Go Pooja Phalitamulu In Telugu – గో పూజా ఫలితములు

Go Pooja Phalitamulu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోమాత పూజా ఫలితములు గురించి తెలుసుకుందాం…

Gomata Pooja Phalithalu In Telugu

గో పూజా ఫలితములు

  1. గో ప్రదక్షిణము భూ ప్రదక్షిణముతో సమానము.
  2. ఆవు కుడి ప్రక్కను బ్రహ్మ ఉండును. అచట పూజించినవారికి సంతానము కలుగును.
  3. గోవు కొమ్ములకు ఎడమప్రక్క విష్ణువు ఉండును. కాన ఆ తావును పూజించిన వారికి జ్ఞానమోక్షములు లభించును.
  4. ఆవు కొమ్ముల చివరిభాగములో మూడు కోట్లు ఏబదిలక్షల తీర్థములు వుండును. వాటిపై చల్లిన నీటిని త్రాగిననూ, శిరస్సున, చల్లుకొనినూ త్రివేణీ సంగమ స్నానఫలము లభించును.
  5. ఆవు నుదుటి భాగమునందు సాంబశివుడు వుండును. కావున మల్లె పూవులతో పూజించి నచో కాశీవిశ్వేశ్వరుని పూజించిన ఫలితము కలుగును.
  6. గోవు ముక్కునందు సుబ్రహ్మణ్యస్వామి వసిం చును. ఆ భాగమును పూజించినవారికి చెవి పోటురాదు. సంతాననష్టము వుండదు.
  7. ఆవుచెవియందు అశ్వనీదేవతలు ఉంటారు. ఆ ప్రదేశములను పూజించినచో అసాధ్య రోగములు నివారింపబడును.
  8. ఆవు కన్నులలో సూర్యచంద్రులు వుంటారు. వానిని పూజించినవారికి అజ్ఞానమనే చీకటినశించి జ్ఞానకాంతియు, సకల సంపదలు కలుగును.
  9. ఆవు నాలుకపై వరుణదేవుడు ఉండును. దానిని పూజించినచో సంతానము కలుగును.
  10. ఆవు హుంకారమునందు సరస్వతి వుండును. దానిని పూజించినచో విద్య లభించును.
  11. ఆవు గండస్థలముల (చెక్కిళ్ళు) యందు కుడి భాగమున యముడు, ఎడమభాగమున ధర్మ దేవతయు వుందురు. దానిని పూజించినచో యమబాధలు వుండవు. ధర్మపరులకు లభించే పుణ్యలోకము ప్రాప్తించి, జ్ఞానవృద్ధి యగును.
  12. ఆవు పెదవులయందు ప్రాతఃసంధ్యాది దేవతలు ఉందురు. దానిని పూజించినచో సంధ్యా సమయంలో కావించిన పాపములు తొలగును.
  13. ఆవు కంఠమునందు ఇంద్రుడు వుండును. దానిని పూజించినవారికి ఇంద్రియ పాటవము కలుగును. సంతానాభివృద్ధి యగును. పక్షవా తాది రోగములు రావు.
  14. ఆవు వక్షస్థలము నందు సాధ్యదేవతలు వుం దురు. ఆ భాగమును పూజించినవారికి సాధింపరాని కార్యములు ఉండవు.
  15. ఆవు నాలుగుపాదములలోను నాలుగు పురు షార్ధములు వుండును. ఆ నాల్గింటిని పూజించినవారికి ధర్మార్ధకామమోక్షములు సిద్ధించును.
  16. ఆవు గిట్టలచివరి భాగమున నాగులు వుందురు. ఆ ప్రదేశమున పూజించినవారికి గంధర్వలోకములు లభించును.
  17. ఆవు గిట్టలనందు గంధర్వులు వుందురు. అచట పూజించినవారికి నాగలోకము సిద్ధిం చును. ఈ భూమియందు నాగభయము వుండదు.
  18. ఆవుగిట్టల ప్రక్క భాగములందు దేవవేశ్యలు ఉందురు. అచట పూజించినవారికి అప్సరో లోకము సిద్ధించును.

మరిన్నిపూజా విధానాలు:

Judam Tagadu In Telugu – జూదం తగదు

Judam Tagadu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… జూదం తగదు నీతికథ.

జూదం తగదు

(ఈ కథ ఆదిపర్వంలో ఉంది.)

తన వలె కష్టాలపాలయిన మహామహులు చరిత్రలో ఎవరయినా ఉన్నారా అని ధర్మరాజు అడుగగా బృహదశ్వమహర్షి చెపుతున్నాడు.

“ధర్మనందనా ! నిజానికి నువ్వు పడే కష్టం ఎంతటిదయ్యా ! తమ్ములు నలుగురూ, నీ భార్యా నీ దగ్గర ఉన్నారు. ఈ వనాలలోని మునులూ, ఋషులూ నీకు ధర్మబోధ చేస్తూ, ఓదారుస్తూన్నారు.

ఈ మాత్రం కూడా లేకుండా భార్యకు దూరమై ఎన్నో బాధలు పడిన నలమహారాజున్నాడు. ఆయన కూడా జూదంలోనే రాజ్యం, పంప దమా కోలుపోయి నావా యాతనలూ పడ్డాడు. ఆ కథ విను.

భారతదేశంలో ఉండే అనేక రాజ్యాలలో నిషేధదేశం ఒకటి. ఆ రాజ్యాన్ని వీరసేనుడనే రాజుకొడుకు నలుడు పాలిస్తున్నాడు. ఈ సల మహారాజు సర్వసద్గుణ సంపన్నుడు, విద్యావంతుడు, రూపంలో మన్మ థుడు. సత్యవ్రతంతో విద్వాంసులను పూజించే వాడు.

అయితే పాండురాజనందనా! ఆయనకు కూడా నీలానే జూదం అంటే మహా ప్రీతి. ఆ విద్యలో మంచి నేర్పు కూడా ఉంది. సరే ఆ విషయం అలా ఉంచు.

ఆ రోజులలో విదర్భ రాజ్యాన్ని పాలించే భీముడనే రాజుకి దమ యంతి అనే పేరు గల కుమార్తె ఉండేది. ఆమెకు పదహారేళ్ళు నిండే నాటికి ఆమె గుణ, శీల, మందర రూపాలను గురించి దేశదేశాలలో చెప్పుకునే వారు.

సాధారణంగా అందం కల ఆడవారికి వినయం ఉండదు. కొంద రికి శీలం ఉండదు. వినయము, శీలమూ లేని అందగత్తెమ గురించి అందరూ ఆడిపోసుకుంటారే తప్ప మంచి మాట అనరు.

అలా కాకుండా ఈ దమయంతి తవ అందం కంటె వినయ, గుణ, శీలాలతో అందరి మెప్పునూ పొందింది.

అలానే పదాచార, పద్గుణ రూపాలకు, సాహస పరాక్రమాలు తోడుగా ఉన్న నలమహారాజుకి దమయంతి తగిన ఇల్లాలు కాగలదని దేశ దేశాలు తిరిగే విద్వాంసులు అంటుండే వారు. ఈ వార్త నల దమయంతు లిద్దరి చెవిని పడింది. ఒకరినొకరు చూచుకోకుండానే వారి మధ్య అమ రాగం అంకురించింది.

అలా ఉండగా, ఒకనాడు నలుడు తన ఉద్యానవనంలో విహారం సాగించే సమయంలో అక్కడ తిరిగే హంసలలో ఒక రాయంచ నలుని చేతికి చిక్కింది.

దాని అందాన్ని చూసి ఆనందించే నలునితో ఆ హంసః
‘మహారాజా! నువ్వు నన్ను విడిచిపెడితే నేను విదర్భదేశం వెళ్ళి అక్కడ నీ గుణ, రూప, సాహసాలు వివరించి ఆమెకు నీ యందు అనురాగం కలిగేలా చేస్తాను’ అంది.

నలుడు విడిచిపెట్టాడు.
హంస బయలు దేరి వెళ్ళి విదర్భ రాజు ఉద్యానవనంలో విహ రించే దమయంతిని సమీపించి నలుని గుణ గణాలు కీర్తించింది.

ఆ మాటలు విని దమయంతి హంసను లాలించి ఇదే విధంగా నా గురించి ఆ మహారాజుకి చెప్పవలసిందిగా ప్రార్థించింది.

హంస అలాగే అని వెళ్ళి విషయమంతా నలునికి విశదం చేసింది.
తన కుమార్తె వయసు గమనించి విదర్భరాజు స్వయంవరం ప్రక ఉంచాడు.

ఆ స్వయంవరానికి దేశదేశాల రాజులతో పాటు దేవతలు కూడా వచ్చారు. వారు వచ్చే దారిలో నలుని చూసి, తమ పక్షాన దమయంతి దగ్గరకు రాయబారిగా పంపారు.

దేవతల అనుగ్రహం వల్ల నలుడు ఎవరికంటా పడకుండా పరావరి దమయంతి అంతఃపురంలో ఆమె ఎదుట నిలిచాడు.

ఆ సుందరాకారుని చూసి దమయంతి ఆశ్చర్యంతో

‘ఆర్యా! దివ్యసుందరాకారంతో ఉన్న మీరెవరు? ఈ అంతః పురంలోకి పోతుటీగ రావడానికి వీలులేదే మీరెలా వచ్చారు?’ అంది.

నలుడు: కల్యాణీ! నేను ఇంద్ర, వరుణ, యమ, అగ్నిహోత్రులు పంపగా వారి అమ గ్రహం వల్ల ఎవరి కంటబడక ఇక్కడకు దూతగా వచ్చాను. రేపు స్వయంవరంలో నువ్వు ఈ నలుగురిలో ఒకరిని వరించాలి.

దమయంతిః తమరెవరో చెప్పలేదు?
నలుడు నన్ను నలుడంటారు. నిషధ చక్రవర్తిని.
దమయంతి సిగ్గుతో, ఆనందంతో తలవంచి-

‘మహారాజా ! నా మనసెప్పుడు మిమ్మే ప్రాణనాథునిగా వరం చింది. అలనాడు హంస చెప్పిన నాటి మంచి మిమ్మే ఆరాధిస్తున్నాను. ఈ స్వయంవరం మీ కోసమే ప్రకటించారు. మీరు నా భర్త, అలా జర గని నాడు మరణమె శరణ్యం’ అంది.

పరిపరివిధాల దేవతల ఘనతను గురించి చెప్పి, వారిలో ఎవరినో ఒకరిని వరించడం ఉచితం అని పలుడు ఎంత బోధించినా అంగీకరించ లేదు దమయంతి. ‘దేవతా సమక్షంలోనే మిమ్ము వరిస్తాను’ అంది.

నలుడు తిరిగి వచ్చి అంతా వివరించాడు.
దేవతలు ఆశవీడక మరునాడు స్వయంవర మండపానికి నలుని వేషంలో వచ్చి వాని పక్కనే కూర్చున్నారు.

గమయంతి స్వయంవర సభలో అడుగు పెట్టి ఒక్కొక్కరినే చూస్తూ నలుని సమీపించింది. అక్కడ అయిదుగురు నలమహారాజులు కనిపించగా ‘ ఓ దివ్యపురుషులారా! నేను ప్రేమించే వలనుహారాజు మీలో ఎవరు?ి అందిం

వారు నలుగురూ లేచి నిలబడ్డారు. వలుడు కదలలేదు. అప్పుడు దమయంతి ఆ ఎలుగురికీ నమస్కరించి వలుని మెడలో పూలమాల వేసింది.

దేవతలు వారిని దీవించి వెళ్ళారు.
నలుడు భార్యాసహితుడై తన రాజ్యానికి వచ్చాడు.

పన్నెండు సంవత్సరాలు సుఖ సంతోషాలతో నలదమయంతులు జీవితం సాగించారు. వారికి ఇంద్రసేనుడనే కుమారుడు, ఇంద్రసేన అనే కుమార్తె కలిగారు. వారు చక్కని శిక్షణలో పెరుగుతున్నారు.

ఆ రోజులలో పొరుగు రాజయిన పుష్కరుడు నలుని దగ్గరకు వచ్చి తనతో జూదం ఆడమన్నాడు.

జూదానికి, యుద్ధానికి ఆహ్వానం వస్తే తిరస్కరించరాదు అనే నియమం అంగీకరించాడు.

జూదం ఆరంభమయింది. పుష్కరుని మాయజూడంలో నలుడు ఒక్కొక్క పందెం ఓడిపోతున్నాడు.

ఓడిన కొద్దీ ఆవేశంతో పందెం పెంచుతున్నాడు. గెలిచిన ఆనం దంతో పందెం కాస్తున్నాడు పుష్కరుడు. రోజులు గడుస్తున్నాయి. భర్త జూదంలో సర్వం ఓడిపోతున్నట్టు తెలిసి దమయంతి తన బిడ్డ లిద్దర్నీ ఒక రథం మీద పుట్టింటికి పంపింది.

అన్ని సంపదలూ ఓడిపోయిన నలునితో పుష్కరుడు
‘ ఇంక నీ దగ్గర పైసా కాసులేదు. నీ భార్య ఉంది. ఆమెను కూడా పందెం కాస్తావా?’ అన్నాడు.
నలుడు దీనవదనంతో కోట దాటి వచ్చాడు. దమయంతి కూడా అనుసరించింది.
శత్రు నగరంలో ఉండరాదని రాజ్యం విడిచి వారు వెడుతున్నారు.

(వజలందరూ)
‘జూదం ఎంత పని చేసింది : ధర్మప్రభువయిన నలమహారాజుకి ‘కూడా కష్టాలు తెచ్చిపెట్టింది’, అని కంటనీరు పెట్టారు.

నల దమయంతు లిద్దరూ తిరిగి తిరిగి ఆహారం కూడా దొరకనిచోట మంచి నీరు తాగి కాలం గడుపుతున్నారు.

అలా ఉండగా ఒకనాడు వారి సమీపంలో కొన్ని పక్షులు కని పించగా నలుడు వాటిని పట్టుకోవాలని ఉత్తరీయం వాటిమీద విసిరాడు. అవి ఆ బట్టతో సహా ఎగిరిపోయాయి. అప్పుడు భార్య పైట చెరగు పగం చింపి తన ఉత్తరీయం చేసుకున్నాడు.

కొంతదూరం నడిచి నాలుగు దారులు కలిసి ఒక కూడలిలో నిం బడి:

‘దమయంతీ! ఇంతవరకూ నాతో ఎన్నో కష్టాలు అనుభవించావు.” ఇప్పుడు నీకు శ్రేయోమార్గం బోధించాలని ఉంది. ‘

ఇదిగో ఇటు దక్షిణంగా వెడితే అవంతీ దేశం చేరుతావు. అటు నుంచి కొంచెం ముందుకు వెడితే విదర్భదేశం వస్తుంది’, అన్నాడు.

దమయంతి ఆ మాటలు విని కన్నీరు విడిచి ‘నాథా! ఎందుకు చెపుతున్నారు నాకు ఈ దారి? రాజ్యం పోయినా, సంపదలు పోయినా కట్టుబట్ట పోయినా మిమ్మల్ని నేను విడవలేదు. మీతోనే కష్టమయినా, సుఖమయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా అయినా మీ దుఃఖాన్ని తగ్గించడానికే నేను మీతో ఉన్నాను. నన్ను వదలకండి’- అంది.

అప్పుడు నలుడు :
‘ దమయంతీ । భార్యకంటె ఈ ప్రపంచంలో స్నేహితుడూ, ఆప్త బంధువు ఎవరూ లేరు. ఈ విషయం నే నెరుగుదును. ఎరిగి నిన్ను విడిచిపెడతానని ఎందుకనుకున్నావు? ఒక వేళ నీకు నేను దూరమయినా నా మనస్సు ఎప్పుడూ నీ మీదనే ఉంటుంది. మన ప్రేమకు అంతరాయం ఉండదు * ‘ అన్నాడు.

అలా మాట్లాడుకుంటూ వారు ఒక పత్రం చేరారు. ఆ రాత్రి నిద్రి స్తున్న వేళ దమయంతిని విడవలేక విడవలేక విడిచి వెళ్ళిపోయాడు. నలుడు.

తెలతెలవారు తూండగా నిద్రలేచిన దమయంతి భర్తకోసం గోలు గోలున విలపిస్తూ పత్రం విడిచి ఊరు దాటి అడవిదారి పట్టి వెదకడం ఆరంభించింది.

తిరుగుతూండగా ఓ కిరాతుడు ఆమెను చూసి మోహించి బలాత్కారం చెయ్యబోయి, ఆ పతివ్రత వేడిచూపులకు తట్టుకోలేక నేలకూలాడు.

దొరికిన పండుతిని, నీరుతాగి భర్తకోసం పిచ్చిదానిలా తిరుగుతూ చేదిదేశం చేరింది. అక్కడి జనులందరూ ఆమెను పిచ్చిదానిగా, భావించి

వెంటాడుతూంటే, రాజభవనం నుంచి చూసిన రాజమాత తన దాసిని పంపి దమయంతిని రాజభవనంలోకి రప్పించింది”.

దమయంతి రాజభవనంలోని అంతః పురంలో మహారాణి నందాదేవి దగ్గరకు రాగానే ఆవిడ ఆదరంతో కూర్చుండ బెట్టింది. పరిచారిక అందరినీ దూరంగా వెళ్ళమని

‘అమ్మాయీ ఎవరింటి బిడ్డవమ్మా! నీ భర్త ఎవరు? ఈ దశలో ఎందుకున్నావు? అలంకారాలు లేకపోయినా, జుట్టు చిందర వందరగా ఉన్నా, మాసిన బట్టలతో ఉన్నా నీలో దివ్యశోభ కనిపిస్తున్నది. సత్యం చెప్పు తల్లీ ‘ ! అని బుజ్జగింపుగా అడిగింది.

దమయంతి విచారంతో
‘ మహారాణి । నేను ఎవరి బిడ్డనని చెప్పను? ఆ కథ మరచి పోయాను. ప్రస్తుతం ఏకాకిని, సైరంధ్రి వృత్తిలో నాకు ప్రవేశంఉంది, రాజాంతః పురాలలో, నా నియమాలకు భంగం కలగనిచోట ఆ వృత్తిలో ఉంటాను.

నా భర్త గుణ, శీల రూపవంతుడు. కానీ, అన్యాయంగా జరిగిన జూదంలో అన్నీ కోలుపోయి అడవులపాలయాము. ఆయన నన్ను ఒక సత్రంలో ఒంటరిగా విడిచివెళ్ళాడు. ఆయనకోసం తిరుగుతూ తిరుగుతూ యిలా వచ్చాను. మీరు నా నియమాలకు అంగీకరిస్తే యిక్కడే ఉంటాను’ అంది.

అంగీకరించింది మహారాణి.
తన కొమార్తెను పిలిచి మహారాణి అన్ని విషయాలూ చెప్పి, * ఈమెను కంటికి రెప్పవలె చూసుకోవాలి’ అంది. ఆ విధంగా దమ యంతి వారి అంతఃపురంలో కాలం గడుపుతున్నది.

ఆ రాత్రి సత్రంలో బయలుదేరిన వలుడు ఒక మహారణ్యంలో సాగుతూండగా అక్కడ దావానలం వ్యాపించి మంటలు లేచాయి.

మంటలలో నుండి ఆర్తనాదం వినిపించింది. దీని జన రక్షణ దీక్షకల నలుడు అటునడువగా –

‘ఓ పుణ్యాత్ముడా! ఇటురా నేను నాగజాతి కర్కోటకుడను. నారదులవారి శాపంవల్ల యిక్కడ కర్రలా పడి ఉన్నాము. నీ దర్శనంతో నాకు శాపం పోతుందని ఆయనే అన్నారు. నన్ను ఈ మంటల నుండి కాపాడితే నీకు మేలు చేస్తాను’ అని కర్కోటకుడు పణకగా నలుడు వానిని యీవలకు తెచ్చి వదిలాడు.

అపుడు శర్కోటకుడు :
‘ఆర్యా! మీరు పది అడుగులు వేయండి. మీకు శుభం కలుగు తుంది’, అన్నాడు.
నలుడు పదో అడుగు వెయ్యగానే కర్కోటకుడు నలుని కాటు వేశాడు. ఆ పర్పవిషం ఎక్కగానే నలుడు నల్లని మరుగుజ్జు వాడయాడు.

నలుడు తెల్ల బోయిచూడగా, కర్కోటకుడు:
మహారాజా ! బాధపడకు. ప్రస్తుతం నన్ను కలిపురుషుడు బాధిస్తు న్నాడు. నా విషంతో వాడు పడుతూంటాడు. అంతవరకూ నీ రూపం ఎవరికీ తెలియకుండా రహస్యంగా గడపడానికే నేను కాటు వేశాను. ఇది మొదలు నీ పేరు బాహుకుడు.

ఇప్పుడు నువ్వు అయోధ్యకు వెళ్ళి ఆ రాజు ఋతువర్ణుని కొలువులో చేరు. ఆయనకు జూదం అంటే పిచ్చి. ఆయన దగ్గర ఆ విద్య గ్రహించా అంటే నీకు తెలిసిన అశ్వహృదయం ఆయనకు నేర్పాలి. దానితో మిగిలిన కార్యాలు చక్కబడతాయి.

నీకు నీ రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను స్మరించు’, అని చెప్పి మాయమయ్యాడు.

బాహుక రూపంతో నలుడు అయోధ్య చేరి, రాజును దర్శించి, తనకు అశ్వశాస్త్రం తెలుసుననీ, ద్యూతం కూడా వచ్చుననీ, పంట చెయ్యటంలో మంచి అనుభవం ఉన్నదని చెప్పగా, ఆ మహారాజు వానిని తన అశ్వపాలకుడుగా నియమించాడు.

అలా కాలం గడుపుతున్నాడు నలుడు, నిత్యం రాత్రి వేళల దమ యంతినే స్మరించు కుంటూ.

తన కుమార్తె దమయంతి, అల్లుడు నలమహారాజు అరణ్యాల పాలయారని విన్న విదర్భరాజు విచారంలో తన నగరంలోని విప్రవరు లను రావించి :

‘ వేదవిదులారా మీరు దేశ దేశాలు తిరుగుతూ అనేక నగరాలు చూస్తుంటారు. ఎక్కడయినా నా కుమార్తె, ఆమె భర్త కనిపిస్తే వార్త నాకు అందించండి. అందుకు ప్రత్యుపకారంగా మీకు అగ్రహారం యిచ్చి వందల గోవులు సమర్పిస్తాను’ అన్నాడు.

వారందరూ తమ పర్యటనలో నందమయంతుల జాడ తెలుసు కోవడానికి ప్రయత్నాలు ఆరంభించారు.

వారిలో సుదేవుడనే విద్వాంసుడు చేది రాజ్యంచేరి, రాజు యింట శుభకార్యం జరిగే వేళ అక్కడ ఉన్న నారీమణులమధ్య దమయంతిని గుర్తుపట్టాడు.

పతి వియోగంతో, అరణ్య యాత్రల క్లేశాలతో కృశించిన దమ యంతి రాహు గ్రస్తమయిన చంద్రబింబంలా, ఎండకు వాడిపోయిన తామరపూవులా కనిపించింది.

నెమ్మదిగా వీలు చూసి ఆమెను ఏకాంతములో కలిసి, తన కథ చెప్పాడు సుదేవుడు.

దమయంతి మాట్లాడకుండా బొట బొట కన్నీరు విడిచింది. అది. చూసి రాజకుమారి సునంద ఆ విషయం తన తల్లితో చెప్పింది.

రాజమాత ఆ విప్రునిచేరి వివరా అడిగింది.
ఆయన సంగతులన్నీ చెప్పి:
‘మహారాణి చూశారా! ఈ అమ్మాయి కనుబొమలమధ్య తిలకం వలె ఒక పుట్టుమచ్చ ఉంది. అదిచూసి నేను గుర్తుపట్టాను’ అనగా రాజు మాత దమయంతిని దగ్గరగా తీసుకునిః

బిడ్డా! మీ అమ్మా నేను అక్క-చెల్లెళ్ళం. నీకు ఎంతటి దురవస్థ పట్టిందమ్మా ! అని విచారించింది.

కొంత సేవయాక దమయంతి :
‘పిన్నీ! ఇంతకాలం నే నెవరో తెలియకపోయినా ఎంతో ఆదరంగా చూశావు. ఇప్పుడు నన్ను ఈ విద్వాంసుని వెంట మా పుట్టింటికి పంపు. అక్కడ నా బిడ్డ లిద్దరూ ఉన్నారు. వారిని చూసుకుని కొంత అశ్వాసం పొందుతాను’ అంది.

మరునాడే దమయంతి పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. కన్నబిడ్డలు తల్లిని కౌగిలించుకుని సంతోషంతో కంటనీరు పెట్టారు.

దమయంతి బిడ్డలిద్దరినీ దగ్గరగా తీసుకుని ముద్దాడి, వెన్నుదువ్వి, కన్నీరు తుడిచి, బుజ్జగించింది.

ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. మరునాడు దమయంతి తల్లిత తన భర్తను అన్వేషించే ప్రయత్నం సాగించమంది.

ఆ పనికి బయలుదేరే విద్వాంసులందరినీ రావించి దమయంతి :

‘పుణ్య పురుషులారా! మీరు వెళ్ళిన ప్రతి రాజసభలోనూ యీ సందేశం వినిపించి, అందరినీ పరీక్షగాచూచి, యిది వినగానే ఎవరు చలిస్తారో వానిని గురించి వివరాలు తెలుసుకు రండి.

జూదరి అయిన ఓ ప్రాణేశ్వరా! పతిసేవకే అంకిత మయిన భార్యను నిద్రలో ఉండగా విడిచి, ఆమె చీర చెరగు కట్టుకు వెళ్ళావు. నాటి నుంచీ ఆమె అదే దశలో నిన్నే స్మరిస్తూ కృశిస్తున్నది. కనికరంతో ఆమెకు నీ దర్శన భాగ్యం అనుగ్రహించు ‘

అని దమయంతి వినిపించిన సందేశంతో వెళ్ళిన వారిలో అందరూ ఏ సమాచారం లేకుండానే వచ్చారు.

వారిలో మదేవుడనే విప్రవరుడు దమయంతి దగ్గరకు వచ్చి:

‘అమ్మా! దేశ దేశాలు తిరిగి నేను అయోధ్యలో ఋతుపర్ణుని ఆస్థానంలో నీ సందేశం వినిపించాను. ఆ సభలో ఎవ్వరూ జవాబివ్వలేదు. కాని, సభదాటి వచ్చాక, దారిలో ఒక పురుషుడు (ఆ మహారాజుగారి ఆశ్వపాలకుడు, బాహుకుడని ఆయన పేరు) నేను పలికిన మాటలకు జవాబిచ్చాడు’ అని చెప్పాడు.

ఒక రథం విదర్భ నగర సరిహద్దులలో ప్రవేశిస్తున్నది. ఆ వేగానికి భూమి కంపిస్తున్నది. రాతికోట గోడలు ఊగిపలాడుతున్నాయి. అంత దూరం మంచి అంతఃపురానికి వినబడింది రథ చక్ర నేమిధ్వని.

దమయంతి గుండె పులకించింది. ‘సందేహం లేదు, అది నలుని సారథ్యమే. అంత వేగంగా మరెవరూ రథాన్ని నడవలేరు, ‘ అని నిశ్చయించింది.

ఆ ధ్వనికి విదర్భలోని గుర్రాలు, ఏనుగులూ గజ గజ లాడి ఆకాశంలోకి తలలెత్తి చూశాయి భయంగా.

రథం కోటలోని మధ్య ప్రాకారానికి రాగానే ఆ వార్తవిని విదర్భ రాజు మర్యాదగా ఎదురువచ్చి ఋతుపర్ణునికి స్వాగతం పలికి, అతిథి మర్యాదలు నడిపాడు.

నగరంలో ఎక్కడా స్వయంవర సన్నాహాలు కాని, ఆ ప్రయ త్నాలు కాని కనిపించక ఋతువర్ణుడు తెల్లబోయాడు. ఇలా స్వయంవర వార్త తనకు ఎందుకు పంపారో తెలియలేదు.

ఋతుపర్ణుడు ఎందుకు వచ్చాడో విదర్భ రాజుకు తెలియలేదు.
‘మిత్ర ధర్మంగా వచ్చానన్నా డాయన.
‘సంతోషం’ అన్నాడీయన.
దమయంతి తన చెలికత్తెను పిలిచి :

“కేశినీ। ఆ రథం మీద వచ్చిన పొట్టి చేతుల కురూపివున్నాడే ఆయన ఎవరో ఆయన కథ ఏవిటో వివరంగా తెలుసుకురా’ అని సంపీ౦ంది,

ఆమె నెమ్మదిగా రథం దగ్గరకు వెళ్ళి బాహుకుని చేరి కుశల ప్రశ్నలతో సంభాషణ మొదలు పెట్టి, సేకరించిన సమాచారంతో డమ యంతి దగ్గరకు వచ్చి:

‘అమ్మా రథం మీద వచ్చిన కురూపి ఋతువర్ణులవారి సారథి. మనం పంపిన బ్రాహ్మణుని సందేశం విని ఏ సమాధానం యిచ్చాడో అనే మాటలు చెప్పి విలపించాడమ్మా’ అంది.

దమయంతికి అర్థమయింది ఆ వ్యక్తి నలుడే అని. అయితే ఈ వికారరూపం ఏమిటో అర్థంకాక, మరోసారి దూతికను పంపి, వాని చర్యలన్నీ పసిగట్టి రమ్మంది.

వెళ్ళిన దూతిక తిరిగి వచ్చి:
‘అమ్మా! అంతా అద్భుతంగా ఉన్నదమ్మా!
మన కోటమంచి వారికి అన్నీ పండని పదార్థాలు పంపించారు. అక్కడ వంటశాలలో నీళ్ళులేవు, నిప్పులేదు. బాహుకుడు ఒక్కసారి అక్కడున్న ఖాళీ కుండలలోకి చూడగానే అవి నీటితో నిండాయి. రెండు గడ్డి పరకలు తీసి సూర్యుని కెదురుగా ఉంచాడు. అవి మండడం ఆరం భించాయి. క్షణాలలో వంట పూర్తి అయింది.

ఆ పరిసరాలలోని మన ంతానికుంజాలలో వికసించిన పువ్వులు తీసి ఆయన నలిపి పారేశాడు. ఆ చేతులలో అంత నలిగినా అవి వాడి పోకుండా అప్పుడే రేకులు విచ్చిన వాసన లీముతున్నాయి.

అలా దూతిక చెప్పుతూంటే దమయంతి విశ్వాసం మరింత పెరిగి, ఆయన వండిన పదార్థాలు తీసుకు రమ్మని చెప్పింది. తెచ్చిన వంట కాల రుచిని బట్టి అది నలుని చేతి వంటయే అని గ్రహించింది.

తన బిడ్డ లిద్దరినీ యిచ్చి దూతికను నలుని దగ్గరకు పంపింది. వారిని చూస్తూనే దగ్గరకు తీసుకుని బాహుకుడు గోలు గోజున విలపించాడు.

తన పిల్లలు కూడా యిలా ముద్దుగా ఉండే వారనీ, వీరిని చూడ గానే వారు గుర్తు వచ్చి విచారించా’ ననీ అన్నాడు.

ఈ కబురు విన్న దమయంతికి సందేహం పూర్తిగా తీరింది. తల్లి దగ్గరకు వెళ్ళి :

‘అమ్మా! ఆయనను అంతఃపురానికి రప్పించి అసలు విషయం తెలుసుకోవాలి’ అంది.

ఆవిడ మహారాజుతో సంప్రదించి బాహుకుని రప్పించింది.
దమయంతిని చూస్తూనే బాహుకుడు కంటనీరు పెట్టాడు. దుఃఖం పొంగిపొర్లింది. దమయంతి కూడా అదే దశలో పడింది కొంత సేపు యిద్దరూ దుఃఖించారు.

దమయంతి దుఃఖాన్ని దిగమింగుతూ :
‘బాహుకా! ఘోరారణ్యంలో భార్యను విడిచి వెళ్ళిన పురుషుని ఎక్కడయినా చూశావా? ఆమె ఎ అపరాధం చేసిందని అలా విడిచి వెళ్ళాడో కనుక్కున్నావా ? దేవతలను కూడా తిరస్కరించి అనురాగంతో వరించి, సంతానవతిని అయిన నన్ను అలా ఒంటరిగా వదలి వెళ్ళడం న్యాయమనీ భావించాడా ఆయన ధర్మార్థ కామాలు మూడూ కలిసి సాగించి, అనుభవిద్దాం అని అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న నన్ను విడవడం ధర్మమా ? ‘

అని అడుగుతూంటే బాహుకుని కన్నుల వెంట అశ్రుధారలు కురిశాయి.

‘ ఓ మహాసాధ్వీ | యింకా నీ మాటల శూలాలతో నన్ను వేధించకు. మనకు కలిగిన క్లేశాలన్నీ కలిపురుషుని పగవల్ల వచ్చినవి. ఇప్ప టికి వాడు నన్ను విడిచాడు. కమక యిక్కడకు రాగలిగాను.

అనురాగంతో ఆనందమయ జీవితం గడిపిన నారీమణి పంపురు మని వివాహ మాడుతుందని ఊహించలేకపోయాను. మీ నాన్నగారు నీ ద్వితీయ స్వయంవరం ప్రకటించడం వల్ల మా మహారాజును తీసుకు వచ్చాను’ అని రోదించాడు.

అప్పుడు దమయంతి :

“నన్ను శంకించకండి. మీ జాడ కని పెట్టడానికి నేనే ఆ నందేశం పంపాను. నగరంలో స్వయంవర సన్నాహాలు మీకు కనబడ్డాయా మా నాన్న గారికి కూడా మీ రెందుకు వచ్చారో తెలీదు. మీరు తప్ప ఇంత దూరం రథాన్ని ఒక్కరోజులో నడపగలవారు లేరని ఎరుగుదును. నా ఊహ నిజమయింది’ అంది.

బాహుకుడు కర్కోటకుని స్మరించాడు. అంతే బాహుకుడు నలు డుగా సుందర రూపంతో సాక్షాత్కరించాడు. నలదమయంతులు ఇద్దరూ ఒకరి నొకరు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు.

వాడిపోతున్న నారు మడికి తొలకరి చినుకులు పడినట్లు వారి దుఃఖభర హృదయాలు ఆనంద గగనంలో విహరించాయి. మరునాడు తెలతెల వారుతూండగా నందమయంతులు అభ్యంగన స్నానంచేసి నూతన వస్త్రాలు ధరించి మహారాజును సమీపించి నమస్కరించారు.

ఆయన వరమ సంతోషంతో వారిని ఆశీర్వదించి నగరంలో ఉత్ప వాలు జరిపించాడు.

తన సేవకుడుగా ఉన్న బాహుకుడు వలుడని తెలియగానే ఋతు ఎర్ణుడు వచ్చి క్షమార్పణ కోరాడు. అనంతరం వారివద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు.

నలదమయంతులు కొంతకాలం ఇక్కడే సుఖభోగాలు అనుఖి వించారు.

అప్పుడొకనాడు నలుడు:
‘నే నిప్పుడు పుష్కరుని ఓడించగల ద్యూత రహస్యాలు నేర్పు కున్నాను. వెళ్ళి వాడితో ఆడి, ఓడించి మన రాజ్యం సంపాదించి వస్తామ’ అని వెళ్ళి పుష్కరుని జూదానికి పిలిచాడు. పుష్కరుడు వరమ సంతోషంతో జూదానికి దిగి సర్వమూ ఓడిపోయి నలుని పాదాల మీద పడ్డాడు.

నలుడు వానిని క్షమించి :
“నీ రాజ్యానికి నవ్వుహా ” అన్నాడు.
అనంతరం దమయంతినీ, బిడ్డలనూ రప్పించి ధర్మమార్గావ సత్య పాలనం సాగించి సర్వ ప్రకారంజకుడనే పేరు సంపాదించాడు.

అని మార్కండేయుడు కథ ముగిస్తూ
ధర్మనందనా ! విన్నావుకదా!
ఆయన ఎన్ని క్లేశాలు పడినా ధర్మమార్గం విడవక సత్యం తప్పక నడిచి నందువల్ల సుఖంగా జీవించి, కీర్తి సంపాదించాడు అన్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Gomatha Mahatmyamu In Telugu – గోమాత మహాత్మ్యము

Gomatha Mahatmyamu Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గో మహాత్మ్యము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

Go Mahatmyamu In Telugu Lyrics

గో మహాత్మ్యము తెలుపు శ్లోకములు

కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థిప గవార్ధే ప్రశస్యతేవీర | సర్వపాపహరంశివమ్ || గోమూత్రంగోమయం క్షీరం దధిసర్పికుశోదకం నిర్దిష్టం పంచగవ్యం తు సర్వపాపహరంశుభం గో,భూ,తిల,హిరణ్యాజ్యవాసో ధాన్యగుడానిచ రౌప్యం లవణమిత్యాహు । దశదానాఃప్రకీర్తితాః నమోగోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవచ నమోబ్రహ్మసుతాభ్య శ్చ పవిత్రాభ్యోనమోనమః నమోబ్రహ్మణ్యదేవయ గోబ్రాహ్మణహితాయచ | జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయనమోనమః గవాం శతహస్రం చ బ్రాహ్మణేభ్యోనరాధిపః | ఏకైకశో దదౌరాజాపుత్రా నుద్దిశ్యధర్మతః | సువర్ణ శృంగ్యఃసంపన్నా, సవత్సాః కాంస్యదోహనాః గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభః॥ గవాం రుక్మవిషాణీనాం రూప్యాంఫ్రిణాంసువాససామ్ | పయశ్శీలవయోరూప వత్సోపస్కార సంపదామ్ | గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి స్సత్యవాదిభిః | ఆలుబ్జె ర్దానాశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ || సర్వోపనిషదో గావో దోగ్ధాగోపాలనందనః | పార్థోవత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం ||

ధేను మాహాత్మ్యమ్

శ్లో॥ గోమయ ప్రాశన ఫలంమయావక్తుం శక్యతే |
ధేనుమాహాత్మ్యమేతత్తేవక్ష్యామి శుణుపార్వతి ||
పాదేషుపితరశ్చైవ ఖురాగ్రేవసవస్తథా |
ఊరౌచద్వాదశాదిత్యాః పృష్ఠాదిక్పాలకాస్తధా॥
జిహ్వాయాంచ చతుశ్వేదాః దేవతా దంతపంక్తిషు |
నాసిక్యాం శీతలాదేవి ఋషయశ్చక్షుషీతధా ||
భ్రూమధ్యేచ నవబ్రహ్మ ఫాలే జీవేశ్వరస్తధా |
భుజేవాణీ ముఖేజ్యేష్ఠా అస్థి చర్మేచ శాంకరీ॥
శ్రోత్రే శంఖంచ చక్రంచ శృంగేచ తులసీవనం |
కరిణ్యాం కామధేనుశ్చ ఉదరేధరణీతధా ||
లాంగూలేచ మహానద్యస్తన మూలేచ కేశవః |
స్తనే సప్తసముద్రాశ్చ క్షీరేపంచామృతాస్తధా ||
మూత్రేభాగీరథీచైవ శ్రీలక్ష్మిర్గోమయే తథా |
సర్వరోమసు రుద్రాశ్చ ధేనాస్తిష్టంతి సర్వదా ||
ఆమల్కఫలమాత్రంచ స్మృతంగోమయభక్షణమ్ |
సప్తజన్మాఘనాశం చ ఏకవారేచ భక్షణమ్ ||
ద్వివారేభక్షణేపుత్రాన్ పౌత్రాన్ సౌభాగ్యమాప్నుయాత్ |
త్రివారభక్షణే విష్ణుసాయుజ్యంప్రాప్నుయాత్ |
మాఘేశుక్లేచ సప్తమ్యాం గోష్ఠదేవాలయేపిచ |
విష్ణుపూజాంచ గోపూజాం సదాగోమయభక్షణమ్ |
వర్షమేకంతు కర్తవ్యం తథా ఉద్యాపనం చరేత్ ||
ఉద్వాపన విధింవక్ష్యే సౌవర్ణే రాజతేనవా |
స్వగృహోక్తవిధానేన మండలం కారయేత్తతః ||
మండపం పాలవల్లీంచ రంగవల్లీం లిఖిత్తతః ||
ద్వాత్రింశత్కలశాంశ్చైవ తదభావేతదర్థకం |
కలాశాన్ స్థాపయేత్తత్రవస్త్రాలంకారసంయుతాన్ ||
సౌవర్ణే రాజతేనాపి గాంచవిష్ణుంచ స్థాపయేత్ |
రాత్రేజాగరణంకృత్వా ప్రభాతే విమలేంభసి |
స్నానంకృత్వా విధానేన పూర్వవత్పూజయేద్దరిమ్
స్వర్ణశృంగీం రౌప్యఖురాంగాందద్యాద్భాహ్మణాయవై
దంపతీపూజనం కృత్వా బ్రాహ్మణాన్ భోజయేత్తతః ||
తాంబూలం దక్షిణాందద్యా త్స్వయంభుజీతబంధుభిః |
అనసూయాదిభి స్త్రీభిః చక్రే ఏతద్ర్వతంపురా ||

మరిన్ని భక్తి యోగం:

Go Suktam In Telugu – గో సూక్తం

Go Suktam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గో సూక్తం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

Go Suktam Lyrics

గో సూక్తం

ఆ గావో అగ్మన్నుత భద్రమక్రన్త్సీదన్తు గోష్ఠే రణయన్త్వస్మే ।
ప్రజావతీః పురురుపా ఇహ స్యురిన్ద్రాయ పూర్వీరుషసో దుహానాః ॥

ఇన్ద్రో యజ్వనే పృణతే చ శిక్షత్యుపేద్దదాతి న స్వం మాషుయతి ।
భూయోభూయో రయిమిదస్య వర్ధయన్నభిన్నే ఖిల్యే ని దధాతి దేవయుమ్ ॥

న తా నశన్తి న దభాతి తస్కరో నాసామామిత్రో వ్యథిరా దధర్షతి ।
దేవాంశ్చ యాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిః సచతే గోపతిః సహ ॥

న తా అర్వా రేణుకకాటో అశ్నుతే న సంస్కృతత్రముప యన్తి తా అభి ।
ఉరుగాయమభయం తస్య తా అను గావో మర్తస్య వి చరన్తి యజ్వనః ॥

గావో భగో గావ ఇన్ద్రో మ అచ్ఛాన్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ।
ఇమా యా గావః స జనాస ఇన్ద్ర ఇచ్ఛామీద్ధృదా మనసా చిదిన్ద్రమ్ ॥

యూయం గావో మేదయథా కృశం చిదశ్రీరం చిత్కృణుథా సుప్రతీకమ్ ।
భద్రం గృహం కృణుథ భద్రవాచో బృహద్వో వయ ఉచ్యతే సభాసు ॥

ప్రజావతీః సూయవసం రిశన్తీః శుద్ధా అపః సుప్రపాణే పిబన్తీః ।
మా వః స్తేన ఈశత మాఘశంసః పరి వో హేతి రుద్రస్య వృజ్యాః ॥

ఉపేదముపపర్చనమాసు గోషూప పృచ్యతామ్ ।
ఉప ఋషభస్య రేతస్యుపేన్ద్ర తవ వీర్యే ॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

మరిన్ని భక్తి యోగం:

Lord Krishna Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

Lord Krishna Mangala Harathi Patalu In Telugu

Lord Krishna Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

కృష్ణుడు (లేదా కృష్ణభగవానుడు) హిందూ మతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవతలలో ఒకరు. ఆయనను వైష్ణవ సంప్రదాయంలో విష్ణువుకి అష్టావతారాలలో ఎనిమిదవ అవతారంగా పూజిస్తారు. శ్రీకృష్ణుడు యాదవ వంశంలో వసుదేవుడు, దేవకుల కుమారుడుగా మథురలో జన్మించాడు. ఆయన జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా అత్యంత భక్తితో జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జీవితంలో ఎన్నో సంఘటనలు, లీలలు ఉన్నాయి. చిన్నప్పటి నుండే ఆయన అసురులను సంహరించి, తన భక్తులను కాపాడేవాడు. బాల్యంలో పొట్టి కృష్ణుడి బదురి గోపాలుల కోసం చేసిన అద్భుతాలు, నందగోపుల పాలు, పెరుగు కాపాడిన విధానం, గోపికలతో క్రీడలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీకృష్ణ మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

కేశవా హారతి గైకొను
ఈశా! భవా! కేశవా!

(ఉదయరవిచంద్రిక రాగం – మిశ్రచాపు తాళం)

పల్లవి: కేశవా యీ హారతి గొను ఇంత కోపంబేలనో హరీ
చ 1) పన్నగేంద్ర శయనా రారా పాపము లెడబాపగ రారా
పారిజాత సుమహరణ రాధా రుక్మిణీ వల్లభా

॥ కేశవా ॥

చ 2) కోపమటరా గోపబాలా కోరితి నిన్ గావగరావా
కరుణ తోడుత మమ్ము గావుము
గరుడ వాహన వేగమెరా

॥ కేశవా ॥

చ 3) వాసిగా యీ సంసార సాగర పురము నందుననోదేవ
దానురాలను రక్షింపరా ధర్మపాలన వీడకే

॥ కేశవా ॥

కోరిన హారతుల్ గోవిందునకు
ఆనంద నందన మందిర శ్రీకృష్ణా

(కాపీరాగం – ఆదితాళం)

పల్లవి: కోరిన హారతుల్ గోవిందునకు
కోమలాంగులు గూడివ్వరే॥

ఆ.ప.) పద్మనాభునకు పాటలు పాడిన
పాపాములన్నియు తొలగునుగా॥
గోకులమందున గోవర్ధనమెత్తి
కాచి రక్షించిన శ్రీకాంతునకు

జయ జయ మంగళం శుభమంగళం.
ప్రియ జయ జయ శుభజయ మంగళం శ్రీకృష్ణా

యదుకుల కాంభోజి రాగం – ఆదితాళం)

చ 1) జయ మంగళం శుభ మంగళం
నంద నందనా నీకు మంగళం
జయ మంగళం శుభ మంగళం
నంద నందనా నీకు మంగళం
నిను పాడగా నరులాడగా నీవు
వేడ్కతో జగమేలగ కనులారగ
నిను చూడగ జాతి నై తిర కృష్ణ బాలక॥

పక పక నవ్వుచు పరుగిడబోకు
శుభంకర! శుభకర! సుంధరవీరా! బాలగోపాలా

(యమునా కళ్యాణ రాగం – ఆదితాళం)

ఆ.ప.) పక పక నవ్వుచు పరుగిడబోకుర!
పడతి యశోదా భాగ్యఫలంబా!

పల్లవి: బాలగోపాల మంగళ హారతు లిచ్చెద
చ 1) లేగ తోకను బట్టి లేమ జెడకు చుట్టి
ఊరకె తోలుట ఉచితముగాదు కృష్ణ

॥బాల॥

మాధవ గొనుమా మంగళ హారతి.
సుధామధుగాధా మాధవా!

(జంగ్లారాగం ఆదితాళం)

పల్లవి: మాధవ గొనుమా మంగళ హారతు లిచ్చెద

॥మాధవ॥

చ 1) ఉరమున సిరియును మెరయుచు నుండగ
గరుడ కిన్నెరులు గానము సేయగ
వరుడ వని నెర నమ్మితిని
సరగున మము దయ జేకొను

చ 2) సృష్టి స్థితి లయముననే కృష్ణుడవై జన్మించితిని
దుష్టుల మద మణగించి శిష్టుల పరిపాలించెడి

॥మాధవ॥

మానినిరో మాధవునికి మంగళం
జ్ఞానమాసత్రేణ మాధవా! శ్రీహరి

(హరి కాంభోజి రాగం – త్రిశ్రగలి తాళం)

చ 1) మానినిరో మాధవునకు మంగళం బని
పాడగా పాడగా మానవతులు కూడి వేగ
దీనజనుల బ్రోవు మనుచు
గానలోల గారవించు

॥మానినిరో॥

చ 2) మకరిచేత చిక్కి హరి మొరలు పెట్టగా
తికమకలై సకలాత్ముడు వేగ వచ్చి
సకలనుతా శస్త్రమున
మకరి ద్రుంచి కరి గాచిన

॥మానినిరో॥

చ 3) అంబ తపసి వెడలు బుద్ధి
అంబరీశుని శపియింపగ
డింబ మనుచు చక్రమంటి
కుంభినీ తన యార్చితునకు
సంభ్రమమును కలిగించును

॥మానినిరో॥

చ 4) తులువలైన కౌరవులు
వలువ లొలువ కరుణ కల్గి
కలత తీర్చి పిలువక – నే తరలి వచ్చి
వలువ లిచ్చి పగబాపిన

॥మానినిరో॥

Lord Krishna Mangala Harathi Patalu In Telugu pdf

మంగళ హారతిదేరా
ఆవిరళ సంగరఖేలన ధీరా! గోపాల

(జంగ్లా రాగం – ఆదితాళం)

పల్లవి: మంగళా హారతిదేరా మార సుందరా!
చ 1) రాధారమణా రమ్య గుణాకర
రక్షించు సమయ మిదేరా రాజేంద్ర వినుత

॥మం॥

చ 2) వేణునాద ప్రియ వేగమె కాపాడగ
వేడితీరా నిన్ను వేగమె రారా

॥మం॥

చ 3) గోకులమందున గోపాలుర గూడి
గోవర్ధన మెత్తిన గోపాలా రారా

॥మం॥

చ 4) పదునాల్గు భువనములు బొజ్జ నిల్పిన తండ్రి
పాపుల నందన జంపిన పన్నగ శయనా

॥మం॥

చ 5) వైకుంఠ మందునా వటపత్రసాయివై
వామ భాగమునందు గూడి

॥మం॥

మంగళ హారతిదేరా
ఆనంద నందన సుందరా శ్రీ కృష్ణా

(జంగ్లా రాగం – ఆదితాళం)

పల్లవి: మంగళ హరతిదేరా మారా సుందరా రాధా రమణా రమ్యగుణాకర
రక్షించు సమయ మిదే రాజేంద్ర వినుతా!

చ 1) వేణునాద ప్రియ వేగమె కాపాడరా
వేడితిరా నిన్ను వేవేగమె రారా

॥మం॥

చ 2) గోకుల మందున గోపాలురతో గూడి
గోవర్ధన మెత్తిన గోపాల బాల రారా

॥మం॥

చ 3) పదునాల్గు భువనముల్ బొజ్జ నిలిపిన తండ్రి
పాపుల దుష్టుల చంపిన పన్నగ శయనా

॥మం॥

చ 4) వైకుంఠ మందున వటపత్రశాయివై
వామభాగము నందు లక్ష్మీతో గూడిన

॥మం॥

రంగా! నీకిదే మంగళం.
రంగదుత్తుంగ నానందతరంగా రంగ!

(మోహనరాగం – ఆదితాళం)

పల్లవి: రంగా నీకిదే మంగళం – కస్తూరి రంగా నీకిదే మంగళం

చ 1) రంగ ఖగరాట్ తురంగ కలుష వి
భంగా తవ మోహనాంగా వయ్యారి

॥రంగా॥

చ 2) హరే విబుధ విహారీ ఉభయ
కావేరీ తీర విహారీ వయ్యారి

॥రంగా॥

చ 3) అన్నా యితరుల నన్నెవరు-నీ
కన్న నన్ను బ్రోవుచున్నా-వయ్యారి

॥రంగా॥

చ 4) లీలా శేషాంశు లీలా కరుణాల
వాలా జగత్పరిపాలా-వయ్యారి

॥రంగా॥

చ 5) అయ్యా వరము మాకియ్య నిను నమ్మి
తయ్య నను బ్రోవుమయ్య-వయ్యారీ

॥రంగా॥

చ 6) హాసా మహ చిద్విలాసా శేషాచల
దాశార్చిత పరమేశా-వయ్యారి

॥రంగా॥

రాధా మనోహర హారతి ఇదేరా
సుధా మధుర నిధీ! శ్రీకృష్ణా

(శుద్ధసావేరీ రాగం – ఆదితాళం)

పల్లవి: రాధా మనోహర హారతి ఇదేరా గైకొను ధీరా

చ 1) నారాయణ దామోదర కేశవ
నందుని వర సుకుమారా
నను గావగ నీవేరా
మందారధార సుందరాకార

||రాధా॥

చ 2) శేషశైల ద్వారకావాసా నిజమనీషా రవికుల భూషా
ఆహల్య శాప విమోచనా!
గోపాల బాల కృప జూపుమివేళ

||రాధా॥

చ 3) వైకుంఠవాసా వామనరూపా
వందన మీదే గైకోరా
నను గావవేర వేగరా
కరిరాజ మిత్ర కౌసల్య తనయా

॥రాధా॥

Lord Krishna Mangala Harathlu In Telugu pdf

మంగళ హారతిదేరా
మంగళాంగా! దివ్మతురంగా! శ్రీకృష్ణా!

(జంగ్లారాగం – ఆదితాళం)

పల్లవి: మంగళహారతిదేరా మారా సుందరా
రాధా రమణా రమ్యగుణాకర
రక్షించు సమయ మిదేరా రాజేంద్రా వినుతా

చ 1) వేణునాద ప్రియ వేగమె కాపాడరా
వేడితిరా నిన్ను వేవేగమె రారా

॥మం॥

చ 2) గోకులమందున గోపాలురతో గూడి
గోవర్ధన మెత్తిన గోపాల బాల రారా

॥మం॥

చ 3) పదునాల్గు భువనముల్ బొజ్జలోనిల్పిన తండ్రి
పాప పుదుష్టుల చంపిన పన్నగశయనా

॥మం॥

చ 4) వైకుంఠమందున వటపత్రశాయి వై
వామభాగమునందు లక్ష్మితో గూడిన

॥మం॥

సంగీతలోలా నందునిబాలా
రంగా తరంగ సంగీత భంగీ శ్రీకృష్ణా

(యమునా కళ్యాణి రాగం – ఆదితాళం)

పల్లవి: సంగీతలోలా నందునిబాలా మంగళహారతిగొను మీవేళా||
చ 1) అంగన లందరు శృంగారమ్ముగ
బంగారు పళ్ళెరముల కొని పాడ

చ 2) దేవేంద్రుడు శిలావర్షమ్ము
ధేనువు లన్నిటి పై కురియింపగ కృష్ణ

చ 3) గోవర్ధన గిరి గోటితో ఎత్తి
గోపాలకులను గాచిన కృష్ణ

చ 4) శిశుపాలకునకును చెలియను ఇచ్చుట
సద్విధంబని నుడివెడి జపములు

చ 5) వనుధేశులతో వంచన చేయక
వనిత రుక్మిణిని వేగమె పరిణయమాడిన కృష్ణ

హారతు లేశారమ్మ
ధీరవీర సారమారా శ్రీకృష్ణా

(ఫరజు రాగం – జుంపె తాళం)

పల్లవి: హారతు లివ్వరమ్మా – శ్రీ వేణుగోపాలుని బోలేటి తమ్మునకు

చ 1) తమ్మిట్లు, జూకాలు, తళతళ మెరయగ
వన్నెచక్కనీ చుక్క చిన్నారి తమ్మునకు

॥హారతి ||

చ 2) కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లు మ్రోయగ
చిట్టి పాదాలతో చిందాడే తమ్మునకు

॥హారతి ||

చ 3) వెయ్యి నూటపదహార్లు వెయ్యవలెనేగాని
కొద్దిగా వేస్తేను కోపగిస్తా మేము

॥హారతి ||

శ్రీ రాధాపతే మంగళం
మధుర సుమధుర రాధాపతే

(సింధుభైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: శ్రీరాధాపతే మంగళం ఓధీరా గంభీరా సుందరసుకుమార

చ 1) వేది గోచరుడవు నీవేకదా
మోదముతో నను బ్రోవ రారా
రాదా దయరాదా ఇది మర్యాద

॥రాధా॥

చ 2) మందర ధర నీదు సౌందర్యము
పొందుగ వర్ణింప సాధ్యమా
ఆనందా నంద గోవిందా ముకుందా.

॥రాధా॥

చ 3) ధరలోన మైసూరు పురములోన
వరలిన నన్ను దాసుడను
రాతిని నాతిగ చేసిన శ్రీరామా

॥రాధా॥

మరిన్ని భక్తి గీతాలు : 

Saksham Leni Prema Kastani Kaligistundi In Telugu – సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది

Saksham Leni Prema Kastani Kaligistundi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది నీతికథ.

సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కలిగిస్తుంది

మేనకా, విశ్వామిత్రులు ఎవరి దారిని వారు వెళ్ళారు. ఒక చెట్టు నీడలో శకుంతములు (పక్షులు) పోషిస్తున్నాయి పసిపాపను.

అటువై పు నదీస్నానానికి వచ్చాడు కణ్వమహర్షి. ఆయన కంట పడింది ఆ పాప. ఆమెను రెండు చేతులలోనికి తీసుకుని తన ఆశ్రమానికి తెచ్చి పెంచుతున్నాడు.

శకుంతములు (పక్షులు) పోషించిన కారణంగా ఆమెకు శకుంతల అని పేరుపెట్టాడు.

ఆమె పెరిగి పెద్దదవుతున్నది.
చక్కనిచుక్కలా, అప్పుడే విరిసిన పువ్వులా పదహారేళ్ళ ప్రాయంతో శకుంతల ఆశ్రమంలో తిరుగుతూ కణ్వమహర్షిని కన్నతండ్రిలా సేవించు కుంటున్నది.

అలా రోజులు గడుస్తూండగా ఒకనాడు దుష్యంతమహారాజు ఆ అర డ్యానికి వేటకు వచ్చాడు. వేట సాగుతుండగా ఆ మహారాజు కణ్వమహర్షి ఆశ్రమ ప్రాంతం చేరాడు.

సమీపంలో మహర్షి ఆశ్రమం కనిపించగానే పరివారాన్ని దూరంగా ఉంచి, ఒంటరిగా ఆశ్రమంలో అడుగుపెట్టాడు.
ఎంతటి మహారాజయినా, ఆ రోజులలో వేదవిదులను, మును లను, మహర్షులను అప్పుడప్పుడు స్వయంగా వెళ్ళి దర్శించి, వారి ఆశీ ర్వాదాలు పొందే సంప్రదాయం ఉండేది.

ఆ భావంతోనే ఆశ్రమ పరిసరాలలోని ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా సేననూ, పరివారాన్ని దూరంగా ఉంచి వచ్చాడు.

ఆశ్రమం దగ్గర ఎవరూ కనబడలేదు. కొంచెం లోపలకు నడిచాడు. ఎదురుగా శకుంతల కనిపించింది.

ఆమె శరీర లావణ్యం, అవయవ శోభ మహారాజు మనస్సుమ ఆకర్షించాయి.

మహారాజును చూస్తూనే ఆమె అతిథిమర్యాదలు జరిపింది. ఇరు పురూ కుశలప్రశ్నలు వేసుకున్నారు.

అప్పుడు శకుంతల:
‘ఆర్యా! తమరు మా ఆశ్రమానికి ఏ పనిమీద దయచేశారో సెల విస్తారా’ అంది.

‘ పద్మముఖీ !
నేను అవిల మహారాజు కుమారుడను. నన్ను దుష్యంతుడని పిలు స్తారు. మహాఋషి కణ్వులవారిని దర్శించి వారి ఆశీర్వాదం పొంది వెళ్ళాలని వచ్చాము. వారు కనిపించలేదు’ అన్నాడు దుష్యంతుడు.

శకుంతల! మహారాజా! మా పితృపాదులు ఫలాలు తేవడానికి వెళ్ళారు. మీరు కొంచెం విశ్రాంతి తీసుకొనేలోగా వస్తారు.

దుష్యంతుడు: ఓ లావణ్యలహరి చూడగానే మమ్ము ఆకర్షించిన నీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ అరణ్యంలో ఆశ్రమాలలో ఉండవలసిన అవసరం నీ కెందుకు కలిగింది? నువ్వెవరి బిడ్డవు? ఈ ప్రశ్నలు ఎందుకడుగుతున్నానంటే కణ్వమహర్షి ఇంద్రియాలను జయించి తపోదీక్షలో ఉన్నారని విన్నాం. ఆయనకు వంశానం కలిగే అవకాశం లేదు. నిన్ను నా భార్యగా గ్రహించి రాజ్యానికి తీసుకువెళ్ళి పట్టమహిషిని చేయాలని ఉంది.

శకుంతల ఆర్యా! కణ్వమహర్షి నాకు గురువులు. వారి అనుమతి లేనిదే నేను స్వతంత్రించి ఏ పనీ చెయ్యను. వారు రాగానే మీరు వారిని అడగండి.

దుష్యంతుడు: అతిలోకసుందరీ బ్రహ్మచర్య వ్రతనిష్ఠలో ఉండే కణ్వమహర్షి సంతానం ఎలా కలిగింది?

శకుంతల: మహారాజా! నేను మేసకా విశ్వామిత్రుల బిడ్డను. నన్ను చిన్ననాటి నుంచీ పెంచి పెద్ద చేసిన వీరే నాకు తండ్రివంటివారు.

దుష్యంతుడు : విశ్వామిత్రుని పుత్రివయిన నువ్వు రాజ వంశానికి చెందిన దానవు కనక, రాజులకు ఉచితమయిన గాంధర్వ వివాహం మనం చేసుకోవచ్చు. దానికి ఒకరి అనుమతి అవసరం లేదు.

శకుంతల: మహారాజా! గాంధర్వం ధర్మబద్దమయితే నేను మిమ్ము పెళ్ళి చేసుకుంటాను. కాని ఒక నియమం ఉంది. మీవల్ల నాకు కలిగిన కుమారుడు మీ రాజ్యానికి చక్రవర్తి కావాలి.
అంగీకరించాడు దుష్యంతుడు,
ఇద్దరూ కొంతసేపు సుఖించారు.

దుష్యంతుడు ఆమెను అనునయించి రాజధానికి వెళ్ళగానే చతు రంగ బలాలను పంపి మహారాణిగా తీసుకు వెడతానన్నాడు.

దుష్యంతుడు వెళ్ళిన కొద్దిసేపటికి కణ్వమహర్షి వచ్చాడు. సిగ్గుతో, భయంతో ఉన్న శకుంతల ఆయనకు యథాప్రకారం ఎదురుగా వెళ్ళి నమస్కరించి, చిరునవ్వుతో స్వాగతం పలక లేదు.

కణ్వమహర్షి ఆమెనుచూసి ‘అమ్మా! ఆశీర్వాదం. ఏం జరిగింది. తల్లీ ? నిర్భయంగా చెప్పు’ అన్నాడు.

‘పితృపూజ్య ః దుష్యంత మహారాజు మన ఆశ్రమానికి వచ్చారు. ఆయనను నేను భర్తగా స్వీకరించాను. అనంతర కథ మీరు గ్రహించ గలరు’ అంది శకుంతల.

కణ్వమహర్షి ప్రసన్న వదనంతో !
‘అమ్మా ! చాలా సంతోషం. అనురాగ తరంగిత హృదయులయిన మీరు ఏర్పరచుకున్న సంబంధం క్షత్రియులకు తగినదే. దీనినే గాంధర్వం అంటారు. యోగ్యుడయిన భర్తను పొందావు.

అందువల్ల నీవు ధర్మాత్ముడూ, మహా బలిష్ఠుడూ అయిన కుమా రుని కని కీర్తి పొందుతావు, నీ పుత్రుడు సర్వశత్రు సంహారం చేసి భూ మండలాన్ని పరిపాలించగలడు, ‘ అని ఆశీర్వదించాడు.

రోజులు గడుస్తున్నాయి. నెలలు దాటుతున్నాయి.
మహారాజు నుండి కబురు లేదు. శకుంతల మనసంతా దుష్యంతుని మీదనే ఉన్నది. ఆకలి వెయ్యడం లేదు. పరిశుభ్రంగా స్నానం చెయ్యా అనిపించడం లేదు. ఏ పూట కాపూట రాజధాని నుండి రథం వస్తుందని ఎదురు చూస్తున్నది.

ఈలోగా నెలలు నిండి ఒకానొక శుభ ముహూర్తంలో ఆమె ప్రస వించింది.

కణ్వమహర్షి ఆ బాలుడికి జాతక కర్మ జరిపించాడు.
బాలుడు పెరుగుతున్నాడు. వాని చేతులలో చక్రాలు చక్రవర్తి లక్షణాలని నలుగురు అంటూంటే ఉప్పొంగేది శకుంతలలోని మాతృ హృదయం. ఆరేడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ బాలుడు సింహంవలె పరాక్రమించి, ఆశ్రమ పరిసరాలకు వచ్చే పెద్దపులులనూ, సింహాలనూ, మదగజాలనూ చెవులు వట్టి ఆడించే వాడు.

అది చూసి అక్కడి మునులు వానికి సర్వదమనుడు అని పేరు పెట్టారు.

పెరుగుతూ ఉన్న బాలునికి రాజవంశ సంప్రదాయానుసారం అన్ని విద్యలూ నేర్పుతున్నాడు కణ్వమహర్షి.

పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
అప్పుడొకనాడు కణ్వమహర్షి :

‘అమ్మా! అంతవరకూ మహారాజు కబురు పంపలేదు. ఇప్పుడు నీ కొడుకు యువరాజు పదవి అలంకరించవలసిన వయసులో ఉన్నాడు. ఎంతటి పతివ్రతయినా చిరకాలం పుట్టింట ఉండకూడదు. భర్త దగ్గరే కష్టమయినా, సుఖమయినా అనుభవించడం భార్యకు ధర్మం,’ అని ఆమె కుమారుని దగ్గరగా తీసుకుని.

‘నాయనా! చంద్రవంశీయుడయిన దుష్యంత మహారాజు నీ తండ్రి. నువ్వు మీ అమ్మతో అక్కడకు వెళ్ళి యువరాజు పదవిని ధర్మ దీక్షతో నిర్వహించాలి’ అని తన శిష్యులను పిలిచి.

‘నాయనలారా వీరిద్దరినీ తీసుకు వెళ్ళి దుష్యంత మహారాజు దగ్గర విడిచి రండి’, అన్నాడు.

ప్రయాణ సన్నద్ధురాలై శకుంతల ఆయన పాదాలకు అభివాదం చేసింది.

బ్రహ్మచర్య దీక్షితుడూ, తపస్సంపన్నుడూ అయిన కణ్వమహా మునికి కన్నీరాగలేదు.

పెంచిన ప్రేమ నిండిన గుండెలో బాధ పుట్టింది. కంటనీరు ఒలి కింది. గద్గద స్వరంతో:

‘ లోకమంటే ఏమిటో ఎరగని ఈ అమాయకురాలిమీద దేవతలం దరూ దయ చూపాలి !’ అని ఆశీర్వదించి పంపాడు.

శకుంతల తన కుమారుడైన భరతుని (సర్వదమనుని ముద్దుపేరు) వెంట పెట్టుకుని దుష్యంతుని దగ్గరకు బయలుదేరింది.

అరణ్యం దాటి రాజధాని చేరి దుష్యంతుని కోటలో ఆయన కొలు వులో శకుంతలనూ, భరతునీ విడిచి కణ్వుని శిష్యులు తరలి వెళ్ళారు.

దుష్యంత మహారాజు సభా భవనంలో సింహాసనం మీద ఉన్నాడు. మంత్రి, సామంత, దండనాథులతో విద్వాంసులు కూడా ఆ సభలో ఉచి తావనాల మీద అలరారుతున్నారు.

అప్పుడు వచ్చిన శబంతల, తన కుమారుడయిన భరతుని భుజం మీద చెయ్యి వేసి

‘నాయనా! సత్య ధర్మ పరాయణుడైన ఈ మహారాజు మీనాన్న గారు. ఆయనకు నమస్కరించు,’ అని తను కూడా చేతులు జోడించింది.

కుమారుడు భరతుడు సంతోషంతో ఆశగా తండ్రి వైపు చూశాడు. దుష్యంతుడు: ఓ తరుణీ। నీ బిడ్డను తీసుకుని ఏ ప్రయోజనం కోరి వచ్చావో అడుగు।

శకుంతల మహారాజా! వీడు మీ కుమారుడు. అలనాడు మీరు వేటకు వచ్చి కణ్వాశ్రమంలో గాంధర్వవిధిని నన్ను వివాహం చేసుకునే ముందు నా బిడ్డకు యువరాజు పదవి యిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకోవలసిన భారం మీ మీద ఉంది.

దుష్యంతుడు! ఓ మూర్ఖురాలా! నువ్వెవరివి? నిన్ను నే నెప్పుడూ చూడలేదు. ఇటువంటి అసందర్భపు ప్రలాపాలు కట్టిపెట్టి బయటికినడు.

శకుంతల మహారాజా ! మీరు నన్ను చూడనేలేదా? గుర్తు తెచ్చు కోండి. పన్నెండేళ్ళ క్రితం వేటకువచ్చి మాలినీ నది తీరాన కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర నన్ను కలిసి మీ రాడిన మాటలు మరవ కండి. పంచ భూతాలూ, సూర్య చంద్రులూ, అంతరాత్మ-ఇవన్నీ మనం చేసే ప్రతి పనికీ సాక్షులు. వాటి కన్ను గప్పి ఎవరూ ఏమీ చెయ్యలేరు.

ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను కనక మీరు తిరస్కారభావంతో చూస్తున్నారు. మీ సభలో నా మాటలు అరణ్యరోదనంలా ఉన్నాయి. ఒక్కటి మరువకండి. పురుషుడు పుత్ర రూపంలో భార్యాగర్భంలో ప్రవేశించి పితృదేవతలను ఉద్ధరిస్తాడు. పున్నామ నరకంమంచి కుమారుని వల్లనే బయటపడతాడు. భార్య అనేది తండ్రివలె పురుషుని హితవు కోరుతుంది. తల్లి వలె ఓరిమితో ఓదారుస్తుంది. మిత్రుని వలె సాయపడుతుంది. లోకంలో ఎవ రయినా భార్య కలవానినే విశ్వసిస్తారు. వివాహం కానివాడు ఎంత ధనవంతుడయినా ఆ పంపద, అడవిశాసిన వెన్నెం. అన్ని విధాల తోడునీడగా ఉండాలి కనకనే భార్యను ఎన్నుకునేటప్పుడు రూపంతోపాటు గుణం, గుణంతో శీలం, శీలంతో సంప్రదాయ పదాచారాలు చూచుకుంటారు పెద్దలు.

పోగా –
భార్యగర్భం నుంచి ప్రభవించిన బాలుడు సర్వ విధాలా తండ్రిని పోలి ఉంటాడు. అద్దంలో ప్రతి బింబంలా కుమారునిలో తండ్రి రూపం సాక్షాత్కరిస్తుంది. అందువల్ల నే పుత్రోదయ, దర్శనాలు తండ్రికి ఆహ్లాదం కలిగిస్తాయి.

దేశ భ్రష్టులయి, దుర్భర దారిద్య్ర్యం అనుభవించే వారయినా భార్య దగ్గర ఉంటే ఆకష్టాలు మరచిపోతారు. అందువల్లనే భార్యను అనాదరంతో, ఆగ్రహంతో బాధించరాదు అని వివేకవంతులు చెపు తున్నారు.

మహారాజా ! అంతకంటే ప్రధాన ధర్మం ఉంది.
అది పుత్ర వాత్సల్యం.
పసితనంలో ఎక్కడ పడితే అక్కడ పాకుతూ, దుమ్ములో దొర్లుతూ, అల్లంత దూరంలో తండ్రి కనిపించే సరికి కిలకిల నవ్వుతూ వచ్చి రెండు కాళ్ళూ చుట్టివేసుకుని ఆశగా చూసే కొడుకుకంటే ఆనందం కలిగించే విషయం మరొకటి ఉన్నదా?

నామాట మీకు ఎంత చేదుగా ఉన్నా ఈ మీ కుమారుని వైపు చూడండి. మీ ఒడిలో కూర్చుని యువరాజు ఠీవిని ఒలికించాలనే కోరిక వీడి కన్నులలో మీకు కనిపిస్తుంది.

చిన్న చిన్న చీమల నుంచి పక్షులు, పశువులు తమ సంతానం మీద ఎంతో ప్రేమతో ఉంటాయి. తన గూటిలో ఉన్న కోకిల గుడ్లను కూడా కాకి అమాయకంగా తన సంతానమే అని సాకి పొదుగుచున్నది.

అది ఎరిగిన మీరు మీ కుమారుని విషయంలో ఆవాదరం చూపడం న్యాయం కాదు.

సామాన్య మానవుడు కూడా తిరిగి తిరిగి యింటికి రాగానే తన బిడ్డలను దగ్గరగా తీసుకుని ముద్దులాడి పొంగిపోతాడు.

మరొక మాట:
తన బిడ్డకు ” జాతక కర్మ” జరుపుతూ
” అంగాదంగాత్
సంభవసి……..

నా ప్రతి అవయవం నుంచి మవు జన్మించావు. నా హృదయంలో నువ్వే. నా ఆత్మ నువ్వు. అటువంటి నువ్వు నూరేళ్ళు సుఖంగా బ్రతుకు అంటాడు.

చూడండి నిర్మలమయిన కొలనిలో ప్రతిబింబంలా వీడు ముమ్మూ ర్తులా మిమ్ము పోలి ఉన్నాడు..

అని అలా శకుంతల చెప్పుకు పోతున్నది.
దుష్యంతుడు కదలకుండా పెదవి మెదవకుండా కూర్చున్నాడు.
“మహారాజా ! రాజ కార్యాలలో మునిగి తేలే మీకు అన్ని విష యాలూ గుర్తుండవు.

పన్నెండేళ్ళ క్రితం
వేటకోసం అడవికి వచ్చారు.
మీ బాణానికి అందక పరుగెత్తే లేడికోసం తిరుగుతూ మా ఆశ్ర మంలో ప్రవేశించి గాంధర్వ విధానాన నన్ను పెళ్ళి చేసుకున్నారు.

అప్సరో భామలలో అగ్రశ్రేణికి చెందిన మేనక నా తల్లి .
తేజోవంతుడూ, తపస్వీ అయిన విశ్వామిత్రులవారు నా జనకులు. నన్ను పెంచిన జనకుడు బ్రహ్మర్షి కణ్వులు.

అటువంటి ఉత్తమురాలి నయిన నన్ను తియ్య తియ్యని మాట లతో పరిగ్రహించారు. ఆనాటి మన సమాగ ఫలం ఈ బాలుడు,

విశ్వరక్షతులైన మీరు నా ప్రాణ నాథులు. ధర్మ పరులయిన మీరు నన్ను మోసం చెయ్యకండి.

చిన్న నాడే నా తలిదండ్రులు నన్ను వదిలేశారు. ఇప్పుడు నా ప్రాణ నాథులయిన మీరు కూడా తిరస్కరిస్తున్నారు. కష్టాలు నాకు కొత్తకాదు. కాని ఈ బాలుడు మాత్రం మీ కుమారుడే’ అని నిట్టూర్చింది.

దుష్యంతుడు శకుంతలా సాధారణంగా అబద్ధా లాడడం ఆడవారికి సహజ గుణం. నీ మాటలు మరి సమ్మక్తివంత అబద్దాల పుట్టణ.

ఎక్కడి విశ్వామిత్ర మహర్షి ।
వారికి కలిగిన నువ్వు ఇలా కుంటలా ప్రవర్తిస్తున్నావంటే నిన్ను నమ్మలేను. నువ్వు ఏమేమో కథలు చెపుతున్నావు. నా కనలుగుర్తు లేవు.

శకుంతల మహారాజా! ధర్మ భ్రష్టులను తాచుపాముతో పోలుస్తారు, అందుకే భర్తృ హీవలకు వాస్తికులు కూడా భయపడతారు.

మహారాజా వందనూతులు తవ్వించడం కంటే ఒక దిగుడుబావి నిర్మించడం మంచిది. అటువంటివి నూరు నిర్మించడం కంటే ఒక పర్కతువు మంచిది. అవి నూరు చెయ్యడం కంటే గుణవంతుడయిన కొడుకును కనడం శ్రేష్ఠం. కుమారులు నూరుగురికంటె ఒక్క సత్య వాక్యం శ్రేయోదాయకం. సత్యమే పరమేశ్వరరూపం. అందుచేత మీరు సత్యాన్ని మరువకండి. నన్ను విడిచినా బాధలేదు. నేను పెడతాను. ఆఖరు సారిగా ఇటు వీడికన్నులలో మీ చూపుని నిలవండి. మీ కొడు కవునో కాదో తెలుస్తుంది. సరిగ్గా ఆ సమయానికి ఆ శరీరవాణి ఇలా పలికింది.

‘మహారాజా! ఈమె నీ భార్య, వీడు నీ కుమారుడు. ఆమె నిజం చెప్పింది.’
ఆ మాటలు విని దుష్యంతుడు
‘సభాసదులారా !
విన్నారు కదా ధర్మ దేవత పలుకులు.

ఈమె చెప్పిందంతా నిజమే. కాని ముందుగా అంగీకరిస్తే మీ రంతా ఈ పుణ్యశీలను శంకిస్తారని ఇంతసేపు ఆగామ’

అని కొలువు చాలించి, శకుంతలా భరతులను దగ్గరగా తీసుకుని అంతఃపురానికి వెళ్ళి తన తల్లికి నమస్కరింపజేసి, విషయం వివరించి, ఆశీర్వాదాలు పొందాడు.

(భారతంలో మొదటి ప్రేమ కథ ఇది. సాక్ష్యం లేని ప్రేమ కష్టాన్ని కల్గిస్తుంది. నాడు ధర్మం రక్షించి ఉండకపోతే ఈ నాటి ప్రేమ కథే ఇది కూడా)

మరిన్ని నీతికథలు మీకోసం:

Bhakti Yogam | భక్తి యోగం

Bhakti Yogam

భక్తి యోగం ఒక హిందూ యోగ పథం, మరియు ఆధ్యాత్మిక అభ్యాసము. ఈ యోగంలో, భక్తి మరియు అనుష్ఠానం ముఖ్యమైనవి. వ్యక్తి తన దైవభక్తిని, పరమాత్మ సంబంధమును అభివృద్ధి చేయడానికి ఈ యోగాన్ని అభ్యసించవచ్చు. భక్తి యోగం మూలమైన ఉద్దీపన అనుభవాలతో, అంతరాళంలో చలింపును చేపట్టేది. ఈ యోగం విశేషంగా దేవుని ప్రేమ మరియు భక్తిని వివరించేది.

Bhakti Yogam | భక్తి యోగం

భక్తి యోగం అనేది మనస్సును శుద్ధి చేసే, ఆత్మ అధ్యాత్మిక ప్రయత్నము. అనుష్ఠానాల్లో ప్రార్థన, భజన, ధ్యాన, పరమాత్మ సేవ మరియు ముక్తి సాధన ముందుగా ఉంటుంది. భక్తి యోగం యోగుడును ఆత్మశుద్ధి, సర్వోత్తమ ప్రమేయాలు మరియు ఆనందంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ క్రింది లింకుల ఆధారంగా భక్తి యోగం గురించి తెలుసుకుందాం…

Pooja | పూజ

Pooja

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

Pooja | పూజ

పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. ఈ క్రింది లింకుల ఆధారంగా పూజ గురించి తెలుసుకుందాం…

Sri Ganesh Mahimna Stotram In Telugu | శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రం

Sri Ganesh Mahimna Stotram In Telugu

Sri Ganesh Mahimna Stotram In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రం గురించి తెలుసుకుందాం…

శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రం

అనిర్వాచ్యం రూపం స్తవననికరో యత్ర గలిత
స్తథా వక్ష్యే స్తోత్రం ప్రథమపురుషస్యాత్ర మహతః |
యతో జాతం విశ్వం స్థితమపి సదా యత్ర విలయః
స కీదృగ్గీర్వాణః సునిగమనుతః శ్రీగణపతిః ||

గణేశం గాణేశాః శివమితి చ శైవాశ్చ విబుధాః
రవిం సౌరా విష్ణుం ప్రథమపురుషం విష్ణుభజకాః |
వదంత్యేకం శాక్తాః జగదుదయమూలాం పరిశివాం న
జానే కిం తస్మై నమ ఇతి పరం బ్రహ్మ సకలమ్ ||

తథేశం యోగజ్జా గణపతిమిమం కర్మ నిఖిలం
సమీమాంసా వేదాంతిన ఇతి పరం బ్రహ్మ సకలమ్ |
అజాం సాంఖ్యో బ్రూతే సకలగుణరూపాం చ సతతం
ప్రకర్తారం న్యాయస్త్వథ జగతి బౌద్ధ ధియమితి ||

కథం జ్ఞేయో బుద్ధేః పరతర ఇయం బాహ్యసరణి
ర్యథా ధీర్యస్య స్యాత్స చ తదనురూపో గణపతిః |
మహత్కృత్యం తస్య స్వయమపి మహాన్సూక్ష్మమణువ
ధ్వనిర్జ్యోతిర్బిందుర్గగనసదృశః కిం చ సదసత్ ||

అనేకాస్యో పారాక్షికరచరణో నంతహృదయ
స్తథా నానారూపో వివిధవదనః శ్రీగణపతిః |
అనంతాహ్వః శక్త్యా వివిధగుణకర్మెకసమయే
త్వసంఖ్యాతానంతాభిమతఫలదో నేకవిషయే ||

న యస్యాంతో మధ్యో న చ భవతి చాదిః సుమహతా
మలిప్తః కృత్వేత్థం సకలమపి ఖంవత్స చ పృథక్ |
స్మృతః సంస్మర్తౄణాం సకలహృదయస్థః ప్రియకరో
నమస్తస్మై దేవాయ సకలసువంద్యాయ మహతే ||

గణేశాద్యం బీజం దహనవనితాపల్లవయుతం
మనుశ్చెకార్ణో2యం ప్రణవసహితో భీష్టఫలదః
సబిందుశ్చాంగాద్యాం గణకఋషిఛందోఒస్య చ నిచృ
త్స దేవః ప్రాగ్బీజం విపదపి చ శక్తిర్ణపకృతామ్ ||

గకారో హేరంబః సగుణ ఇతి పుంనిర్గుణమయో
ద్విధాప్యేకో జాతః ప్రకృతిపురుషో బ్రహ్మ హి గణః |
స చేశశ్చోత్పత్తిస్థితిలయకరో2యం ప్రథమకో
యతో భూతం భవ్యం భవతి పతిరీశో గణపతిః ||

గకారః కంఠోర్ధ్వం గజముఖసమో మర్త్యసదృశో
ణకారః కంఠాధో జఠరసదృశాకార ఇతి చ |
అధోభావః కట్యాం చరణ ఇతి హీశో2స్య చ తను
ర్విభాతీత్తం నామ త్రిభువనసమం భూర్భువః సువః ||

గణేశేతి త్ర్యర్థాత్మకమపి వరం నామ సుఖదం
సకృత్రోచ్చైరుచ్చారితమితి నృభిః పావనకరమ్ |
గణేశస్యైకస్య ప్రతిజపకరస్యాస్య సుకృతం
న విజ్ఞాతో నామ్నః సకలమహిమా కీదృశవిధః ||

గణేశేత్యాహ్వాం యః ప్రవదతి ముహుస్తస్య పురతః
ప్రపశ్యంస్తద్వక్త్రం స్వయమపి గణస్తిష్ఠతి తదా |
స్వరూపస్య జ్ఞానం త్వముక ఇతి నామ్నాస్య భవతి
ప్రబోధః సుప్తస్య త్వఖిలమిహ సామర్థ్యమమునా ||

గణేశో విశ్వేఒస్మిన్ స్థిత ఇహ చ విశ్వం గణపతౌ
గణేశో యత్రాస్తే ధృతిమతిరమైశ్వర్యమఖిలమ్ |
సముక్తం నామైకం గణపతిపదం మంగళమయం
తదేకాస్యే దృష్టే సకలవిబుధాస్యేక్షణసమమ్ ||

బహుక్లేశైర్వ్యాప్తః స్మృత ఉత గణేశే చ హృదయే
క్షణాత్ క్లేశాన్ముక్తోభవతి సహసా త్వభ్రచయవత్ |
వనే విద్యారంభే యుధి రిపుభయే కుత్ర గమనే
ప్రవేశే ప్రాణాంతే గణపతిపదం చాశు విశతి ||

గణాధ్యక్షో జ్యేష్ఠః కపిల అపరో మంగళనిధి
ర్దయాలుర్హేరంబో వరద ఇతి చింతామణిరజః |
వరానీశో ఢుంఢిర్గజవదననామా శివసుతో
మయూరేశో గౌరీతనయ ఇతి నామాని పఠతి ||

మహేశో2యం విష్ణుః సకవిరవిరిందుః కమలజః
క్షితిస్తోయం వహ్నిః శ్వసన ఇతి ఖం త్వద్రిరుదధిః |
కుజస్తారః శుక్రో పురురుడుబుధో గుశ్చ ధనదో
యమః పాశీ కావ్యః శనిరఖిలరూపో గణపతిః ||

ముఖం వహ్నిః పాదౌ హరిరపి విధాతా ప్రజననం
రవిర్నేత్రే చంద్రో హృదయమపి కామోస్య మదనః |
కరౌ శక్రః కట్యామవనిరుదరం భాతి దశనం
గణేశస్యాసన్వె క్రతుమయవపుశ్చైవ సకలమ్ ||

అనర్ఘ్యాలంకారైరరుణవసనైర్భూషితతనుః
కరీంద్రాస్యః సింహాసనముపగతో భాతి బుధరాట్ |
స్మితాస్యాత్తన్మధ్యేఒప్యుదితరవిబింబోపమరుచిః
స్థితా సిద్ధిర్వామే మతిరితరగా చామరకరా ||

సమంతాత్తస్యాసన్ ప్రవరమునిసిద్ధాః సురగణాః
ప్రశంసంతీత్యగ్రే వివిధనుతిభిః సాంజలిపుటాః |
బిడౌజాద్యైర్బహ్మాదిభిరనువృతో భక్తనికరై
ర్గణక్రీడామోదప్రముదవికటాద్యైః సహచరైః ||

వశిత్వాద్యష్టాష్టాదశదిగఖిలాల్లోలమనువా
గ్ధృతిః పాదూః ఖడ్గంజనరసబలాః సిద్ధయ ఇమాః |
సదా పృష్టే తిష్ఠంత్యనిమిషదృశస్తన్ముఖలయాః
గణేశం సేవంతే ప్యతినికటసూపాయనకరాః ||

మృగాంకాస్యా రంభాప్రభృతిగణికా యస్య పురతః
సుసంగీతం కుర్వంత్యపి కుతుకగంధర్వసహితాః |
ముదః పారో నాత్రేత్యనుపమపదే దౌర్విగలితా
స్థిరం జాతం చిత్తం చరణమవలోక్యాస్య విమలమ్ ||

హరేణాయం ధ్యాతస్త్రిపురమథనే చాసురవధే
గణేశః పార్వత్యా బలివిజయకాలే పి హరిణా |
విధాత్రా సంసృష్టావురగపతినా క్షోణిధరణే
నరైః సిద్ధా ముక్తే త్రిభువనజయే పుష్పధనుషా ||

అయం సుప్రాసాదే సుర ఇవ నిజానందభువనే
మహాన్ శ్రీమానాద్యో లఘుతరగృహే రంకసదృశః |
శివద్వారే ద్వాఃస్థో నృప ఇవ సదా భూపతిగృహే
స్థితో భూత్వోమాంకే శిశుగణపతిర్లాలనపరః ||

అముష్మిన్ సంతుష్టే గజవదన ఏవాపి విబుధే
తతస్తే సంతుష్టాస్ట్రిభువనగతాః స్యుర్బుధగణాః |
దయాళుర్హేరంబో న చ భవతి యస్మింశ్చ పురుషే
వృథా సర్వం తస్య ప్రజననమతః సాంద్రతమసి ||

వరేణ్యో భూశుండిర్భృగుగురుకుజా ముద్గలముఖా
హ్యపారాస్తద్భక్తా జపహవనపూజాస్తుతిపరాః |
గణేశోయం భక్తప్రియ ఇతి చ సర్వత్ర గదితం
విభక్తిర్యత్రాస్తే స్వయమపి సదా తిష్ఠతి గణః ||

మృదః కాశ్చిద్ధాతోశ్ఛదవిలిఖితా వాపి దృషదః
స్మృతా వ్యాజాన్మూర్తిః పథి యది బహిర్యేన సహసా |
అశుద్ధోఒద్ధా ద్రష్టా ప్రవదతి తదాహ్వాం గణపతేః
శ్రుతా శుద్ధో మర్త్యో భవతి దురితాద్విస్మయ ఇతి ||

బహిర్ద్వారస్యోర్ధ్వం గజవదనవర్ష్మేంధనమయం
ప్రశస్తం వా కృత్వా వివిధకుశలైస్తత్ర నిహతమ్ |
ప్రభావాత్తన్మూర్త్యా భవతి సదనం మంగళమయం
విలోక్యానందస్తాం భవతి జగతో విస్మయ ఇతి ||

సితే భాద్రే మాసే ప్రతిశరది మధ్యాహ్నసమయే
మృదో మూర్తిం కృత్వా గణపతితిధౌ ఢుంఢిసదృశీమ్ |
సమర్చత్యుత్సాహః ప్రభవతి మహాన్ సర్వసదనే
విలోక్యానందస్తాం ప్రభవతి నృణాం విస్మయ ఇతి ||

తథా హ్యేకః శ్లోకో వరయతి మహిమ్నో గణపతేః
కథం స శ్లోకేస్మిన్ స్తుత ఇతి భవేత్సంప్రపతితే |
స్మృతం నామాస్యైకం సకృదిదమనంతాహ్వయసమం
యతో యస్యెకస్య స్తవనసదృశం నాన్యదపరమ్ ||

గజవదన విభో యద్వర్జితం వైభవం తే
త్విహ జనుషి మమేత్థం చారు తద్దర్శయాశు |
త్వమసి చ కరుణాయాః సాగరః కృత్స్నదాతా
ప్యతి తవ భృతకోఒహం సర్వదా చింతకోస్మి ||

సుస్తోత్రం ప్రపఠతు నిత్యమేతదేవ
స్వానందం ప్రతి గమనే ప్యయం సుమార్గః |
సంచింత్యం స్వమనసి తత్పదారవిందం
స్థాప్యాగ్రే స్తవనఫలం నతీః కరిష్యే ||

గణేశదేవస్య మాహాత్మ్యమేత
ద్యః శ్రావయేద్వాపి పఠేచ్ఛ తస్య |
క్లేశా లయం యాంతి లభేచ్చ శీఘ్రం
స్త్రీపుత్రవిద్యార్థగృహం చ ముక్తిమ్ ||

ఇతి శ్రీపుష్పదంతవిరచితం శ్రీగణేశమహిమ్నః స్తోత్రమ్ |

మరిన్ని స్తోత్రములు:

Sri Shiva Mahimna Stotram In Telugu | శ్రీ శివ మహిమ్నః స్తోత్రం

Shri Shiva Mahimna Stotram In Telugu

Sri Shiva Mahimna Stotram In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ మహిమ్నః స్తోత్రం గురించి తెలుసుకుందాం…

శ్రీ శివ మహిమ్నః స్తోత్రం

మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్ర్బహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః |
అథా౬వాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్
మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః ||

అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయో
రతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే శ్రుతిరపి |
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః ||

మధుస్ఫీతా వాచః పరమమమృతం నిర్మితవత
స్తవ బ్రహ్మన్ కిం వాగపి సురగురోర్విస్మయపదమ్ |
మమ త్వేతాం వాణీం గుణకథనపుణ్యేన భవతః
పునామీత్యర్ధే౬స్మిన్ పురమథన బుద్ధిర్వ్యవసితా ||

తవైశ్వర్యం యత్తజ్జగదుదయరక్షాప్రలయకృత్
త్రయీవస్తువ్యస్తం తిసృషు గుణభిన్నాసు తనుషు |
అభవ్యానామస్మిన్ వరద రమణీయామరమణీం
విహంతుం వ్యాక్రోశీం విదధత ఇహైకే జడధియః ||

కిమీహః కిం కాయః స ఖలు కిముపాయ భువనం
కిమాధారో ధాతా సృజతి కిముపాదాన ఇతి చ |
అతర్క్యైశ్వర్యే త్వయ్యనవసరదుఃస్థో హతధియః
కుతర్కోజియం కాంశ్చిన్ముఖరయతి మోహాయ జగతః ||

అజన్మానో లోకాః కిమవయవవంతోపి జగతా
మధిష్ఠాతారం కిం భవవిధిరనాదృత్య భవతి |
అనీశో వా కుర్యాద్భువనజననే కః పరికరో
యతో మందాస్త్వాం ప్రత్యమరవర సంశేరత ఇమే ||

త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ |
రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిల నానాపథజుషాం
నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్థవ ఇవ ||

మహోక్షః ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణినః
కపాలం చేతీయత్తవ వరద తంత్రోపకరణమ్ |
సురాస్తాం తామృద్ధిం దధతి తు భవద్ర్భూప్రణిహితాం
న హి స్వాత్మారామం విషయమృగతృష్ణా భ్రమయతి ||

ధ్రువం కశ్చిత్ సర్వం సకలమపరస్త్వధ్రువమిదం
పరో ధ్రావ్యాధౌవ్యే జగతి గదతి వ్యస్తవిషయే |
సమస్తేఒప్యేతస్మిన్ పురమథన తైర్విస్మిత ఇవ
స్తువంజిప్రేమి త్వాం న ఖలు నను ధృష్టా ముఖరతా ||

తవైశ్వర్యం యత్నాద్యదుపరి విరించిర్హరిరధః
పరిచ్ఛేత్తుం యాతావనలమనలస్కంధవపుషః
తతో భక్తిశ్రద్ధాభరగురుగృణద్భ్యాం గిరిశ యత్
స్వయం తస్థే తాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి ||

అయత్నాదాపాద్య త్రిభువనమవైరవ్యతికరం
దశాస్యో యద్భాహూనభృత రణకండూపరవశాన్ |
శిరఃపద్మశ్రేణీరచితచరణాంభోరుహబలేః
స్థిరాయాస్త్వద్భక్తేస్త్రిపురహర విస్ఫూర్జితమిదమ్ ||

అముష్య త్వత్సేవాసమధిగతసారం భుజవనం
బలాత్ కైలాసేఒపి త్వదధివసతౌ విక్రమయతః |
అలభ్యా పాతాలే౬ప్యలసచలితాంగుష్ఠశిరసి
ప్రతిష్ఠా త్వయ్యాసీధ్రువముపచితో ముహ్యతి ఖలః ||

యదృద్ధిం సుత్రామ్లో వరద పరమోచ్చెరపి సతీ
మధశ్చక్రే బాణః పరిజనవిధేయత్రిభువనః |
న తచ్చిత్రం తస్మిన్ వరివసితరి త్వచ్చరణయో
ర్న కస్యాప్యున్నత్యై భవతి శిరసస్త్వయ్యవనతిః ||

అకాండబ్రహ్మాండక్షయచకితదేవాసురకృపా
విధేయస్యాసీద్యస్త్రినయనవిషం సంహృతవతః |
స కల్మాషః కంఠే తవ న కురుతే న శ్రియమహో
వికార్కోపి శ్లాఘ్యో భువనభయభంగవ్యసనినః ||

అసిద్ధార్ధా నైవ క్వచిదపి సదేవాసురనరే
నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః |
స పశ్యన్నీశ త్వామితరసురసాధారణమభూత్
స్మరః స్మర్తవ్యాత్మా న హి వశిషు పథ్యః పరిభవః ||

మహీ పాదాఘాతాద్ర్వజతి సహసా సంశయపదం
పదం విష్ణోగ్రామ్యద్భుజపరిఘరుగగ్రహగణమ్ |
ముహుర్ద్యార్ధాస్థ్యం యాతనిభృతజటాతాడితతటా
జగద్రక్షాయై త్వం నటసి నను వామైన విభుతా ||

వియద్వ్యాపీ తారాగణగుణితఫేనోద్గమరుచిః
ప్రవాహో వారాం యః పృషతలఘుదృష్టః శిరసి తే |
జగద్ద్వీపాకారం జలధివలయం తేన కృతమి
త్యనేనైవోన్నేయం ధృతమహిమ దివ్యం తవ వపుః ||

రథః క్షోణీ యంతా శతధృతిరగేంద్రో ధనురథో
రథాంగే చంద్రార్కౌ రథచరణపాణిః శర ఇతి |
దిధక్షోస్తే కోయం త్రిపురతృణమాడంబరవిధి
ర్విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రభుధియః ||

హరిస్తే సాహస్రం కమలబలిమాధాయ పదయో
ర్యదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలమ్ |
గతో భక్త్యుద్రేకః పరిణతిమసౌ చక్రవపుషా
త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతామ్ ||

క్రతౌ సుప్తే జాగ్రత్త్వమసి ఫలయోగే క్రతుమతాం
క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే |
అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదానప్రతిభువం
శ్రుతౌ శ్రద్ధాం బద్ధ్వా దృఢపరికరః కర్మసు జనః ||

క్రతౌ సుప్తే జాగ్రత్త్వమసి ఫలయోగే క్రతుమతాం
క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే |
అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదానప్రతిభువం
శ్రుతౌ శ్రద్ధాం బద్ధ్వా దృఢపరికరః కర్మసు జనః ||

క్రియాదక్షో దక్షః క్రతుపతిరధీశస్తనుభృతా
మృషీణామార్త్విజ్యం శరణద సదస్యాః సురగణాః |
క్రతుభేషస్త్వత్తః క్రతుఫలవిధానవ్యసనినో
ధ్రువం కర్తుః శ్రద్ధావిధురమభిచారాయ హి మఖాః ||

ప్రజానాథం నాథ ప్రసభమభికం స్వాం దుహితరం
గతం రోహిద్భూతాం రిరమయిషుమృష్యస్య వపుషా |
ధనుష్పాణేర్యాతం దివమపి సపత్రాకృతమముం
త్రసంతం తేజ ద్యాపి త్యజతి న మృగవ్యాధరభసః ||

స్వలావణ్యాశంసాధృతధనుషమహ్నాయ తృణవత్
పురః పుష్టం దృష్ట్వా పురమథన పుష్పాయుధమపి |
దేవీ యమనిరత దేహార్ధఘటనా
యది స్త్రైణం -దవైతి త్వామద్ధా బత వరద ముగ్ధా యువతయః ||

భవః శర్వో రుద్రః పశుపతిరథోగ్రః సహమహాం
స్తథా భీమేశానావితి యదభిధానాష్టకమిదమ్ |
అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవ శ్రుతిరపి
ప్రియాయాస్మై ధామ్నే ప్రవిహితనమస్యోస్మి భవతే ||

నమో నేదిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమో
నమః క్షోదిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః |
నమో వర్షిష్ఠాయ త్రినయన యవిష్ఠాయ చ నమో
నమః సర్వస్మై తే తదిదమితి శర్వాయ చ నమః ||

బహులరజసే విశ్వోత్పత్తా భవాయ నమో నమః
ప్రబలతమసే తత్సంహారే హరాయ నమో నమః |
జనసుఖకృతే సత్త్వోద్రిక్తా మృడాయ నమో నమః
ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః ||

కృశపరిణతి చేతః క్లేశవశ్యం క్వ చేదం
క్వ చ తవ గుణసీమోల్లంఘినీ శశ్వదృద్ధిః |
ఇతి చకితమమందీకృత్య మాం భక్తిరాధా
ద్వరద చరణయోస్తే వాక్యపుష్పోపహారమ్ ||

అసితగిరిసమం స్యాత్కజ్జలం సింధుపాత్రే
సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీ |
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం న యాతి ||

అసురసురమునీంద్రెరర్చిత స్యేందుమౌళే
ర్గథితగుణమహిమ్నో నిర్గుణస్యేశ్వరస్య ||
సకలగణవరిష్ఠః పుష్పదంతాభిధానః
రుచిరమలఘువృత్తైః స్తోత్రమేతచ్చకార ||

అహరహరనవద్యం ధూర్జటేః స్తోత్రమేతత్
పఠతి పరమభక్త్యా శుద్ధచిత్తః పుమాన్ యః |
స భవతి శివలోకే రుద్రతుల్యస్తథాత్ర
ప్రచురతరధనాయుః పుత్రవాన్ కీర్తిమాంశ్చ ||

మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః |
అఘోరాన్నాపరో మంత్రో నాస్తి తత్త్వం గురోః పరమ్ ||

దీక్షా దానం తపస్తీర్థం జ్ఞానం యాగాదికాః క్రియాః |
మహిమ్నః స్తవ పాఠస్య కలాం నార్హంతి షోడశీమ్ ||

కుసుమదశననామా సర్వగంధర్వరాజః
శిశుశశిధరమౌలేర్దేవదేవస్య దాసః |
స ఖలు నిజమహిమ్నో భ్రష్ట ఏవాస్య రోషాత్
స్తవనమిదమకార్షీద్దివ్యదివ్యం మహిమ్నః ||

సురవరమునిపూజ్యం స్వర్గమోక్షైకహేతుం
పఠతి యది మనుష్యః ప్రాంజలిర్నాన్యచేతాః |
ప్రజతి శివసమీపం కిన్నరైః స్తూయమానః
స్తవనమిదమమోఘం పుష్పదంతప్రణీతమ్ ||

ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గంధర్వభాషితమ్ |
అనౌపమ్యం మనోహారి శివమీశ్వరవర్ణనమ్ ||

ఇత్యేషా వాఙ్మయీ పూజా శ్రీమచ్ఛంకరపాదయోః |
అర్పితా తేన దేవేశః ప్రీయతాం మే సదాశివః ||

తవ తత్త్వం న జానామి కీదృశోసి మహేశ్వర |
యాదృశో౬సి మహాదేవ తాదృశాయ నమో నమః ||

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః |
సర్వపాపవినిర్ముక్తః శివలోకే మహీయతే ||

శ్రీపుష్పదంతముఖపంకజనిర్గతేన
స్తోత్రేణ కిల్బిషహరేణ హరప్రియేణ |
కంఠస్థితేన పఠితేన సమాహితేన
సుప్రీణితో భవతి భూతపతిర్మహేశః ||

ఇతి శ్రీపుష్పదంత విరచితం శ్రీ శివ మహిమ్నః స్తోత్రమ్ |

మరిన్ని స్తోత్రములు: