కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అప్పడైన హరియెక్కె నదివో తేరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అప్పడైన హరియెక్కె నదివో తేరు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 4
కీర్తన : అప్పడైన హరియెక్కె నదివో తేరు
సంఖ్య : 35
పుట : 24
రాగం : పాడి
శ్రీవేంకటేశ్వరుని తేరు (రథము) తిరుమల తిరువీధులగుండా వూరేగిపోతున్నది. పరవశించిన అన్నమాచార్యులవారు ఆ హరి యేయే సందర్భాలలో నాలుగు అశ్వముల పూన్చి తను తోలే రథమునేకాక పరులు తోలే రథములను కూడా యెప్పుడెక్కాడో పునశ్చరణ చేసికొంటున్నారు ఈ కీర్తన ద్వారా. పురాణవాఙ్మయము బాగాపరిచయంవుంటేకాని ఈ ప్రయత్నం సిద్ధించదు. సృగాలుడు అనేవాడు నక్క రూపంలోవుండే రాక్షసుడు (నరకాసురుడేమో!!) ఇవన్నీ అటువంచి “హంసడిచికుల మీదన్ తోలినట్టితేరు” అన్న చరణంలో నాకేమీ పాలుపోలేదు. స్వామి తనశత్రువుపై యుద్ధానికి రథం పై వెళ్ళాడని తెలుస్తూనే వున్నది. హంస అంటే శివుడు లేక విష్ణుడు. ఆయనపై ఆయనే యుద్ధానికి వెళ్ళడు కదా! కాబట్టి ఆ మాటకు అర్థం శివభక్తుడైన బాణాసురుడని భావించాను. ఇక చదవండి. నేనూ బ్రహ్మెత్సవాలలోనే దీన్ని వివరిస్తున్నాను.
భావ వివరణ:
అదిగో ఈ విశ్వమునకంతటికీ అప్పడు (తండ్రి) అయిన శ్రీహరి, తేరు యెక్కెను (రథము) పైయెక్కినాడు. ఇప్పుడు ఈ తిరుమల తిరువీధులలో ఈ రథము పోతున్నది. కనుల పండువుగా చూచి తరించండి.
ఒకప్పుడు ఈ సర్వేశ్వరుడు తన తేరును సముద్రాలమీద తోలినాడు. (అర్జునునికి తన ఆదినారాయణుని రూపం చూపాలని తన రథముపై శ్రీకృష్ణుడు వైకుంఠం తీసికొని వెళ్ళాడు). జరాసంధుడు భ్రమించి మతిపోగొట్టుకునేట్లు రథం తోలాడీయన. (వాడి అక్షౌహిణీ సైన్యమూ నశించేది). తిమురుచు (ఉద్రేకముతో) రుక్మకుపై (రుక్మిపై తిరగబడితోలిన రథము ఇదే (రుక్మిణీ స్వయంవరంలో). ప్రమదాన (సంతోషముతో) సృగాలునిపై (నక్కరూపంలో వున్నరాక్షసునిపై) తోలిన రథము ఇదే (బహుశా నరకాసురుడు అయివుండవచ్చు).
అక్రూరుడు తీసికొనిరాగా కమ్మి (విజృంభించి) కంసునిపై దండెత్తిన తేరు ఇదే, (ఈ రథముపైననే అక్రూరునికి శ్రీకృష్ణుడు భగవంతుడని అర్థమైంది). దంతవక్త్రుడు భ్రమచెంది నిస్తేజుడగునట్లు శ్రీకృష్ణుడు తోలిన రథము ఇదే, (శ్రీహరిద్వారపాలకుడైన విజయుడే వీడై పుట్టాడు). ఈ రథముపైననే శ్రీకృష్ణుడు దుమ్మురేగునట్లు సాల్వునితో యుద్ధం చేశాడు. (అంబను కాదన్నదీ సాల్వుడే). రుక్మిణీ కళ్యాణము సందర్భంగా రుక్మిణితోలిన రథం ఇదే, (శ్రీకృష్ణుడు శిశుపాలుని చిత్తుచేశాడీ రథంపైనుండే)
మీఱి (విజృంభించి) శివుడు రక్షణగా వచ్చిన బాణుని శ్రీకృష్ణుడు ఓడించినదీ రథముపైననే (ఉషాపరిణయం దీని తరువాతనే జరిగింది). సంధిమాటలు తూఱి (విఫలమై) భారతయుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణపరమాత్మ, పార్ధసారధియైనదీ రథముపైననే (భగవద్గీతకు వేదిక ఈ రథమే). నేడు శ్రీవేంకటేశ్వరుడు, అలమేల్మంగను ఆరడిన్ (మించి) కూడ, చూఱలుగొని (ఆదరణపొంది) ఎక్కిన శోభనపు తేరు (కళ్యాణప్రదమైన రథము) ఇదే. (చూచి తరించండి).
