Naraduni Upadesam Vinandi In Telugu – నారదుని ఉపదేశం వినండి

Naraduni Upadesam Vinandi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… నారదుని ఉపదేశం వినండి నీతికథ.

నారదుని ఉపదేశం వినండి:

(నారదుడి పేరు వినే సరికి చాలామంది ఫకాలున నవ్వుతారు. ఆయన విదూషకుడనీ, కలహ ప్రియుడనీ ఈ అభిప్రాయానికి కారణం యిటీవలి కాలపు నాటకాలు, సినిమాలు మాత్రమే. భారత, భాగవత, రామాయణాలలో కనిపించే నారదుడు దేవముని, భక్తి తత్త్వవేత్త, మహాజ్ఞాని. అటువంటి మహామహునికి విదూ షక రూపం కల్పించిన పుణ్యాత్ములకు నమస్కారం.)

మహాభారతంలో నారద మహర్షి దర్శనం మొదటిసారి సభా పర్వంలో లభిస్తుంది.

ఇంద్ర ప్రస్థంలో ధర్మరాజు మయసభా భవనంలో సింహాసనం మీద ఉండగా ఆ ఉత్సవం చూడడానికి వచ్చాడు నారదుడు.

ఆ మునీంద్రునికి ఎదురేగి స్వాగతం యిచ్చి, అసనంచూపి, అతిథి మర్యాదలు జరిపాడు, పాండవాగ్రజుడు.

అప్పుడా మునీంద్రుడు ఆనందంతో ఆశీర్వదించి:
‘ధర్మనందనా ! నిన్ను సింహాసనంమీద చూడడం సంతోషంగా ఉంది. అయితే యింతకు పూర్వం ఈ సామ్రాజ్యాన్ని పాలించిన నీ తండ్రి తాతలందరూ ఏ విధానాలు అవలంబించారో ఆ మార్గాలను విడనాడ కుండా ఉంటున్నావా? నీ రాజ్యంలో ప్రజలందరినీ సమానదృష్టితో చూసుకుంటున్నావా ? ధనలోభానికి లొంగి కొందరిని ప్రేమతోనూ, మరికొందరిని ద్వేషంతోనూ చూడడం లేదుకదా! ఆదిచాలా అనర్థాలకు దారి తీస్తుంది. చివరకు రాజుకే ముప్పు తెస్తుంది.

ఏ మానవుడయినా, ఉదయంపూట ధర్మకార్యాలు కొనసాగించాలి. మధ్యాహ్న సమయాల్లో ధన సంపాదన మార్గాలు ఆలోచించాలి. రాత్రి పూట కామభోగాలు అనుభవించాలి.

ఈ విధంగా సామాన్యులు నడవాలంటే మహారాజు వారికి మార్గ దర్శకంగా ఉండాలి.

ధనం ఉన్నదే-అది ఎక్కువయితే దురభ్యాసాలకు దారితీస్తుంది. దానికి లొంగుతున్నామంటే సర్వనాశనమే.

పగటిపూట నిద్రపోవడం, రాత్రి వేళల మేలుకొని ఉండడం అనారోగ్య కారణం.

మన మంత్రులు, కార్యనిర్వహణ పక్షులూ, నిర్మల మనస్కులూ, కుశాగ్ర బుద్ధులూ, నిస్స్వార్థ జీవనులూ అయి ఉండాలి సుమా !

ఉద్యోగాలు
వ్యక్తుల విద్య, వివేకంతో పాటు వారి శీల స్వభావాలు పరిశీలించి వారిని తగిన ఉద్యోగాలలో నిరమించాలి.

అధములకూ, మధ్యములకూ ఉన్నత పదవులు ఇచ్చి, ఉత్తము లను దిగువ శ్రేణిలో ఉంచరాదు. అందువల్ల పెద్ద పదవులలో ఎక్కిం చిన వారికి బాధ్యతలు తెలియవు. క్రిందికి దిగిన వారు అవమాన భారంతో ఉండి పాలనా యంత్రాంగాన్ని పాడుచేస్తారు.

మన బాధ్యతలు మనమే నిర్వర్తించాలి. అవి క్రింది వారిమీద విడిచిపెడితే వారు మనలను లోకువ చేసి మరీ క్రిందికి దింపుతారు.

నీ సేవలోని వారికి ఎప్పటి కప్పుడు జీతభత్యాలు సకాలంలో అందకపోతే వారు తిరుగుబాటు తెస్తారు. మన రక్షణకోసం, త్యాగాలు చేసే వారి పోషణ విషయంలో చాలా శ్రద్ధ చూపాలి. అలా దేశ ప్రజా రక్షణ కార్యంలో ప్రాణాలు బలిపెట్టినవా రుంటారు. వారి కుటుంబ పోషణ అంతా మనమే భరించాలి.

అలా చెయ్యకపోతే మళ్ళీ ఏ సేనాపతీ మన కోసం సాహసించడు. దేశ రక్షణ పాడయిపోతుంది. కనక పేనలోని వారి పోషణ ప్రధాన కర్త వ్యం.

మరొక ముఖ్యాంశం.
మన కొలువులో ఎందరో ఉద్యోగులుంటారు. వారిలో కొందరే మేధావులు. వీరు తమ ప్రతిభతో మనకు పేరు ప్రతిష్ఠలు తెస్తారు. అటు వంటి వారికి పెద్ద పెద్ద పదవులు యిస్తూండాలి. అంతే కాని అలాగే ఉంచితే వారి ఉత్సాహం పన్నగిల్లుతుంది. దానివల్ల రాజ్యానికి ముప్పు, అపఖ్యాతి.

అలానే దేశంలో అద్భుత సాహస కార్యాలు చేసేవారూ, మహా విద్వాంసులూ ఉంటారు. వారిని ఘనంగా సన్మానించాలి. విద్యా వంతులూ, ప్రతిభాసంపన్నులూ అయినవారు ఎప్పుడూ కొద్దిమందే ఉంటారు.

అటువంటి వాళ్ళు దేశానికి అలంకారం. అందుచేత వారి పోషణ భారం ప్రభుత్వమే వహించాలి.

దేశానికి రెండు రకాల ప్రమాదాలుంటాయి. అందులో మొదటిది గాలివానలూ, అగ్ని ప్రమాదాలూ, వరదలూ; వీటివల్ల కరువూ కాటకాలూ వస్తాయి. ఇవి ప్రకృతి వల్ల వచ్చే ప్రమాదాలు..

రెండవ రక –
దేశంలో సంస్కారం లేని మూఢులు పెరుగుతుంటారు. వారిలో పశుత్వం ఎక్కువ ఉంటుంది. రాజు బలవంతుడై ధీశాలిగా ఉంటే ఈ మూఢులు మూల మూలల్లో బ్రతుకుతారు. అలాకాక ప్రభువు కూడా మూఢుడైతే వీరు ప్రజలను హింసించి దోచుకు తినేస్తారు. ఒక్కోసారి రాజుకే ధన లోభం పుడితే రాజు పేరుమీద వీరే దోపిడి ఆరంభిస్తారు. అందుచేత అధికారంలోకి వచ్చేవాడు ఈ మూర్ఖుల సంఖ్య పెరగకుండా చూడాలి. చూడనివాడు పదవికి నీళ్ళు వదులుకోవాలి. పైగా నేరాలు చేసేవారిని ఎప్పటికప్పుడు కఠినంగా దండించకపోతే దేశంలో దొంగ తనాలూ, దొమ్మీలూ, హత్యలూ పెరిగిపోతాయి. ఏ సమయంలోనూ ద్రోహులను దండించకుండా విడువరాదు. విద్రోహుల మీద కనికరం చూపడం కంటే తెలివితక్కువ పని లేదని నువ్వూ వినే ఉంటావు ధర్మ నందనా.

దేశ ప్రజలకు అగ్ని ప్రమాదాల బాధ రాకుండా రాజు కాపాడాలి. అలానే వారి ఆరోగ్యానికి అవసరమైన సదుపాయాలూ, చక్కని మంచి నీరు దొరికే ఏర్పాట్లు ప్రభువే చెయ్యాలి.

దేశంలో వికలాంగులూ, ఆనాథులూ ఉంటారు. వీరం వరి రక్షణ, పోషణలూ ప్రభువే చూడాలి.

చివరగా ప్రజలనుంచి పన్నులు వసూలు చేసే వారిని సరయిన వారినే వెయ్యాలి. మంచి గంధపు చెట్లను కట్టెల కోసం పొడిచే మూర్ఖుల వలె పన్నులు పిండరాదు. పూలమాల కట్టేవాడు పూల తీగ కందకుండా పూలు కోసుకునేటట్లు మనం పన్నులు వసూలు చేసుకోవాలి.

దేశ దేశాల నుంచి మన దేశానికి వ్యాపారంకోసం వర్తకులు వస్తారు. వారిని పీడించి అధికంగా పన్నులు గుంజితే వారు మళ్ళీరారు. అలాకాక వారు పన్నులు ఎగగొట్టకుండా కూడా జాగ్రత్త పడాలి సుమా!

దేహం ఆరోగ్యంగా ఉండాలంటే శుచిగా వండిన ఆహారం మితంగా తీసుకోవాలి. దేహారోగ్యంతోపాటే మనస్సుకూడా నిర్మలంగా ఉండా అంటే అనుభవ సంపన్నులయిన విద్వాంసులతో, సత్పురుషులతో రోజూ కొంత సేపు సత్కాలక్షేపాలు చెయ్యాలి.

ధర్మనందనా ! ఇవన్నీ నీకు తెలుసు. అయినా చెప్పడం మా విధి అన్నాడు వారదుడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satyanarayana Vrata 4th Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం

Satyanarayana Vrata 4th Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – చతుర్థోధ్యాయః –

తరువాత సాధువు శుభశకునములు చూచి, విప్రులకు దానధర్మములు చేసి ప్రయాణం సాగించెను. సాదువు కొంతదూరము ప్రయాణించెను. సత్యదేవునికి సాధువును పరీక్షించు కోరిక గలిగి, సన్యాసి వేషముతో వచ్చి సాధూ! నీ పడవలలో నున్నదేమి? అని యడిగెను. ఆ వైశ్యులు ధనమదముగలవారై, అడిగిన ఆ సన్యాసిని జూచి, పరిహసించి, ఇందులో నున్నదేమైన అపహరించుటకు చూచుచున్నావా? ఇందులో మాత్రమేమున్నది? ఆకులు తీగలు తప్ప? అని చెప్పిరి. సన్యాసి రూపుడైన ఆ దేవుడతని మాటలు విని ‘తథాస్తు’ అని పలికి కొంతదూరములో నది యొడ్డుననే నిలుచుండెను. సన్యాసి అటు వెళ్ళగానే సాధువు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలు ఆకులలములతో నిండియుండుట చూచి ఆశ్చర్య పడి, దుఃఖముతో మూర్చపోయెను.తెలివి వచ్చిన తరువాత ధనములు అట్లయినందుకు చాల విచారించెను. అప్పుడల్లుడు సాదువును జూచి, మహాత్ముడైన సన్యాసిని పరిహసించినాము. అతడు కోపముతో శపించి పోయినాడు. ఆయనయే మరల మనలను రక్షింపగలడు. ఆయనను శరణు వేడినచో మన కోరికలు తీరును అని చెప్పెను. అల్లుని మాటలు విని సాధువు వెంటనే సన్యాసి దగ్గరకు బోయి భక్తితో నమస్కరించి వినయవిధేయతలతో ఇట్లనెను. స్వామీ ! అజ్ఞానముచే నేను పలికిన మాటలను మన్నించి నన్ను క్షమింపుము. అని పదే పదే మ్రొక్కుచు ఏడ్చెను. గోలున ఏడ్చుచున్న సాదువును జూచి స్వామి, ఏడువవద్దు. నీవు నా పూజ చేయుదునని ప్రతిజ్ఞ చేసి, అశ్రద్ధ చేత మరచినావు. దుష్టబుద్దీ! నా శాపము చేత నీ కీ కష్టాలు కలుగుచున్నవని యిప్పటికైనా గ్రహించితివా? అనెను. స్వామి మాటలు విని సాధువు చేతులు జోడించి, ఓ పుండరిక నేత్రా ! బ్రహ్మాదిదేవతలే నీ మాయను దాటలేక సతమతమగుచున్నారు. నీ గుణములను రూపమును తెలిసికొనలేకున్నారు. మానవమాత్రుడను, అజ్ఞానిని. ఆపైన, అనీ మాయలో చిక్కుకొని, నీ అనుగ్రహమునకు దూరమైనవాడను. నిన్ను నేనెట్లు తెలిసికొనగలను? నా యపరాధమును క్షమింపుము. నిన్నెప్పుడును మరువక నా శక్తి కొలది నిన్ను పుజించెదను. శరణాగతుడైన నన్ను అనుగ్రహించి, నాధనములు నాకిచ్చి రక్షింపుము. అని ప్రార్థించెను. భక్తితో సాధువు చేసిన స్తోత్రమునుకు స్వామి సంతోషించి అతడు కోరిన వరమిచ్చి అక్కడనే అదృశ్యుడయ్యెను. సాదువు నావ దగ్గరకు వచ్చి అది ధనములతోను , వస్తువులతోను నిండి యుండుట చూచి, సత్యదేవుని దయవలన నా కొరిక తిరనదనుచు, పరివారముతో గలసి స్వామిని పూజించి తన నగరమునకు ప్రయాణము సాగించెను.

సాధువు తన ధనములను జాగ్రత్తగా కాపాడుచున్న అల్లుని జూచి, అల్లుడా ! చూచితివా? రత్నపురమునకు జేరినాము. అనుచు తమ రాకను తెలియజేయుటకై ఇంటికొక దూతను పంపెను. ఆ వార్తాహరుడు నగరమునకు బోయి సాధువు భార్యను జూచి నమస్క రించి, ‘అమ్మా! మన షావుకారుగారు అల్లునితోను, బందుమిత్రులతోను మన నగరమునకు వచ్చినారని’ చెప్పెను. దూత చెప్పినమాట విని సాధువు భార్య తాను చేయుచున్న సత్యవ్రతమును త్వరగా పూర్తిచేసి కుమార్తె తో ఇట్లనెను. నేను వెళ్ళుచున్నాను. నీవు కూడ త్వరగా నీతండ్రిని, భర్తను జూచుటకు రమ్ము. అనగా, తల్లిమాటలు విని కళావతి వ్రతమును ముగించి ప్రసాదమును భుజించుట మరచి భర్తను చూచుటకు వెళ్ళెను. అందుకు సత్యదేవుడు కోపించి ఆమె భర్తను పడవతో నీళ్ళలో ముంచివేసెను. తీరమందున్న జనులందురును పరమదుఃఖముతోనున్న కళావతిని జూచి దుఃఖము నొందిరి. ఉన్నట్లుండి పడవ మునిగిపోయినందుకు ఆశ్చర్యమును గూడ పొందిరి. కళావతి దుఃఖితురాలైన కుమార్తెను జూచి దుఃఖించుచు భర్తతో ఇట్లనెను. మన అల్లుడు పడవతో ఇట్లేల మునిగిపోయినాడు? ఇది ఏ దేవుని మాయవల్ల జరిగినది ? అని పలుకుచు కుమార్తెను ఒడిలోనికి దీసుకొని దుఃఖించెను కళావతీ తన భర్త అట్లు మునిగిపోయినందుకు విచారించుచు, అతని పాదుకలతో పాటు సహగమనము చేయుటకు సిద్దపడెను. తన కుమార్తె అవస్థ జూచి సాధువు చాల విచారించెను. అక్కడివారు కూడా బాదపడిరి. అప్పుడు సాధువు ‘ఇది యంతయు సత్యదేవుని మాయయై యుండును. స్వామి నన్ననుగ్రహించినచో నా వైభవము కొలది సత్యదేవ వ్రతము చేసెదనని చెప్పుచు ఆ దేవునికి అనేక సాష్టాంగనమస్కారములు చేసెను. సాధువుపై ప్రసన్నుడైన సత్యదేవుడు అతనితో ‘ఇట్లు చెప్పెను. ఓ సాధూ ! నీ కుమార్తె సత్యవ్రతము చేసి ప్రసాదము పుచ్చుకొనకుండ భర్తను జూచుటకు వచ్చినది. అందుచేతనే ఆమె భర్త కనబడకుండా పోయినాడు. ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని వచ్చినచో ఆమె భర్త మరల జీవించును. ఆకాశమునుండి వినవచ్చిన ఆ వాక్యమును విని కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని త్వరగా తిరిగివచ్చి నీటిపై తేలుచున్న పడవలోని భర్తను జూచి సంతోషపడెను. అప్పుడామె తండ్రితో, తండ్రీ ! మన యింటికి పోవుదుము. ఇంక ఆలస్యమెందుకు ? అనెను. కుమార్తె మాటలు విని సాదువు సంతోషపడి,తన వారందరితో గలసి ఆ నదీతీరమునందే సత్యనారాయణ వ్రతము చేసి, తరువాత తన యింటికి చేరెను. ప్రతి పూర్ణిమనాడును ప్రతి సూర్య సంక్రమణనాడును సత్యనారాయణ వ్రతము యధావిధిగా చేయుచు ఆ సాధువు ఇహలోకమున సమస్త్రైశ్వర్యములు అనుభవించి చివరికి సత్యదేవుని సన్నిదానము చేరెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే చతుర్థోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Satyanarayana Vrata 3rd Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం

Satyanarayana Vrata 3rd Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ తృతీయోధ్యాయః 

మరల సూతుడిట్లు చెప్పసాగెను. మునులారా ! ఇంకొక కథను జెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను రాజుండెను. అతడు సత్యవాక్పాలకుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు బోయి దైవదర్శనము చేసి, బ్రాహ్మణులుకు ధనమును ఇచ్చెడివాడు. అతని భార్య సౌందర్యవతి, సాధ్వి. ఆమెతో గలిసి రాజొకనాడు భద్రశీలానదీ తీరమున సత్యనారాయణ వ్రతమాచరించెను. ఇంతలో అక్కడికి సాధువను ఒక వర్తకుడు, అనేక వస్తువులతోను, ధనముతోను నిండిన నావను ఒడ్డున నిల్పి, వ్రతము చేయుచున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇట్లడిగెను. ఓ మహారాజా ! ఇంత భక్తిశ్రద్ధలతో మీరు చేయుచున్న యీ వ్రతమేమి? దయచేసి నాకు వివరింపుడు. వినవలెననియున్నది. సాధువిట్లడగగా ఆ రాజు, ‘ఓ సాధూ ! పుత్రసంతానము కావలెనను కోరికతో నేను మా బందుమిత్రులను బిలుచుకొని సత్యనారాయణ వ్రతము చేయుచున్నాను, అని చెప్పెను. రాజు మాటలు విని సాధువు, మహారాజా ! నాకును సంతానము లేదు. ఈ వ్రతము వలన సంతానము కలుగుచున్నచో నేనును దీని నాచరించెద ననెను. తరువాత సాధువు వర్తకము పూర్తిచేసుకొని ఇంటికి వచ్చి భార్యయైన లీలావతితో సంతానప్రదమైన యీ సత్యదేవుని గూర్చి చెప్పి, మనకు సంతానము కలిగినచో ఆ వ్రతము చేసెదనని పలికెను. సాధువు భార్య లీలావతి ధర్మప్రవృత్తి గలదై భర్తతో ఆనందముగా గడిపి గర్భవతియై సత్యదేవుని అనుగ్రహమువలన పదవ నెలలో ఒక బాలికను గనెను. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునివలె వృద్ధి చెందుచుండగా తల్లిదండ్రులామెకు కళావతి అని పేరు పెట్టిరి. ఆ సమయములో లీలావతి భర్తను జూచి, సంతానము గలిగినచో వ్రతము చేయుదమంటిరిగదా ! పుత్రిక కలిగినది కదా! ఇంకను వ్రతము మాట తలపెట్టరేమి? అని అడిగెను. అందుకు భర్త, లీలావతీ ! మన అమ్మాయి వివాహములో వ్రతము తప్పక చేయుదును. అని యామెను సమాధానపరిచి వర్తకమునకై నగరమునకు బోయెను. కళావతి తండ్రి యింటిలో పెరుగుచుండెను.

అట్లు యుక్తవయసు వచ్చిన కుమార్తెను జూచి సాధువు తన మిత్రులతో ఆలోచించి, వరుని వెదుకుటకై దూతను పంపెను. వర్తకునిచే పంపబడిన ఆ దూత కాంచనగరమునకు బోయి, అక్కడ యొగ్యుడైన వైశ్యబాలకుని జూచి పెండ్లి చూపులకై తీసుకొని వచ్చెను. సుందరుడైన ఆ వైశ్యబాలును జూచి సాధువు తన కుమార్తె నిచ్చి పెండ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత ఆ పెండ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత ఆ పెండ్లి వేడుకలలో బడి సత్యదేవుని వ్రతము సంగతి మరిచిపోయెను. అందుచే ఆ స్వామి చాలా కోపించెను. తరువాత కొంతకాలమునకు వ్యాపారమునందు దక్షతగల ఆ సాధువు అల్లునితో గలిసి వాణిజ్యమునకై బయలుదేరెను. అతడు నౌకలలో సముద్రతీరమున నున్న రత్నసానుపురమును జేరుకొని అక్కడ అల్లునితో గూడి వ్యాపారము సాగించుచుండెను. తరువాత వ్యాపారమునకై వారిద్దరును చంద్రకేతు మహారాజు నగరమునకు బోయిరి. అంతటి, వ్రతము చేసెదనని ప్రతిజ్ఞ చేసి మరచి పోయిన ఆ సాధువును జూచి, స్వామి కోపించి, దారుణము, కఠినము అయిన మహాదుఃఖ మతనికి కలుగుగాక యని శపించెను.

ఆనాడే రాజ దనాగారములో ఒక దొంగ ప్రవేశించి ధనము దోచుకొని పారిపోవుచుండెను. రాజభటులు తరుముచుండగా వాడీ వర్తకులున్నవైపు పరుగెత్తెను. ఆ దొంగ, తన్ను తరుముకొని వచ్చుచున్న రాజభటులను జూచి భయపడి దనమును వర్తకులముందు గుమ్మరించి పారిపోయెను. రాజభటులక్కడికి వచ్చి, రాజదనముతో ఎదుట కనబడుచున్న ఆ వర్తకులను బందించి రాజునొద్దకు తీసుకొనిపోయిరి. ఆ భటులు సంతోషముతో వీరిని దీసుకొనిపోయి, మహారాజా ! ఇద్దరు దొంగలను బట్టి తెచ్చినాము. విచారించి శిక్షింపుడు అనిరి. రాజు వారి నేరమును విచారణ దొంగలను బట్టి తెచ్చినాము. విచారించి శిక్షింపుడు అనిరి. రాజు వారి నేరమును విచారణ చేయనక్కరలేదనచు, కారాగారమున బందింపుడనెను. వారు వర్తకులను కారాగృహమున బందించిరి. సత్యదేవుని మాయచేత వర్తకులెంత మొరపెట్టుకున్నను వారి మాటలెవ్వరును పట్టించుకొనలేదు. రాజు వారి ధనమును తన ధనాగారమున చేర్పించెను.

ఆ దేవుని శాపముచే ఇంటి దగ్గర సాధువు భార్య కూడ కష్టాలపాలయ్యెను. ఇంటిలోని ధనమునంతను దొంగ లపహరించిరి. లీలావతి మనోవ్యథచే రొగగ్రస్తురాలయ్యెను. తినుటకు తిండి దొరకక ఇంటికి దిరిగి బిచ్చమెత్తుకొనసాగెను. కుమార్తెయైన కళావతి కూడ బిచ్చమెత్తుటకు పోసాగెను. ఒకనాడు సాయంకాలం వేళ, కళావతి ఒక బ్రాహ్మణునింటికి మాధవకబళమునకు బోయెను. అక్కడ ఆయన సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూచి, కథయంతయు విని, తమకు మేలు కలుగునట్లు వరమిమ్మని స్వామిని కోరుకొనెను. స్వామి ప్రసాదమును గూడ పుచ్చుకొని కళావతి, రాత్రి ప్రొద్దు పోయి యింటికి చేరెను. అప్పుడు తల్లి ఆమెతో ఇట్లనెను. అమ్మాయీ ! ఇంత రాత్రి వరకు ఎక్కడనుంటివి? నీ మనస్సులో ఏమున్నది? అని యడిగెను. వెంటనే కళావతి, అమ్మా! నేనొక బ్రాహ్మణుని యింటిలో సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా చూచుచు ఉండిపోయితిని. ఆ వ్రతము కోరిన కోరికలు తీర్చునట గదా ! అనెను. ఆ మాటవిని సాధుభార్య, తామా వ్రతము చేయకపోవుటచేతనే ఇట్టి దురవస్థ కలిగినదని గ్రహించి, వ్రతము చేయుటకు సంకల్పించి, ఆ మరునాడు యథాశక్తిగా వ్రతము చేసెను. వ్రతాంతమునందు, స్వామీ !
నా భర్తయును అల్లుడును సుఖముగా తిరిగి యింటికి చేరునట్లు అనుగ్రహింపుము. వారి తప్పులను క్షమింపుము అని ప్రార్థించెను. లీలావతి చెసిన యా వ్రతముచే సంతోషించబడిన సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనబడి, నీవు బంధించిన వారిద్దరును దొంగలు కారు, వర్తకులు. రేపు వారిని విడిపించి వారి ధనమును వారికిచ్చి పంపుము. లేనిచో నిన్ను సమూలముగా నాశనము చేసెదనని చెప్పి అదృశ్యుడయ్యెను. మరునాడు ఉదయమున రాజు సభలో తనకు వచ్చిన కలను చెప్పి, ఆ వర్తకులను చెరసాలనుండి విడిపించి తెండని భటుల కాజ్ఞాపించగా వారట్లే ఆ వైశ్యులను సభలోనికి దెచ్చి రాజా ! వైశ్యులిద్దరిని తెచ్చినామని విన్నవించిరి.

ఆ వైశ్యులిద్దరును చంద్రకేతు మహారాజుకు నమస్కరించి వెనుకటి సంగతులు తలచుకొనుచు ఏమియు పలుకలేక నిలుచుచుండిరి. రాజప్పుడా వైశ్యులను జూచి ఆదరముతో, వర్తకులారా ! మీకీ కష్టము దైవ వశమున కలిగినది. ఇప్పుడా భయములేదని ఓదార్చి, వారి సంకెళ్ళను తీయించి క్షౌరము మున్నగు అలంకారములు జేయించెను. (మండనం ముండనం పుంసాం = పురుషులకు క్షౌరము అలంకారము.) వస్త్రాద్యలంకారములనిచ్చి, మంచి మాటలతో వారిని సంతోషపరచవలెను. ఇది వరకు వారివద్దనుండి తీసికొన్న ద్రవ్యమును రెట్టింపు ద్రవ్యమిచ్చి, ‘ఓ సాదూ! ఇంక మీ యింటికేగుమని ఆ రాజు చెప్పగా వారు సెలవు తీసుకొని బయలు దేరిరి’.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే తృతీయోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Satyanarayana Vrata 2nd Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం

Satyanarayana Vrata 2nd Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – ద్వితీయోధ్యాయః

శ్లో // అధాన్యత్సంప్రవక్ష్యామి కృతం యేన పురాద్విజాః,
కశ్చిత్కాశీపురేమ్యేహ్యా సీద్విప్రోతి నిర్ధనః
క్షుత్తృ డ్భ్యాం వ్యాకులో భూత్వా నిత్యాంబభ్రామ్ భూతలే //

సూతుడు మరల ఇలా చెప్పుచున్నాడు. మునులారా ! పూర్వమీ వ్రతము చేసిన వాని కథ చెప్పెదను వినుడు. కాశీనగరమున అతి దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు నిత్యము ఆకలిదప్పులతో అలమటించుచు తిరుగుచుండెను. శ్రీ సత్యనారాయణ స్వామి, దుఃఖపడుచున్న బ్రాహ్మణుని జూచి కరుణ గలవాడై తానొక బ్రాహ్మణ వేషము దరించి వచ్చి, ‘ఓ విప్రుడా ! ఇట్లు దుఃఖించుచు తిరుగుచుంటివేమి? నీ కథనంతను జెప్పుము. వినవలెనని యున్నది’ అనెను. విప్రుడిట్లు చెప్పెను. ఓ మహానుభావా ! నేనొక బ్రాహ్మణుడను. అతి దరిద్రుడను. బిక్ష కొరకు ఇంటింటికి తిరుగుచున్నాను. నా దరిద్రము నశించెడి ఉపాయము నీకు తెలిసినచో నాకు చెప్పుము అని నా దరిద్రము నశించెడి ఉపాయము నీకు తెలిసినచో నాకు యమ నీకు తెలిసినచో నాకు చెప్పుము అని ప్రార్ధించెను.

అంత వృద్ధబ్రాహ్మణుడు, ఓ బ్రాహ్మణుడా ! సత్యనారాయణ వ్రతమని ఒక వ్రతమున్నది. అది చేసినవారికి సర్వదుఃఖాలు తొలగిపోవును. నీవును ఆ వ్రతము చేయు మనుచు దాని విధానమును భోధించి అంతర్థానము చెందెను. ఆ బ్రాహ్మణుడు, రేపే నేనా వృద్ధబ్రాహ్మణుడు చెప్పిన వ్రతము చేసెదనని సంకల్పించి, దానినే తలచుకొనుచు రాత్రి నిద్దురగూడ పోలేదు. అతడు ప్రొద్దున్నే లేచి, ఈ రోజున సత్యదేవుని వ్రతము చేసెదనని మరల సంకల్పించుకొని భిక్షకై బయలుదేరెను. ఆ రోజున స్వామి దయవలన అతనికి చాల ద్రవ్యము లభించెను. బంధువులను గూడ పిలిచి, దానితో అతడు సత్యనారాయణ వ్రతము చేసెను. ఆ వ్రతము యొక్క ప్రభావము చేత అతడు దారిద్ర్యము మున్నగు సర్వ దుఃఖములనుండి విముక్తుడై, సమస్త సంపదలతో తులతూగెను. అది మొదలుగా అతడు ప్రతిమాసమునందు ఈ వ్రతమును ఆచరించి సర్వపాప విముక్తుడై తుదకు మోక్షము నొందెను. ఆ బ్రాహ్మణుడు చేసినట్లు ఏ మానవుడైనను ఈ సత్యనారాయణ వ్రతము చేసినచో, అతని సర్వదుఃఖములును నశించును. సూతుడు, మునులారా ! మీరడిగిన కథ చెప్పినాను. ఇంకేమి చెప్పమందురు ? అని యడిగెను. శౌనకాది ఋషులు, మహాత్మా ! ఆ బ్రాహ్మణుని వలన తెలిసికొని యెవ్వడీ వ్రతమాచరించెనో చెప్పుము. మాకు వినవలెనని యున్నది అని యడిగిరి. సూతుడిట్లు చెప్పనారంబించెను. మునులారా! ఒకనాడా బ్రాహ్మణుడు తన వైభవము కొలది బందువులను బిలిచికొని వ్రతము చేయుటకు ప్రారంభించెను. అంతలో అక్కడి కొక కట్టెలమ్ము కొనువాడువచ్చి కట్టెల మోపు బయట దింపి విప్రుని ఇంటికి వచ్చెను.

అతడు చాల దప్పిక గలవాడై యుండియు ఓపికగా బ్రాహ్మణుడు చేయు వ్రతమును పూర్తిగా చూచి, తుదకు ఆయనకును దేవునుకును నమస్కరించి, మహానుభావా ! నీవు చేసిన పూజయేమి? దీనివలన కలుగు ఫలమేమి ? వివరముగా జెప్పమని యడిగెను. బ్రాహ్మణుడిట్లు చెప్పెను. ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము చేసినచో ధనధాన్యములు, సర్వసంపదలు కలుగును. ఇట్లు ఆ విప్రుని వలన ఆ వ్రతమును గూర్చి తెలుసుకొని మంచి నీరు త్రాగి, ప్రసాదమును స్వీకరించి తన యూరికి బోయెను. అతడు సత్యదేవుని మనసులో ధ్యానించుచు, ఈ కట్టెల మోపును రేపు అమ్మెదను. అమ్మగా వచ్చిన ధనముతో సత్యదేవుని వ్రతము చేసెదను, అనుకొని మరనాడు కట్టెల మోపు తలపై పెట్టుకొని నగరములో ధనికులుండు ఇండ్లవైపు వెళ్ళెను. అతడానాడు స్వామి యనుగ్రహముచే కట్టెలమ్మి రెట్టింపు లాభము నొందెను. దానికి సంతోషించి, అరటిపండ్లు, పంచదార, ఆవునేయి, ఆవు పాలు, శేరుంబావు గోధుమనూక, పూజాద్రవ్యములు అన్నియు దీసుకొని ఇంటికి వెళ్ళెను. వెళ్ళి, బందువులునందరిని బిలిచి సత్యదేవుని వ్రతమును యథాశక్తిగా చేసెను. ఆ వ్రతము చేసిన ప్రభావముచే అతడు ధనములతోను, పుత్రులతోను సర్వసమృద్ధిగలవాడై యీ లోకమున సౌఖ్యములననుభవించి చివరికి సత్యలోకమును పొందెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ద్వితీయోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Viveka Margramlo Povali In Telugu – వివేక మార్గంలో పోవాలి

Viveka Margramlo Povali In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వివేక మార్గంలో పోవాలి నీతికథ.

వివేక మార్గంలో పోవాలి

మహా విద్వాంసుడూ, భారత వంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రీ. అయిన విదురుడు తన ప్రభువు అవివేశాన్ని వేలెత్తి చూపుతూ చెపు తున్నాడు.

ప్రభూ! ధనవంతుడున్నాడే వాడు హాయిగా సుఖపడుతూ భోగ మయ జీవితం గడుపుతూ తృప్తి పడకూడదు. పదిమందికీ పెట్టి, పేద వారికి దానధర్మాలు చేస్తూండాలి. దానం చేసేటప్పుడు చిరాకుతో, విసు గుతో చెయ్యకూడదు. సంతోషంతో చేస్తే పుచ్చుకున్న వాడు కూడా అనం దిస్తాడు. దానివల్ల మన పుణ్యం పెరుగుతుంది. అదే ధనానికి ఫలం.

