మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…
Dattatreya Ashtottara Shatanamavali Lyrics In Telugu
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అటువంటి అష్టోత్తరాన్నిఎలా చదవాలి, ఏయ్ ఏయ్ అష్టోత్తరాన్ని చదవాలి, దాని వల్ల ప్రయోజనాలు ఏంటి, మొదలగు అష్టోత్తర విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. తులసీ మాత అంటేనే తులసి మొక్కకు దేవతా రూపంగా భావించి పూజించడం. హిందూ ధర్మంలో తులసీ మాతకు ప్రత్యేక స్థానం ఉంది. తులసీ అనేది పవిత్రమైన మొక్క, విశేషించి విష్ణుమూర్తికి ప్రియమైనది. తులసీ మొక్కను పూజించడం వల్ల మనకు శుభాలు కలుగుతాయని మన పురాణాలు, శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు తులసి మాత మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…
కుదుళ్ళ తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
కూర్మాము తానాలు గోవిందా రామ ।
చేసివచ్చిన ఫలము గోవిందా రామ ।
మొక్కల తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
మొక లింగ తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
ఆకుల్లో తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
హర్షవల్లి తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
జంట తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
జగన్నాధ తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
పువ్వుల్ల తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
వున్నెగిరి తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
కాయల్ల తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
కాశీలో తానాలు గోవిందా రామ ।
చేసి వచ్చిన ఫలము గోవిందా రామ ।
పండిన తులసికి గోవిందా రామ ।
ఉదక మొడ్డించితే గోవిందా రామ ।
ఏడేడు లోకాలు గోవిందా రామ ।
తిరిగి వచ్చిన ఫలము గోవిందా రామ ।
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ గోవింద దామోదర స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Ammavari Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అమ్మవారి పుణ్యమి అని పిలిచే అమ్మవారు మన భారతీయ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. అమ్మవారు అనగా దేవతా స్వరూపమైన తల్లి అని అర్థం. వివిధ ప్రాంతాల్లో అమ్మవారు వివిధ పేర్లతో పూజింపబడతారు. భారతీయుల విశ్వాసాలలో అమ్మవారు అన్ని శక్తులకు మూలమైన, సృష్టి, స్థితి, లయాలకు అధిపతిగా భావించబడతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు అమ్మవారి మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు స్తోత్రముల గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కులం కాదు గుణం ప్రధానం నీతికథ.
కులం కాదు గుణం ప్రధానం
(ఇది ఆరణ్యపర్వంలో మార్కండేయ మహాముని చెప్పిన కథ. దీన్నిబట్టి, కుల వర్గ విద్వేషాలు ఈవాటి నాగరిక సమాజంలో బలిసినంతగా ప్రాచీన కాలంలో ఉండేవి కావనీ, మంచి విషయం ఎవరి దగ్గర ఉన్నా గ్రహించవలసినదేనని తెలుసు కోవాలి.)
కులం కారణంగా ఉన్నత స్థానాలు, మర్యాదలు యివ్వడం ఈ వాడు పెరిగినంతగా భారతకాలం నాడు లేనేలేదు. గుణం ప్రధానంగా మనిషిని మర్యాద చేయడం అందరూ ఎఱిగిందే. అటువంటి అంశం
ఒకానొక గ్రామానికి సమీపంలో ఒక వనం. ఆ వపంలో ప్రశాంత ప్రదేశం. అక్కడొక చిన్ననది. ఆ నది ఒడ్డునే చక్కని నిడనిచ్చే పెద్ద చెట్టు. ఆ చెట్టు క్రింద కూర్చుని ఒక విపుడు తపస్సు చేసుకుంటూ, మధ్యాహ్నం కాగానే గ్రామంలోకి వెళ్ళి భిక్షాటనం చేసి జీవితం గడుపు తున్నాడు.
అలా తపస్సు చేసుకునే రోజులలో …..
ఓకనాడు
ఆయన భిక్షాటనకు లేచే సమయంలో చెట్టుమీది కొంగ రెట్ట వేసింది. అది ఆయన మీద పడింది.
అంతలో ఆయనకు చాలా కోపం వచ్చింది. అంతే: కన్నులు ఎర్రజేసి పై కి చూశాడు.