కొంకులేని పొలయాట కూరిములలో తేట
అంకెల బాలులతోడి యాట పాట
పొంకపు తుత్తురు కొమ్ము పొలుపైన నీ సొమ్ము
వేంకటనగము చాయ విట్టలరాయ.
||పసులు||
అవతారిక:
విఠల దేవుని విట్టలరాయా అని సంభోదిస్తూ గొప్ప జానపదకీర్తన చెబుతున్నారు అన్నమయ్య. ఇటువంటి కీర్తన నాస్వాదించినప్పటికీ దీని ప్రత్యేకత యేమంటే చాలా మాటలు యధాతధంగా నిఘంటువులలో దొరకవు. “పసపు జేల” అంటే ఏమిటి? పసుపురంగు చేలము అని అర్థం చేసికోవాలి, అంటే పీతాంబరుడైన కృష్ణుడు, దూడలను కాచే ఈ విట్టలరాయుడు వింతకూతవేసి ఆ దూడల్ని తన దగ్గరకు పిలుస్తాడట. ఎంతని చెప్పను? గొప్ప వర్ణన. మీరే రుచి చూడండి.
భావ వివరణ:
ఈ విట్టలరాయడు (విఠలుడు) యెలావున్నాడంటే ఈతడు పసుపుజేల (పీతాంబరము) కట్టిన శ్రీకృష్ణుడు ఇతని చేతిలో పసులుగాచే కోల (ముల్లుకఱ్ఱ) వుంటుంది. స్వామీ! పొసగ (అతిశయించుటకు) నీకింత బుద్ధుల గోల యెందుకయ్యా!
ఇతడు తన బుత్తి (భోజనము) చిక్కములో (చిన్న వుట్టిలో) కట్టి తెచ్చుకొన్నాడు. గచ్చకాయలు తిత్తి (గచ్చకాయరంగులో వుండె తన వుంగరాల జుట్టును కుచ్చులుగా కట్టుకొన్నాడు. చుట్టిన తలపాగలో నెమలిపింఛము గుచ్చి అలంకరించుకొన్నాడు. ఇటువంటి సింగారము నీకు ఇంత ప్రియమా విట్టలరాయా! నీచేతలు యెంతవెట్టి (పనికిమాలిన) వో చెబుతాను, వినవయ్యా!
ఈ విట్టలరాయుడు తన ఆవు పేయలను (దూడలను) ఒక వింతయైన ‘కూత’తో పిలిచి ఒకచోట చేరుస్తాడు. అతని పిల్లఁగోవి (మురళి) బలు మోత (పెద్ద ధ్వని చేస్తుంది). అతడు గొల్లెతలతో చేయరాని సిగ్గుల చేతలు చేస్తాడు. ఆపైన యమునాతటిలో అతని లీలలు తలపోతలు వేయరాని మోపులు (ఆరోపణలకు) దారితీశాయి.