వేద వేదాంగాలు చదివినవారుంటారు. వారు నిత్యం సత్కర్మలే చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడాలి. శాస్త్రాలు చదివిని వారందరూ అందులో చెప్పిన సదాచారాలను తాము ఆచరించి ఎదుటి వారికి బోధిం చాలి.

ఆత్మబలం కనక ఉన్నట్లయితే ఎన్ని వివత్తులు మీదపడ్డా తట్టుకో గలం. అది లేని నాడు ఏ చిన్న కష్టం వచ్చినా క్రుంగిపోతాం.

ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము. క్రోధాన్ని శాంతంతో జయించాలి. దుష్టులను మంచి మాటలతో మరలించాలి. లోభబుద్ధి ఉంటే అది పోవడానికి దానగుణం అలవరచుకోవాలి. అసత్యాన్ని పత్యమే జయిస్తుంది.

దొంగలు, జూదరులు, సోమరిపోతులు, కాముకులు, కృతఘ్నులు, వా స్తితులు- వీరందరూ అవఖ్యాతినే పొందుతారు.

విద్యావంతుడు కానివాడి జీవితం నిరర్థకం. అలానే సంతానం లేని దాంపత్య జీవితమూనూ.

విశ్రాంతి లేకుండా తిరిగే వారికి త్వరగా ముపలితనం వస్తుంది. పదిమంది చేత అవమానాల పాలయిన వాడి మనస్సుకి వార్ధక్యం ప్రాప్తి స్తుంది. నిరంతరం మననం చేసుకోక పోతే విద్య నిలవదు.

అన్నిటికంటె లోభం మహాచెడ్డది. ఎందుకంటే
ఈ ప్రపంచంలో ఉండే బంగారం, మణులూ, రత్నాలూ, ధాన్యాలూ, అన్నీ లభించినా యింకా ఏదో దొరకలేదని ఏడుస్తూనే ఉంటాడు లోభి. అందువల్లనే మానవుడు ముందుగా లోభ గుణాన్ని విడిచి పెట్టాలంటారు.

నడ్డిపంచి పని చేసేవాడికి ఏ లోటూ రాదు. సజ్జమలతో సహవాసం చేసే వానికి అపకీర్తి రాదు. వీరిద్దరూ సర్వ సుఖాలూ పొందుతారు.

గుంతలను దోషులుగా ప్రచారం చెయ్యడం కంటె మరణం లేదు. ఇతరులను నిందిస్తూ కూర్చోవడం కంటే దరిద్రం లేదు.

విద్యార్థులయిన వారు సోమరితనాన్ని దరి చేర నివ్వకూడదు. వ్యామోహాలకు లొంగరాదు. మదోన్మత్తులు కాకూడదు. చపలచిత్తులు కాకూడదు. సర్వ సుఖ భోగాలలో తేలియాడే వారికి చదువు రాదు. విద్యా భ్యాస కాలంలో వివయాన్నీ, క్లేశసహనాన్ని అలవరచుకోవాలి. అప్పుడే విద్య అంటుతుంది.

ప్రభూ!
మరొక్క ముఖ్యమయిన మాట. సావధానంగా వినండి. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ మాత్రమే నిత్యం. అంమచేత దానిని గురించే యోచన చెయ్యాలి.

ధన ధాన్య సమృద్ధమూ, రత్న మాణిక్య సంపన్నమూ అయిన ఈ భూమండలం అంతటినీ పాలించిన మహారాజు కూడా మరణానంతరం తనతో ఒక్క గడ్డి పరక కూడా పట్టుకుపోలేడు అన్నీ యిక్కడ విడిచి పోవలసిందే.

ఈ విషయం మీకు తెలియనిదని చెప్పడం లేదు. తెలిసిన వాటిని మళ్లీ గుర్తు చేసుకోవడం మన విధి.

కష్టపడి పెంచి, పోషించి, విద్యాబుద్ధులు నేర్పి, సంపదలన్నీ -యిచ్చిన తండ్రి మరణిస్తే, యిన్నీ అనుభవించే ఆ కొడుకు ఏం చేస్తు న్నాడు?

ఇంతసేపు ఏడ్చి, వల్లకాటికి తీసుకుపోయి బూడిద చేస్తున్నాడు. అంతేగదా ! ఆ తరువాత హాయిగా జీవితం సాగిస్తున్నాడు. ఇది లోక వ్యవహారం.

ఆ మరణించిన వాడి సిరి సంపదలన్నీ బంధువులు పంచుకు తింటు న్నారు. ఆ శరీరాన్ని బూడిద చేస్తే పంచ భూతాలలో కలసిపోతుంది.

పాతిపెడితే నక్కలూ, గ్రద్దలూ తింటున్నాయి.
పువ్వులూ, కాయలూ లేని చెట్లమీదికి పక్షులు కూడా చేరవు. అలానే మరణించిన వాడితో ఎవరూ పోరు.

ఎటొచ్చీ – వాడు చేసిన పుణ్య, పాపకర్మల ఫలం మాత్రం కూడా వెడుతుంది. కనుకనే దాన ధర్మాలూ, పుణ్యకార్యాలూ చెయ్యాలని పెద్దలు చెబుతున్నారు.

మనం చెయ్యవలసిన పనులు మనం చేసుకుంటూ పేదసాదలను ఆవరంతో చూస్తుండాలి. పతితులను రక్షించడానికి ప్రయత్నించాలి.
గురువులనుందు భక్తి కలిగి శ్రద్ధతో వారి బోధలు వింటూ, వారిని సేవించుకోవాలి.

ఎప్పుడూ పత్యమే పలకాలి అసత్య భాషణానికి అవకాశం యివ్వకూడదు.

ధనవంతులు దానధర్మాలతో త్యాగబుద్ధిని ఎలా అలవర్చుకుంటారో, అలానే బలపరాక్రమాలు కలవారు ఎదుటి వారిని హింసించడానికి దానిని వినియోగించరాదు.

దుర్బలులకు సాయపడడానికే వీరులు కృషి చెయ్యాలి.
అన్ని దానాల కంటే శ్రేష్ఠమయినది అన్నదానం.
అదే కదా ప్రాణానికి ఆధారం.
అలానే జీవితంలో ప్రధానమయినది ధర్మ మార్గాన నడవడం.
అంతకంటె ఏమీలేదు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satyanarayana Swamy Vrata Katha First Part In Telugu – వ్రత కథ ప్రథమ అధ్యాయం

Satyanarayana Vrata 1st Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

సత్యనారాయణ వ్రత కథ – ప్రథమోధ్యాయః

శ్లో//ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోప శాంతయే //

శ్రీమంతమైన నైమిశారణ్యములో శౌనకాదిమహర్షులు, తమ దగ్గరకు వచ్చిన మహాపురాణవేత్తయైన సూతునికి మర్యాదలు చేసి, యిట్లడిగిరి. పౌరాణిక శేఖరా ! మానవులు కోటిన ఇహలోక, పరలోకములందలి సౌఖ్యములు ఏ వ్రతము చేసిన లభించును ? ఏ తపము చేసిన లభించును ? అదంతయు మాకు చెప్పుము. అని కోరగా సూతుడిట్లనెను. మునులారా ! మీరడిగిన ప్రశ్ననే ఒకప్పుడు దేవర్షియైన నారదుడు శ్రీమన్నారాయణు నడిగెను.ఆయన నారదునకు చెప్పిన దానినే మీకు చెప్పెదను, వినుడు.ఒకానొకప్పుడు నారదమహాముని లోకములను అనుగ్రహించు కోరిక గలవాడై వివిధ లోకములు దిరుగుచు భూలోకమునకు వచ్చెను. అక్కడ, తాము చేసిన కర్మములచే నానాదుఃఖములనుభవించుచు, అనేక జన్మములెత్తుచున్న జనములనుజూచి, ఏ యపాయముచే వీరి దుఃఖములు తొలగు నని చింతించి, సర్వలోక పరిపాలకుడగు శ్రీహరి నివసించు వైకుంఠమునకు వెడలను. అక్కడ, తెల్లని శరీరకాంతి గలవాడును, నాలుగు భుజములు ప్రథమ అధ్యాయం గలవాడును, శంఖము – చక్రము – గద – పద్మము వనమాల వీనిచే అలంకరింపబడినవాడును అగు శ్రీమన్నారయణుని జూచి స్తుతించుట ఆరంభించెను. “మాటలకును మనస్సునకును అందని రూపముగలవాడవును, సృష్టి స్థితి లయములు చేయు అనంతశక్తి గలవాడవును, పుట్టుట – పెరుగుట – నశించుట లేనివాడవును, మొదట సత్వరజస్తమో గుణములు లేనివాడవే అయినను సృష్టి వ్యవహారములో త్రిగుణములు గలవాడవును, అన్నింటికి మొదటివాడవును, భక్తుల బాధలు తీర్చువాడవును అగు నీకు నమస్కారము” నారదుని యీ స్తోత్రమును విని విష్ణువు నారదమునీ తో నిట్లనెను. నారదమునీ ! నీవిక్కడి కేల వచ్చితివి? నీ మన్సులో నేమి కోరిక యున్నది? చెప్పుము. నీవడిగిన వన్నియు వివరింతును. అని నారదుడిట్లనెను. స్వామీ ! భూలోకమున జనులందరును చాల దుఃఖము లనుభవించున్నారు. మృగ పశుపక్షి మనుష్యాది అనేక జన్మములెత్తుచున్నారు.అనేక పాపములు చేసి ఆ పాప ఫలములనుభవించుచున్నారు. తేలికయైన ఉపాయము చేత వారి పాపములన్నియు నశించు మార్గమును దయచేసి ఉపదేశింపుము. అని అడుగగా భగవానుడిట్లనెను, నారదా! లోకములోనివారు సుఖపడవలెనను మంచిబుద్ధితో నీవడిగిన విషయము చాల బాగున్నది. జనులు దేనిచే సంసార భ్రాంతి విడిచి సౌఖ్యము పొందుదురో అట్టి సులభోపాయమును జెప్పెదను, వినుము.