చూసిన మరుక్షణంలో ఆ కొంగ మాడి పడిపోయింది.
ఆయన యథాప్రకారం గ్రామంలో భిక్షకువెళ్ళి, ఒక యింటి గుమ్మంలో నిలబడి: ‘భవతి భిక్షాం దేహి”, అన్నాడు.
ఆ మాట చెవిని పడగానే యింట్లోని గృహలక్ష్మి ఆయనకు భిక్ష తేవడానికి వంటయింటి వయిపు నడిచింది.
అదే సమయానికి ఆమె భర్త దూర ప్రయాణం చేసి యింటికి వచ్చాడు.
భర్తన చూడగానే ఆమె చల్లని నీటితో ఆయన పాదాలు కడిగి, విసన కర్రతో కొంతసేపు విసిరి, భోజనం చేయించి, పరుండాక, భిక్ష తీసుకుని వీథిలోకి వచ్చింది.
అక్కడ నిలబడ్డ ముని కోపంగా చూశాడు. అప్పుడామె :
“స్వామీ! మీ కోపానికి మాడిపోయే కొంగను కాను. భర్తను మరెవరి విషయమయినా చూసుకుంటాను. పతి
సేవను మించిన పరమార్థం వేరే లేదు, నాకు ‘
అని నిలబడింది.
అప్పుడా ముని తెల్లబోయి :
‘అమ్మా! ఎక్కడో, అడవిలో జరిగిన నా కథ నీకు ఎలా తెలి సింది ? నాకు జ్ఞానబోధ చెయ్యి తల్లీ’, అని ప్రార్థించాడు.
గృహిణి : ‘మునీశ్వరా ! ఇక్కడకు కొద్ది దూరంలో మిథిలానగరం ఉంది. అక్కడ ఒక బోయవాడు మాంస విక్రయం చేసి జీవితం గడుపు తున్నాడు. వానిపేరు ధర్మవ్యాధుడు. ఆయన మీకు సర్వవిషయాలూ బోధిస్తాడు, వెళ్ళండి’, అంది. ఆయన బయలుదేరి నడిచి నడిచి మిథిలా నగరం చేరాడు.
నగరంలో అడుగు పెడుతూనే ధర్మవ్యాధుని నివాసం గురించి అడిగి, తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరాడు.
బడ్డాడు.
అక్కడ రకరకాల జంతువుల మాంసాలు చూసి దూరంగా నిం
వచ్చిన మునిని అంత దూరంలో చూసి ధర్మవ్యాధుడు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి:
‘ ఆర్యా ! ‘ ప్రణామాలు. మిమ్ము నా దగ్గరకు పంపిన పతివ్రతా శిరోమణి క్షేమంగా ఉన్నదా ? అని అడిగాడు.
వచ్చిన మునికి మతిపోతోంది.
‘అక్కడ ఆ యిల్లాలు కొంగ విషయం చెప్పింది. ఈ ధర్మ వ్యాధుడు ఆ ప్రతివ్రత క్షేమం అడిగాడు. ఇంతకాలంగా తపస్సు చేసినా ఏ శక్తి సాధించ లేకపోయాము,
ఆవిడ పతివ్రత కనుక ఆ వ్రత దీక్షతో దూరదృష్టి వచ్చి ఉండవచ్చు.
జంతువుల మాంసం అమ్ముకునే ఈ కసాయి వానికి ఇంత శక్తి ఎలా వచ్చింది’ అని ఆలోచనలో పడ్డాడు.
అది గ్రహించి ధర్మవ్యాధుడు :
‘స్వామీ! ఈ మాంసపు వాసన మీరు భరించలేరు. రండి మా యింటికి వెడదాం. నాకు యింతటి శక్తి ఎలా వచ్చిందని ఆలోచిస్తు న్నారు కదూ ! ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను ”
అని వినయంగా యింటికి తీసుబవెళ్ళాడు. వెడుతూనే వాకిట్లో మంచంమీద పడుకున్న, ముసలి తండ్రి పాదాలకు నమస్కరించి, ఆయన యోగ క్షేమాలు విచారించి, లోపల గడపలో ఉన్న తల్లికి నమ స్కరించి, ఆవిడకు సేవచేసి :
‘స్వామీ! ఇదే నేను చేసేవి. మనం ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు జరిపినా, తల్లి దండ్రులను సేవించుకోకపోతే ప్రయోజనం లేదు.
తొమ్మిది మాసాలు గర్భంలో మనలను భరించి, ప్రసవవేదనపడి, మనకు జన్మనిచ్చి, నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చే వరకూ మన ఆరోగ్యం కోపం ఆ తల్లి ఎన్నో అవస్థలు పడుతుంది.
అటువంటి తల్లి ఋణం ఎన్ని సేవలు చేసినా తీరుతుందా?
అలానే మన భవిష్యత్తుకు పునాదులు వేసి, మనకోసం ఎన్నో బాధలు పడే తండ్రి ఋణం కూడా తీరదు.
అయినా వారిని సేవించుకోవడం వల్ల కొంత ఋణ భారం తగ్గుతుంది.
వీరిని సేవించు కోవడం కంటె నేను చేసే సాధన ఏమీలేదు. దాని వల్లనే నేను సుఖంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. తల్లి దండ్రులను సేవించుకుంటూ ఆలుబిడ్డలను రక్షించుకుంటూ జీవితం నడుపుతున్నాను. అంతే! మరేంలేదు. మీకు మరో సందేహం కలిగి ఉంటుంది. మాంసం అమ్ముకుని బ్రతుకుతున్నాను కదా! అది జీవహింస కాదా, దానిపిల్ల పాపం కదా అని. ఇక్కడ తమ కొక పరమ రహస్యం చెప్పాలి.
అదీ ధర్మ సూక్ష్మం అంటే –
ఈ భూగోళంలో ప్రాణికోటి అంతా ఒక దానిమీద ఆధారపడి మరొకటి జీవిస్తున్నది. రెక్కలు విప్పుకు ఎగిరే పక్షులూ, నాలుగు కాళ్ళ జంతువులూ యివే ప్రాణులని మీరు అనుకుంటున్నారు. మీరు తినే ధాన్యం, కాయగూరలు, పళ్ళు అన్నింటిలోనూ జీశం ఉన్నది. అయితే అవి పక్షులవలె ఎగరడం లేదు కనక జీవం లేదనుకోవడం న్యాయమా।
జీవి బ్రతికి, పెరగడానికి మరోజీవం బలికాక తప్పదు.
అలాకాదు, యిదే జీవహింస అంటారా!
నేను మానినింతలో నా దుకాణానికి వచ్చేవారందరూ మాంసా హారం వదులుతారా ! అందుచేత మీరు ఈ అనుమానం వదిలేయండి. ప్రాణాలు నిలిపు కోవడానికి ఆవశ్యకమయిన ఆహారంకోసం జరిపేది హింసకాదు.
మరొశ్రమాలు ఈ జంతువులను ఎవరో సంహరించి తెస్తారు. నా వృత్తి ధర్మానుసారం దీనిని విక్రయం చేసి బ్రతుకుతాను.
వ్యాపారంలో దొంగ తూకాలూ, అధిక లాభాలూ నేనెరుగను.
నా ధర్మాన్ని నేను విడిచి పర ధర్మాన్ని స్వీకరించము. ఆకలి గొన్న వారికి పిడికెడు అన్నం పెడతాను. నా మీద ఆధారపడి జీవించే వారందరి యోగ క్షేమాలు తెలుసుకుంటాను. ఇరుగు, పొరుగులవారి కష్ట సుఖాలలో భాగం పంచు కుంటాను.
అన్నిటినీ మించిన విషయం –
ఈ మనస్సు ఉన్నదే యిది స్థిరంగా నిలబడదు. ముందు దీన్ని లొంగదియ్యాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. నిర్మల బుద్ధితో నిరంతరం పరమేశ్వరారాధనం చెయ్యాలి.
నేను చేసేది యింతే! ఈ మాత్రం చెయ్యగలిగితే మనకు ఏ బాధలూ ఉండవు, ఈ జీవితం ఎంతవరకూ పరోపకారానికి ఉపయోగపడితే అంత ధన్యం’ అని బోధించాడు.
గొడ్డు మాంసం అమ్ముకుని జీవించే బోయవాడు చేసిన ప్రబోధంతో మనస్సు నిర్మలమై ప్రశాంతంగా వాని వద్ద సెలవు తీసుకుని తపస్సు కేసుకునేందుకు వెళ్ళాడాయన.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గురుసేవ సత్ఫలితం ఇస్తుందినీతికథ.
గురుసేవ సత్ఫలితం ఇస్తుంది
(ఇది ఆదిపర్వంలో కథ. గురు సేవ ఎంత అవసరమో, దాని ఫలితం ఎంతటిదో గ్రహించాలి.)
ఆ రోజులలో ఒకానొక గురుకులంలో పైలుడు అనే పేరుగల ఉపా ధ్యాయు డుండేవాడు. ఆయన దగ్గర ఎందరో విద్యాభ్యానంచేసేవారు.
ఆ రోజులలో గురుకులాలంటే చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆ ఆశ్రమంలోనే ఉండాలి. వారికి అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పించే భారం రాజు మీద ఉండేది. నిరంతరం గురు సన్నిధానంలో ఆయన సేవచేస్తూ వినయ విధేయతలతో విద్యనేర్చుకునేవారు. గురువుగారు కూడా వారిని తన బిడ్డలుగా చూసుకుని ఎవరికి ఏ విద్యయందు అభిరుచి ఉన్నదో గ్రహించి ఆ విద్యనే నేర్పేవాడు. తనకు కావలసిన విద్యనేర్ప గల గురువును అన్వేషిస్తూ విద్యార్థి తిరిగేవాడు. అవీ అనాటి గురుకులాలు.
అటువంటి గురుతులంలో పైలునివద్ద ఉదంకుడని శిష్యుడుండే వాడు. ఈ ఉదంకుడు విద్యపూర్తి చేసుకుని సంప్రదాయం ప్రకారం గురువుగారి దగ్గర సెలవుతీసుకునే ముందు, చేతులు కట్టుకు నిలబడి, తలవంచి.
‘ఆచార్యా! గురునక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించండి’, అన్నాడు
అప్పుడు పైలుడు చిరునవ్వు నవ్వి, ఆశీర్వదించి :
“నాయనా నీ వంటి శిష్యుడు దొరకడం మా అదృష్టం. గురు దక్షిణ ఏమీ అవసరం లేదు,’ అన్నాడు.
ఉదంకుడు అలాగే నిలబడి:
‘ఆచార్యా! గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళడం న్యాయంకాదు. కమఠ మీరు ఆజ్ఞాపించండి’, అన్నాడు.
వాని పట్టుదల, ధర్మవిరతిచూపి సంతోషంతో:
నాయనా! ఇంతకాలంగా నువ్వు చేసిన సేవను మించిన గురు దక్షిణ లేదు. అయినా నువ్వు తప్పదంటున్నావు కనుక ఆశ్రమంలోకి వెళ్ళి అమ్మగారు ఏం కోరుకుంటారో అడుగు’, అన్నాడు పై లుడు.
ఉదంకుడు లోపలకు వెళ్ళి గురువుగారి భార్యకు నమస్కరించి విష యం చెప్పాడు.
అప్పుడావిడ :
‘నాయనా మీ గురువుగారి దగ్గర పౌష్యుడనే రాజు విద్యనేర్పు కున్నాడు. ఆ రాజుభార్య ధరించే కుండలాలు నాకు తెచ్చిపెట్టు, అంది.
ఉదంకుడు పరమానందంతో బయలుదేర పండగా ఆవిడ పిలిచి ” నాయనా ! ఇంక నాలుగు రోజులలో నేను ఒక వ్రతం చెయ్య బోతున్నాను. అప్పటికి అవి తీసుకురావాలి’ అంది.
‘చిత్తం, తల్లీ’ అని ఉదంకుడు బయలుదేరాడు.
కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక మహావృషభంమీద ఒకా నౌక పురుషుడు అడ్డుగా వచ్చి:
‘ఈ గోమయం భక్షించివెళ్ళు. అనుమానించకు. దీన్ని మీ గురువుగారు కూడా భక్షించారు’, అనగానే ఉదంకుడు మాట్లాడకుండా అది తిని, త్వరగా రాజు గారింటికి వెళ్ళాడు.
మహారాజు చిరునవ్వుతో ఆహ్వానించి, అతని సమాచారం అడిగి: ‘మీ రాకవల్ల మా జన్మ ధన్యమయింది. ఊరకరారు మహాత్ములు! ఏ పనిమీద వచ్చారో చెప్పండి’, అనగా గురుపత్ని కోరిక వివరించాడు.
మహారాజు వినయంగా
‘ ఓ విద్వాంసుడా ? మీరు ఏదికోరినా ఇవ్వవలసిందే. ఇప్పుడు మీరు స్వయంగా అంతఃపురానికి వెళ్ళి మహారాణిని అడగండి. ఆవిడ సంతోషంగా ఇస్తుంది’, అన్నాడు.
ఉదంకుడు క్షణాలలో అంతిపురికిపోయి తిరిగివచ్చి :
‘రాజా! మీరు విద్వాంసులతో పరిహాసాలాడుతా రమకో లేదు. మహారాణి అంతఃపురంలో లేదు’, అన్నాడు.
రాజు: ఓ మహాత్మా! క్షమించాలి. అపవిత్రులకు నా భార్య కనబడదు. మీ వంటివారు అుచిగా ఉన్నారనీ అనలేను.
ఉదంకుడు: గుర్తుకు వచ్చింది మహారాజా! నేను వచ్చేదారిలో ఆ పొరపాటు జరిగింది. ప్రయాణపు తొందరలో నేను కాళ్ళూ, చేతులూ, ముఖం కడగకుండా ఆచమించాను. ఇలాచెప్పి అప్పటి కప్పుడు అన్నీ ముగించి అంతఃపురానికి వెళ్ళి ఎదురుగా వినయంతో నిలిచిన రాణికి తన రాశకు కారణం చెప్పాడు.
రాణి! విద్వాంసుల కోరిక తీర్చడం మా విధి. ఇవిగో రత్న కుండలాలు తీసుకోండి. ఒకమాట. ఈ కుండలాలు దొంగిలించాలని చిర కాలంగా తక్షకుడు వేచి ఉన్నాడు. అది కనిపెట్టుకుంటూ వెళ్ళండి.
ఉదంకుడు అవి తీసుకుని చక చక వస్తున్నాడు. కొంక దూరం వచ్చేసరికి దారి వెంట ముసలి బిచ్చగాడు వానిని వెన్నంటి వస్తున్నాడు.
ఉదంకుడు సాయంకాలానికి ఒక చెరువు దగ్గరటచేరి, కుండలాలు ఒడ్డున పెట్టి సంధ్యావందనం ఆరంభించగా ఆ దొంగ వాటిని ఆవహరించి పారిపోయాడు.
ఉడంకుడు తిరిగి చూసేసరికి ఆ దొంగవాడు పాములామారి ఒక బిలంలో దూరాడు. దాన్ని తవ్వడానికి ఉదంకుడు శ్రమపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆ బిలాన్ని విశాలం చేశాడు.
దానిగుండా పోయి పోయి ఉదంకుడు నాగలోకానికిపోయి అనేక విధాల ప్రార్థనలు చేసినా తక్షకుడు కనిపించలేదు.
కనిపించకపోగా ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చుని తెలుపు నలుపు దారాలతో వస్త్రం నేస్తున్నారు.
నేత చక్రాన్ని ఆరుగురు తిప్పుతున్నారు. దానికి వన్నెండు ఆకులు ఉన్నాయి. ఎదురుగా అశ్వంమీద ఒక పురుషుడు కనిపించాడు. అందరినీ స్తుతించగా ఆ పురుషుడు ప్రసన్న వదనంతో ‘ వరం కోరుకో’ అన్నాడు.
ఉదంకుడు: నాగలోకమంతా నా వశంలో ఉండాలి.
“అయితే ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు’ అన్నాడా పురుషుడు.
అప్పటికే కాలాతీతం కావస్తున్నది. ‘గురుపత్నీ వ్రత సమయానికి ఎలాచేరడం’ అని విచారిస్తుండగా ఆ పురుషుడు తన గుర్రంయిచ్చి అదృశ్యం అయ్యాడు.
మరుక్షణంలో ఉదంకుడు గురువుగారి ఆశ్రమం దగ్గర దిగాడు. గుర్రం మాయమయ్యింది.
అప్పటికి గురువుగారి భార్య అభ్యంగస్నానంచేసి వ్రతానికి సన్నద్ధు రాలవు తున్నది.
ఉదంకుడు ఆవిడ పాదాలకు నమస్కరించి, కుండలాలు అర్పించి, ఆశీర్వాదం పొంది, గురువుగారి దగ్గరకు వచ్చాడు.
ఇంత ఆలస్యం ఎందుకయింది అని గురువుగారు అడుగగా జరిగిన విషయాలన్నీ వివరించి వాటి అంతరార్థం బోధించమని కోరాడు. ‘నాయనా! నీకు ఎదురుపడిన పురుషుడు దేవేంద్రుడు. ఆ వృషభం ఆయన ఐరావతం. ఆ గోమయం అమృతం. అది భక్షించక పోతే నువ్వు నాగలోకంలో జీవించవు.
నాగలోకంలో స్త్రీలను చూశావే, వారు ధాత- విధాతలు.
నలుపు తెలుపు దారాలు రాత్రింబవళ్ళు. చక్రాన్ని తిప్పే ఆరుగురూ ఋతువులు, పన్నెండాకులూ మాసాలు. ఆ చక్రం సంవత్సర రూప మయిన కాలచక్రం.
అక్కడ కనిపించిన పురుషుడు దేవేంద్రుడు. ఆ గుర్రం అగ్ని హోత్రుడు.
ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇంద్రుడు నాకు ప్రాణమిత్రుడు. నువ్వు నా శిష్యుడవు కనక నీకు అపాయం జరగకుండా కాపాడాడు. నీ వలె వినయ విధేయతలతో, గురుశుశ్రూష చేసి విద్యనేర్చుకునే వారిని ఎప్పుడూ దేవతలు కాపాడుతారు. ఇకనువ్వు మీ ఇంటికి వెళ్ళు. నీకు” సర్వశుభాలూ కలుగుగాక’, అని గురువుగారు ఆశీర్వదించాడు.
Lord Rama Mangala Harathi With Lyrics In Telugu – మంగళ హారతులు
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీరాముడు (లేదా శ్రీరామచంద్రుడు) హిందూ మతంలో ప్రముఖమైన దేవుడు. ఆయనను విష్ణువు యొక్క ఏడవ అవతారంగా పూజిస్తారు. రాముడు ఐక్య వేదాన్తం, ధర్మ పరిపాలకుడు, సత్యవ్రతుడు, క్షమాశీలతగల వ్యక్తి, గొప్ప భర్త, ప్రేమపూర్వక భక్తుడు మరియు క్షమాశీలతగల రాజు అని పిలుస్తారు. శ్రీరాముడు దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి కుమారుడిగా అయోధ్యలో జన్మించాడు. రాముడి కథ ప్రధానంగా రామాయణం అనే మహాకావ్యంలో వర్ణించబడింది. వాల్మీకి మహర్షి రాసిన ఈ రామాయణం, 24,000 శ్లోకాలతో, రాముడి జీవితాన్ని మరియు ఆయన యాత్రలను వివరిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీరాముడు మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…
పల్లవి: నిరాకార నిరంజనా నీకు హారతీ
మా రామచంద్రునకు మనసు హారతీ నా మనసు హారతీ
॥ నిరాకార
చ 1) పంచభూతములను ఐదు
ప్రమిదల గాను చేసినాను
మించిపోయే గుణము తీసి
మంచి వత్తి వేసినాను
అహంకారమనే గుణము తీసి
అక్షతలు చేసినాను
కామమనే గుణము తీసి
తరచి చమురు పోసినాను
చ 2) మాయ అనే తెరను తీసి దక్షిణగా ఉంచినాను
దూషణమనే గుణము తీసి ధూపముగ వేసినాను
కామ క్రోధములను తీసి కైవత్తిగ వెలిగించినాను
ప్రేమయనే గుణముతీసి నైవేద్యము చేసినాను
||నిరాకార||
బాలుడా నీకిదే హారతీ
శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామచంద్రా నీకు కర్పూర హారతి – వలె (శంకరాభరణ రాగం – మిశ్రచాపు తాళం)
చ 1) బాలుడా నీ కిదే హారతి
సుగుణ బాలుడవై వర్థిల్లుమా
చాలగ దేవదేవులు కొలచుచు
శాశ్వత సుఖముల నొందుమా