కొంకులేని (ఏమాత్రమూ జంకులేని) అతని పొలయాట (రాసలీల) కూరిములలో తేట (ప్రణయమాధుర్యపు తేట). అంకెల బాలులతోటి (తన ఈడు గొల్ల బాలురతో) నిత్యమూ ఆటపాటలతో కాలక్షేపం చేస్తాడు. ఈ వేంకటాద్రి నీడలోని విట్టలరాయా! నీ పొలుపైన సొమ్ము (ఒప్పయిన ఆభరణం) యేమిటో తెలుసునా స్వామీ? నీ పొంకపు తుత్తురుకొమ్ము (నీ అందమైన తూతూ ధ్వనిచేసే శృంగనాదము). దానినే కొందరు “కొమ్ముబూర” అంటారు.
బగ్గుల్ నగ్గుల్ బావుల్ సొరె (ర?) గా
దగ్గర వెరపగు తపసుల తా
సిగ్గుల్ వాపెడి శ్రీ వేంకటపతి-
నగ్గపు సొమ్ములయాతని తా
||శిన్నెక||
అవతారిక:
జానపదుల బాణీలో కొనసాగే అన్నమాచార్యులవారి కీర్తననాస్వాదించండి. ఒక గోపిక ఇంకొక గోపికను శిన్నెక అనిపిలిచి తన చెలికాడైన ‘కిష్టుని’ (కృష్ణుని) తీసికొని రమ్మని వేడుకొంటున్నది. వాడు వెన్నల నారగించేవెన్నుడట. ఆతనిని తెమ్మంటున్నది. ఈ కీర్తనలో తా అని ప్రతిచరణం ముగిసినందువలన ‘తా’ అనునది తాళము కోసం తాలద్యోతకమని తోచుచున్నది. చరణములలో కొన్ని మాటలు ధ్వని ప్రధానమైనవి. కావున చిందేసే ఆటకు ప్రత్యేకించినవే. కీర్తన ప్రతిపదార్థం అసంభవమని నా భావన.
భావ వివరణ:
ఓ శిన్నెకా! (చిన్నక్కా!) శెలువుని (చెలికాడైన ఈ శ్రీకృష్ణుని) తేవే (నాయెదుటకు తీసికొనిరావే). ఈతడెవరో తెలియునా? చిన్నప్పుడు ఇంటింటా వెన్నదొంగతనం చేసి, చవిగొన్న (రుచి మరిగిన) వెన్నడు (శ్రీకృష్ణుడు).
ఈ అల్లరి పిడుగుకు ఆనాడు, మాటలు మూటలుగా వుండేవి. అవి బారులు, మూరలు (బారెడు మూరెడు మాటలు… అంటే… పెద్దగా ఆరిందలా మాట్లాడేవాడు.) బాటలు సదివే బాపలు తా (వేదపండితులమని విఱ్ఱవీగే బ్రాహ్మణులకు హితోపదేశము చేశాడు.) వేలుపు కుడుపులు (దేవతల కివ్వవలసిన నైవేద్యము) ఇవ్వలేదని అలిగిన దేవేంద్రుడి దేవతల వీపులు సాపుచేసి వేటాడినాడట. ఎందుకంటే ఈయన తేటలు మరిగిన దేవుని తా (ప్రసన్నత అతిశయించిన దేవదేవుడట).
ఈ చరణానికి అన్నమయ్య భావన సులభగ్రాహ్యము కాదు. నా భావన నా స్ఫురణయే..)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రామయ్య ఎడ్లు నీతికథ.
రామయ్య ఎడ్లు
రామయ్య ఒక సాధారణ రైతు. దైవికముగా తనకి ఉన్నంతలో సంతృప్తిగా ఉండేవాడు. అతని వద్ద మంచి నాగౌరు గిట్టులుండేవి. వాటిని తన కన్నబిడ్డలవలె కంటికి తెప్పలాగా చూసుకునేవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ జీవనానికి సహాయపడే పశుసంపదను పూజించడం భారతీయుల కృతజ్ఞతా వైభవానికి తార్కాణం. ఆ భారతీయ తత్త్వానుసారముగా రామయ్య తన ఎడ్లను పూజించేవాడు. నాగౌరు గిట్టలు అవడంచేత రామయ్య ఎడ్లలో సత్తా బాగా ఉండేది. అవి ఉత్తమ జాతి అశ్వాలకన్నా వేగముగా పఱుగెత్తగలిగేవి! వాటి వేగము చూసి పుత్రోత్సాహ భావముతో రామయ్య ముఱిసిపోయేవాడు.
ఇలా ఉండగా ఒక రోజు రామయ్య వృషభాలను కొందఱు దొంగలు అపహరించారు. తన ఎద్దులు లేవని తెలుసుకొన్న రామయ్య దుఃఖాని కి అంతులేదు. పాపం! సొంత కొడుకు దూరమైనట్లు బాధపడ్డాడు. “రామా! నేనేమి పాపంచేశానయ్యా? ఎందుకింత పెద్ద శిక్ష? నా ఏడ్లు లేకుండా నేనెట్లా బ్రతికేది? ఆ దొంగలు నా ధనం తీసుకుని నా ఎడ్లను వదిలిపెట్టుంటే బాగుండేది. పశుసంపద లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందా? (ఉండదు)”
ఇలా పరిపరి విధాల వగచి రామయ్య రక్షకభటులతో దొంగలు తన ఎడ్లను ఎత్తుకుపోయిన విషయం చెప్పాడు. తనుకూడా వారితో కలిసి దొంగలను వెదుక సాగాడు. చివరికి రామయ్య పాలిటి దేవతలైన వృషభాలను ఆ దొంగలు ఒక బండికి కట్టి పాఱిపోవడం రామయ్య రక్షకభటులు చూశారు. రామయ్య కళ్ళు సూర్యుని చూసిన పద్మాల్లాగా విచ్చుకున్నాయి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతలో ఆ రక్షకభటులు రామయ్య ఓ బండి ఎక్కి దొంగల వెనకాల పడ్డారు. దొంగల ఎడ్లబండిని త్వరగా అందుకుంటున్నారు రామయ్య రక్షకభటులు.
ఇంతలో రామయ్య వాయువేగంతో వెళ్ళే తన నాగౌరుగిట్టలను వాళ్ళు వెళ్ళే గుఱ్ఱబ్బండి అందుకోవడమేవిటి? అని అనుకున్నాడు. తన ఎడ్లు ఆ గుఱ్ఱాలతో ఓడిపోవటం ఇష్టంలేక పొయిన రామయ్య “ఆ ముక్కుత్రాటిని రెండు సార్లు లాగండిరా”! అని ఆ దొంగలకు ఎడ్లు పూర్తి వేగముతో వెళ్ళే కిటుకు చెప్పాడు. దొంగలు ఆ కిటుకు తెలుసుకుని తీవ్రవేగాన్ని అందుకున్నారు. కొద్ది సేపటిలోనే కను మఱుగైపోయారు. వచ్చిన ఒక్క అవకాశము పోయిందని విచారిస్తాడేమో అనుకున్న రక్షకభటులు రామయ్య ఆనందాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ఆనందానికి కారణమేమిటని అడిగిన రక్షకభటులతో ఇలా అన్నాడు మహౌదార్యముగల రామయ్య
“అయ్యా! నా గిట్టలు ఎప్పుడూ పఱుగు పందెంలో ఓటమిని చవిచూడలేదు. వాటి పేరు ప్రతిష్ఠలే నాకు ముఖ్యం. నాకు దొఱికి అపజయం పొందడం కన్నా అవి విజేతలుగా నాకు దూరమైనా మేలు కదా! అవి నాకు దక్కాయనే స్వార్థబుద్ధి కన్నా అవి గెలిచాయనే విషయం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది”. తోటి మనుషులనే కాకుండా పశుపక్షాదులను వృక్షములను ప్రేమభావంతో చూసే భారతీయతను రామయ్యలో నిండుగా చూసిన రక్షకభటులు రామయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
పశుసంపదను ప్రేమించి పూజించే భారతీయ తత్త్వాన్ని మనకు గుర్తుచేసిన రామయ్య ధన్యజీవి. మనకు ఆచార్యతుల్యుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు నీతికథ.
అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు
పరమేశ్వరుని వరప్రభావముతో సక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణము. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపదీ పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసారజీవములో వారుపాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు “ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్క యేడాది క్రమముగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి”. పాండవులందఱూ నారదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరసావహిస్తామని నిశ్చయించుకున్నారు.
ఇట్లా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హెూమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్పుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించి నారదుడు వారికి విధించిన నియమభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తరక్షకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులైన ఆ దొంగలను శిక్షించి విపుని హెూమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.
తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడిలా అన్నాడు “సోదరా! క్రూరకర్ములై ఆ విపుని హెూమధేనువును అపహరించిన ఆ దొంగల ను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశాపు కనక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం”?
అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు “అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో (వంకతో) నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి”. తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేక పోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని సకల తీర్థాలూ సేవించి పావనుడైనాడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. తనంతట తాను వేళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశమీయ మని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ శివస్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
Sri Shiva Stotram Lyrics Telugu
శ్రీ శివస్తోత్రమ్
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే।
రక్త పింగళ నేత్రాయ జటామకుట ధారిణే॥
కరి మొరలిడనాడు త్వరగను నేగి మకరినుంచికరిగావవే
పరమపావన రామ చెరసాలనున్న భూసురునేలరక్షింతివో
||అనియిట్లు||
అతిపాపియైన యజామిశునేలి వతడేమి నీ చుట్టమా
పతితపావన రామ భద్రాద్రినిలయ నన్ పాలింపవిది దిట్టమా
||అనియిట్లు||
భద్రగిరీశుడ భక్తులపాలిట పారిజాతంబనుచు
భద్రాత్ముడై యున్న వాడు రామదాసు పాలించెదవనుచు
||అనియిట్లు||
28. ధన్యాసి చాపు తాళం
పల్లవి : అబ్బబ్బా రామ నామమది
సారము లేని సంసారసార మిదే రామనామం
పారద్రోలు మున్నూట ఇరువది భవరోగములన్ని
చేరి పంచేంద్రియములన్ని చేరక పారదోలు నామం
ఘోరమైన యమదూత కొట్టెడి నామం
||అబ్బబ్బా||
దినదినము జిహ్వకింపై దీయగనుండు నామం
ధనకనక వస్తువులు దయచేయు నామం
అసలు కొసలు నొక్క సమాభివృద్ధి చేయునామం
తనువును రెండనుచు తుదిని తారక నామం
ఓ రామయ్య వర్షములో జిక్కి వసుమతిమీదనే వర్తించు చుంటిగద కొన్నాళ్ళు
వరుసశేషసస్యగతమైన ధాన్యమును వదలి వర్తించితిగదకొన్నాళ్ళు
వరశరుని తేజస్సువల్ల నారీతనువల్ల నోరీగర్భనరకమునబడి యుంటిగ ఓ రామ
||అయ్యయ్యో||
త్రిప్పుడు తిత్తిలోబడి దినము ప్రవర్తిల్లు చుంటిగద కొన్నాళ్ళు
అప్పుడు మాతల్లి యుప్పుపులుపు దిననంగలార్చుచుండ కొన్నాళ్ళు
ఎప్పుడు నిందుండి బదులు వెళుదునని ఎదురుచూచుచుంటిగ కొన్నాళ్ళు
చెప్పరానియట్టి ద్వారములోనుండి జననమునొందితి ఓరామ
||అయ్యయ్యో!|
పొరలుచు దురగాధపొత్తిలో నలిగిరనుచుచు పోనుంటిగద కొన్నాళ్ళు
పెరుగుచు బాల్యావస్థల దినముల పరుగులాడుచుంటి గదకొన్నాళ్ళు
తరుణంతోగూడి మదమత్సరముల కన్నెరుగనైతిగద కొన్నాళ్ళు
తరువాత దారాపుత్రాది మోహములదవిలి వర్తించిగద ఓ రామా
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో మంత్ర పుష్పం అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు మంత్ర పుష్పం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిగురించి తెలుసుకుందాం…
Sri Mahalakshmi Ashtottara Sathanamavali In Telugu
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు కృష్ణాష్టకమ్గురించి తెలుసుకుందాం…