భూలోకమందును, స్వర్గలోకమందును గూడ దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రత మొక్కటి కలదు. నీయందలి వాత్సల్యము చే చెప్పుచున్నాను. అది సత్యనారాయణ వ్రతము. దానిని విధివిధానముగా ఆచరించినవాడు ఈ లోకమున సమస్త సౌఖ్యముల ననుభవించి ఆపైన ముక్తి నొందును. అని చెప్పగా స్వామీ ! ఆ వ్రతవిదానమేమి? ఆ వ్రత మట్లు చేసినచో ఫలమేమి? పూర్వ మెవ్వరైన చేసి ఫలము నొందినారా? ఆ వ్రతమెప్పుడు చెయవలెను? ఇవ్వన్నియు వివరముగా జెప్పుమని యడిగెను. భగవానుడిట్లు చెప్పెను. వ్రతవిష్టత ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును. ఈవ్రతము ఏప్పుడు చేయాలిమాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభదినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ధ ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించవచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదశినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను. .ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యావందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలెను. పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్ధికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల మ్రుగ్గులు పెట్టవలెను. ఆ మ్రుగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు. కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో నుంచవలెను.

గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్యష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన చేసి, సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజచేయవలెను. బ్రాహ్మణ – క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక – పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశ్రద్దలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను. బ్రాహ్మణులతోను బంధువులతోను గూడి వ్రతము చేయవలెను. అరటిపండ్లు, ఆవునేయి, ఆవుపాలు, శేరంబావు గోధుమనూక, గోధుమనూక లేనిచో వరినూక, పంచదార వీనినన్నిటిని కలిపి ప్రసాదము చేసి స్వామికి నివేదనము చేయవలెను.

బంధువులతో గూడి సత్యనారాయణ వ్రతకథను విని, బ్రాహ్మణులకు దక్షిణతాంబూలములిచ్చి, వారికిని బంధువులకును భోజనములు పెట్టి స్వామి ప్రసాదమును స్వీకరించి, స్వామికి నృత్యగీతాది మహారాజోపచారములర్పించి తానును భుజింపవలెను. నదీతీరమున ఇట్లు వ్రతము చేసి, స్వామిని స్మరించుచు స్వగృహమునకు చేరవలెను.

ఇట్లు సాంగముగ భక్తి శ్రద్ధలతో వ్రతము చేసినవారికి కోరినవి సిద్ధించును. విశేషించి, కలియుగములో సర్వార్థ సిద్ధికి ఇదియే సులభమైన ఉపాయము. దీనిని మించినదేదియు లేదు. అని శ్రీమన్నారయణుడు, నారదున కుపదేశించెనని సూతుడు శౌనకాది మహామునులకు జెప్పెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ప్రథమోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Sri Sai Deeksha Vidhanam In Telugu – శ్రీ సాయి దీక్షా విధానము

Sri Sai Deeksha Vidhanam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి దీక్షా విధానము గురించి తెలుసుకుందాం…

Sri Sai Deeksha Or Sai Mala Vidhanam

శ్రీ సాయి దీక్షా విధానము

మానవునికి శాంతి సౌఖ్యములను సమకూర్చేది భక్తి. ఆ సాయినాథుని కృపాకటాక్షములు ఎల్లవేళల తోడుండాలని చేసే ప్రయత్నమే శ్రీ సాయిదీక్ష. ఈ దీక్షను శ్రీ సాయి పుట్టిన రోజగు శ్రీరామ నవమికి ముందు, శ్రీ సద్గురుని గురు పౌర్ణిమగు ఆషాఢ పౌర్ణిమకు ముందు, శ్రీ సాయి పుణ్యతిథి యగు విజయదశమికి ముందు, శ్రీ దత్త జయంతి యగు మార్గశిర పౌర్ణిమకు ముందు మండలము, అర్ధ మండలము, సప్తాహంగా వీలును బట్టి స్వీకరించవచ్చును.

దీక్షకు అవసరమగు వస్తువులు:

రెండు మాలలు. ఒకటి ధారణమాల, రెండవది జపమాల. మాలలలో తులసీ, రుద్రాక్ష, స్పటిక, రక్త చందన రకాలున్నాయి. వీటిలో తులసీమాల శ్రేష్ఠము. తెలుపు రంగు దీక్షా వస్త్రములు, అలంకరణ కొరకు గంధము, విభూతి, కుంకుమ, పూజ కొరకు పసుపు, కుంకుమ, అక్షింతలు, అగరవత్తులు, గంధము, కర్పూరం, కలకండ (కడి చక్కెర), పన్నీరు, పీచుతో కూడిన నారికేళం, ఊదు, విభూతి చూర్ణం, ప్రమిదలు, గంట, ఏక మరియు పంచ హారతులు, ఉదాని, వత్తులు, మంచి నూనె, సాయి బాబా విగ్రహం లేదా బాబా, గణపతి, దత్తాత్రేయుల చిత్రపటాలు.

మాలాధారణ విధానము:

మాలాధారణ రోజు ఉదయమే తలంటు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీక్షా దుస్తులు ధరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం పొంది సాయి కాకడహారతికి (ఉ॥ 5-15 ని॥) ముందుగా ఆలయాన్ని చేరి కాకడ హారతి అనంతరం గురు స్వామి లేదా పూజారి చేత మాలధారణ చేయవలెను. తరువాత తాను నివసించు ప్రదేశంలో పీఠం ఏర్పాటు చేసుకొని సాయి విగ్రహం, చిత్ర పటాలు, గురుస్వామి ఇచ్చిన నారికేళం ఉంచి నిత్యం పూజించాలి.

దీక్షా నియమాలు:

  1. వ్రతి రోజు నూర్యోదయం కన్నా ముందు మరియు సూర్యాస్త మయం తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి.
  2. స్నానానంతరం దీక్షా వస్త్రధారణ కాగానే గంధం, కుంకుమ, విభూతి ధరించాలి.
  3. పీఠం వద్ద శుభ్ర పరచి సాయినాథునికి అభిషేకము చేసి దీపారాధన అనంతరం అష్టోత్తరంతో కూడిన అర్చన గావించి ధూపం చూపించి కలకండ నైవేద్యం సమర్పించి, కర్పూర హారతి యిచ్చి మంత్ర పుష్ప సాష్టాంగ నమస్కారాలతో వూజ నాచరించవలెను.
  4. మధ్యాహ్నం 12 గం॥లకు మహా నైవేధ్యం చూపి పంచ హారతులతో మధ్యాహ్న హారతి సాయికి ఇచ్చి అనంతరం భోజనం చేయాలి. ఆహారం సాత్వికమై ఉండాలి.
  5. సూర్యాస్తమయం అనంతరం స్నానాది కార్యక్రమాలు జరిపిన తరువాత ఏక హారతితో ప్రదోష పూజ (సంధ్యా హారతి) ను, రాత్రి 10 గం॥లకు శేజారతి నివ్వాలి.
  6. దీక్షా సాధకుడు ప్రతి రోజు ఒకే పూట భోజనం చేసి రాత్రికి పాలు, ఫలములు మాత్రమే తీసుకోవాలి. నేలపైనే నిద్రించాలి. నిరంతరం సాయి నామం జపిస్తు గురు స్వామి ఉపదేశించిన మంత్రమును ఉదయం 108 సార్లు, రాత్రి 108 సార్లు స్మరించాలి.
  7. తను నిర్వర్తించే వృత్తులను నిర్వర్తిస్తు వీలైన సమయంలో సాయి జీవిత చరితము సాయి లీలామృతము నిత్య పారాయణము చేయాలి.
  8. భూత దయను కలిగి వుండి, ప్రతి జీవిలో సాయిని దర్శించాలి.
  9. ఇతరులను సాయిరాం అని గాని, సాయి శరణం అని గాని సంబోధించాలి.
  10. ప్రతి స్త్రీలోను తల్లిని చూడవలెను.
  11. వీలును బట్టి ఆలయ దర్శనం చేయాలి. దైవ భక్తి కార్యక్రమాల్లో పాల్గొనాలి.
  12. తీసుకొనే ప్రసాదము భోజనం పరిశుభ్ర స్థలంలో ఒకే సారి తీసుకోవాలి.
  13. ఆర్థిక పరిస్థితిని బట్టి అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలి.

దీక్షలో చేయకూడనివి:

  1. తెలుపు దుస్తులు తప్ప ఇతర రంగు దుస్తులు ధరించకూడదు.
  2. క్షౌరము చేయకూడదు, గోళ్ళు తీయకూడదు.
  3. క్రీములు, నూనెలు, సబ్బులు వాడకూడదు.
  4. విలాసాలకు, హాస్యానికి, రాజకీయ విషయములకు దూరంగా వుండాలి. (న్యూస్ పేపర్ చదవకూడదు. టి.వి, సినిమాలు చూడకూడదు)
  5. ధూమపానం, మద్యపానం, మాంసాహారమును విడిచిపెట్టాలి.
  6. పాదరక్షలు ధరించకూడదు.

దీక్షావిరమణ :

దీక్ష పూర్తయిన మరుసటి రోజు ఉదయం పీఠం వద్ద పూజా కార్యక్రమాలు జరిపి పీఠంను కదిలించి పీఠంపై గల నారికేళమును తీసుకొని దానితో స్వామి వారి పూజా వస్తువులు, నైవేద్యంతో శ్రీ సాయిబాబా మందిరమును చేరి గురు స్వామి లేదా పూజారి చే దీక్షా విరమణ చేయాలి. శాంతిని చేకూర్చు శ్రీ సాయిబాబా దీక్షను కుల మత భేదాలు లేకుండా స్వీకరించిన కార్యసిద్ధి తప్పక జరుగును.

మరిన్ని పోస్ట్లు:

Sri Madhava Nagar Sai Kshetram In Telugu – శ్రీ మాధవ నగర సాయి క్షేత్రము

Sri Madhava Nagar Sai Kshetram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భక్తి యోగం అనేది మనస్సును శుద్ధి చేసే, ఆత్మ అధ్యాత్మిక ప్రయత్నము. అనుష్ఠానాల్లో ప్రార్థన, భజన, ధ్యాన, పరమాత్మ సేవ మరియు ముక్తి సాధన ముందుగా ఉంటుంది. భక్తి యోగం యోగుడును ఆత్మశుద్ధి, సర్వోత్తమ ప్రమేయాలు మరియు ఆనందంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ మాధవ నగర సాయి క్షేత్రము గురించి తెలుసుకుందాం…

Sri Madhava Nagar Sai Baba Kshetram

శ్రీ మాధవ నగర సాయి క్షేత్రము

సదానింబ వృక్షస్య మూలాధి వాసాత్
సుదా సావిణం విక్రమప్య ప్రియంతం
తరుం కల్ప వృక్షాధికమ్ సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ।

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దివ్య మంగళ స్వరూపుడైన భగవానుడు సాయిబాబ రూపంలో శ్రీరామ నవమి పర్వదినమున ఈ అవనిపై అవతరించాడు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాన్ సమీపాన గోదావరి తీరంలో గల షిరిడీలోని మసీదును కోవెలగా మలచుకొని కొలువైనాడు. ప్రాణుల పట్ల దయను కలిగియుండాలని, అందరి దైవం ఒక్కడేనని చాటి, కనులుండి చూడలేని లోకానికి వెలుగు దారిని చూపాడు. బాబా నివసించు మసీదులో ఎల్లప్పుడు ‘ధుని’ (హోమ గుండం)ని వెలిగించేవారు. ప్రతి అణువులో నిండియుండి ప్రతి ఇంటిలో పూజలందుకొంటున్న పరమేశుడు సాయి. ఆయన లీలలు తెలుపగ ఈ జీవితం చాలదు. వ్రాయడానికి ఎన్ని పుటలైనా సరిపోవు.

ఇందూరుకు 5 కి.మీ. దూరంలో ఇప్పుడు మాధవనగర్ సాయిబాబ దేవస్థానం ఉన్న స్థానంలో క్రీ.శ. 1930-35 సం॥ ప్రాంతంలో అంజయ్య అనే భక్తుడు రావిచెట్టు క్రింద బాబా ఫోటో పెట్టి ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో పూజనాచరించేవాడు. ప్రతి గురువారము రోజున సాయి పల్లకితో ఒంటెద్దు బండిపై ఇందూరు పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేసేవాడు. క్రీ.శ. 1945-55 సం॥ ప్రాంతంలో ద్వారకామాయిని ఏర్పాటు చేసి షిరిడీలో మాదిరిగా ‘ధుని’ని వెలిగించేవారు.

అలా అంజయ్య అనే భక్తుడు సాయినాథుని సేవ చేస్తున్న రోజులలో 1962-63 సం॥ ప్రాంతంలో నవీపేట్ వాస్తవ్యులు శ్రీ కిష్టాపురం బాలాగౌడ్ గారు ఈ దారి వెంట ప్రయాణిస్తూ తన వాహనం చెడిపోగా ఆ రాత్రి ఇక్కడే బస చేశారు. ఆ రాత్రి సాయినాథుడు అంజయ్య, బాలాగౌడ్ గార్లకు స్వప్నంలో కనిపించి తనకు ఆలయము నిర్మించండని చెప్పినాడట.

జైపూర్ నుండి శ్రీ సాయిబాబ పాలరాతి విగ్రహాన్నితీసుకొని వచ్చి 21 రోజులు 101 మంది పురోహితులచే పూజా హోమాదులను జరిపించి క్రీ.శ. 1964 సం||లో బాబా విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సాక్షాత్తు శ్రీ సాయినాథుని ద్వారా నవ నాణెములు పొందిన సాయి భక్తురాలు శ్రీమతి లక్ష్మీ బాయి షిండే గారు షిరిడీ నుండి వచ్చారు. 1972 సం॥లో ఈ దేవస్థానం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. 6 ఎకరాల 30 గుంటల భూమిని శ్రీ సుబ్బారెడ్డి (మోస్రా) గారు ఆలయానికి విరాళముగా అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్లుగా పదవీ బాధ్యతలను చేపట్టేవారు, అభివృద్ధికై కృషి చేసినారు. ఆలయ సిబ్బంది, అర్చక . బృందము మరియు భక్తుల సహాయ సహకారములతో దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది.

ఆలయ ప్రాంగణంలో శ్రీ గణపతి, శివుడు, నాగేంద్రుడు, సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, శ్రీ పద్మావతీ శ్రీనివాసులు, దత్తాత్రేయులు, నవగ్రహాలు మొదలగు దేవతామూర్తులు దర్శనమిస్తారు. ఎల్లప్పుడు ద్వారకామాయిలో వెలుగొందే ‘ధుని’ లోని విభూతి సర్వరోగహరిణి, సర్వ పాప నివారిణి.

ఇక్కడి మందిరములో షిరిడీలో మాదిరిగా నాలుగు వేళలందు హారతులివ్వడం జరుగుతుంది. ఉ॥ 5-15 ని॥లకు కాకడ హారతి, మ॥ 12-00 గం॥లకు మధ్యాహ్న హారతి, సాయం సంధ్యా సమయంలో సంధ్యా హారతి, రాత్రి 10 గం॥లకు శేజారతి ఉంటుంది. ప్రతి గురువారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నిండైన మనస్సుతో బాబాను కొలుస్తారు. ఇదే రోజున సాయంత్రం సాయికి పల్లకీ సేవ జరుగుతుంది.

సాయి జన్మదినమైన శ్రీరామనవమి, సద్గురుని శ్రీ గురు పౌర్ణిమ సాయినాథుని పుణ్యతిథియైన విజయదశమి (బాబా సమాధియైన రోజు), దత్త రూపుని శ్రీ దత్త జయంతి రోజులలో అశేష భక్తజనావళి తరలిరాగ ఘనముగా వేడుకలు జరుగుతాయి.

అష్టదిక్కులే అప్లైశ్వర్యములుగా, పంచభూతములే పంచభక్ష పరమాన్నములుగా మలచుకొన్న సచ్చిదానంద రూపునకు ఈ ఇందూరు అవని తన మదినే మందిరముగా చేయగా నిత్య పూజలతో మరో షిరిడీగా మారిపోయింది.

భక్తుల కొరకు నీటి సరఫరా, వసతిగృహాలు, వంట గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యములను కల్పించడం జరిగినది.

మరిన్ని పోస్ట్లు:

Durga Saptashati Pradhanika Rahasyam In Telugu | దుర్గా సప్తశతీ ప్రధానిక రహస్యం

Durga Saptashati Pradhanika Rahasyam In Telugu

Durga Saptashati Pradhanika Rahasyam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దేవీ సూక్తం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దుర్గా సప్తశతీ ప్రధానిక రహస్యం

అస్య శ్రీసప్తశతీరహస్యత్రయస్య నారాయణ ఋషిః అనుష్టుప్చందః శ్రీమహాకాలీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతా యథోక్తఫలావాప్త్యర్థం జపే వినియోగః |

రాజోవాచ |

భగవన్నవతారా మే చండికాయాస్త్వయోదితాః |
ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం వక్తుమర్హసి ||

ఆరాధ్యం యన్మయా దేవ్యాః స్వరూపం యేన చ ద్విజ |
విధినా బ్రూహి సకలం యథావత్ప్రణతస్య మే ||

ఋషిరువాచ |

ఇదం రహస్యం పరమమనాఖ్యేయం ప్రచక్షతే |
భక్తో సీతి న మే కించిత్తవావాచ్యం నరాధిప ||

సర్వస్యాద్యా మహాలక్ష్మీస్త్రిగుణా పరమేశ్వరీ |
లక్ష్యాలక్ష్యస్వరూపా సా వ్యాప్య కృత్స్నం వ్యవస్థితా ||

మాతులుంగం గదాం ఖేటం పానపాత్రం చ బిభ్రతీ |
నాగం లింగం చ యోనిం చ బిభ్రతీ నృప మూర్ధని ||

తప్తకాంచనవర్ణాభా తప్తకాంచనభూషణా |
శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజసా ||

శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరీ |
బభార రూపమపరం తమసా కేవలేన హి ||

సా భిన్నాంజనసంకాశా దంష్ట్రాంచితవరాననా |
విశాలలోచనా నారీ బభూవ తనుమధ్యమా ||

ఖడ్గపాత్రశిరఃఖేటైరలంకృతచతుర్భుజా |
కబంధహారం శిరసా బిభ్రాణా హి శిరఃస్రజమ్ ||

తాం ప్రోవాచ మహాలక్ష్మీస్తామసీం ప్రమదోత్తమామ్ |
దదామి తవ నామాని యాని కర్మాణి తాని తే ||

మహామాయా మహాకాలీ మహామారీ క్షుధా తృషా |
నిద్రా తృష్ణా చైకవీరా కాలరాత్రిర్దురత్యయా ||

ఇమాని తవ నామాని ప్రతిపాద్యాని కర్మభిః |
ఏభిః కర్మాణి తే జ్ఞాత్వా యోధీతే సోశ్నుతే సుఖమ్ ||

తామిత్యుక్త్వా మహాలక్ష్మీః స్వరూపమపరం నృప |
సత్త్వాఖ్యేనాతిశుద్ధేన గుణేనేందుప్రభం దధౌ ||

అక్షమాలాంకుశధరా వీణాపుస్తకధారిణీ |
సా బభూవ వరా నారీ నామాన్యస్యై చ సా దదౌ ||

మహావిద్యా మహావాణీ భారతీ వాక్ సరస్వతీ |
ఆర్యా బ్రాహ్మీ కామధేనుర్వేదగర్భా సురేశ్వరీ ||

అథోవాచ మహాలక్ష్మీర్మహాకాలీం సరస్వతీమ్ |
యువాం జనయతాం దేవ్యౌ మిథునే స్వానురూపతః ||

ఇత్యుక్త్వా తే మహాలక్ష్మీః ససర్జ మిథునం స్వయమ్ |
హిరణ్యగర్భౌ రుచిరౌ స్త్రీపుంసౌ కమలాసనౌ ||

బ్రహ్మన్ విధే విరించేతి ధాతరిత్యాహ తం నరమ్ |
శ్రీః పద్మే కమలే లక్ష్మీత్యాహ మాతా స్త్రియం చ తామ్ ||

మహాకాలీ భారతీ చ మిథునే సృజతః సహ |
ఏతయోరపి రూపాణి నామాని చ వదామి తే ||

నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరమ్ |
జనయామాస పురుషం మహాకాలీం సితాం స్త్రియమ్ ||

స రుద్రః శంకరః స్థాణుః కపర్దీ చ త్రిలోచనః |
త్రయీ విద్యా కామధేనుః సా స్త్రీ భాషా స్వరాక్షరా ||

సరస్వతీ స్త్రియం గౌరీం కృష్ణం చ పురుషం నృప |
జనయామాస నామాని తయోరపి వదామి తే ||

విష్ణుః కృష్ణో హృషీకేశో వాసుదేవో జనార్దనః |
ఉమా గౌరీ సతీ చండీ సుందరీ సుభగా శివా ||

ఏవం యువతయః సద్యః పురుషత్వం ప్రపేదిరే |
చక్షుష్మంతో2 నుపశ్యంతి నేతరే తద్విదో జనాః ||

బ్రహ్మణే ప్రదదౌ పత్నీం మహాలక్ష్మీర్నృప త్రయీమ్ |
రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చ శ్రియమ్ ||

స్వరయా సహ సంభూయ విరించోండమజీజనత్ |
బిభేద భగవాన్ రుద్రస్తదౌర్యా సహ వీర్యవాన్ ||

అండమధ్యే ప్రధానాది కార్యజాతమభూన్నృప |
మహాభూతాత్మకం సర్వం జగత్ స్థావరజంగమమ్ ||

పుపోష పాలయామాస తల్లక్ష్మ్యా సహ కేశవః |
మహాలక్ష్మీరేవమజా రాజన్ సర్వేశ్వరేశ్వరీ ||

నిరాకారా చ సాకారా సైవ నానాభిధానభృత్ |
నామాంతరైర్నిరూప్యెషా నామ్నా నాన్యేన కేనచిత్ ||

ఇతి ప్రాధానికం రహస్యం సంపూర్ణమ్ |

మరిన్ని స్తోత్రాలు:

Devi Suktam In Telugu | దేవీ సూక్తం

Devi Suktam In Telugu

Devi Suktam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దేవీ సూక్తం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దేవీ సూక్తం

ఓం అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమా”దిత్యెరుత విశ్వదే”వైః |
అహం మిత్రావరుణోభా బిభర్మ్యహమి”స్త్రాగ్నీఅహమశ్విన్తోభా ||

అహం సోమమా సోమమాహనసం” బిభర్మ్యహం త్వష్టా”రముత పూషణం భగమ్” |
అహం దధామి ద్రవిణం హవిష్మతే సుప్రావ్యే ఏయజమానాయ సున్వతే ||

అహం రాష్ట్రీ” సంగమనీ వసూ”నాం చికితుషీ” ప్రథమా యజ్ఞియా”నామ్ |
తాం మా” దేవా వ్యదధుః పురుత్రా భూరిస్థాత్రాం భూర్యా” వేశయన్”తీమ్ ||

మయా స్కో అన్నమత్తి యో విపశ్యతి యః ప్రాణితి యఈ”౦ శ్రుణోత్యుక్తమ్ |
అమన్తవోమాన్త ఉపక్షియన్తి శ్రుధిశ్రుత శ్రద్ధివం తే” వదామి ||

అహమేవ స్వయమిదం వదామి జుష్ట”౦ దేవేభిరుత మానుషేభిః |
యం కామయే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తమృషిం తం సుమేధామ్ ||

అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవేహన్త వా ఉ |
అహం జనా”య సమదం” కృణోమ్యహం ద్యావా”పృథివీ ఆవివేశ ||

అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోనిరప్స్వ౬౧న్తః సముద్రే |
తతో వితిష్ఠ భువనాను విశ్వో తామూం ద్యాం వర్ష్మణోపస్పృశామి ||

అహమేవ వాత౬ఇవ ప్రవా”మ్యారభమాణా భువనాని విశ్వా” |
పరో దివా పరఏనా పృథివ్యె తావతీ మహినా సంబభూవ ||

ఓం శాస్త్రి: శాస్త్రి: శాస్త్రి: ||

మరిన్ని స్తోత్రాలు: