మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ ఉపనిషత్తు ప్రారంభం అయినప్పుడు “ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్” అని మంత్రం వచ్చుతుంది. అందువలన ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. ఇతర ఉపనిషత్తుల లాగా కాకుండా, ఇది మంత్ర భాగంలో చేరినది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు ఈశావాస్యోపనిషత్ గురించి తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు పంచబ్రహ్మోపనిషత్ గురించి తెలుసుకుందాం.
Pancha Brahma Upanishad In Telugu
పంచబ్రహ్మోపనిషత్
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్యా దీక్ష నీతికథ.
విద్యా దీక్ష
(ఈ కథ ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో యితర వ్యవహారాల మీద మనసు పోనివ్వకుండా దీక్షగా చదివితే మంచి ఫలితాలు సాధించగలం అనికదా ఈ కథ ద్వారా భారతం చేసిన హితబోధ)
చాలా రోజుల క్రితం మాట !
కశ్యపుడు అనేముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు. అదితి పిల్లలు దేవతలు.
ఈ అన్నదమ్ములు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూనే ఉండే వారు. ఒకప్పుడు వారు, ఒకప్పుడు వీరు గెలిచేవారు.
అలా సాగుతోంది.
అందులో రాక్షసులకు గురువు శుక్రాచార్యులు. దేవతల గురువు బృహస్పతి. ఆ రాక్షసగురువు చాలాకాలం తపస్సు చేసి మృతసంజీవనీ అనే విద్య సాధించాడు. దానివల్ల యుద్ధంలో చచ్చిన రాక్షసులందరినీ మళ్ళీ బ్రతికించేవాడు.
అప్పటికింకా దేవతలు అమృతపానం చెయ్యలేదు. కనుక వారు చచ్చిపోయేవారు. అది చూచి బృహస్పతి తనకుమారుడయిన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవనీ విద్య నేర్చుకురమ్మని పంపాడు.
కచుడు శుక్రాచార్యుల దగ్గరకు వచ్చి:
‘శ్రీగురుభ్యోనమః ‘ అని పాదాలమీద వ్రాలి:
‘నేను అంగీరస వంశ్యడను, బృహస్పతి తనయుడను. నన్ను కచుడు అని పిలుస్తారు. మీ వద్ద విద్యాత్యాసానికి వచ్చాను’ అన్నాడు.
శుక్రాచార్యులు ఆ కుర్రవాని వివయానికి చాలా సంతోషించి: ‘నాయనా! చాలా ఆనందం’ అని ఆశీర్వదించి తన ఆశ్రమంలో ఉండమన్నాడు.’
కచుడు రోజూ సూర్యోదయంకాకుండా లేచి కాలకృత్యాలు ముగించి సంధ్యావందనాలు యథావిధిగా సాగించి గురుశుశ్రూష చేస్తున్నాడు.
శుక్రాచార్యులవారికి దేవయాని అనే కూతురుంది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అందులోనూ వయస్సు వదహారు దాటింది.
ఆ పిల్లకి కచుడు మీద మనసు పడింది. అనేకవిధాల తన ప్రేమను వ్యక్తంచేసేది. కచుడికి తవ విద్యాత్యాసం తప్ప మరోదృష్టి లేదు. పయిగా గురువుగారి కూతురు కమక సోదరభావంతోనే చూపేవాడు.
ఇలా ఉండగా –
రాక్షసులందరూ సమావేశమై ఆలోచించారు.
‘ దేవతల గురువయిన బృహస్పతి కొడుకు మన గురువులవద్ద విద్యా భ్యాసానికి వచ్చాడు? శత్రువర్గం వారి దగ్గర ఏం చదువుదామని వచ్చాడు? ఓహో! మన గురువుగారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది.
అది వీడు నేర్చుకు వెడితే మన వంశానికే ప్రమాదం. కనక వీట్టి అడవిలో చంపి పారేద్దాం’ అని నిశ్చయించారు.
గురు సేవాభావంతో అడవిలో అవులను మేపి వస్తున్న కచుడిని చంపేశారు.
ప్రొద్దు గ్రుంకింది.
చీకటి ముదురుతోంది.
రోజూ సాయం సంధ్యావేళకు ఆశ్రమంచేరే కచుడు అప్పటికీ రాక పోవడంతో దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. కూతురు దుఃఖం చూడలేక శుక్రాచార్యులు దివ్య దృష్టితోచూచి, జరిగిన సంగతి గ్రహించి మృత సంజీవనితో కచుని బ్రతికించాడు.
అది విన్న రాక్షసులకు కడుపు మండి పోయింది. బాగా ఆలో చించారు. కచుని సంహరించి కాల్చి ఆ బూడిద కలిపిన కల్లు తెచ్చి శుక్రాచార్యులకు వివయంగా అందించారు.
ఆయన వెనుక ముందు ఆలోచించకుండా ఆ సురాపానం చేశాడు. వాడు వెళ్ళారు.
మళ్ళీ చీకటి పడింది.
ప్రేమపాశంలో ఉన్న దేవయాని తండ్రి దగ్గరకు వచ్చి ఏడ్చింది.
ఆయన జాలివడి దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది.
‘అమ్మా! ఈ రాక్షసులు వరమ కిరాతకం చేశారు. ఆ బాలుని చితాభస్మం కలిపిన కల్లు నా చేత త్రాగించారు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడు కచుడు. వాడు జీవించాలంటే నా పొట్ట చీల్బుకు రావాలి. వచ్చాక నన్ను బ్రతికించాలి. అంటే లోపం సూక్ష్మ అణువుగా ఉన్న ఆ ప్రాణికి నా విద్య బోధించాలి.
వివేకహీనులైన రాక్షసులు ఈ విధంగా వాడికి మేలు చేశారు, అని పద్మాసనం వేసి, లోపల ఉన్న కచుని ప్రబోధించి మృత సంజీవనీ మంత్రం ఉపదేశించాడు.
కచుడు ఆయన ఉదరం చీల్చుకు వచ్చాడు.
వస్తూనే తాను నేర్పిన విద్యతో గురువుగారిని జీవింపజేసి ఆయన వద్ద సెలవు తీసుకు వెడుతున్నాడు.
వెను వెంట వచ్చి దేవయాని :
‘ఏమయ్యా ః ఇంతకాలం నిన్నే ప్రేమించే నన్ను విడిచి పెడ కావా’ అంది.
‘ సోదరి గురువు తండ్రితో సమానం. ఆ ప్రకారం నువ్వు నాకు చెల్లిలివి ‘, ‘ అన్నాడు.
దేవయానికి కోపం వచ్చి :
‘ఇలా నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపయోగ పడదు బా’ అంది,
‘ సోదరీ ! విద్య ఎప్పుడూ నిరుపయోగం కాదమ్మా! ఈ మృత సంజీవని నీ శాపం ప్రకారం నాకు ఉపయోగపడక పోయినా నేను బోధిం చిన వారికి ఉపయోగపడుతుంది వెళ్ళు’, అని దేవలోకం చేరాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. కఠోపనిషత్ భారతీయ దర్శన సాహిత్యంలో ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటి. ఇది యాజ్ఞవల్క్య శాఖలో ఉన్నది. వేదాంత దర్శనంలో ముఖ్యమైన ప్రమాణ గ్రంథంగా కనిపిస్తుంది. యోగ మార్గం, ఆధ్యాత్మిక జ్ఞానం, మరణం, మరణానంతర జీవితం మొదలు చేస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు కఠోపనిషత్తు గురించి తెలుసుకుందాం.
Kathopanishad In Telugu Book
కఠోపనిషత్
ఓం సహ నావవతు |
సహ నౌ భునక్తు |
సహవీర్యం కరవావహై |
తేజస్వి నావధీతమస్తు |
మా విద్విషావహై |
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు చాక్షుషోపనిషత్ గురించి తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్య వివేక హేతువు నీతికథ.
విద్య వివేక హేతువు:
(ఈ కథ ఆరణ్య పర్వంలో ఉంది)
విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉండేవాడు.
ఎంతటి మహా విద్వాంసుడై నా వందితో వాదించి గెలవలేక పోతు న్నాడు. అందరినీ ఓడించిన అహంకారంతో ఉన్న నంది:
“నాతో వాదించి ఓడినవారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను’, అని ప్రకటించాడు.
అలా ఎందరినో నదిలో తోయించి సగర్వంగా ఉన్నాడు వంది..
ఆ రోజులలో
ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతులలో ఓడిపోయి ప్రాణాలు విడిచాడు.
అప్పటికి గర్భవతిగా ఉంది కహోడుని భార్య సుజాత, భర్త మరణవార్త విని ఎంతో దుఃఖించింది. గర్భంలో ఉన్న శిశువు మీద మమకారాన్ని చంపుకో లేక విచారాన్ని విడనాడి జీవితం గడుపుతూ కొంత కాలానికి కుమారుని కన్నది.
ఆ బాలుడు తండ్రి శాపంవల్ల ఎనిమిది వంకరలతో పుట్టాడు. అందువల్ల అందరూ వానిని ‘అష్టావక్రుడు’ అని పిలిచేవారు.
పన్నెండు సంవత్సరాలు గడిచాయి. అప్పటికి అష్టావక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి, వందితో వాదనకు బయలుదేరి విదేహ రాజ్యానికి వచ్చాడు.
‘నిండా పన్నెండేళ్ళు రాని బాలుడు వంటివంటి మహా విద్వాంసు నితో వాదించడమా !’ అని ద్వారపాలకుడు నిరోధించాడు.
‘ద్వారపాలక విద్యకు వయస్సుతో నిమిత్తం లేదు. జుట్టు నెరసి వయస్సు ముదిరినవాడు మహా విద్వాంసుడని అనుకోకు”, అని వాదిస్తుండగా అటు వచ్చిన జనక మహారాజు:
‘ఆర్యా! మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్య సముడు. ఆయన ముందు మిగిలిన విద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాలవలె వెల వెల బోతుంటారు’ అనగా అష్టావక్రుడు :
‘ మహారాజా ! నా వంటి వాడెవరూ మీ సభా భవనానికి వచ్చి ఉండరు, అన్నాడు.
‘ అయితే ముప్పది అవయవాలతో, పన్నెండు అంశలతో ఇరువది నాలుగు పర్వాలతో మూడు వందల అరువది రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివా నువ్వుః ‘ అని జనకుడు ప్రశ్నించాడు.
“మహారాజా ! ముప్పది దినాలు అవయవాలు, అమావాస్యలు పన్నెండు, పూర్ణిమలు పన్నెండు, ఈ ఇరువది నాలుగు పర్వాలు, పన్నెండు నెలలు అంశలు, మూడు వందల అరువది రోజులు రేకులు, అటువంటి సంవత్సర రూపమయిన కాలచక్రం మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక’, అన్నాడు.
జనకుడు: అడు గుర్రాలజంటవలె కనిపిస్తూ, హఠాత్తుగా డేగలా మీద పడే ఆ రెండిటినీ ధరించే దెవరు ?
అష్టా : మహారాజా ! అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ రెండు తత్వాలవల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది.
జన: కన్ను మూయకుండా నిద్రించేది ఏది?
అష్టా: నిరంతరం నీటిలో ఉండే చేప.
జన: జన్మించినా చైతన్యం లేనిది ఏది?
అష్టా: పక్షులు పెట్టే గ్రుడ్డు.
జన: హృదయం లేనిదేది?
అషా : బండరాయి.
జన: ఓవేదవేత్తా! ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా తీసుకు వెళ్ళాడు.
చూశాడు మహావిద్వాంసుడు వంది. అష్టావక్రుడు ఆయనను సమీపించాడు.
వంది: బాలకా! నిద్రపోయే సింహాన్ని లేవకు. కాలకూట విషభరిత మయిన పాము పడగ మీద కాలు పెట్టకు,
అష్టా: : మహారాజా ! పర్వతాలన్నీ మైనం కంటె చిన్నవి. లేగదూడలు ఆంబోతుకంటే చిన్నవి. రాజులందరూ జనకునికంటె అల్పులు. దేవతలలో యింద్రుని వలె, నరులలో ఉత్తముడుగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదానికి రమ్మనండి. ప్రారంభిస్తున్నాను నా వాదం.
అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశం ఇస్తుంది. సూర్యుడొక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృ దేవరావతి, యముడొక్కడే, అని ప్రారంభించాడు, వంది.
అష్టా: నంది ! ఇంద్రుడు- అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు, అలానే పర్వత నారదులు. అశ్వనీ దేవత లిద్దరు. రథా నికి చక్రాలు రెండు. సతీపతులు ఇద్దరు..
వంది: ప్రాణికోటి అంతా దేవమానవ తిర్యగ్రూపాలు మూడు ధరి స్తుంది. ఋగ్యజుస్సామాలు మూడే వేదాలు. ప్రాతర్మాధ్యా హ్నిక సాయం సవనాలు మూడు. స్వర్గ మర్త్య నరకాలు మూడే లోకాలు, అగ్ని, సూర్య చంద్రులు ముగ్గురే జ్యోతి స్వరూపులు.
అష్టా: బ్రహ్మచర్య, గార్హస్థ్య, వావవస్థ, సన్న్యాశ్రమాలు నాలుగు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు నాలుగు, దిక్కులూ నాలుగే హ్రస్వ, దీర్ఘ, ప్లత, హల్లు భేదాలతో శబ్దం నాలుగు రకాలు. వేరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ అని వాక్కు నాలుగు రగాలు.
అష్టా : బాలకా! అగ్ని స్థాపన వేళ ఆరు ఆవులను దక్షిణ ఇవ్వాలి. ఆరుఋతువులే సంవత్సర కాల చక్రాన్ని నడుపుతాయి. మన స్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు ఆరు. కృత్తికలు ఆరు. యజ్ఞలు ఆర
అష్టా: తులాదండాన్ని బంధించే సూత్రాలు ఎనిమిది. సింహాన్ని సంహరించే శరభ మృగానికి ఎనిమిది పాదాలు. యజ్ఞశాల సమీ పంలో యూవస్థంభానికి రోజులు ఎనిమిది. వసువులు ఎవ మండుగురు.
వంది: పితృయజ్ఞవేళ అగ్నిని ఉపాసించే సామిధేను మంత్రాలు తొమ్మిది. ప్రకృతి, పురుష, అహంకార, మహత్తత్త్వ, పంచతన్మా త్రలు తొమ్మిది. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతీ ఛందస్సుకు ప్రతిపాదంలోనూ తొమ్మిదే అక్షరాలు. గణితశాస్త్రం యావత్తూ తొమ్మిది అంకెలమీద ఆధారపడి ఉంది.
అష్టా: దిక్కులువది. గర్భంలో శివుడు పది మాసాలుంచాడు. రోగి, దరిద్రుడు శోకార్హుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయిన వాడు, పిచ్చివాడు, కాముకుడు, అనూయాపరుడు, మూర్ఖుడు మొండివాడు ఈ పదిమంది నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్నగారు, ప్రభువు, మాతామహి, పితామహులు, మేనమామ, మామగారు, తండ్రిసోదరులు, కుటుంబంలో వృద్ధులు ఈ పది మంది పూజింప దగినవారు.
అష్టా: పసివాడా। మాసాలు పన్నెండు. జగతీ ఛందస్సుకి అక్షరాలు పన్నెండు. ప్రాకృతయజ్ఞం పన్నెండు రోజులు సాగుతుంది. ఆదిత్యులు పన్నెండుగురు.
వంది: తిథులలో త్రయోదశి మంచిది. భూమిమీద పదమూడు ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ఆరంభించగా,
అహ్జైాన్నకుడు: మహారాజా! మీ విద్వాంసుడు శ్లోకం సగం చదివి విర మించాడు. మిగిలింది నేను చెబుతా.
కేశి దానవునితో మహావిష్ణువు పదమూడు రోజులు యుద్ధం చేసాడు. వేదంలోని అతిజగతి ఛందస్సు పదమూడక్షరాల పరిమితితో నడుస్తుంది. అనగా, పంది తల వంచేశాడు.
నియమానుసారం పంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకు ఎంత విద్య ఉన్నా, వయస్సు మీరినా, వివేకాన్ని దిగమ్రింగే అహంకారంతో నడుచుకునే వారు వంది వలెనే పసివారి ప్రజ్ఞముందు పతనమయిపోతారు.
విద్య వినయాన్ని కలిగించాలికాని గర్వ హేతువు కారాదు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు గజేంద్రమోక్షము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
పరిచయం
శ్రీరాముడు శాపగ్రస్తురాలై రాయిగా మారిన అహల్యను తన కాలితో తాకగానే తిరిగి అహల్య స్త్రీగా మారినదని ఒక కట్టుకథ ఉంది. హిందువులు శ్రీరాముని దేవుని అవతారమని చెప్పుటకే ఈ కట్టుకథను కల్పించారు. శ్రీరాముని దేవుడంటే తప్పులేదు. కానీ ఈ చరాచర జగత్తునంతా చేసి పోషించి లయంచేసే సృష్టికర్త ధర్త హర్త అనుకుంటే మాత్రం పొరపాటు. శ్రీరాముడు ఏక పత్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, వేదవిదుడు. అందువలన ఆయనను దేవుడు – దివ్యగుణములు కలవాడు అంటే దోషమేమీ లేదు. మానవులలోనే విద్వాంసులు, దాన ధర్మములు చేయువారు, వేద విద్యలను నేర్పు ఆచార్యులు, ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయు రాజులు మున్నగు వారు కూడా దేవతలనబడతారు. అందువలన శ్రీరాముడొక దేవుడు. సృష్టికర్తయైన పరమేశ్వరుడు మాత్రం కాడు.
మహాభారత యుద్ధానికి పూర్వమే వేద సిద్ధాంతాలు కనుమరుగైన కారణంగా మానవ సమాజంలో అనేక దురాచారాలు ప్రబలం కాసాగాయి. మన ప్రాచీన ఋషులను, మహాత్ములను నిందించటం, అవహేళన చేయటం కూడా అప్పటినుండే ఆరంభమైనది. ఋషులు, ఋషి పత్నులపై నిందలు వేస్తూ మన ప్రాచీన వైదిక సంస్కృతి – సభ్యతలను సర్వనాశనం చేసే ప్రయత్నంలో ఒక భాగమే ఈ అహల్య శాపం కట్టు కథ. బుద్ధిమంతులు ఆలోచించి ఇటువంటి నిందలను తిరస్కరించాలి.
– సంధ్యావందనం శ్రీనివాసరావు
అహల్య రాయిగా మారలేదు
తులసీరామాయణంలో గౌతమ ఋషిపత్నియైన అహల్యా గౌతమ ఋషి శాపంతో రాయిగా మారినట్లు ఒక కట్టు కథ ఉంది. శ్రీరాముడు రాతిని కాలితో తాకగానే ఆయన పాదధూళి అంటుకొని ఆ రాయి మళ్ళీ స్త్రీగా మారి స్వర్గానికి ఎగిరిపోయింది. చూడండి
ఓ రామా ! మీ రహస్యం నా కర్ధమైంది. మీ పాద పద్మముల ధూళి మానవులను తయారుచేసే ఔషధమని అంతా అంటుంటారు. మీ పాద ధూళిని తాకగానే రాయి సుందర స్త్రీగా మారింది. రాయి కంటే కర్ర గట్టిది కాదు. రాయే స్త్రీగా మారినపుడు నా కర్రనావ స్త్రీగా మారదా ! ? ఈ నావకూడా ఋషి పత్నిగా మారి పైకెగిరి పోతే నాగతేమిటి? నేనీనావతోనే నాకుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు వేరే పనేదీ రాదు. అందుకని మహారాజా! మీరీ గంగానదిని నా నావపైనే దాటాలనుకుంటే, ముందు నేను మీ పాదాలను నీటితో కడగటానికి అనుమతించండి. కాళ్ళు కడగటంతో మీ పాదాలకంటిన ధాళి పోతుంది. కనుక నా నావ ఎగిరి పోకుండా ఉంటుంది !
ఈ కథ వలన మనకు తెలిసేదేమంటే – శ్రీరాముని పాదాలలో ఆ శక్తి లేదు. ఆయన పాదాలకంటియున్న ధూళి (మట్టి) కాచమత్కారమున్నది. దీనిపైన రహీంకవి దోహ ఒకటుంది. అది ధూరి ధరత గజ శీశ పర్…….
రహీం కవిని ఒకరిలా అడిగాడు – “రహీం ఈ ఏనుగు తన తలపై దుమ్మునెందుకు పోసుకుంటున్నది? అని. అందుకు రహీం : గౌతమముని పత్ని అహల్యా తరించిన ధూళి కొరకు ఈ ఏనుగు వెదుకుతూ తిరుగుతోంది. ఆ దుమ్ము ఎక్కడైనా దొరికితే తాను కూడా తరించవచ్చని దాని ఆశ! అన్నారు.
అహల్య రాయిగా మారటం. అహల్య శ్రీరాముని పాదధూళి తాకగానే స్త్రీగా మారటం వంటి దేమీ వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. అచ్చటిలా ఉంది –
ఆశ్రమంలో ప్రవేశిస్తుండగా మహాభాగ్యశాలిని యైన అహల్య తన తపోబలంతో దేదీప్యమానంగా ప్రకాశించుచున్నది.
శ్రీరామలక్ష్మణులు ఎంతో ఆనందంతో అహల్యయొక్క పాదములు రెండింటిని స్పర్శించిరి. (శ్రీరాముడు తన పాదాలతో అహల్యను తాకలేదు) అహల్య ఆ ఇరువురు అన్నదమ్ములను ఎంతో ఆదరంతో అర్ఘ్యపాద్యాదులను (కాళ్ళు ముఖం చేతులు కడుగుకొనుటకు నీళ్ళు) త్రాగుటకు (ఆచమనం) నీళ్ళిచ్చి అతిథి సత్కారమును చేసెను. వాల్మీకి రామాయణంలో అహల్య రాయిగా మారటం శ్రీరాము డారాతిని తాకగానే అది స్త్రీగా మారటం వంటివేవీ లేవు. గౌతమ ఋషి శాపంతో అహల్య రాయిగా మారెనను మాట వాల్మీకి రామాయణంలో లేదు. ఇందుకు విరుద్ధంగా ఇచ్చట ప్రకరణం ఇలా ఉంది. చూడండి –
‘తపసా ద్యోతిత ప్రభా’ తపస్సు చేస్తున్న అహల్య అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తోంది. అని మీరు రామాయణంలోని వాక్యాన్ని చదివే ఉంటారు. శ్రీరాముడామెను దర్శించి అన్నదమ్ములిరువురు ఆమె పాదాలను స్పర్శించిరి.
రామాయణంలో అహల్యా ఇంద్రుల జారకర్మ (వ్యభిచారం) ను గురించి వ్రాసి ఉంది. కానీ రామాయణ కథను చెప్పే భాగవతులు దీనిని రామాయణంలో కల్పినట్లుగా భావిస్తున్నాను. కలపటానికి కారణాలివి –
గౌతమ – అహల్య – ఇంద్రులను గూర్చిన ఈ కథ శతపథ బ్రాహ్మణంలో రూపకాలంకారంలో ఉన్నది –
అహల్యపతి గౌతముడు. ఇంద్రుడు – జారుడు. చూడండి. ‘రాత్రిరహల్యా కస్మా దహర్దినం లీయతే స్యాం తస్మా ద్రాత్రి రహల్యోచ్యతే’
రాత్రి ‘అహల్య’. దినమునకు ‘అహః’ అని పేరు. అహల్యా” “అహః” దినము దీనిలో లయమగును (కలిసిపోవును) కనుక రాత్రికి “అహల్యా” అని పేరు. గౌతముడు – చంద్రుడు. చంద్రుడు రాత్రివేగంగా వెళ్ళుతున్నట్లు కనబడతాడు కనుక – గచ్ఛతి ఇతి గౌ”నడచువాడు – చంద్రుడు- “గౌ” అనబడును. వేగంగా వెళ్ళును. కావున “గౌతముడు” అనబడతాడు. చంద్రుని రాత్రికి పతి అందురు. అందువలన చంద్రుని “నిశా – పతి” అంటారు. నిశా అంటే రాత్రి. చంద్రునకు రాకేశ్ అని కూడా పేరు. రాత్రికి రాకా అనిపేరు. పూర్ణిమకు కూడా రాకా అని పేరు. చంద్రుడు లేని రాత్రి ‘విధవ’వలె కనబడుతుంది. చంద్రునితో కలిసిఉన్న రాత్రి శోభాయమానంగా ప్రకాశిస్తూ అంటే సౌభాగ్యవతియైన స్త్రీలా కనబడుతుంది. అందువలన చంద్రుడు అంటే గౌతముడు రాత్రి అంటే అహల్యకు పతి.
సూర్యుడు ఇంద్రుడు. సూర్యుడు రాత్రిని నశింపజేస్తాడు. (లేకుండా చేస్తాడు) అంటే బలహీనపరుస్తాడు. ఇది జారకర్మ. అందువలన ఇంద్రుడనగా సూర్యుడు, అహల్య అనగా రాత్రితో వ్యభిచరించును. సూర్యోదయం కాగానే రాత్రి బలహీనపడుతూ పడుతూ పూర్తిగా నశించిపోతుంది. ఇదొక విజ్ఞానంతో కూడి యున్న సుందర రూపకాలంకారం.
దీనిని అర్థం చేసుకోకుండా గౌతమ ఋషిపత్ని అహల్యతో ఇంద్రుడు జారకర్మ – వ్యభిచరించాడని పురాణాలలో వ్రాశారు. రామాయణంలో గౌతమ ముని పత్ని అహల్యయొక్క చరిత్రకు సంబంధించిన వర్ణన ఉంది. దానితో బ్రాహ్మణగ్రంథంలోని ఈ రూపకాలంకారాన్ని జోడించి చరిత్ర భ్రష్టు పట్టించారు – నాశనం చేశారు. ఇంద్రుడు – అహల్యకు మధ్య అబద్ధపు వ్యభిచారదోషాన్ని కల్పించారు.
ఈ విధంగా శబ్దాలకు (అనర్థాలను) తప్పుడు అర్థాలను కల్పనచేసి చేసి కథలు చెప్పే మన పౌరాణికులు మన చరిత్ర గాధలన్నింటిని నాశనం చేశారు. రామాయణంలో అనేక చోట్ల తమ ఇష్టం వచ్చిన కల్పిత కథలున్నాయి. వీనితో వాస్తవాలు మరుగున పడ్డాయి. నేటి ఆధునిక యుగంలో ప్రతి విషయాన్ని తర్కబుద్ధితో ఆలోచించి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాతకాలం నాటి మాటలు- “చేపచెట్టెక్కిందని పండితుల వారంటే. భక్తబృందం సత్యం మహరాజ్’ అన్నారు. ఇటువంటి భ్రమలు కలిగించే అబద్ధపు కథలు చదివి చదివి నేటి యువతీ – యువకులు రామాయణ, మహాభారత ఇతిహాసాలకు తిలాంజలులివ్వటానికి తయారౌ తున్నారు. కనుక విద్వాంసులంతా ప్రతివిషయాన్ని సత్యంతో పరీక్షించి యుక్తి-యుక్తంగా వ్రాయాలి. మన దేశ చరిత్ర, ధర్మగ్రంథాలలో ఎటువంటి దోషాలూ రానివ్వరాదు.
ఒక ధర్మము, ఒక భాష, ఒక లక్ష్యము భారతవాసుల కేర్పడనంతవరకు భారత దేశమునకు పూర్ణహిత మేర్పడజాలదు. ఉన్నతియు జరుగదు.
(మహర్షి దయానంద సరస్వతి).
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సుందోపసుందులు నీతికథ.
సుందోపసుందులు
(ఇద్దరు తమలో తాము పోట్లాడుకొని ఇద్దరూ నాశనమువ కాన్ని సుందోప సుందన్యాయ మంటారు.)
ఈ నాటికీ మారుమూల పల్లెలలోనే కాక, మహానగరాలలో కూడా భారత సంస్కారం కలవారు ఈ సామెత వాడుతుంటారు. సుందోప సుందుల వలె కొట్టుకుంటున్నారు అని. ఆ కథ భారతం ఆదిపర్వంలో నారదుడు వినిపిస్తున్నాడు.
ధర్మరాజా !
హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల కథ ఎరుగుదువు కదా ! వారి వంశ ములో కుంభుడనే పేరు గల రాక్షసుడుండేవాడు. వీడు మహాబలశాలి. ఈ బలశాలికి ఇద్దరు కుమారులు.
వారు మహా భయంకర దేహులు. పెద్దవాడు సుందుడు. వాడి -తమ్ముడు ఉపసుందుడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏ విషయంలోనూ వారికి అభిప్రాయ భేదం లేదు.
నిరంతరం ఒకరినొకరు విడువకుండా కలిసి తిరిగే వారు.
అలా ఉండగా వారికి తమ పూర్వీకుల వలె త్రిలోకాలనూ జయిం చాలనే కోరిక కలిగింది. కలగగానే వింధ్యపర్వతం చేరి ఆ గిరి శిఖరం మీద పద్మాసనం వేసి తపస్సు ఆరంభించారు. అన్నపానాలు విడిచేశారు.
వాయువునే ఆహారంగా గ్రహిస్తూ, ఒంటికాలి బొటన వేలుమీద నిలబడి తీవ్రదీక్షతో సాధన చేస్తున్నారు. ఆ తపస్సు వేడికి మంటలు లేచేవి. ఎలా అయినా ఆ సోదరుల తపస్సుకు భంగం కలిగించాలని దేవ తలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారు చలించలేదు. ధ్యా ధిలోనే ఉన్నారు.
బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
ప్రపంచంలో అస్త్ర శస్త్ర విద్య అంతా తమకు రావాలనీ, ఇంద్ర జాల మహేంద్రజాల విద్యలు తమ అధీనంలో ఉండాలనీ, తమకు తమకు వైరం వచ్చి ఒకరినొకరు చంపుకుంటే తప్ప మరెవరివల్ల చావు రాకూడ దనీ కోరుకున్నారు.
అనుగ్రహించి బ్రహ్మ అదృశ్యమయ్యాడు.
వారు తమ నగరం చేరి సేవలతో విజయ యాత్రకు బయలు దేరారు.
ముందుగా అమరావతిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భూలోకం, నాగలోకం, యక్షరాక్షప లోకాలన్నీ వశపరుచుకున్నారు.
పెద్దపులి రూపాలతో, సింహాకారాలతో గుహలలో దూరి అక్కడ తపస్సు చేసుకునే మునులను హింసించే వారు.
ఆశ్రమాలలో ప్రవేశించి యజ్ఞసామగ్రిని విరిచి, విసిరేసే వారు. అలా ప్రపంచం అంతటా తిరుగుతూ సాధు, సజ్జన హింసతో, వర స్త్రీ బలాత్కారాలతో జీవితం నడుపుతున్నారు.
ప్రపంచంలో ఏ ప్రాణికి శాంతి లేదు. అంతటా దీనారావాలు, హాహాకారాలు. ఏ పూట ఎవరికి కీడు మూడుతుందో తెలీదు. ఏ రాత్రి ఏ నగరం శ్మశానం అవుతుందో తెలీదు.
అలా భయానకంగా ఉన్న సమయంలో దేవతలూ, మునులూ కలిసి బ్రహ్మను ప్రార్థించగా ఆయన విశ్వకర్మను పిలిచి:
మహాశిల్పీ ప్రపంచంలో ఎంతటి వారి నయినా సరే కనుచూపుతో ఆకర్షించి పాదాక్రాంతం చేసుకోగల సుందరీమణిని సృష్టించు అన్నాడు. ఆలోచించాడు విశ్వకర్మ.
ఇంతకుముందు నిర్మించిన సుందరరూపాలన్నింటినించి అందాన్ని నువ్వుగింజంత (శిలాంశ) తీసి ఒక అందగత్తెను రూపొందించాడు.
కాలిగోరు నుంచి కమరెప్పల వరకూ అంతా లావణ్యం జాలువారు తున్నది.
తిగాంశగా తీయడం వల్ల ఆమెకు తిలోత్తమ అని పేరుపెట్టారు.
అది వింధ్యగిరి శిఖరం.
అక్కడ విశాలమయిన సాలవృక్షం.
ఆ చెట్టు నీడలో రకరకాల పానపాత్రలు.
కనులు మిరుమిట్లుగొలిపే కామినీ జనం.
హంసతూలికాతల్పాలు.
వింజామరలతో సుందరీమణులు.
కమ్మని కంఠాలతో పాటలు.
ఆ పాటలకు అనుగుణంగా అందెల రవళులతో, గాజుల గలగలలతో, చూపుల మిలమిలలతో సుందరాంగుల నాట్యాలతో ఆ సోదరు లిద్దరూ పరమ సంతోషంగా ఉన్నారు.
అటువంటివారి కంటికి అల్లంత దూరంలో వయ్యారంగా ముట జారుస్తూ కనులు త్రిప్పుతూ, తన అందాన్ని ఒలకబోస్తూ’ నిలిచింది. తిలో త్తమ,
అంత మైకంలో ఉన్న అన్నదమ్ములిద్దరూ ఆ సుందరిని చూస్తూనే కోరమీసం ఎగదువ్వుతూ, పానపాత్రలు జారవిడిచి, ఆశ నిండిన కను లతో, రాచఠీవితో, ఆమె వయిపే అడుగులు వేశారు.
ఇద్దరూ దగ్గరగా చేరారు,
ఆమె భయాన్నీ, సిగ్గునీ, అభినయిస్తూ, జారుతున్న పైట సరి జేస్తున్నట్టు నటించి, వెనుదిరిగి ఓరచూపుతో యిద్దరినీ రెచ్చగొట్టింది.
ఒకడు కుడిచెయ్యి అందుకుంటూండగా రెండవవాడు ఎడమచెయ్యి పట్టుకున్నాడు.
బలమడం, ధనమదం, రాజ్యమదం, వరమిదం ఇన్నిటికీ మద్యపానమదంలోవున్న వారిని చూసి తిలోత్తమ ఒక కంటితో నుందుని రెండవ కంటితో ఉవసుండుని రెచ్చగొట్టింది.
“తమ్ముడూ! అన్నగారి భార్య తల్లితో సమానం. నువ్వు దీన్ని తాకకూడదు ” అన్నాడు సుందుడు.
“తమ్ముని భార్య కోడలితో సమానం. నువ్వు దూరంగా వెళ్ళు” అన్నాడు ఉవసుందుడు.
మీరిద్దరూ తేల్చుకోండి అని దూరంగా నిలబడి యిద్దరి వయిపూ కోరచూపులే విసిరింది తిలో త్తమ.
అంతలో గదాదండాలు అందుకున్నారు.
ఆ గదా ఘాతాలతో వారి శరీరాలు చీలి రక్తధారలు సెల వీరుల్లా ప్రవహించాయి.
అంతే పర్వత దేహులయిన అన్నదమ్ములిద్దరూ నదీ ప్రవాహంలో బండరాళ్ళవలె నేల కూలారు, అని నారదుడు కథ ముగించి,
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ సాయినాథ మహిమా స్తోత్రంగురించి తెలుసుకుందాం…