తాత్మా పరిపాలనాయ జగతామాప్తావతారస్థితిః,
దుష్టధ్వంస-సదిష్టదానవిధయే నానాసనాధ్యాసినీ
శ్రీశైలాగ్రనివాసినీ భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ.

టీక. యా = ఏ దేవి, సచరాచరస్య = స్థావరజంగమాత్మకమైన, జగతః = ప్రపంచమానకు, మూలం = ప్రథానమైనదో (ప్రకృతియైనదో) పుంసః = ఆదిపురషుఁడైన యీశ్వరునకు, పురాణీ = ప్రాచీనమైన, సఖీ = చెలికత్తియయో, వ్యక్తాత్మా = ఆకారముతోఁ బ్రకటితమైనదో, జగ తాం = లోకములయొక్క, పరిపాలనాయ= రక్షణమకొఱకు, ఆప్తావ తారస్థితిః = పొందఁబడిన జన్మలంగలదో, దుష్టధ్వంస = దష్టులనాశ మొనర్చిట, సత్ = నుఁచివారలకు, ఇష్టదాన = అభీష్టములిచ్చుటయను, విధయే = పనికొఱకు, నానాసనాధ్యానినీ = శ్రీ గిరిశిఖరమున నివసించిన, భ్రామరీ = ఆ భ్రమరాఁబిక, మే నాకు, మే నాకు, శ్రేయస్కరీ = మంగళప్రదురాలు, భవతు = ఆగుఁగాక !

తా. ఏ దేవి చరాచరజగత్తున కంతటికి మూలప్రకృతియో, పురాణపురుషుఁడై న యీశ్వరునకే దేవి పట్టపురాణియో, లోకుల సనుగ్రహింప నేదేవి రూపమును ధరించినదో, దుష్ట సంహారము, శిష్టరక్షణ మొనర్చుచు సర్వాభీష్టములను భక్తుల కనేక స్థలములనుండి యొసంగుచున్నదో ఆ శ్రీగిరి భ్రమరాఁబిక నాకు శుభప్రదురాలగుఁగాక !

యత్తేజః పరమాణురేతదఖిలం నానాస్ఫురన్నామభిః
భూతం భావి భవచ్చరాచరజగద్ధత్తే బహిశ్చాంతరే,
సా సాక్షాత్ భ్రమరాంబికా శివసఖీ శ్రీశైలవాసోత్సుకా
దిశ్యాదాశ్రితలోకకల్పలతికా శ్రేయాంసి భూయాంసి నః.

టీక . ఏతత్ = ఈ, ఆఖిలం = సమస్తజగత్తు, యత్తేజః పరమాణుః = ఏ దేవి యొక్క తేజో రూపపరమాణువో, ఏతత్ = ఈ భూతం, భావి, భవత్ = జరిగినది (పుట్టినది) భావి = పుట్టఁబోవుంది, భగత్ = జరుగుచున్న, చరాచరజగత్ = స్థావరజంగమాత్మళమగు ప్రపంచమును నానాస్ఫురన్నా మభిః = తేజోవంతములగు ననేక నామములతో, ఆంతరే = లోపలను, బహిశ్చా = వె· పలను, ధత్తే = ఏ దేవి ధరించుచున్నదో, సా = ఆ, శివసఖీ = శివప్రియము, శ్రీ శైలవాసోత్సుకా = శ్రీ శైలశిఖర వాసమందు వేడ్కఁ గలదియు, ఆశ్రితలోక కల్పలతికా = ఆశ్రితజనమునకుఁ గల్పవృక్షమువంటిదైన, సాక్షాత్ప్రమరాంబికా = ప్రత్యేక్ష భనురాంబిక, సః = మాకు, భూయాంని = అనేకములగు, శ్రేయాంసి = శుభములను, దిశ్యాత్ = ఇచ్చునుగాక !

తా. ఏ జగదంబికయొక్క తేజోవిశేషమే యీ చరాచర ప్రపంచరూపమో, భూత భవిష్య ద్వర్తమాన సర్వ ప్రపంచము నేదేవి యనేకరూప నామములతో ధరించుచున్నదో, ఆ శ్రీశైలవాసిని యగు భ్రమరాంబిక మాకు శుభము లొడఁ గూర్చుఁగాక !

శరణం తరుణేందుశేఖరశ్శరణం మే గిరిరాజకన్యకా,
శరణం పునరేవ తావుభౌ శరణం నాన్యదుపైమి దైవతమ్.

టీక. మే = నాకు, తరుణేందుశేఖరః = బాలచంద్ర శేఖరుఁడు, శరణం = రక్షకుఁడు; గిరిరాజకన్యకా = హిమవత్పు తియగు పార్వతి, మే = నాకు, శరణం = రక్షణము. తౌ = ఆ, ఉభౌపునః = పార్వతీపరమేశ్వరు : లిరువురును, శరణ మేవ = రక్షకులేయగుదురుగాక! ఆన్యత్ = ఇతరమగు, (ఈ పార్వతీపర మేశ్వరులకంటే) దైవతం = దైవమును, శరణం = రక్షణను, నోప్రేమి = పొందను,

తా. నాకా చంద్రకళావతంసుఁడు, శ్రీగిరి భ్రమరాంబికయు రక్షకులగుదురు గాక! ఆ యుభయమునకున్న నితరదైవ మెద్దియు నాచే శరణ మనఁబడ కుండుఁగాక!

మరిన్ని ప్రపత్తులు:

Bharatuni Katha In Telugu – భరతుని కథ | శ్రీమద్భాగవతం లోని కథ

Bharatuni katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భరతుని కథ.

భరతుని కథ

శ్రీ హరి అంశతో పుట్టిన భరతుడు కణ్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపినాడు. వనమే అతని క్రీడారంగం మృగాలే అతని స్నేహితులు. ఆ బలశాలి సింహం పిల్లలతో ఆటలాడే వాడు! ఆ పసివాడి బలపరాక్రమాలు చూచి ఆశ్చర్యచకిత అయ్యేది తల్లి శకుంతల. స్వయంగా కణ్వమహర్షే భరతునికి జాతక కర్మలు చేసి విద్యాబుద్ధులు నేర్పినాడు. కుమారుడైన భరతుని తీసుకుని కణ్వ మహర్షి అనుజ్ఞపై ఆ సాధ్వి దుష్యంతుని వద్దకు వెళ్ళింది.

రాజు యొక్క జీవతం కత్తిమీద సాము వంటిది. అతడు ఏది చేసినా ప్రజల హితం కోరి వారి ఆమొదంపైనే చేయాలి. శకుంతల భరతుని తీసుకొని వచ్చి ఈతడే నీ వారసుడు అని చూపినది. ఆ విషయం నిజం అని తనకి శకుంతలకి కణ్వమహర్షికే తెలుసు. అది ప్రజులకు విశ్వసనీయమైన రీతిలో తెలియ చేయాలని తలచి ఆ ధర్ముడే రక్షిస్తాడని నమ్మి ఏమనక ఊరకున్నాడు దుష్యంతుడు. అప్పుడు ధర్మాత్ముడైన దుష్యంతుని కరుణించి ఆకాశవాణి అందఱికీ తెలిసే లాగా స్పష్టంగా ఈ భరతుడే దుష్యంతుని పుత్రుడు కాబోవు చక్రవర్తి అని చెప్పినది. ఆ వాక్కు విని దుష్యంతుడు శకుంతల సంతసించి పుత్రినికి పట్టాభిషేకం చేసి ఐహిక విషయాల మీద మనసు పెట్టక తపోవనాలకు వెళ్ళిపోయారు.

భరతుడు సమర్థమైన తన భుజస్కంధాలపైన ఈ భూభారాన్నంతా నిలిపి ధర్మపాలన చేశాడు. ధర్మస్థాపన కోసమే యుద్ధం చేసేవాడు. తన దిగ్విజయ యాత్రలో సనాతన ధర్మానికి విరుద్ధమైన శక కబర బర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛ దేశాల రాజులను అణచాడు. పాతాళంలో దేవతాస్త్రీలను చెఱబెట్టిన రాక్షసులను శిక్షించి ఆ స్త్రీలను వారి భర్తలకు అప్పగించినాడు. త్రిపురరాక్షసులను జయించి దేవతలను వారి వారి పదవులయందు నిలబెట్టినాడు. సత్యం శౌచం దయ తపస్సు స్థిరంగా భరతుని రాజ్యంలో ఉండటంతో ప్రకృతి సహజంగా జనాలు కోరినవన్నీ ఇచ్చేది.

ఈ భూమండలం అంతా భరతుని పాలనలో ఉన్నా కర్మ భూమి అయిన ఈ భరతఖండంలోనే అన్ని యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేశాడు. దీర్ఘతపుడను మర్షిని పురోహితునిగా చేసుకుని యమునా తీరమునందు 78 అశ్వమేధయాగాలు చేశాడు. గంగాతీరం పొడుగునా 55 అశ్వమేధాలు చేసి దేవేంద్రుని అతిశయించిన వైభవంతో శోభించినాడు.

పదమూడువేల యనభైనాలుగు పాడి ఆవుల మందను ద్వంద్వం అంటారు. అట్టి వేయి ద్వంద్వాలను దూడలతోపాటు బంగారముతో గిట్టలు కొమ్ములు అలంకరించి బాగా పండితులైన వేయి మంది విప్రోత్తములకి దానం చేశాడు. బంగారు నగలతో శోభించేవీ తెల్లని దంతాలు కలవీ అయిన పధ్నాలుగులక్షల నల్లని ఏనుగులను మష్కారతీర్థం ఒడ్డున దాన మిచ్చినాడు!

కుబేరునితో సమానమైన సంపద సాటిలేని శౌర్యం దేవేంద్రునితో సమానమైన విభవం మహర్షులతో సరితూగే తపశ్శక్తి ఉండికూడా భరతుడు ఎన్నడూ గర్వించక అర్థశరీరాలు తృణప్రాయంగా భావించి శాంతికాముకుడై భగవత్భక్తితో జీవించాడు. ఈ విధముగా ఇరవైయేడువేల యేండ్లు రాజ్యపాలన చేసినాడు. ఈ భరతుని సంతతి వారము కనుక మనం భారతీయులం అయ్యాము.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

ఒక మనిషి నిజంగా మనస్సుపెట్టి ధర్మబుద్ధితో పరిశ్రమ చేస్తే దేవతలనే మించిన మహామనీషి అవుతాడని భరతుడు మనకు నిరూపించాడు. అతడు తన బలపరాక్రమాలను ఉపయోగించి యుద్ధములలో విజయుడై భూమండలం అంతటా ధర్మస్థాపన చేశాడు. ప్రజల హితార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. నభూతో నభవిష్యతి అనే రీతిలో ఎన్నో దాన ధర్మాలు చేసి యశశ్వి అయ్యాడు.

భారతీయుల ఆధ్యాత్మ చింతన ఈ కథలో మనకు తెలిసింది. దుష్యంతుడు శకుంతల అన్ని ఐశ్వర్యాలను రాజభోగాలను పుత్రపౌత్రాది ఆకర్షణను త్యజించి తపోవనాలకి వెళ్ళి తపస్సు చేసుకొన్నారు. అలాగని కర్తవ్యాన్ని విస్మరించకుండా ఎంతో కాలం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసి కర్తవ్యం పూర్తి చేసుకొని ఆ తరువాతే వానప్రస్థం స్వీకరించారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Shuchilenidi Satpurusha Darsanam Labhinchadu In Telugu – శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు

Shuchilenidi Satpurusha Darsanam Labhinchadu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు కథ. 

శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు

వేదప్రవర్తకుడైన పైలమహర్షికి ఉదంకుడను ఉత్తమ శిష్యుడుండెడివాడు. అతడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సంపన్నుడు. గురుదేవతా అనుగ్రహం వలన అణిమాద్యష్టసిద్ధులు జ్ఞానము పొందిన మహానుభావుడు ఉదంకుడు.

ఒకరోజు గురుపత్ని అతనికి ఒకకార్యమును అప్పచెప్పినది “నాయనా! మనదేశ మహారాజైన పౌష్యుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మపత్ని ఉత్తమురాలు. ఒక వ్రతము చేయటానికి నాకు ఆ సాధ్వి కుండలాలు కావాలి. ఆమెను అర్థించి అవి తీసుకొనిరా”. గురుపత్ని ఆజ్ఞను శిరసావహించుటకై ఉదంకుడు వెంటనే ధర్మాత్ముడైన పౌష్యమహారాజు వద్దకు బయలుదేరినాడు. దారిలో అరణ్యమార్గములో వెళుతుండగా ఒక మహావృషభము మీదనున్న దివ్యపురుషుని చూచినాడు. అతడు సూర్యుని వలె వెలిగిపోతున్నాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునికి అనుగ్రహముతో పవిత్రమైన గోమయమును ఆరగించుటకు ఇచ్చెను. అమృతప్రాయమైన గోయమును భుజించి గురుపత్ని ఆజ్ఞ త్వరగా నెరవేర్చుటకై ఆ మహాపురుషుని వద్ద సెలవు తీసుకొని పౌష్యుని రాజ్యమును చేరుకున్నాడు.

పౌష్యుడు ఉదంకునికి యథావిధి సత్కారాలు చేసి రాకకు కారణమేమియో తెలుపుమని ఉదంకుని ప్రార్థించినాడు. ఉదంకుడు తన గురుపత్నిగారి ఆజ్ఞను రాజుకు తెలిపినాడు. “ఆహా! లోకశ్రయస్సును కోరే మీవంటి తాపసులను సేవించుటకంటే అదృష్టమేమున్నది? మహానుభావా నా రాణి వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పి కుండలములను తీసుకొనుము” అని పౌష్యుడు చెప్పినాడు. వెంటనే ఉదంకుడు మహారాణిగారి మందిరమును చేరుకున్నాడు. కానీ ఆయనకు ఎక్కడా పౌష్యరాణి కనబడలేదు! తరిగివచ్చి “రాజా! నాకు మహారాణి కనబడలేదు. నీవే ఆ కుండలములను తెప్పించి ఇవ్వు” అని అడిగినాడు.

అప్పుడు పౌష్యమహారాజు ఇలా అన్నాడు “భూవినుత! నీవంటి త్రిభువన పావనుని అశుచివి అని ఎట్లా అనగలను? నా రాణి మహాపతివ్రత కావున అశుచులకు కనబడదు”. ఉదంకుడు ఎందులకు తనకు అశుచి వచ్చినదో ఆలోచించినాడు. తాను గురుపత్నీ కార్యమును త్వరగా పూర్తిచేసే తొందరలో ఆ మహాపురుషుడు ఇచ్చిన గోమయాన్ని భుజించిన తరువాత ఆచమించలేదని గుర్తుకు వచ్చినది. వెంటనే కాళ్ళూ చేతులు అన్ని కడుక్కుని కేశవ నామాదులతో ఆచమనము చేసి శిచియై మహారాణి అంతఃపురమునకు వెళ్ళినాడు. అక్కడ యథాస్థానములో మహారాణిని చూసి ఆమె పాతివ్రత్య మహాత్మ్యమునకు ఆశ్చర్యపోయి “మహారాణీ! మా గురుపత్ని వ్రతార్థము మీ కుండలములు కోరి వచ్చినాను” అని ప్రార్థించినాడు. ఆ పతివ్రతామతల్లి తన కుండలములు ఇట్టి తాపసులకు ఉపకరిస్తున్నాయని సంతోషించి ఉదంకునకు కుండములను ఇచ్చి పంపివేసినది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

శుచిత్వము సత్పురుషుల సందర్శనమునకు ప్రథమ సోపానము. ఉదంకుడు భోజనము తరువాత తొందరలో ఉండి కాళ్ళుకడుక్కుని ఆచమించనందున ఎంతగొప్పవాడైనా ఆయనకు పతివ్రత అయిన పౌష్యరాణి కనబడలేదు. కావున మనమన్ని వేళలా ముఖ్యముగా సత్పురుష, దైవ సందర్శనమునకు వెళ్ళునప్పుడు శుచిగా ఉండవలయును. ఇదే కారణముగా అర్జునుడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రప్రయోగమునకు ముందు శుచులై మంత్రప్రయోగము చేసినారు (ద్రౌపదీదేవి కథ చూడండి). బకాసురుని యుద్ధమునకు ముందు భీమసేనుడు ఆహారము భుజించి శుచిఅయ్యి తరువాతనే యుద్ధముచేసినాడు (బకాసురవధ కథ చూడండి). అవంతీరాజు, విక్రమార్కుడు పుష్కరిణిలో స్నానము చేసిన తరువాతనే కాళీ ఆలయములోకి ప్రవేశించినారు (విక్రమార్కుని కథ చూడండి).

మరిన్ని నీతికథలు మీకోసం:

Bhumilona Gottalaya Butrotsava Midivo In Telugu – భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో

భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
సంఖ్య : 17
పుట: 12
రాగం: రామక్రియ

రామక్రియ

77 భూమిలోనఁ గొత్తలాయఁ బుత్రోత్సవ మిదివో
నేమపు కృష్ణజయంతి నేఁడే యమ్మా

||పల్లవి||

కావిరి బ్రహ్మాండము కడుపులోనున్నవాని
దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని
యీవల వసుదేవుఁడు యెట్టు గనెనమ్మా.

||భూమి|||

పొడవుకుఁ బొడవైన పురుషోత్తముఁడు నేఁడు
అడరి తొట్టెలబాలుఁడాయ నమ్మ
వుడుగక యజ్ఞ భాగమొగి నారగించేవాఁడు
కొడుకై తల్లిచన్నుగుడిచీనమ్మా.

||భూమి||

పాలజలధియల్లుండె(డై?) పాయకుండేయీతనికి
పాలవుట్లపండుగ బాఁతే (తా?) యనటే
ఆలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి
పేలరియై కడు పెచ్చుపెరిగీనమ్మా

||భూమి||17

అవతారిక:

శ్రీకృష్ణజయంతి పర్వదినాన అన్నమాచార్యులవారు వినిపించిన కీర్తన ఇది. “ఓ అమ్మలారా! మనం అంతా నియమంతో జరుపుకొనే కృష్ణజయంతి వేడుక నేడు నందుని ఇంట పుత్రుడుదయించాడనె వుత్సవం భూమిపై ప్రతియేడూ జరుపుకొంటున్నా అది యెప్పటికప్పుడు కొత్తలాయె” అంటున్నారు అన్నమాచార్యులవారు. ఆ అల్లరి కృష్ణుడు శ్రీవేంకటాద్రిపై ఆటలాడుట మరిగిపేలరియై కడుపెచు పెరిగీనమ్మా! అంటున్నారు. అంటే యేమిటి? ‘పేలరి’ అంటే వదరుబోతు అని అర్థం. వాగుడుకాయ అన్నమాట. మరి “బాత్రేయనటే” అంటే….?

భావ వివరణ:

ఓ అమ్మలారా! ఇదివో ఈ పుత్రోత్సవము (పుత్రుని పుట్టుక సందర్భంగా చేయు పండుగ) భూమిపై కొత్తలాయ (ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది). నేడే అట్టి కృష్ణజయంతి. ఇది నేమపు పండుగ (నియమం ప్రకారం జరిపే పండుగ).

కావిరి బ్రహ్మాండము (అనంత నిశీధిలో యెడతెగక విస్తరించే విశ్వము) తన బొజ్జలో దాచుకొన్న ఈ విశ్వరూపుని కంసుడి చెల్లెలు దేవకీదేవి తన గర్భమున మోసిందమ్మా! అద్దిర! (అదిరా… ఎంతంటే) దేవతలంతా త్రిభువనాలు వెదకినా కనబడని ‘పరమాత్మ’ యీ యాదవరాజు వసుదేవుడికి యెట్లా కనుపించాడో కదా!

ఆ దేవదేవుని లీలలు చెప్పలేమమ్మా!

పొడవుకు బొడవైన (ఉన్నతోన్నతుడైన ఈ పురుషోత్తముడు నేడు, అడరి (అతిశయించి) తొట్టెలో బాలుడు (ఉయ్యాలలో శిశువు) యైనాడమ్మా! ఈ ప్రపంచంలో యెక్కడ యే యజ్ఞం జరిగినా ఆ యజ్ఞభోక్త (యాగఫలములో మొదటిభాగం ఈయనకే అర్పిస్తారు. దానిని ఆయన వుడుగక (వదలక) నారగించీ (స్వీకరిస్తాడు). అట్టి యజ్ఞపురుషుడు, కొడుకై చనుబాలుత్రాగుతున్నాడే… ఆహా! ఏమిఈ పరమాత్ముని లీల.

ఈయన యెవరో తెలుసునటే? క్షీరసాగరునికి స్వయంగా అల్లుడు. పైగా ఆయన నివాసస్థానంకూడ పాలసముద్రమే. అటువంటి వాడికి పాలవుట్లు తెంచేపండుగ ‘బాతేయనటే’ (ప్రేమకలిగిందటనే?) ఎంతెంత మనం పండుగ చేసికొంటే అదే ఆయనకు పండుగ. ఇవన్నీ ఆవిశ్వాత్మునికెందుకమ్మా? నేడు ఈ తిరుమలలో ఆలరి (అల్లరిపిల్లవాడే) శ్రీవేంకటాద్రిపై ఆటలాడమరగినాడు. పేలరియై (అతివాగుడుకాయయై) ఈ పిల్లవాడు కడుపెచ్చుపెరిగీనమ్మా (తెగ విజృంభిస్తున్నాడమ్మా!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Bhaktha Puramdaradasu Katha In Telugu – భక్త పురందరదాసు కథ

Bhaktha Purandaradasa Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భక్త పురందరదాసు కథ. 

భక్త పురందరదాసు కథ

పూర్వం విక్రమార్క శకం 16వ శతాబ్దములో నవనిధి శ్రీనివాసనాయకుడనే గొప్పధనవంతుడు ఉండేవాడు. అతడు పరమ లోభి. భార్య సరస్వతీబాయి భక్తురాలు దానగుణశీలి. పతియే ప్రత్యక్షదైవమని నమస్కరించిన ఆ సాధ్వితో శ్రీనివాసనాయకుడిలా అనేవాడు “ఏమని ఆశీర్వదించను? అంకా దానధర్మాలు చేయమనా?” “స్వామీ! మీ ఆనుజ్ఞ తీసుకునే నేనీ వ్రతము ఆచరించితిని కదా!” అని బదులిచ్చిన భార్యతో “ఆ! ఆ! పొందితివి పొందితివి. తులసీపూజయే కదా ఖర్చు ఉండదులే అనుకున్నాను. కాని ఆ పేరుతో దంపతి పూజలు దానాలు ఒక్కటేమిటి అన్నీ చేశావు. నీ సుపుత్రుడు వరదుడు లెక్క చూపిన తరువాతే నాకీ విషయం తెలిసింది. నువ్విలాంటి నాగులు వ్రతాలు చేస్తే చాలు మనమందఱము తలకొక జోలె పట్టుకోవలసి వస్తుంది” అని అనేవాడు శ్రీనివాసనాయకుడు.

“రామ! రామ! అట్లా అనకండి. భగవంతుడు మనకు ఇచ్చినప్పుడే దానాదులు చేయకుంటే లేనప్పుడీయ గలమా”? అని సత్యం పలికిన సరస్వతీబాయితో శ్రీనివాసనాయకుడు “ఇందులో భగవంతుడిచ్చినది ఏమున్నది? మా తాతముత్తాతలు మా నాన్నగారు నేను ఎంతో శ్రమించి ఆర్జించినదే కదా!” అని అనేవాడు. “దానధర్మాదులకు ఉపయోగపడని ధనమెందులకు స్వామి? ఇట్టి సత్కార్యములే సద్గతులకు చద్ది మూటలని సాధుసజ్జనులంటారు” అని హితవు చెప్పిన భార్యతో భర్త “ఆ సన్యాసుల మాటలకేమిలే వాళ్ళలానే అంటారు. అవన్నీ ఆచరిస్తూ కూర్చుంటే మనకు మిగిలేది బూడిదే! చూడు సరస్వతీ! ధనమూలమిదం జగత్ అన్నారు. ఆ సిరి యొక్క గరిమ ఎంతో కష్టపడి సంపాదించిన నాకు తెలుసు” అని అనేవాడు. ఆ భార్యా భర్తల సంభాషణములు ఇలా ఉండేవి!

శ్రీనివాసనాయకుని అనంత పూర్వజన్మ పుణ్యమో లేక సరస్వతీబాయి అఖండ సౌశీల్య మహాత్మ్యమో పుట్టు లోభి అయిన శ్రీనివాసనాయకుని భక్త పురందరదాసుగా మార్చా అనుకున్నాడు పాండురంగ విఠ్ఠలుడు. ఏ దుర్గుణాన్నైనా నివారించవచ్చును కానీ లోభగుణాన్ని మార్చుట దుష్కరం అని అనుకున్న స్వామి స్వయంగా ఆ శ్రీనివాసనాయకుని వద్దకు ఒక బ్రాహ్మణుని వేషంలో వచ్చాడు. ఎవరి పాదాలకు సకల చరాచర జీవులు ముక్తికై చేతులుజోడించి నమస్కరిస్తాయో అట్టి స్వామి శ్రీనివాసనాయకుని ముందర నిలిచి ఏదైనా దానమివ్వమని యాచించేవాడు! కసురుకుంటూ వెళ్ళగొట్టేవాడు నాయకుడు.

భగవంతుడు శ్రీనివాసనాయకుడెన్ని అవమానాలు చేసినా రోజూ పుత్రవాత్సల్యంతో వచ్చి ఏదో ఒకటి దానమిమ్మని అర్థించేవాడు. భగవంతుడు ఎన్ని సార్లు అడిగినా ఆ శ్రీనివాసనాయకుడు ఒక్కసారికూడా ఏమీ ఇవ్వలేదు. ఇలా ప్రతిరోజు ఆ లక్ష్మీపతి శ్రీనివాసనాయకుని మార్చడం కోసం పడరాని పాట్లు పడ్డాడు. బహుశః ఇందుకేనేమో ఆ భగవంతుడు ఆశ్రితపక్షపాతి అని నిందింపబడినాడు. నీవే తప్ప ఇతరమెఱుగనని శరణువేడిన సరస్వతీబాయిని రక్షించటానికే నేమో ప్రాయశః స్వామి ఇన్ని పాట్లుపడ్డాడు. లేదా కర్మయే పరమాత్మ అన్న నిజం నిరూపించేలా శ్రీనివాసనాయకుని పూర్వజన్మల పుణ్యానికి ఫలముగా ఇలా అనుగ్రహించదలచినాడో స్వామి. ఆ పన్నగశాయి లీలలు అర్థం చేసుకోవటం ఎవరి తరము?

“ఏమైనా సరే నీకేమీ ఇవ్వను” అని నిక్కచ్చగా అన్నాడు ఒకరోజు విప్రవేషంలో ఉన్న భగవంతుని చూసి శ్రీనివాసనాయకుడు. “అయ్యా! వీడు నా ఒక్కగానొక్క కొడుకు. వీడికి ఉపనయనం చేయాలని సంకల్పించాను. ఓం ప్రథమంగా మీ వద్దకొచ్చాను. మీరు దయతో ఏది ఇచ్చినా తీసుకుంటాను” అని అడిగాడు భగవంతుడు. “ఏది ఇచ్చినా తీసుకుంటావా?” అని రెట్టిస్తూ “నేను ఇచ్చేది కిం అనక తీసుకు వెళిపోవాలి” అని అంటూ ఇల్లంతా వెతికి వెతికి తుప్పు పట్టిన కాణీ బిళ్ళ తెచ్చి విఠ్ఠలునికి ఇచ్చి పంపించి “పీడా వదిలింది” అనుకున్నాడు.

ఏదో పనిమీద నాయకుడు బయటికెళ్ళాడోలేదో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు విఠ్ఠలనాథుడు. “అమ్మా! నాకు సహాయం చేయండి” అని అన్నాడు స్వామి. “ఇందాకే కదయ్య మా ఆయనిచ్చారు?” అని అన్నది ఆ ఇల్లాలు. ఆ తుప్పుపట్టిన కాణీ చూపించాడు స్వామి. ఖిన్నురాలై నిస్సహాయిగా నిలుచున్న ఆమెను చూసి పరమాత్మ “అమ్మా! మీ ముక్కెర ఇప్పిస్తే నా అవసరం తీరుతుంది” అని అన్నాడు. నీళ్ళునములుతూ యాచించిన ఆ పేద బ్రాహ్మణుని చూసి జాలిపడి సరస్వతీబాయి వెంటనే తన ముక్కెర తీసి ఇచ్చింది. మనసారా ఆశీర్వదించి ముక్కెర తీసుకుని స్వామి వెళ్ళిపోయాడు.

విప్రునికి ముక్కెర ఇచ్చింది కాని భర్తకు ఏమని సమాధానం చెబుతుంది? ఏమి చేయాలిరా భగవంతుడా అని వ్యాకుల పడుతుండగా ఆమె ప్రాణాలపాలిటి రెండో కాలునిలా శ్రీనివాసనాయకుడు వచ్చి “ఏదీ నీ ముక్కెర?” అని ప్రశ్నించాడు. లోభికి ధనం తప్ప ఇంకేదీ కానరాదు కదా! ఎక్కడుందో వెతికి తెమ్మన్నాడు భర్త. “రంగ రంగ! ఏమి లీల స్వామి? నాకు దిక్కెవ్వరు?” అని భగవంతునికి మొరపెట్టుకుంది సరస్వతీబాయి. “ఇది ఏమైనా సత్యయుగమా చమత్కారాలు జరగడానికి?” అని అనుకుని మరణమే శరణ్యమని నిశ్చయించుకున్నది.

ప్రేమతో అటుకులిచ్చినందుకే స్వామి సుదామునికి అనంత ఐశ్వర్యాలు కడకు కైవల్యమిచ్చాడు. ఇక అవసరానికి ఏమీ సంకోచించక అడిగనదే తడవుగా ముక్కెర ఇచ్చిన ఆ సాధ్విని మఱుస్తాడా స్వామి? “సాధ్వీ! నీ దానగుణానికి భక్తికి మెచ్చాను. ముక్కెర ధారపోసి ముక్తేశుడనైన నన్ను కొన్నావు. ఇదుగో! ముక్తిని తులతూచిన నీ ముక్కెర” అన్న భగవంతుని అంతర్వాణి వినిపించింది సరస్వతీబాయికి. ఎంతో సంతోషంతో ముక్కెర తీసుకొని భర్త దగ్గరకు వెళ్ళింది. అదిచూసి అవాక్కయ్యాడు నాయకుడు. విప్రుడు తన వద్దకే వచ్చి ముక్కెర అమ్మాడు. విషయము తెలిసింది ఆ దంపతులకు. రోజూ విప్రవేషంలో వచ్చి యాచించినది ఆ విఠ్ఠలేశుడే అని అవగతమైంది ఆ దంపతులకు. “వడివాయక తిరిగే ప్రాణబంధుడు స్వామి” అన్న సత్యం తెలుసుకున్నాడు నాయకుడు. ఆ రోజునుండి ఎన్నో దానధర్మాలుచేస్తూ భగవంతుని భక్తితో కొలుస్తూ తరించారు ఆ దంపతులు. దాదాపు నాలుగు లక్షల సంకీర్తనలు గానంచేసి భక్త పురందరదాసుగా ప్రసిద్ధికెక్కాడు శ్రీనివాసనాయకుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. కర్మఫలం అమోఘమైనది. శ్రీనివాసనాయకుని పూర్వ పుణ్యం వలన భగవంతుడు స్వయంగా వచ్చి అతనిలోని లోభగుణాన్ని పోగొట్టి కాపాడినాడు.
  2. ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలంటారు. ఆ సూక్తికి తార్కాణం సరస్వతీబాయి. సుశీలవతి అయిన సరస్వతీబాయి తన సుగుణాలతో స్వామిని మెప్పించి తనను తానే కాక తన భర్తను కుడా తరింపచేసింది.
  3. లోభం చాలా భయంకరమైన దుర్గుణము. సాక్షాత్ ఆ భగవంతునికే శ్రీనివాసనాయకుని లోభగుణం మార్చడానికి అంత శ్రమ పడవలసి వచ్చింది. మనమెన్నడూ ధనకాంక్షులము కారాదని దానధర్మాలు చేయాలని మనకీ కథద్వారా తెలిసినది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Bhartruhari Katha In Telugu – భర్తృహరి కథ

Bhartruhari Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

విక్రమార్కుని సాహసగాధల నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భర్తృహరి కథ. 

భర్తృహరి కథ

మహానుభావుడైన కేశవశర్మకు నలుగురు ఉత్తములైన పుత్రులు దైవానుగ్రహము వలన కలిగినారు. సంస్కృత వ్యాకరణకర్త దివ్య శివమహిన్మా: స్తుతికర్త అయిన కాత్యాయన వరరుచి, అతిలోక సాహవంతుడు ధర్మాత్ముడు మహాకాళీభక్తుడు అయోధ్యాలయ పునరుద్ధారకుడు శకకర్త అయిన విక్రమార్కుడు, పండితుడు మహావివేకవంతుడు కాళీ అనుగ్రహపాత్రుడు అయిన భట్టి మరియు సంస్కృత మహాకవి సుభాషిత రత్నావళికర్త వాక్యప్రదీప, రాహత, కారిక గ్రంథకర్త అయిన భర్తృహరి ఆయన నలుగురు కుమారులు. కేశవశర్మ యోగ్యుడైన భర్తృహరికి రాజ్యభారమప్పగించి వానప్రస్థమును స్వీకరించాడు. చిన్నప్పటినుంచి భర్తృహరి సాధుసజ్జనుల సేవలుచేస్తూ ఉండేవాడు.

భర్తృహరి రాజ్యములో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధనానికి పేదకాని గుణానికి కాదు. సౌశీల్యుడు మంత్రతంత్రశాస్త్ర కోవిదుడు అయిన ఆ విప్రోత్తముడు భువనేశ్వరీదేవి ఉపాసకుడు. మాత ఆ పరమభక్తుని అనుగ్రహించదలచి ఆయన ముందు ప్రత్యక్షమై “కుమారా! నీ గుణసంపదను భక్తిని మెచ్చినాను. ఈ దివ్యఫలం తీసుకో. ఈ ఫలం తిన్నవాడికి జరామరణాలు ఉండవు!” అని ఆజ్ఞాపించింది జగజ్జనని.

గుణాగ్రగణ్యుడైన ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచించాడు “నేను ఒక పేదబ్రాహ్మణుడను. అమృతత్వము సంపాదించిననూ నేను ఎవరిని కాపాడగలను? ఈ పండు కనక మన మహారాజుగారు తింటే ఎందఱో నిర్భాగ్యులను రక్షించగలడు. అప్పుడే నేనీ ఫలమును సద్వినియోగము చేసినవాడను అవుతాను”. ఇలా తలచి ఆ బ్రాహ్మణుడు మహారాజైన భర్తృహరి వద్దకు వెళ్ళి అతనిని ఆశీర్వదించి ఆ దివ్యఫలాన్ని అతనికిచ్చి వచ్చేశాడు!

ఫలము యొక్క మహిమను అర్థంచేసుకోలేక భర్తృహరి ఆ ఫలమును తన ప్రియురాలైన అనంగసేనకు ఇచ్చివేసాడు. కుటిలాత్మురాలైన ఆ అనంగసేన తన సఖుడైన అశ్వపోషకునికి ఆ దివ్యఫలం ఇచ్చింది. మూర్ఖుడైన ఆ అశ్వపోషకుడు తన దాసికి ఆ ఫలాన్ని ఇచ్చాడు. ఆమె తనకు ప్రియుడైన ఒక గోపాలకునికి ఫాలాన్ని ఇవ్వగా వాడు దానిని తన ప్రియురాలికిచ్చాడు. ఆ చిన్నది పశువులపెంట ఉన్న బుట్టలో పండును పెట్టి రాజమార్గముగుండా ఆ బుట్టను తలపైపెట్టుకొని తన ఇంటికి వెళ్ళింది. భర్తృహరి ఆ పండును చూశాడు. బ్రాహ్మణుడు మహాత్యాగం చేసి లోకహితార్థం తనకిచ్చిన దివ్యఫలం చివరికి పెంటబుట్టలో చేరిందని బాధపడ్డాడు. ఆ పండు ఎంతమంది చేతులు మారిందో తెలుసుకున్నాడు.

ఒక్కసారిగా భర్తృహరికి వైరాగ్యం వచ్చింది. సంసారం మీద విరక్తి పుట్టింది. తను ఎవరినైతే ప్రియులు అనుకుంటున్నాడో వాళ్ళు నిజమైన ప్రియులు కాదని పరమేశ్వరుడొక్కడే ప్రాణబంధుడని తెలుసుకున్నాడు. మిథ్యాజగత్తులోని విషయభోగాలను త్యజించి రెమేశునిపై అనురక్తుడై వైరాగ్యముతో తపోవనాలకు వెళ్ళడనికి సిద్ధపడ్డాడు. దేవీప్రసాదమైన ఆ దివ్యఫలాన్ని తన రాజ్యసర్వస్వాన్ని యోగ్యుడైన విక్రమార్కుని చేతిలో పెట్టి తపస్సుకై వెళ్ళిపోయాడు.

మహౌదార్యుడైన విక్రమాదిత్యుడు తన వద్దకు వచ్చిన దీనుడైన ఒక బ్రాహ్మాణునిపై జాలిపడి ఆ దివ్యఫలాన్ని అతనికి ఇచ్చివేశాడు!!

రత్నైర్మాహార్హైస్తుతుషుర్న దేవా న భేజిరే భీమ విషేణ భీతిమ్|
సుధాం వినా న పరయుర్విరామం న నిశ్చితార్థాద్విరమన్తి ధీరాః||

– భర్తృహరి నీతిశతకమ్

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

విప్రోత్తముని సద్భావము మనకు కనువిప్పుకావాలి. లోకంలో జనాలు వృద్ధాప్యం రాకూడదు మృత్యువు రాకూడదు అని తపిస్తుంటే ఆ బ్రాహ్మణుడు జరామరణ రహితముగా చేసే దివ్యఫలాన్ని లోకహితార్థం మహారాజుకు ఇచ్చివేశాడు. స్వధర్మపాలలనో పరాకాష్టను చూపిన ఆ భూసురుడు ధన్యుడు.

“అంతా మిథ్య తలంచిచూచిన” అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు భర్తృహరి. లౌకిక విషయాలను విడిచి మోక్షమార్గోన్ముఖుడైనాడు. ఆయన మనకు అందించిన సుభాషితాలను చదివి అర్థంచేసుకుని మన నిత్యజీవితములో అనుసంధానం చేసుకోవడం మన కర్తవ్యము.

విక్రమార్కుని ఔదార్యము గొప్పది. దీనుడైన విప్రునికి దివ్యఫలాన్ని దానం చేసి తన త్యాగబుద్ధిని మనకు చూపినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Mallikarjuna Suprabhatam In Telugu – శ్రీ మల్లికార్జున సుప్రభాతమ్

Sri Mallikarjuna Suprabhatam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ మల్లికార్జున సుప్రభాతం ఒక తెలుగు భక్తి గీతంగా తెలుగు వారు ప్రధానంగా పాడే భక్తి సంగీత క్రియలలో ఒకటి. ఈ సుప్రభాతం మల్లికార్జున స్వామిని స్తుతించడానికి సమర్థమైనది. ఈ గీతం భక్తులకు మాత్రమే కాదు, ప్రత్యేకంగా తెలుగు సాంస్కృతిక వ్యవహారాలలో ప్రచురించబడుతుంది. అది భక్తి, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సమృద్ధికి ప్రధాన పాత్రని ప్రదర్శిస్తుంది.

శ్రీ మల్లికార్జున స్వామి సుప్రభాతం

“సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి అయ్యప్ప ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే “సుప్రభాతం” అని అంటారు.

Sri Srisaila Mallikarjuna Suprabhatam

శ్లో. ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం
సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్,
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ
మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్.

టీక. ఆనాథబంధుమ్ = దిక్కు లేని వారికి బంధువైనట్టియు; సిందూర పూర పరిశోభిత గండయుగ్మమ్ = చంది కమను శోభనద్రవ్యము యొక్క సమూ హముచేఁ బ్రకాశించెడి చెక్కిళ్లు గలవాఁడును. ఉద్దండ… దండమ్:— ఉద్దండ = గొప్పవైన; విఘ్న = ఆంతరాయముల యొక్క; పరిఖండన = విచ్ఛేదమందు; చండదండమ్ = తీక్ష్ణ శాసనముగలవాఁడును; ఆఖండల… వంద్యమ్:— ఆఖండలాది = ఇంద్రుఁడు మొదలగు, సురనాయక = దేవ శ్రేష్ఠులయొక్క, బృంద = సమూహముచే, వంద్యమ్ = నమస్కరింపఁ బడువాఁడునగు, గణనాథం = ప్రమథగణనాయకుఁడగు వినాయకుని; ప్రాతః = ఈ ప్రాతః కాలమున, స్మరామి = నేను తలఁచుచున్నాను.

తా. దీన బంధువును, చందిరపుఁ గాంతి చే చెలువొందు గండ స్థలములు గల యేనిక మోమువాఁడును, విఘ్నము లెంత లెంతవైన క్షణములోఁ బ్రచండ శాసనమున నణఁచి వేయు వాఁడును, ఇంద్రాది దేవవంద్యుఁడునగు గణపతిని ఈ సుప్ర భాతము నిర్విఘ్నమగుట కీ ప్రాతఃకాలమున మొదట నేను మనస్సులో స్మరించుకొనుచున్నాను.

కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే,
శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్.

టీక. కలాభ్యాం = చతుష్షష్టి (64) కళలుగలవారును; (కలిఃకామధేనుః అనుటచే కలి ఛాతూత్పన్నమైన కలయనుదాని కనేకార్థములుగలవు; వానిని వివరింప విస్తారమగును) చూడాలంకృత = శిరసునం దలంకరించు కొనఁబడిన, శశికలాభ్యాం = చం ద్రకళ గలవారును; నిజతపః = ఒకరి కొఱ కొకరు చేసికొనిన తపస్సు యొక్క, ఫలాభ్యాం = ఫలముగల వారును, భక్తేషు = భక్తులమీఁద, ప్రశటిత ఫలాభ్యాం = విశదపఱచిన ఫలముగలవారును; అస్తోక… శివాభ్యాం:- అస్తోక = గొప్పదైన, త్రిభు వనశివాభ్యాం = ముల్లోకములకు శుభమునొసఁగువారును; భవాభ్యాం = కారణజన్ములైనట్టియు, ఆనంద…. అనుభవాభ్యాం _ ఆనంద = ఆనంద ముచే, స్ఫురత్ = ప్రకాశితమైన, అనుభవాభ్యాం = అనుభూతిగల వారిను, ఆగు-శివాభ్యాం = పార్వతీ పరమేశ్వర దంపతుల కొఱకు, మే = నాయొక్క; హృదిపుః = హృదయమందైతే; ఇయం = ఈ, నతిః = నమస్కారము; భవతు = ఆగుగాక !

తా. చతుష్షష్టి కళాస్వరూపులును, చంద్రకళాధరులును, వర స్పర తపఃఫల సంపాదితులును, భక్తతతి కభీష్టదాయకు లును, ముల్లోకములకు శుభములొసఁగువారును, కారణ జన్ములును, నిత్యానందగోచరులును పార్వతీవర మేశ్వరు లకు నా మనస్సులో మ్రొక్కులిడుదును.

నమస్తే నమస్తే మహాదేవ! శంభో!
నమస్తే నమస్తే దయాపూర్ణసింధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ.

టీశ. మహాదేవ! = దేవతల కెల్లదేవుఁడవైనవాఁడా | శంభో! = సుఖమును గల్గించువాఁడా! తే=నీకొఱకు, నమః = నమస్కారము – తే = నీకొఱకు, నమః = నమస్కారము, దయాపూర్ణసింధో = దయతో నిండిన సముద్రుఁడా ! నమస్తే నమస్తే = నీకు మరల మరల నమస్కారము. ప్రపన్నాత్మబంధో! = శరణన్నవారి కాత్మబంధువైనవాఁడా! నమస్తే నమస్తే = నీకు నమస్కారము. మహేశ్ ! ఓయీ! లోకమంతటిని శానించు ప్రభువా! నమస్తే, నమస్తే, నమస్తే = నీకు ముమ్మాటికి నమస్కారములు.

తా. ఓయీ! మహా దేవ! శంభో! దయాసాగర! శరణార్తిహర ! మహేశ్వర ! నీకు పదే పదే నేను నమస్కరించు చున్నాను.

శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్,
సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః.

టీక. త్రిజగతాం = ముల్లోకములకు, రక్షాకృతిం = రక్షణాకారమును, శశ్వత్ = ఎల్లప్పుడు, శ్రీగిరిమూర్ధని = శ్రీశైలపర్వత శిఖరమందు, లక్ష్మీతాం = కనబఱచునట్టిదియు, సాక్షాత్ = ప్రత్యక్షముగ, అక్షత = తఱుఁగని, సత్కటాక్ష = అనుగ్రహవీక్షణముల యొక్క, సరణి = మార్గముచే, శ్రీమత్ = శోభతో గూడిన, సుధావర్షిణీమ్ = అమృతమును వర్షించునదియు, సోమ… మస్తకాం :- సోమార్ధ = చంద్రకళ చే, అం కిత = గుర్తుగానున్న, మస్తకాం = శిరస్సును గలిగినదియు. ప్రణమతాం = తనకు నమస్కరించువారలకు, నిస్సీమసంపత్ప్రదాం = మితిలేని సంపద నిచ్చునదియు, సుశ్లోకాం = మంచి వారిచేఁ గొనియాడఁబడునదియు, స్మితముఖీం = చిఱునవ్వుగల ముఖముఁ గలిగినదియు, శంభోః = శంకరునకు, సఖీం = ప్రియురాలైన, భ్రమరాంబికాం = భ్రమరాంబ యను పేరుగల, త్వామ్ = నిన్నును, నుమః = నమస్కరించుచున్నాము.

తా. లోకరక్షణమునకై శ్రీశైలశిఖరమున నెల్లప్పుడు నాకారమును గల్గియున్నట్టియు, అక్షయము నమృత సమ్మితమైన చూపులను భక్తులపై నెఱపునదియు, చంద్రరేఖా వతంసయు, మితి లేని సంపదల నాశ్రితులకిచ్చుచు సుజనులచే నుతింపఁబడునదియు శివునర్ధాంగియు భ్రమరాంబ. యను నామముగల నిన్నును స్తోత్రించుచున్నాము.

మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్.

టీక. మాతః! = ఓతల్లీ!, ప్రసీద = ఆనుగ్రహింపుము; భవ్యశీలే! = మంగళ స్వభావము గలదాన! సదయా = దయతో ఁగూడినదానవు, భవ = అగుము; లీలా…. హారే!: – లీలాలవ విలాసలేశముచేతనే, ఆకలిత చూడఁబడిన, దైత్యకుల = రాక్షస వంశమును ఆపహారే = నాళన మొందించినదాన! శ్రీ చక్రరాజనిలయే ! = ఉత్తమమగు శ్రీచక్రము నాధారముగఁజేసికొనినదాన!, శ్రుతిగీతకీర్తే! = వేదముల చేఁ గీర్తింపఁ బడిన కీర్తిగలదాన! శ్రీ శైలనాథదయితే ! = శ్రీశైలపతికి ప్రియురాల నగునో భ్రమరాంబ! తవ నీకు, సుప్రభాతమ్ = సుఖమయమైన యుదయమగుఁ గాక !

తా. ఓ తల్లి! నీవు మంగళమగు మనస్సుగలదానవు; కృపా వతివి, కావున మమ్మనుగ్రహింపుము; శ్రీ చక్ర ము సధిష్ఠించి యొక్కసారి విలాసమున దుష్టరాక్షసులఁజూచి వారినంతమొందించిన దాన ! వేదవాక్కులచే సుప్రతిష్ఠిత మగు కీర్తి గలదాన! శ్రీశైలనాథార్ధదేహ భాగినియగు నో భ్రమరాంబా దేవి! నీకిది సుప్రభాతమగుఁగాక !

శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !
చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. శంభో = సుఖమును గల్గిచువాఁడా! సురేంద్రనుత = ఇంద్రునిచే సుతిఁపఁబడువాఁడా ! శంకర! = మంగళముల నొనరించువాఁడా ! శూలపాణే = శూలాయుధముమ హస్తమందు గలవాఁడా! చంద్రావ తెంస = చంద్రుని శిరసున ధరించినవాఁడా! శివ! = మంగళ మగు రూపముగలవాడా! శర్వ సర్వస్వరూపుఁడా! పినాకపాణే = పినాకమను పేరుగల ధనస్సును చేతియందుఁ గలవాఁడా! గంగాధర! = గంగను ధరించినవాఁడా! శ్రితుపతే = యజ్ఞమున అధిపతియైనవాఁడా!, గరుడధ్వజ = విష్ణువునకు, ఆప్త = ప్రియమైనవాఁడా! శ్రీ మల్లికారున = విభో! = శోభితో గూడిన ఓ మల్లి కార్డు నేశ్వర! తవ = నీకు, సుప్రభా తమ్ = సుఖరుగు ప్రణాతమగుఁ గాక !

తా. ‘శఁభో’ అనునదాదిగా ఁగల పై శ్లోకములోఁ జెప్పబడిన పదునొకండు నామములతో గూడిన యో రుద్రుఁడా! (మల్లికార్జున!) నీ కీ యుదయము శుభ మైనదగుఁగాళ !

విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. విశ్వేశ ! = ప్రపంచమును శాసించువాఁడా! విశ్వజనసేవిత ! = ప్రపంచములోని జీవకోటిచే సేవించఁబడినవాఁడా!; విశ్వమూర్తే! ప్రపంచమే స్వరూపముగఁ గలవాఁడా!: విశ్వంభర! ప్రపంచభార మును మోయువాఁడా! త్రిపురి భేదః! = త్రిపురాసురులను భేదించిన వాఁడా!, విశ్వయోనే ! = ప్రపంచమునకుఁ గారణమైనవాఁడా!, ఫాలాక్ష! = నొసట మూఁడవకన్ను గలవాఁడా!, భవ్యగుణ! = శుభమగు గుణములు గలవాఁడా!, భోగి విభూషణేశ! = పర్పముల నాభరణము గాఁ గలశ్రభువా!, శ్రీ మల్లి కార్జున భో! = శోభాయుక్తుఁడవగు నో మల్లి కార్జునశ్రుభూ!, తవ = నీకు, సుప్రభాతమ్ = శోభనమగు ముదయకాల మగుఁ గాక !.

తా. ‘విశ్వేశ’ అనునది మొదలు తొమ్మిదినామముల ధరించిన ఓమల్లి కార్జున స్వామి! సీకీప్రభాతముశోభ వ మైనదగుఁగాక!

కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. కల్యాణరూప! = మంగళమైన రూపముగలవాఁడా!; కరుణాకర! = దయానిధియైనవాఁడా!; కల్పద్రుమ….పూజితః :- కల్పద్రుమ = కల్పవృక్షముల సంబంధమగు, ప్రసవ = పుష్పములచే, పూజిత! = పూజింపఁబడువాఁడా !; కామదాయిన్ ! = కోరికలిచ్చువాఁడా !; దుర్నీతి…. ఉద్యత :- దుర్నీతి = దుర్నయులైన, దైత్య = రాక్షసులను, దళన = ఛేదించుటయందు; ఉద్యత! = సంసిద్ధుఁడా!; దేవదేవ! = దేవతల కెల్ల దేవుఁ డైన వాఁడా, శ్రీ మల్లికార్జున విభో ! = శోభాయుతుఁడ వగు నో మల్లికార్జునస్వామి! తవ = నీకు, సుప్రభాతమ్ శుభోదయ మగుఁ గాళ !

తా. ‘కల్యాణరూప’ అనునది మొదలు సప్తనామములతో శోభిల్లునో మల్లి కార్జునస్వామీ! నీకు శుభోదయమగుఁగాః !

గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే !
గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గండావలంబిఫణికుండలమండితాస్య !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. గౌరీ మనోహర ! = పార్వతీ ప్రియుఁడా!; గణేశ్వర = ప్రమధగణ నాథునిచే, సేవిత = సేవింపఁబడుచున్న, ఆంఘ్రే! = పాదములు గల వాఁడ! గంధర్వ… కీర్తే! :- గంధర్వ = గంధర్వుల చేత, యక్ష= యక్షులచేత, కిన్నర = కిన్నరుల చేత (ఈమూఁడు రకములగు కులములు గల దేవతలు సంతోషమున గానము చేయుటలో ప్రవీణులు) గీత = కీర్తింపఁబడిన; కీర్తే! = యశస్సుగలవాఁడా!; గండావలంబి = గండ = స్థలముల వఱకు వ్రేలాడుచున్న; ఫణికుండల = పాముల వేడి చెవిపోగులతో, మండిత = ఆలంకరింపఁబడిన, ఆస్య = ముఖము గలవాఁడా!; శ్రీమల్లికార్జునవిభో! = శోభతోఁగూడిన, ఓ మల్లికార్జునస్వామి! తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగుఁ గాక !

తా. ‘గౌరీ మనోహర’ అను నామ చతుష్టయముగల ఓ మల్లికార్జునస్వామీ! నీకు శుభోదయమగుఁగాః !

నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ !
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్.

టీక. నాగేంద్రభూషణ! = వాసుకి, శేషుఁడు మొదలగు రాజసర్పములు భూషణముగఁ గలవాఁడా!, నిరీహిత = కోరికలు లేనివాడా! నిర్వికార! = జన్మాది షడ్వికారములు లేనివాఁడా!, నిర్మాయ = మాయా విరహితుఁడా! నిశ్చల! = స్థాణుస్వరూపుఁడా! నిరర్గల! = అవరోధము లేనివాఁడా! నాగ భేదిన్! = గజేంద్ర సంహారకుఁడా!, నారాయణీ ప్రియ! = నారాయణి యను పేరుగల శాంకరికి ప్రియుఁడైనవాఁడా!, నతేష్టదా! :- నత = నమస్కరించువారలకు, ఇష్టద = ఇష్టములనిచ్చువాఁడా! నిర్మలాత్మన్ :- నిర్మల = స్వచ్ఛమైన, ఆత్మన్ = దేహము గలవాఁడా! (శివుఁడు తెల్లనిదేహము గలవాఁడనుట) లేదా? పరిశుద్దాం తఃకరణము గలవాఁడా! శ్రీ పర్వతాధిప! = శ్రీ యను పేరుగల కొండపై నివసించు ప్రభూ!, విభో! = ఓ దేవ!, తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగును గాక !

తా. ‘నా గేంద్రభూషణ’ అను నామము మొదలుకొని పదు నొకండు నామములతోఁ గూడిన యో శంకరా! నీకు శుభోదయ మగునుగాక!

Sri Srisaila Mallikarjuna Suprabhatam

సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః,
సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. ఈశ = ఓ ప్రభువా ! ఏతత్ = ఈ, ఆశేషం = సమస్తరుగు, జగత్ = లోకముత్వయైవ = నీచేతనే, స్పష్టం = సృజింపఁబడినది. విధిగోచర ! = ఓయీ! అదృష్టరూపుఁడా!, రక్షావిధిశ్చ = లోకరక్షణ విధానమును, తావకీనః = నీ సంబంధమైనదే! శంకర! = ఓ శంకరుఁడా! సంహారశ క్తిరపి = లయ మొనర్చుశక్తియు, తే = నీకు, కింకరి = వళమైన సేవకురాలేగద? శ్రీశైల శేఖరవిభో! = శ్రీశైలపర్వతమందుండెడి యో దేవుఁడా! తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగుఁ గాక!

తా. ఓ శ్రీశైల వాస! నీవు, ఈశ్వరుఁడవై లోకముల సృజిం చుచు విష్ణుస్వరూవుఁడవై లోకరక్షణభారమును నిర్వ హించుచు శివుఁడను నామమున లయక ర్త పై సర్వమును వహించిన యో శ్రీశైలవాస! శంకరా! నీకు శుభోదయ మగుగాక!

ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే
నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. భవ! = ఓయీ! శంకరుడా!, త్వం = నీవు, ఏక ఏవ = ఒక్కఁడవే, లోకే = లోకమఁదు, బహుథా = అనేక రూపములతో, భాని = ప్రకాశించుచున్నావు, నిశ్శంకధీః = నిర్భయబుద్ధిగలవాఁడ వృషభకేతన = వృషభధ్వజముగలవాఁడా! మల్లినాథ! = మల్లీశ్వరుఁడా, శ్రీ భ్రామరీ ప్రియ = శ్రీ భ్రమరాంబాదేవికి ప్రియుఁడైనవాఁడా!. సుఖాశ్రయ! = సుఖమున కాశ్రయమైనవాఁడా!, లోకనాథ! = లోకులకుఁ బ్రభువైన వాఁడా!, శ్రీశైలశేఖరవిభో! = శ్రీ శైలరాజమున నుండెడి ప్రభువా!, తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగు గాక !

తా. ఓయీ! భవుఁడా! నీ వొక్కఁడవే అనేక రూపములతో నీలోకమునఁ బ్రకాశించుతున్నావు. ‘నిశ్శంక ధీ’ అను నామము మొదలు ఆఱునామములతో నొప్పు శ్రీశైల వాస! నీకు శుభోదయమగుఁగాక!

పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః
భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః,
గాయంతి దేవమునిభక్తజనా భవంతం
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. పాతాళ … అంగాః :- పాతాళ గాంగజల = పాతాళగంగలోని నీటి యందు, మజ్జన = స్నానముచేత, నిర్మల = పాపరహితమైన, అంగాః= అవయవములు గలిగినట్టియు, భస్మత్రిపుండ్ర = భూతితో మూడడ్డరేఖలంగా, సమలంకృత = అలంకరించుకొనఁబడిన, ఫాలభాగాః = నొసటి భాగముగలవారగు, దేవమునిభ క్తజనాః = దేవతలం, మునులు, భక్తజనులంను, భవంతం = నిన్ను, గాయతి = కీర్తించుచున్నారు. శ్రీ మల్లికార్జునవిభో! = కాంత్యు పేతుఁడవైన ఓ మల్లి కార్జునస్వామి! తవ = ఓ నీకు, సుప్రభాతమ్ = శోభనోదయమగుఁగాక!

తా. ఓ మల్లికార్జునస్వామి! దేవతలు, మునులు, భ క్తులు నందఱును బాతాళగంగను స్నానించి నిర్మలాంతః కర ణులై భస్మ త్రిపుండ్ర రేఖల నలంకృతమైన మోములతో వచ్చి నీ సన్నిధినుండి నిన్నుఁ గీర్తించుచున్నారు; నీ కీ ప్రభాతసమయము శుభమైనది; లెమ్ము.

సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః,
సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక . సారస్వత = రసమ తోఁజెల వొందు, అంబు = ఉదఃముతో; యుత = కూడిన, భోగవతీ = పాతాళగంగయను నామమును, శ్రితాయాః = ధరించినట్టియు; బ్రహ్మ బ్రహ్మశిఖరము, ఈశ = ఈశ్వర శిఖరము, విష్ణుగిరి = విష్ణు శిఖరమును కూటత్రయము చే, చుంబిత = తాకఁబడుచున్న, కృష్ణవేణ్యాః = కృష్ణానది యొక్క, సోపాన మార్గం = మెట్లమార్గమును ఆధిరుహ్య = ఎక్కి, భక్తాః = నీ భక్తులు, భజంతి నిన్ను సేవించు చున్నారు. శ్రీ మల్లి కార్జునఁభో ! = ఓ మల్లి కార్జున దేవ! తవ= నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగుఁ గాక!

తా. ఓ మల్లికార్జునస్వామి! నీ భ క్తులందఱును — బ్రహ్మవిష్ణు శివ నామములతోనున్న శిఖరములనంటి ప్రవహించు నదియు, కృష్ణానదీస్థాన విశేషమైనదియు, మధురోదశములతో నిండిన పాతాళగంగలో, (భోగవతి) స్నానముచేసి యచటినుండి నీయొద్దకువచ్చు సోపానమార్గములోనుండి నిన్ను సేవించుచున్నారు; నీ కీ ప్రభాతము సుప్రసన్న మగుఁగాక!

శ్రీ మల్లికార్జున మహేశ్వర సుప్రభాత
స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే,
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే.

టీక. శ్రీ మల్లికార్జున = శ్రీయుతుడగు మల్లికార్జునుఁడైన, మ హేశ్వర = శివునియొక్క, సుప్రభాత = ప్రాతః కాలశోభను జెప్పునట్టి, స్తోత్రం = ఈ స్తవమును, ప్రభాతే = ప్రాతస్సమయమున, యే = ఏ, మనుజాః = మానవులు, భువి = భూలోకమందు, పఠంతి = పఠించుచున్నారో, తేజ వారు, సర్వసౌఖ్యం = అన్ని విధములగు సౌఖ్యమును అనుభూయ = అనుభవించి, పరానవాప్యం = ఈ సుప్రభాతపఠనము లేని వారు పొంద లేని, శ్రీ శాంభవం పదం = శ్రీ శంకర నివాసస్థాననుగు కైలాసమును, ఆవాస్య = పొంది, ముదం = సంతోషమును, లభంతే = పొండుచున్నారు.

తా. ఈ మల్లి కారున సుప్రభాతమును ప్రతి ప్రాతస్సమయు మున నే మానవులు శ్రద్ధతోఁ పఠింతురో వారీలోకమున సర్వసౌఖ్యము లనుభవించి చివరకు కైలాసమున కేగి సంతసింతురు.

Indradyumna Katha In Telugu – ఇంద్రద్యుమ్నుని కథ

Indradyumnuni katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఇంద్రద్యుమ్నుని కథ. 

ఇంద్రద్యుమ్నుని కథ – Indradyumna Katha In Telugu

పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గో భూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను ఆర్జించుకొన్నాడు. రాజర్షి అయ్యి ప్రజారంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావముతో కాలం చెల్లాక స్వర్గం చేరుకొన్నాడు. చాలాకాలము స్వర్గభోగాలు అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిపించి

“మహాత్మా! నీవు అనేక దానధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పోందెడి మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది (ఇతరములు శాశ్వతములు కావు). నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున సర్గమును వీడు సమయము వచ్చినది” అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంతకొద్ది కాలములోనే తన పుణ్యరాసులు ఎలా కరిగిపోయినాయి? అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి శచీపతి “రాజా! భూలోకములో నిన్ను కానీ నీవుచేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకొనరు కదా! కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడనుండవచ్చు” అని హితవు చెప్పినాడు. ఇంద్రుని ఆజ్ఞతీసుకొని అట్టివారు ఉన్నారేమో వెదకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు.

Story Of King Indradyumna

చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకువెళ్ళి నమస్కరించి “ఓ తపస్విచంద్రమా! నన్ను మీరు ఎఱుగుదురా”? అని అడిగినాడు. అప్పటికి ఎంతోకాలముగా తీర్థయాత్రలుచేసి ఉపవాస వ్రతాలు చేసి కృశించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు “స్వామి! చిరంజీవులైన మీకంటే ముందుపుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా”? అని అడిగినాడు. “పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతములో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నది” అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి.

వెంటనే ఆ ఉలూకము వద్దకు చేరి “అయ్యా! నెన్నెఱుగుదువా”? అని ప్రశ్నించినాడు. తెలియదు అని చెప్పి “ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది. ఆ సరోవరములో నాడీజంఘమనే కొంగ ఉన్నది” అని ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు చేరి “ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టినారా”? ప్రశ్నించినాడు. “లేదు. ఈ సరోవరములో ఆకూపారమనే తాబేలు ఉన్నది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలుసేమో కనుక్కో” అని చెప్పినది.

ఇంద్రద్యుమ్నుని చూడగానే ఆకూపార కళ్ళుచెమ్మగిల్లాయి “అయ్యా! వెయ్యి యజ్ఞములు సాంగముగా చేసి వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే” అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. మరుక్షణం దేవతలు దివ్యవిమానములో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. మన సత్కీర్తి భూలోకములో ఉన్నంత కాలము సర్గలోకము కరతలామలకము. ఆకూపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్రద్యుమ్నునికి పునః సర్గలోక ప్రాప్తి కలిగినది. కానుక మనము నలుగురుకీ ఉపకరించే పనులు చేయాలి. అవియే మనలను రక్షించు సంపదలు (ధనము కాదు).
  2. దేవేంద్రుడు చెప్పినట్టు మోక్షము ఒక్కటే శాశ్వతపదము. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే “నీవేతప్ప హితః పరంబెఱుగను …” అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినాడు (గజేంద్ర మోక్షము కథ). కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ సోపానము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Shailesha Charana Sharana Ashtakam In Telugu – శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్

Sri Shailesha Charana Sharana Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శైలేశ చరణ శరణాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shailesha Charana Sharana Ashtakam Telugu Lyrics

శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్

గౌరీమనోహర ! సురాసుర మౌనిబృంద
సంసేవితాంఘ్రియుగ ! చంద్రకళావతంస !
కైలాసవాస ! కరుణాకర ! భక్తబంధో !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. గౌరీమనోహర! = పార్వతీ దేవికిఁ బ్రియుఁడైనవాఁడా! సురాసుర మానిబృంద= దేవరాక్షపమని సంఘముచే, సంసేవిత = సేవింపఁబడుచున్న, ఆంఫ్రియుగ! = పాదద్వంద్వముగలవాఁడా! చంద్రకళా వతంస! = చంద్రకళను శిరమున కలంకారముగ ధరించినవాఁడా! కైలాసవాస! = కైలాసాచలము నివాసముగఁ గలవాఁడా! కరుణాకర! = దయ కాకరమైనవాఁడా! భక్తబంధో ! = భ క్తులపాలిటియాప్త బంధువా! శ్రీశైలవాస = శ్రీగిరివాస, తవ = నీయొక్క, చరణం = పాదములను, శరణం = రక్షణమును, ఆస్మి = అంటిని.
తా. ఓ శ్రీశైలవాస! ‘గౌరీమనోహర’ అను నాఱు నామములతోఁ గూడిన నీచరణమునే నేను శరణమంటిని.

భక్తార్తిహార ! భవబంధ వినాశ కేశ !
దివ్యాపగాకలిత కాంత జటాక లాప !
శేషాహిభూష! వృషవాహన ! వ్యోమకేశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. భక్త = భక్తులయొక్క, ఆర్తి = బాధను, హార! = హరించువాఁడా! భవబంధ = సంసారబంధమును, వినాశక ! = నశింపఁజేయువాఁడా!, ఈశా! = లోకముల శాసించువాఁడా!, దివ్యాసగా = దేవగంగతో, కలిత = కూడి, కాంత = మనోహరమైన; జటాకలాప! = జడల సమూ హముగలవాఁడా! శేషాహి = శేషుఁడనుసర్పరాజు, భూష! = ఆలంకా రముగాఁ గలవాఁడా, వృషవాహన! = వృషభమును వాహనముగాఁ గలవాఁడా! వ్యోమకేశ! = ఆకాశమునంటిన కేశములుగలవాఁడా!, శ్రీశైలనాథ! = శ్రీగిరివాస!, తవ = నీయొక్క, చరణం = పాదమును శరణం = రక్షణమునుగ, ఆస్మి = ఆంటీని.

తా. ఓ శ్రీశైలనాథ! ‘భక్తార్తిహర’ అనునామము నుండి సప్తనామములతో నిన్నాహ్వానించి నీ పాదమును శరణమంటిని.

భృంగీశసేవిత ! గణేశ కుమార తాత !
మృత్యుంజయ ! త్రిపురదానవభేదకారిన్ !
పాణావుపాత్త మృగ డామరుక త్రిశూల !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. భృంగీశ సేవిత = భృంగీశునిచే (ప్రసుధాధిపుఁడు) సేవింపఁబడువాఁడా!; గణేశ కుమారతాత = గణపతి, కుమారులు పుత్రులగఁగలవాఁడా!, మృత్యుంజయ! = మృత్యువును జయించినవాఁడా!, త్రిపురదానవ = త్రిపురాసుకులను, భేవకారన్ = భేదించినవాఁడా! పాణే = చేతియందు, ఉపాత్త = పొందిన, మృగ = లేడియు, డామరుక = డమరుకము (బుడబుక్కలవారు వాయించుసాధనము) త్రిశూల = త్రిమాలమును గలవాఁడా! శ్రీశైలవాస! శ్రీగిరినిలయుడా! తవ = నీయొక్క, శరణం= పాదమును, శరణం = రక్షకమునుగ, ఆస్మి = అయియుంటిని.

తా. ఓ! శ్రీశైలవాస! ‘భృంగీశసేవిత’ అను నైదు నామములతో నిన్నుఁ బిల్చి నీ పాదమును శరణ మంటిని.

నాగేంద్ర చర్మవస ! నాగ్ని రవీందునేత్ర !
నారాయణీప్రియ ! మహేశ ! నగేశ ! శంభో !
మౌనిప్రి ! యాశ్రితమహాఫల ! దోగ్రరూప
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. నాగేంద్ర = గజేంద్రునియొక్క, చర్మ = చర్మమును, వసన = వస్త్రముగఁగలవాఁడా! అగ్ని, రవి, ఇందు నేత్ర! = అగ్ని, సూర్యుడు, చంద్రుఁడునామూఁడు నేత్రములుగధరించినవాఁడా! నారాయణి = నారా యణీయను శక్తికి (వైష్ణవమాయకు) ప్రియ = ప్రియమైనవాఁడా!, మహేళ = మహాప్రభూ!, నగేశ = కైలాసాధీశ్వరుఁడా!, శంభో = సుఖమును గల్గించువాఁడా! మౌనిప్రియ! = మహర్షులకుఁ బ్రియమైనవాఁడా! ఆశ్రితమహాఫలద ! ఆశ్రయించినవారికిఁ బరమపురుషార్థ సాధనమునిచ్చువాఁడా!, (జ్ఞానమ్మహేశ్వరాదిచ్చేత్ – అనిశాస్త్రము) ఉగ్రరూప! = ఉగ్రుఁడను రూపముతోనున్నవాఁడా!, శ్రీశైలనాథ = శ్రీగిరి ప్రభూ! తవ = నీయొక్క, చరణం = పాదమును, శరణం = రక్షణమును, ఆస్మి = అయియుంటిని.

తా. ఓయీ ! శ్రీశైలప్రభూ ! ‘నాగేంద్రచర్మవసన’ అను నవ నామములతో నిన్నుఁ బిలిచి నీ పాదములను శరణ మంటిని.

Sri Shailesha Charana Sharana Ashtakam Telugu

సర్వార్తిభంజన ! సదాశివ ! దానవారే !
పార్థప్రహార కలితోత్తమ మూర్థభాగ !
యక్షేశసేవితపదాబ్జ ! విభూతి దాయిన్ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. సర్వ = సమస్తమైన, ఆర్తి = ఆపదలను, భంజన = విధ్వంసమొవర్చువాఁడా ! సదాశివ ! = ఎల్లప్పుడు మంగళముతోనుండువాఁడా!, దానవ = రాక్షసులకు, ఆరే = శత్రువైనవాఁడా! పార్ధ = ఆర్జనునియొక్క, ప్రహార = దెబ్బతో, కలిత = కూడిన, మూర్ఖభాగ = శిరోభాగముఁ గలవాఁడా!, యక్షేశ = కుబేరునిచే, సేవిత = సేవింపఁబడిన పదాబ్జ = పాదపద్మములుగలవాఁడా! విభూతిదాయిన్ ! = ఐశ్వర్యమాను నొసంగువాఁడా, శ్రీశైలవాస! = శ్రీగిరివాస, తవ = నీయొక్క, చరణం = పాదమును, శరణం = రక్షణముగ, అస్మి = ఆంటిని.

తా. ఓ! శ్రీశైలవాస! ‘సర్వార్తిభంజన’ అను నాఱు పేరులతో నిన్నుఁ బిలిచి నీ పాదమును శరణ మంటిని.

శ్రీభ్రామరీశ ! మదనాంతక ! కృత్తివాస !
సర్పాస్థిరుండ కలి తామల హారధారిన్ !
భూతేశ ! ఖండపరశో ! భవబంధనాశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. శ్రీ భ్రామరీశ! = శుభములిచ్చు భ్రమరాంబికానాథుఁడా!, మదనాంతక! = మన్మథుని నాశనమొనర్చినవాఁడా! కృత్తివాసః = గజేంద్ర చర్మమును వస్త్రముగఁ గలవాఁడ!, సర్ప = పాములు, ఆస్థి = ఎముకలురుండ = తలపులతో, కలిత = కూడిన, అమల = స్వచ్ఛమైన హార = హారమును, ధారిన్ = ధరించినవాఁడా! భూతేశ! = భూతములకధిపతి యైనవాఁడా!, ఖండపరశో! = ఖండించెడి గొడ్డలికలవాడా (పరశువను రాక్షసుని ఖఁడించినవాఁడా) భవబంధనాశ! = సంస్కృతిబంధ మును దెగగొట్టువాఁడా!, శ్రీశైలనాథ = శ్రీగిరివాస!, తవ = నీయొక్క చరణం = పాదములను, శరణం = రక్షకముగ, అస్మి = ఆయితిని.

తా. ఓ! శ్రీశైలప్రభూ ! ‘శ్రీభ్రమరీశ’ అనునది మొద లీపైఁబడిన యేడు నామములతో నిన్నుఁ బిలచి నీ పాదమును శరణ మనుచున్నాను.

సర్వాగమస్తుత ! పవిత్ర చరిత్ర ! నాథ !
యజ్ఞప్రియ ! ప్రణతదేవ గణోత్తమాంగ !
కల్పద్రుమ ప్రసవ పూజిత దివ్యపాద !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. సర్వ = సమస్తమైన. ఆగమ = స్మృతులచే, స్తుత! = కొనియాడఁ బడినవాఁడా!, పవిత్రచరిత్ర = పవిత్రమగు చరిత్రగలవాఁడా ! , నాథ! = ఓ! ప్రభూ!, యజ్ఞప్రియ! = యజ్ఞములపైఁ బ్రీతిఁగలవాఁడా!, ప్రణత = నమస్కరించెడు, దేవగణ = దేవతాసమూహముయొక్క, ఉత్తమాంగ! = శిరస్సులుగలవాఁడా; కల్పద్రుమ = కల్పవృక్షములయొక్క, ప్రసవ = పూలచే, పూజిత = పూజింపఁబడిన, దివ్యపాద = ప్రకాశించు పాదములు గలవాఁడా!, శ్రీ శైలనాస! శ్రీగిరిపర్వతాశాసము గలవాఁడా, శంకరా ! తవ = వీయొక్క, చరణం = పాదమును, శరణం = రక్షకముగ, అస్మి = అయితిని.

తా. ఓ శ్రీశైల పర్వతమందు నివసించు స్వామి! ‘సర్వాగ మస్తుత’ అనునామము మొదలాఱు నామములతో నిన్నుఁ బిల్చి నీ పాదమును శరణ మంటిని.

శంభో ! గిరీశ ! హర ! శూలధరాంధకారే !
శ్రీశైలవాస ! భ్రమరాంబికయా సమేత !
శ్రీ పార్వతీదయిత ! సాక్షిగణాధిపేడ్య !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి.

టీక. శఁభో ! = సుఖమునుగల్గించువాఁడా!, గిరీశ ! = కైలాసపర్వతమునకు బ్రభువా? ( లేక – పర్వతములపైననే తన నివాసముండుటనుబట్టి పర్వతము అకుఁ బ్రభువా! యనియునర్థము) హర! = కష్టములనుహరించువాఁడా! శూలధర! = త్రిశూలమును ధరించినవాఁడా!, ఆంధకారే! = ఆంధకుఁడను రాక్షసునకు శత్రువైనవాఁడా!, శ్రీశైలవాస! = శ్రీగిరియందు వసించువాఁడా! భ్రమరాంబికయా = భ్రమరాంబాదేవితో, సమేత! = కూడినవాఁడా!, శ్రీ = శోభావతియగు, పార్వతీ = పర్వతరాజపుత్రిక, దయిత! = ప్రియురాలుగాఁ గలవాఁడా! సాక్షిగణాధిప! = సాక్షిగణపతిచే, ఈడ్య! = నుతింపఁబడు వాఁడా! శ్రీ శైలనాథ! = శ్రీశైలశ్రభూ! తవ = నీ యొక్క, చరణం = పాదమును, శరణం = రక్షకముగ, అస్మి = ఆయితిని.

తా. ఓ! శ్రీశై లేశ్వర! ‘శంభో’ అనునది మొదలు తొమ్మిది నామములతో నిన్నుఁ బిలిచికొని నీ పాదమే నాకు శరణమని యనుచుంటిని; రక్షింపుమని భావము,

శ్రీశైలం, శిఖరేశ్వరం , గణపతిం, శ్రీహాటకేశం పున
స్సారంగేశ్వర, బిందుతీర్థమమలం, ఘంటార్కసిద్ధేశ్వరమ్
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం
శంఖం చక్రవరాహతీర్థకలితం శ్రీశైలనాథం భజే.

టీక. శ్రీశైలం = శ్రీగిరి, శిఖరేశ్వరం = శిఖరేశ్వరుని, గణపతిం = సాక్షి గణపతిని, శ్రీహాటకేశం = శోభించుహాటకేశ్వరుని (ఆటికేశ్వరుని) పునః = ఇంకను, సారంగేశ్వర = సారంగతీర్థమును, అమలం = స్వచ్ఛమైన, బిందుతీర్థం = బిందుతీర్థమును, ఘఁట = ఘంటేశుని, ఆర్క = అర్కేశ్వరుని, సిద్ధేశ్వరం = సిద్ధేశుని, గంగాం = పాతాళగంగను, శ్రీ భ్రమరాంబికాం = శ్రీ భ్రమరాంబాదేవిని, గిరిసుతాం = పార్వతీదేవిని, ఆరామవీరేశ్వరం = ఆరామవీరేశ్వరుని, శంఖం = శంఖమనుతీర్థమును. చక్రవరాహతీర్థ = చక్రతీర్థ, వరాహతీర్ధములతో, కలితం = కూడిన, శ్రీశైలవాథం = శ్రీ శైలేశుఁడగు మల్లీ కార్జున స్వామిని, భజే = సేవించుచున్నాను.

తా. శ్రీశైలక్షేత్రతీర్ధమునఁ గల ఈపైఁ జూపఁబడిన పదు నాఱు క్షేత్రతీర్థములతోఁగూడిన శ్రీశైలవాసుని నిత్యము మనసులోఁ దలఁచు చున్నాను. అని, కవి శ్రీశైలక్షేత్రా దిస్మరణము కాశీస్మరణము వలె పాపహరమని నుడువుచున్నాఁడు.

శ్రీశైలేశ్వర సుప్రభాత కలిత గ్రంథస్య, లంకాన్వయ
స్సీతారామకవి, ర్యథామతి, ముదా, భావార్థవైశద్యయు
గ్వ్యాఖ్యానం, విరచయ్య, చాంతిమతదే తస్యానుకంపాప్తయే
హ్యేకం, శ్రీచరణద్వయం, శరణమి, త్యాలోచ్య, తేనేష్టకమ్

టీక. శ్రీశైలేశ్వరసుప్రభాత = శ్రీగిరీశుని సుప్రభాతముతో, కలిత = కూడిన, గ్రంథస్య = గ్రంథమునకు, అంకాన్వయః = లంకావంశసంభూతుఁడగు, సీతారామకవిః = కవియగుసీతారామశాస్త్రి, ముదా = సంతోషముతో, యథామతి = బుద్ధివైశడ్యముతోలది, భావార్థవైశద్యయన్ = భావము, ఆర్థములయొక్క విశదీకరణముతోకూడిన, వ్యాఖ్యానం = విపులీకరణమును, విరచయ్య రచించి, అంతిమపదే = ఈసుప్రభాత గ్రంథాంతిమస్థానమును, (గ్రంథముయొక్క చివర) తస్య = ఆ శ్రీశైలేశునియొక్క, ఆనుకంపా = దయను, ఆప్తయే = పొందుటకొఱకు ఏకం = ముఖ్యమైనది, శ్రీ చరణం = శ్రీ వారి పాదమే, శరణంహి = రక్షకముగదా? ఇతి = ఇట్లని, ఆలోచ్య = తలఁచి, అష్టకం = శ్రీశైలవాస చరణశరణాష్టకమును, తేనే = రచించెను. తసూకరణ ఇతిధాతోర్థటి ఉత్తమ పురుషైకవచనమ్)

తా. ‘లంకా సీతారామశాస్త్రి’ యను కవి యీ శ్రీశైల సుప్రభాత గ్రంథమునకు టీకాతాత్పర్యములను వ్రాసి, యీ గ్రంథాంతమందు శ్రీశైలచరణ శరణాష్టక ముండు టావశ్యక మనియు-గుర్వులకా శ్రీశునిచరణమే శరణమని యెంచి దానిని రచించి ధన్యుఁడయ్యెనని తాత్పర్యము.

మరిన్ని అష్టకములు:

Govardhana Giri Pooja In Telugu – గోవర్ధన గిరి పూజ

Govardhana Giri Pooja

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గోవర్ధన గిరి పూజ.

గోవర్ధన గిరి పూజ

నందవ్రజములో ప్రతి ఏట ఇంద్రయాగము చేసేవారు. ఏడేళ్ళ పసిబాలుడైన శ్రీ కృష్ణ పరమాత్మ సదస్యులందరి ముందర తండ్రియైన నందుని ఇలా ప్రశ్నించాడు “ఇంద్రయాగము చేయుటలోని ఆంతర్యమేమిటి”? నందుడు “కృష్ణ! యజ్ఞ యాగములు కృతజ్ఞతును ప్రకటించే సాధనములు. మనకు హితము కలిగించే వేల్పులకు కృతజ్ఞత చూపడమే యజ్ఞం యొక్క ముఖ్యోద్దేశం. కృతజ్ఞుడే కాని కృతఘ్నుడు సహాయమునకు అర్హుడుకాడు కదా! ఈ కారణముగా లోకహితార్థం యజ్ఞం చేయుట ఆచారం” అని చెప్పాడు.

తండ్రియొక్క సత్యవాక్కులు విని శ్రీ కృష్ణుడిలా అన్నాడు “తండ్రీ! ఫలము కేవలము దేవతలవల్లనే కలుగదు. ఫలసిద్ధికి ముఖ్యమైన హేతువు కర్మ. ఒక మనిషి తానెన్ని సత్కార్యాలు చేశాడన్నది ముఖ్యం. అందుకే కర్మయే భగవంతుడని అనవచ్చు. స్వధర్మమాచరీంచిన వాడికి దైవము చేరువలో నుండును.

పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.

మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:

“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.

శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.

ఓ శుభదివసమున వ్రజవాసులు గోవర్ధన గిరిపూజకు తండోపతండాలుగా తఱలి వచ్చారు. యాదవుల గురువైన గర్గ మహర్షి పురోహితులు వచ్చారు. నవనందులు వృషభానుడు బంగారు పల్లకీలో రాధాదేవి వచ్చిరి. దేవతలు అప్సరసలు రాజర్షులు మహర్షులు పార్వతీ పరమేశ్వరులు విచ్చేసినారు. భక్తి శ్రద్ధలతో పూజావిధిని అనుసరించి గోవర్ధన గిరి పూజ చేశారు వ్రజవాసులు. వ్రజవాసుల భక్తికి మెచ్చి గోవర్ధనుడు సహస్రబాహులతో మానవాకృతిలో వచ్చి అందరిని ఆశీర్వదించాడు. శ్రీ కృష్ణ పరమాత్మకీ జై గోవర్ధనగిరిరాజుకీ జై అను జయజయ ధ్వానాలు భూనభోంతరాళముల ప్రతిధ్వనించాయి. వ్రజ చరిత్రలో అది ఓ సువర్ణ ఘట్టమ్.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.
  2. దైవసేవ మాతాపితసేవ భూతదయ అన్ని మానవుడి కర్తవ్యాలని గుర్తుచేశాడు శ్రీ కృష్ణుడు. అందుకే పూజకు వచ్చేముందు వృద్ధులకు బాలులకు పశు పక్షాదులకు ఆహారం సమకూర్చి రమ్మన్నాడు.
  3. మన సంస్కృతి ప్రకారము పూజా విధానము ఎట్టిదో శ్రీ కృష్ణుడు తెలిపాడు. భక్తి శ్రద్ధలతో విధినసురించి చేసిన పూజ ఫలించి గోవర్ధనుడు సాక్షాత్కరించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం: