మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు ఆదిత్య హృదయం స్తోత్రముగురించి తెలుసుకుందాం…
ఆదిత్యుని విశిష్టత
సూర్యుడు సమస్త సృష్టికి వెలుగును ప్రసాదించేదైవం. ఆ ఆదిత్యుని స్థానము మన హృదయం “సౌరసూక్తం” సూర్యనమస్కారములు ద్వారా సకలరోగములు నివారింపబడతాయన్నది పురాణఉవాచ. రుగ్మతలతో పాటు దారిద్ర్యము తీర్చగలిగే శక్తిమంతుడు శ్రీ సూర్యనాయకుడు. దారిద్ర్యమునకు ములకారకుడైన శనిమహాదేవుడు ఈ సూర్యనారాయణుని సుపుత్రుడు కనుక, సూర్యారాధన దారిద్య్రమును నిర్మూలింపగలదు. పురాణ ఇతిహాసములందు శ్రీ సూర్యనారాయణుని మహిమకు ఎన్నో తార్కాణములు కనిపిస్తాయి.
ఆదిత్య హృదయం స్తోత్రం
శ్రీ గురు గణేశ శారదా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఓం అస్యశ్రీ ఆదిత్య హృదయ స్తోత్రస్య ‘ అగస్త్యఋషి!’ అనుష్టుప్చందః శ్రీ ఆదిత్య దేవతా సర్వదేవాత్మక ఇతి బీజం ‘ తేజస్వీ ఇతి శక్తిః ! రశ్మిమాన్ ఇతి కీలకం ! మమ శ్రీ సూర్య ప్రసాద సిద్ధ్యర్ధే శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రపారే వినియోగః.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ సాయినాథ మహిమా స్తోత్రంగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండంలో 46వ సర్గ విశేషాల గురించి తెలుపుతుంది. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమానికి చేరుకుంటాడు. యజ్ఞం ప్రారంభించడానికి సిద్ధమవుతాడు. యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తాటక, సుబాహు, మరిచిలాంటి రాక్షసులు వస్తారు. రాక్షసులను అడ్డుకోవడానికి రాముడు తన అస్త్రశస్త్రాలను ఉపయోగించి వారిని సంహరిస్తాడు.
“ఓ రామా! దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారుల మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది.
“నాధా! నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేసారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమ వంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని అడిగింది.
ఆ మాటలు విన్న కశ్యపుడు దితి తో ఇలా అన్నాడు. ” ఓ దితీ! నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించ గల పుత్రుడు నీకు కలుగుతాడు.” అని వరం ఇచ్చాడు. దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్లిపోయాడు కశ్యపుడు.
కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది.
ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేసాడు. అగ్ని కార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్లు అన్నీ సకాలములో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్లు పట్టేవాడు. సకల ఉపచారములు చేసేవాడు. ఆ ప్రకారంగా 999 సంవత్సరములు ఆమె తపస్సు చేసింది. ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు.
దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి. “ఓ దేవేంద్రా! నేను పరాక్రమ వంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి, నాభర్త అయిన కశ్యపుని వరం అడిగాను. వేయి సంవత్సరముల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్తనాకు వరం ప్రసాదించాడు. ఇంకొక పది సంవత్సరములలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు, నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి.” అని పలికింది.
తరువాత ఆమె నిద్రించడానికి లోపలకు వెళ్లింది. కాని తొందరగా నిద్ర పోవలెనని కోరికతో పొరపాటున ఆమె తల పెట్టుకొని నిద్రించ వలసిన వైపు కాళ్లు పెట్టుకొని నిద్రించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకు తగులుతున్నాయి. ఆ కారణం చేత ఆమె అపవిత్రము అయింది. ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూచి దేవేంద్రుడు సంతోషించాడు.
తరువాత ఇంద్రుడు ఆమె గర్భములోకి ప్రవేశించాడు. ఆమె గర్భములో పెరుగుతున్న పిండమును ఏడు ముక్కలుగా నరికాడు. ఆ ప్రకారంగా నరక బడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది.
ఇంద్రుడు ఆ పిండమును చూచి ” ఏడవ వద్దు ఏడవ వద్దు” అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు.
ఆ ఏడుపు విని దితి మేలుకొంది. తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుని వేడుకొంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భము లోనుండి బయటకు వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు.
“తల్లీ! నన్ను క్షమించు. నీవు తల వైపు కాళ్లు పెట్టుకొని, నీ తల వెంట్రుకలు నీ పాదములకు తగులునట్లు నిద్రించావు. అపచారము చేసావు. ఆ అపచారమును అవకాశముగా తీసుకొని నేను నీ గర్భములో ప్రవేశించాను. యుద్ధములో నన్ను చంపబోవు నీ కుమారుని గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు.” అని ప్రార్థించాడు.
శ్రీమద్రామాయణము
బాల కాండ నలుబది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచత్రింశః సర్గలో విశ్వామిత్ర మహర్షి మరికొందరు గంగా నది ఒడ్డుకు చేరుకుంటారు మరియు వారు ఆ నదీతీరంలో విహారం చేస్తారు. అక్కడ గంగా నది గురించి రాముడు పరిశోధనాత్మకంగా అడిగినప్పుడు విశ్వామిత్రుడు గంగానది పురాణాన్ని వివరిస్తాడు, ఆమె తండ్రి హిమాలయాల నుండి దేవతలు ఆమెను ఎలా స్వర్గానికి తీసుకువెళ్లారు.
మరునాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అంతరూ ప్రాతః కాలముననే నిద్ర లేచి, సంధ్యావందనము అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధము అయ్యారు. అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయమునకు గంగానదీ తీరమునకు చేరుకున్నారు.
గంగానదీ దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు, మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదీలో స్నానములు చేసి పితృ తర్పణములు విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామిత్రుని చుట్టు కూర్చున్నారు.
విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు. ” ఓ మహర్షీ! ఇచ్చట గంగానది మూడు పాయలుగా ప్రవహించుచున్నది కదా. ఇది ఎలా ఏర్పడినది. ఈ గంగానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది. వివరించండి.” అని అడిగాడు.
విశ్వామిత్రుడు గంగా నది గురించి దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు.
‘ఓ రామా! హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్పర్వతము నివాసము. హిమవత్పర్వతము సకల ధాతువులకు. ఓషధులకు నిలయము.
హిమ వంతుని భార్య పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగ, ఉ మ. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు, తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్లిపోయింది.
హిమవంతుని రెండవ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదటు పెట్టింది. హిమ వంతుడు తనరెండవ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహము చేసాడు. గంగ, ఉమ అక్కా చెల్లెళ్లు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్లింది. ఉమశివుని వెంట కైలాసమునకు వెళ్లింది.
గంగ నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ ఉంది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…
శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః
(ప్రతి నామమునకు ముందు ఓం శ్రీసాయి అనియు చివర నమః అనియు చదువవలెను.)
అయోధ్యా కాండ సర్గ 26 రామాయణంలో ఒక కీలకమైన అధ్యాయం, ఇందులో రాజకుటుంబంలో కొనసాగుతున్న భావోద్వేగ వాణిజ్యాలు మరియు పెరుగుతున్న విభేదాలను చూపిస్తుంది. ఈ విభాగంలో, భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి, తన ప్రియతమ అన్నయ్య రాముని వనవాసం గురించి తెలుసుకుంటాడు. తీవ్ర దుఃఖం మరియు అపరాధ భావనతో భరతుడు తన తల్లి కైకేయితో ఎదుర్కొని, ఆమె చర్యలపై తన ఆవేదన మరియు నిరాశను వ్యక్తం చేస్తాడు. ఈ అధ్యాయం కుదుళ్ళ బంధాలను మరియు ఇతిహాసాన్ని లక్షణపరచే బలమైన ధర్మబద్ధతను ఎత్తిచూపుతుంది. రాముడికి భరతుడి విశ్వాసం మరియు అతన్ని తిరిగి అయోధ్యకు తీసుకురావాలనే నిర్ణయం సోదర ప్రేమ, కర్తవ్య మరియు న్యాయం కోసం తపన అంశాలను ప్రదర్శిస్తుంది.
తల్లి కౌసల్య నుండి ఆశీర్వాదములు పొందిన రాముడు అక్కడనుండి బయలు దేరాడు. ఇంక వనవాసమునకు వెళ్లడానికి మనస్సును సిద్ధం చేసుకుంటున్నాడు. కౌసల్య మందిరమునుండి బయటకు వచ్చాడు.
రాత్రి అంతా ఉపవాసము చేసి జాగరణ చేసిన సీత ఉదయము రాముని రాకకై ఎదురు చూస్తూ ఉంది. “పట్టాభిషేక ముహూర్తము సమీపిస్తూ ఉంది. కాని రాముడు ఇంకా రాలేదు. కారణం ఏమయి ఉంటుంది” అని తనలో తాను తర్కించుకుంటూ
ఉంది.
ఇంతలో రాముడు సీత ఉన్న మందిరములోకి ప్రవేశించాడు. రాముని ముఖంలో కనపడుతున్న బాధను, వ్యధను చూచి సీత మనస్సు కలత చెందింది. అప్పటిదాకా తనలో ఉన్న బాధను అతి కష్టం మీద అణిచి పెట్టుకున్న రాముడు సీతను చూడగానే ఇంక తట్టుకోలేకపోయాడు.
రాముని ముఖంలో కనిపిస్తున్న బాధను చూచి సీత “ప్రభూ! ఏమి జరిగింది. ఎందుకు మీరు మనసులో బాధపడుతున్నారు. ఈరోజు పుష్యమీ నక్షత్రము. తమరి పట్టాభిషేకము జరుగురోజు. వసిష్ఠుల వారు సుముహూర్తము నిశ్చయించినారు కదా! ఆనందము గా ఉండక ఎందుకు మీరు బాధతో విలవిలలాడిపోతున్నారు.
ఎంతటి విపత్కర సమయంలో కూడా తమరి ముఖంలో మాయని చిరునవ్వు ఈ సంతోష సమయంలో మాయమగుటకు కారణమేమి? కాబోయే యువరాజును స్తుతించుటకు నియమింప బడ్డ వంది మాగధులు కనపడటం లేదు. ఏమి కారణము? ఇంకనూ పట్టాభి షేకము జరగలేదా! తమరి తల మీద మంగళకరమైన తేనె, పెరుగు బ్రాహ్మణులు అభిషేకించలేదా!
తమరి వెంట అమాత్యులు, జానపదులు ఎందుకు అనుసరించి రాలేదు. తమరు కాలి నడకన వచ్చారు. పట్టాభిషేక చిహ్నముగా అలంకరించిన రథము ఏమయినది? మీరు వస్తూ ఉంటే మీ ముందు నడవ వలసిన మదగజము కనపడటం లేదు. అసలు తమరి ముఖంలో పట్టాభిషేకము చేసుకొనబోవు రాకుమారుడి సంతోషము ఆనందము కనబడటం లేదు. కారణమేమి?” అని పరి పరి విధాల ప్రశ్నల వర్షం కురిపించింది సీత.
దానికిరాముడు ఇలా బదులు చెప్పాడు. “ఓ సీతా! నా తండ్రి నన్ను అరణ్యవాసమునకు వెళ్లమన్నాడు. నీకు ధర్మములు అన్నీ తెలుసు కదా! ఈ విపరీత పరిణామము ఎందు వల్ల సంభవించినదో వివరంగా
చెబుతాను విను. నా తండ్రి దశరథమహారాజు నిత్యసత్యవ్రతుడు. ఎన్నడూ ఆడిన మాట తప్పడు. నా తండ్రి నా తల్లి కైకకు పూర్వము రెండువరములు ఇచ్చాడట.
నా పట్టాభిషేక వార్త విన్న కైక, నా తండ్రిని ఆ రెండు వరములు ఇవ్వమని కోరింది. అందులో మొదటి వరము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. రెండవ వరము–నాకు మారుగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరగాలి. దానికి నా తండ్రి సమ్మతించాడు. నా తండ్రి మేరకు నేను వనవాసమునకు పోవుచున్నాను. ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను.
నేను లేని సమయములో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. యువరాజు భరతుని ముందు నా గురించి గానీ, నా గుణగణములు గురించి గానీ నీవు మాట్లాడకూడదు. ఎందుకంటే రాజులు తమ ముందు ఇతరులను పొగడటం సహించలేరు. ఇంకొకమాట. నిన్ను పోషించవలసిన బాధ్యత భరతునికి లేదు.
నీవు భరతునికి అనుకూలంగా ఉన్నంత కాలమే నీవు ఇక్కడ క్షేమంగా, నిశ్చింతగా ఉనా తండ్రి దశరథుడు వంశపారంపర్యముగా జ్యేష్టునికి చెందవలసిన రాజ్యమును, భరతునికి ఇచ్చాడు. కాబట్టి నీవు నీమామగారు దశరథునికి, యువరాజు భరతునికి అనుకూలంగా నడచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి.
నేను వనవాసము వెళు తున్నాను. నీవు ధైర్యంగా ఉండు. నేను లేని సమయములో నీవు వ్రతములు, ఉపవాసవ్రతములు చేస్తూ ఉండు. నీవు పొద్దుటే లేచి, పూజాదికములు అయిన తరువాత, నా తండ్రి దశరథునికి నమస్కరించడం మరిచిపోవద్దు. నా తల్లి, నీ అత్తగారు, వృద్ధురాలు అయిన కౌసల్య నేను అడవులకు వెళుతున్నాను. అని కృంగి, కృశించి పోవుచున్నది. ఆమె యోగక్షేమములు చూడటం నీ ధర్మము. ఆమెను గౌరవించు. నా తల్లి కౌసల్య ఒకతేకాదు. నా తల్లులందరూ నీకు పూజనీయులే. వారి నందరినీ గౌరవించు.
నా తమ్ములు భరతుడు, శత్రుఘ్నుడు నీకు సోదర సమానులు మరియు పుత్రసమానులు. వారిని తగురీతిగా ఆదరించు. పైగా భరతుడు ఇక్ష్వాకుకులమునకు, అయోధ్యకు రాజు. అతని మీద పగ ద్వేషము పెంచుకోకు. సాధారణంగా రాజులు తమను సేవించేవారిని ఆదరిస్తారు. లేకపోతే ద్వేషిస్తారు. కాబట్టి భరతుని నువ్వు ఒక రాజుగా ఆదరించు.
నీ ధర్మమును నువ్వు నిర్వర్తించు. ఈ పదునాలుగు సంవత్సరములు నువ్వు అయోధ్యలోనే ఉండు. నేను వనవాసమునకు పోతున్నాను అని మనసు కష్టపెట్టుకోకు. ధైర్యంగా ఉండు. నన్ను సంతోషంగా అరణ్యములకు సాగనంపు.” అని అన్నాడు రాముడు.
అయోధ్యా కాండ సర్గ 25 రామాయణంలో ఒక కీలకమైన అధ్యాయం, ఇందులో పాత్రలు ఎదుర్కొనే భావోద్వేగ మరియు నైతిక సంక్లిష్టతలను ముందుకు తీసుకువస్తుంది. ఈ విభాగంలో, తన కుమారుడి వనవాసాన్ని ఒప్పుకోవడానికి దశరథ మహారాజు అనుభవిస్తున్న కష్టాన్ని మనం చూస్తాము. రాముని విడిపోవడం వల్ల అయోధ్య ప్రజలు అనుభవిస్తున్న గాఢమైన దుఃఖాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ ఇతిహాస భాగం రాముని వనవాసం అతని కుటుంబం మరియు రాజ్యం మీద పడిన ప్రగాఢ ప్రభావాన్ని ఎత్తిచూపుతూ, విశ్వాసం, ప్రేమ మరియు ధర్మం (నైతిక కర్తవ్యము) కోరుకునే బాధాకరమైన త్యాగాల అంశాలను ప్రముఖంగా ప్రదర్శిస్తుంది. రాముని తిరుగు ప్రయాణానికి ముంగిలి సిద్ధం చేస్తుంది.
మనసు దిటవు పరచుకొన్న కౌసల్య, కళ్లు తుడుచుకొని, ముఖం కడుక్కొని, పాదప్రక్షాళనముచేసుకొని ఆచమనము చేసి, రామునికి మంగళకరమైన పనులు చేయుటకు ఉపక్రమించింది. “రామా! నిన్ను అడవులకు వెళ్లకుండా ఆపుటకు సర్వవిధాలా ప్రయత్నించాను. కాని నీ పట్టు విడవకున్నావు.
నాయనా రామా! ధర్మం తప్పకుండా, మంచి మార్గములో నడుస్తూ, వనవాసము పూర్తి చేసుకొని త్వరగా ఈ తల్లి వద్దకు చేరుకో! నీకు సదా శుభంగుతుంది. రామా! నీవు ఏ ధర్మ పరిరక్షణ కొరకు అరణ్యములకు వెళు తున్నావో, ఆ ధర్మమే నిన్ను సదా రక్షిస్తూ ఉండును గాక!. రామా! నీవు దేవాలయములకు వెళ్లి సమస్త దేవతలకు ప్రణామం చెయ్యి. ఆ దేవతలే నిన్ను సదా కాపాడుదురు గాక!
నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రములు, శస్త్రములు నిన్ను సదా కాపాడుగాక! రామా! నీవు నమ్ముకున్న సత్యము, నీవు ఇప్పటి వరకూ చేసిన మాతృ సేవ, పితృ సేవ నిన్ను రక్షించును గాక! ఓ రామా! మంగళ కరములైన సమిధలు, దర్భలు, అగ్నిహోత్రము, దైవ
సన్నిది నిన్ను అనునిత్యమూ రక్షించు గాక! ఈ ప్రకృతి లోని వృక్షములు, నదులు, పక్షులు, క్రూరమృగములు, సరీసృపములు నీకు ఎలాంటి హానీ చెయ్యకుండా, నిన్ను సదా కాపాడుగాక! ఓ రామా! సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, విశ్వేదేవతలు, మరుత్తులు, మహర్షులు, బ్రహ్మదేవుడు, విధి, సూర్యుడు, దేవేంద్రుడు, లోకపాలకులు నీకు సదా మేలు చేయుదురు గాక!
ఓ రామా! నీకు కాలము, ఋతువులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, రాత్రింబగళ్లు, సుముహూర్తములు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుగాక! ఓ రామా! స్మృతులు, శ్రుతులు, బృహస్పతి, సప్తఋషులు, నారదుడు, చంద్రుడు, కుమారస్వామి నిన్ను దయతో కాపాడుడుదురు గాక!
నీ అరణ్యవాస కాలములో దిక్కులు నిన్ను సదా కాపాడుగాక! అరణ్యములలో ఉన్న పర్వతములు, కొండలు, గుహలు, భూమి, ఆకాశము, స్వర్గము, నక్షత్రములు, గృహములు, వాటి అధిష్టాన దేవతలు నిన్ను రాత్రింబగళ్లు, రెండు సంధ్యవేళల్లో కాపాడుదురు గాక ! నీవు అరణ్యములలో ఉన్న ప్రతిదినము, మాసము, సంవత్సరము, నీకు సదా సుఖము నిచ్చు గాక! నీ అరణ్య వాస కాలములో సమస్త దేవతలు, దైత్యులు, నిన్ను కాపాడుదురు గాక!
నీ వనవాస కాలములో నీకు రాక్షసుల నుండి, రుద్రులు, పిశాచముల నుండి క్రూరమృగముల నుండి నీకు భయము లేకుండు గాక! అరణ్యములో ఉన్న కోతులు, తేళ్లు, పాములు, ఇతర కీటకములు, అలాగే సింహములు, పులులు, ఏనుగులు ఇతర
మాంసాహార జంతువులు నిన్ను బాధించకుండా ఉండు గాక!
ఆకాశంలోనూ, భూమి మీదా ఉందే సమస్త దేవతలు నీకు శుభం కలిగించు గాక! నీకు శత్రుభయం లేకుండు గాక! రామా! అనునిత్యము నేను పూజించే విష్ణువు, మహేశ్వరుడు, పంచ భూతములు, నవగ్రహములు, నా పూజలకు సంతసించి నిన్ను సదా రక్షింతురు గాక!” అని కౌసల్య సమస్త దేవతల రక్షలను రామునికి అందించింది.
సమస్త దేవతలకు పూజలు చేసింది. బ్రాహ్మణుల చేత హెూమములు చేయించింది. మంగళాచరణము చేయించింది. హోమము చేసిన బ్రాహ్మణులకు సంతృప్తిగా దక్షిణలు ఇచ్చింది. కౌసల్యకు ఇంకా తృప్తి కలగ లేదు. తాను స్వయంగా మంగళా చరణము చేయసాగింది.
“ఓ రామా! వృత్రాసుర సంహార సమయంలో ఆ దేవేంద్రునికి కలిగిన మంగళము నీకు కలుగుగాక! పూర్వము అమృతము తీసుకు రావడానికి వెళుతున్నప్పుడు గరుత్మంతునికి అతని తల్లి వినత చేసిన మంగళాశాసనము నీకు కలుగుగాక! వామనావతారములో విష్ణువు మూడు అడుగులు కొలిచినప్పుడు విష్ణువునకు కలిగిన మంగళము నీకు కలుగు గాక!”
అని రాముని తలమీద అక్షతలు వేసి ఆశీర్వదించింది కౌసల్య విశల్యకరణి అనే ఓషధిని రామునికి రక్షగా కట్టింది. కౌసల్య ఇవన్నీ చేస్తూ ఉంది కానీ లోపల దుఃఖము పొర్లుకొస్తూ ఉంది. బలవంతాన అణుచుకుంటూ ఉంది.
“రామా! నీవు వనవాసకాలమును అతి త్వరగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చి రాజ్యాధికారమును చేపట్టు. నన్ను, నీ భార్య సీతను సంతోషపెట్టు. రామా! శుభంగా వెళ్లిరా. నేను నిత్యమూ పూజించే శివుడు, విష్ణువు, మహర్షులు, సమస్త దేవతలు
నిన్ను సదా రక్షించుదురు గాక!
“అని కళ్ల నిండా నీళ్లు నిండగా కౌసల్య రామునికి వీడ్కోలు పలికింది. రాముడు కూడా తల్లి కౌసల్యకు భక్తితో ప్రదక్షిణము చేసి పాదాభివందనము చేసి, ఆమె దగ్గర సెలవు తీసుకొని సీత ఉన్న మందిరమునకు వెళ్లాడు.
అయోధ్యా కాండ చతుర్వింశః సర్గః రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం, ఇందులో పాత్రల భావోద్వేగాలు మరియు సందిగ్ధతలు ముందు వస్తాయి. ఈ విభాగంలో, దశరథ మహారాజు తన ప్రియమైన కుమారుడు రాముడు వనవాసానికి వెళ్లడం వలన, కైకేయికి ఇచ్చిన మాట యొక్క ఫలితాలను ఎలా ఎదుర్కొంటున్నాడో చూపిస్తుంది. ఈ అధ్యాయం ధర్మం (నైతిక కర్తవ్యము), త్యాగం మరియు ఆవశ్యకమైన బాధ వంటి అంశాలను ప్రదర్శిస్తుంది. ఈ హృదయ విదారక భాగం రాముని యాత్రలో తరువాత జరిగే సంఘటనలకు పునాదిగా ఉండి, ఇతిహాసంలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది.
రాముని నిశ్చయమును విని కౌసల్య తల్లడిల్లి పోయింది. ఆమెకు నోట మాట రాలేదు. రాబోవు చీకటి రోజులను తలచు కొని తల్లడిల్లి పోయింది. “రామా! ప్రతిదినము మృష్టాన్నములు భుజించుటకు అలవాటు పడ్డవాడికి అడవులలో మున్యాశ్రమములలో వారు ఇచ్చు ఆకులు, దుంపలు, పండ్లతో ఎలా జీవిస్తావయ్యా? ఎందుకంటే అయోధ్యలో నీ సేవకులు కూడా నీ కన్నా మెరుగైన భోజనము చేస్తుంటారు కదా! నీవు అడవులలో కందమూలములు ఎలా తిని బతుకుతావు. రామా! నీవంటి సద్గుణములు కలవాడిని, ప్రీతి పాత్రుడిని, నిర్దయగా రాజు అరణ్యము లకు పంపుతున్నాడే ఇంక మాలాంటి వారిగతి ఏమిటి? రామా! నీవు వెళ్లిన తరువాత అయోధ్యలో ఉండటానికి మాకు భయంగా ఉంది.
రామా! నీవు చెప్పినది సత్యము. నీ లాంటి వాడినే అరణ్యము లకు పంపడానికి అనుకూలించిన విధి ఎంత బలమైనదో ఇప్పుడు తెలుస్తూ ఉంది. నీవు వెళ్లిన తరువాత నాకు ఇంక శోకమే మిగిలింది. ఆ శోకాగ్నిలో నేను దగ్ధం అవడం తథ్యం. అందుకే రామా! నన్ను కూడా నీ వెంట తీసుకొనిపో. నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజమందిరము. పద పోదాము.” అని రాముని వెంట వెళ్లడానికి కౌసల్య
ఉద్యుక్తురాలయింది. తన కోసం శోకిస్తున్న తల్లి కౌసల్యను చూచి రాముడు ఇలా అన్నాడు. “అమ్మా! అన్నీ తెలిసిన నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను. నీకు తెలుసు గదా! కైక తండ్రి గారిని తన చెప్పుచేతల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చి నట్టు ఆడిస్తూ ఉంది. ఇంక నువ్వు కూడా ఇక్కడ లేక పోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి? ఆయన బాగోగులు ఎవరు చూచుకుంటారు. నీవు కూడా తండ్రిగారిని విడిచి పెట్టి నాతో అరణ్యములకు వస్తే, తండ్రిగారు జీవించడం కల్ల.
కాబట్టి నీవు తండ్రి గారిని చూచుకుంటే ఇక్కడే ఉండాలి. పైగా, నీ వంటి పతివ్రత భర్తను వదిలిపెట్టి అరణ్యములకు పోవడం అత్యంత క్రూరమైన పని. అది నీ వంటి సౌశీల్యవతులకు తగని పని. ఒక భార్యగా జీవితాంతము భర్తకు సేవ చెయ్యడం నీ కర్తవ్యము. ధర్మము. కాబట్టి నీవు ఇక్కడే ఉండి నీ ధర్మమును పాటించమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.” అన్నాడు రాముడు.
రాముని మాటలకు కౌసల్య బదులు చెప్పలేక పోయింది. “రామా! నీవు చెప్పినట్టే చేస్తాను.” అని మాత్రం అనగలిగింది. తల్లి మాటలకు రాముడు సంతోషించాడు. “అమ్మా! నా తండ్రి దశరథుడు మహారాజు, మనకందరికీ పూజనీయుడు. మనల నందరినీ ఆజ్ఞాపించగల సమర్థుడు. ఆయన ఆజ్ఞలను పాటించడం మన అందరి కర్తవ్యము. నీవు అలా చూస్తూ ఉండగానే పదునాలుగేళ్ల వనవాసము పూర్తి చేసుకొని వచ్చి నీ కళ్లముందు నిలబడతాను. నీవు ఏమి చెబితే అది చేస్తాను.” అని
అన్నాడు రాముడు. కుమారుని మాటలకు కౌసల్యకు ఒక పక్క దుఃఖము, మరొక పక్క సంతోషమూ కలిగాయి. కాని రాముడు వెళ్లిన తరువాత సవతుల మధ్య తన పరిస్థితి ఏమిటి అని తలచుకొనే సరికి ఆమెకు శరీరం వణికిపోయింది.
“రామా! నీవు లేని అయోధ్యలో నేను ఉండలేను. ఈ సవతులు నన్ను బతుకనీయరు. నన్ను నీ వెంట తీసుకొని పో” అని భోరున ఏడవసాగింది. వ్యవహారం మరలా మొదటికి వచ్చింది అనుకున్నాడు. రాముడు. తల్లి ఏడుపు చూచి రామునికి కూడా దుఃఖము పార్లుకొచ్చింది. తల్లిని ఎలా ఓదార్చాలో ఆమె నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియలేదు రామునికి. ఏమైనా సరే మరలా మరొక సారి చెప్పి చూద్దాము అని అనుకున్నాడు రాముడు. తల్లి కౌసల్యతో ఇలా అన్నాడు.
“అమ్మా! అదేంటమ్మా అలా అంటావు. నీవు అయోధ్యకు పట్టమహిషిని. దశరథునికి పట్టపురాణివి. నిన్ను ఎవరేమంటారు. అందరూ నీ కనుసన్నలలో మెలగవలసిన వారే కదా! పైగా మహారాజు గారు నేవెంటనే ఉంటారు. నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది. రాజు ఉన్నంతకాలము నీవు అనాధవు ఎలా అవుతావు? పైగా నా తరువాత యువరాజు భరతుడు ఉంటాడు. భరతునికి నీవు అంటే పంచప్రాణాలు. పైగా భరతుడు ధర్మనిరతి ఎక్కువగా కలవాడు. ఎవరి మాటా విని అధర్మమునకు తలవంచడు. ఇంక నీకేం భయం. కాబట్టి ఆ భయాలు, అనుమానాలు నీ మనసులో నుండి తొలగించు. వృద్ధుడైన మహారాజును కనిపెట్టుకొని ఉండు.
ఒక భార్యగా అది నీ ధర్మము, కర్తవ్యము. అమ్మా! స్త్రీలు ఎన్ని వ్రతములు, ఉప వాసములు, పుణ్య కార్యములు చేసినను, భర్తను నిర్లక్ష్యము చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రము చెబుతుంది కదా! అలాగే ఏ దేవతలకూ పూజలు చేయకున్నా ఏ వ్రతములు ఆచరించకున్నా కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని కూడా చెబుతారు కదా! భర్తకు అనుకూలవతిగా, ఆయనను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండటం భార్యకు పరమధర్మము అని వేదములు, శాస్త్రములు, శ్రుతులు, స్మృతులలో చెప్పబడింది కదా!
అమ్మా! నీవు అయోధ్యలో ఉండి తండ్రి గారిని సేవించు కుంటూ, నా క్షేమం కోసం వ్రతాలూ, పూజలూ చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటే నేను అరణ్యాలలో ఏ బాధా లేకుండా క్షేమంగా ఉంటానమ్మా! నీవు చేసే పూజలూ, వ్రతాలూ నన్ను సదా ఆపదలనుండి రక్షిస్తూ ఉంటయమ్మా! నీవు ఇలా చేసావనుకో ఈ పదునాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి. నేను ఇక్కడ లేని లోటు నీకు తెలియదు. నేను వచ్చిన తరువాత నీవు ఎలా చెబితే అలా చేస్తాను.” అని తల్లిని బుజ్జగించాడు రాముడు.
కౌసల్య కొడుకు మాటలకు మారు మాటాడలేకపోయింది. కళ్లు తుడుచుకొంది. “రామా! విధి బలీయమయింది. అంతకన్నా నీ నిశ్చయము బలమైంది. దానిని ఎవరూ మార్చలేరు. నీవు అరణ్యములకు క్షేమంగా వెళ్లిరా.
నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నీకు సదా క్షేమము కలుగు గాక! నీవు వచ్చిన తరువాత నా దుఃఖములు అన్నీ తొలగి పోతాయి అనే ఆశతో నీ రాక కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తూ ఉంటాను. కాని రామా! మా అందరి మాటను కాదని నిన్ను అరణ్యము లకు వెళ్లమని ప్రేరేపించు చున్న ఆ దైవము యొక్క లీలలను ఎవరూ అర్థం చేసుకోలేరు.
రామా! నీ పద్నాలుగేళ్ల వనవాసము ఒక్కరోజులో గడిచిపోయి ఈరోజే నీవు వనములనుండి తిరిగి వచ్చే రోజు అయితే ఎంత బాగుంటుంది!’ అని ఆశాభావంతో పలికింది కౌసల్య. తనకు నమస్కరించిన రామునికి సదా మంగళం కలగాలని మనసారా ఆశీర్వదించింది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గ, “దశరథాక్రందః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముడు వనవాసానికి వెళ్లిన దుఃఖంలో ఉండి కన్నీళ్లు కారుస్తాడు. రాముడు తన దగ్గర లేనందుకు, అతను చనిపోయే సమయానికి కూడా తన కుమారుడిని చూడలేనందుకు, దశరథ మహారాజు గాఢమైన వ్యధతో విలపిస్తాడు. ఈ సర్గ దశరథుడి బాధ, అతని ప్రేమ, మరియు రాముడి వలన కలిగిన శూన్యతను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది. ఈ కథనం దశరథ మహారాజు, ఆయన కుమారుడు రాముడి మధ్య ఉన్న అనుబంధం, మరియు విధి పట్ల ఆయన బాధ్యతలను ప్రతిబింబిస్తుంది.
రాముని రథము వెళుతున్నంత దూరమూ దశరథుడు అటువేపు చూస్తూనే ఉన్నాడు. రథము పోవు వేగముతో రేగిన ధూళితో రథము కనపడటం లేదు. రామునికి తనకూ దూరము పెరిగిపోతున్నట్టు భావించాడు దశరథుడు. దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. ఇంక రాముడు తనకు కనపడడు అనే భావనను తట్టుకోలేకపోయాడు. అలాగే నేలమీద కూలబడ్డాడు. పక్కనే ఉన్న కౌసల్య, కైక ఆయననుపట్టుకున్నారు.
దశరథుడు కైక వంక దీనంగా చూచాడు. “ఓ కైకా! దయచేసి నన్ను తాకవద్దు. నీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు నాకు భార్యవు కావు, బంధువుకావు. నీవు ఎవరని నన్ను తాకుతున్నావు. నీకే కాదు నీ వారికి కూడా నేను ఏమీ కాను. మీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టావో అదే క్షణంలో నేనూ నిన్ను విడిచిపెట్టాను. నీచేయి పట్టుకొని పాణిగ్రహణము చేసి అగ్నిహోత్రము చుట్టు మూడు ప్రదక్షిణములు చేసిన నాడు ముడివడిన మన బంధము నేటితో తెగిపోయినది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ మన ఇద్దరికీ ఎలాంటి సంబంధము లేదు. నీకూ నీ కుమారుడు భరతునికీ ఈ రాజ్యము కావాలి. తీసుకోండి. నన్ను విడిచిపెట్టండి. నేను చచ్చిపోయిన తరువాత మీరు నాకు జలతర్పణము విడవడానికి కూడా నేను అంగీకరించను. మీరు నా శవాన్ని కూడా తాకడానికి నేను అనుమతించను.” అని అన్నాడు దశరథుడు.
చేసేది లేక కైక ఆయనను విడిచిపెట్టింది. కౌసల్య దశరథుని పట్టుకొని లేవనెత్తి ఆయన రథములో కూర్చోపెట్టింది. తరువాత తన అంత:పురమునకు వెళ్లిపోయింది. దశరథుడు రాముని తల్చుకుంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు. బ్రహ్మహత్యాపాతకము చేసిన వాడి మాదిరి భయంతో వణికిపోతున్నాడు. ఇంతలో వార్తాహరులువచ్చి రాముడు అయోధ్యను దాటి వెళ్లిపోయాడు అని చెప్పారు.
“అవును. రాముడు వెళ్లిపోయాడు. రాముడు వెళ్లిన రథచక్రముల జాడలు, రథమునకు కట్టిన గుర్రముల గిట్టల గుర్తులు మాత్రము అయోధ్యలో కనపడుతున్నాయి. రాముని జాడ మాత్రం కనపడటం లేదు. ప్రతిరోజూ చందనము పూసుకొని హంసతూలికా తల్పము మీద నిద్రించే రాముడు ఈ రోజు ఒళ్లంతా మట్టికొట్టుకొని ఉండగా, కటిక నేల మీద నిద్రిస్తాడు కాబోలు. మెత్తని తలగడ లేకుండా నిద్రించని రాముడు కటిక పాషాణమును తల కిందపెట్టుకొని నిద్రిస్తాడేమో! అయోధ్యలో స్నేహితులు, వందిమాగధులు వెంట రాగా
విహరించిన రాముడు రేపటి నుండి మునికుమారులు వెంట రాగా అడవులలో విహరిస్తాడేమో! మెత్తటి తివాచీల మీద నడిస్తేనే కంది పోయే సీత పాదాలు, రేపటి నుండి కటిక రాళ్ల మీద నడవాలి కాబోలు. క్రూరమృగములు అంటేనే భయపడే సీత రేపటినుండి ఆ క్రూర మృగముల భయంకరమైన అరుపులు వింటుందేమో!” అని తనలో తాను అనుకుంటున్నాడు దశరథుడు.
ఇంతలో కైక గుర్తుకు వచ్చింది.
“ఓకైకా! నీ కోరిక తీరిందా! నీకళ్లు చల్లబడ్డాయా! ఇంక నీ ఇష్టం. నీకు మొగుడు లేడు. నీవు విధవరాలవు. రాముడు లేని ఈ లోకంలో నేను ఉండను. నీవే ఈరాజ్యాన్ని పాలించుకో.”అని అరుస్తున్నాడు.
ఈ విధంగా దశరథుడు రాముని కోసరం శోకిస్తున్నాడు. వెనకకు తిరిగి పాడుబడినట్టు ఉన్న అయోధ్యలో ప్రవేశించాడు. అటు ఇటు చూస్తూ వెళుతున్నాడు. అయోధ్యలో ఏ ఇంటి ద్వారము తెరవ బడలేదు. ఏ ఇంటి ముందరా జనం లేరు. దేవాలయాలు, అంగళ్లు, అన్నీ మూసి ఉన్నాయి. రహదారుల మీద జనసంచారము లేదు. అటువంటి అయోధ్య వీధులగుండా దశరథుడు తన అంతఃపురము చేరుకున్నాడు.
ఆరోజు దాకా రాముని మాటలతో రాముని ఆటపాటలతో సందడిగా ఉన్న అంతఃపురము నిశ్శబ్దముగా ఉంది. నిర్మానుష్యమైన ఆ అంత:పురములో ఉండలేకపోయూడు దశరథుడు. “నేను ఇక్కడ ఉండలేను. నన్ను వెంటనే కౌసల్యమందిరమునకు తీసుకొని వెళ్లండి.” అని ఆదేశించాడు. వెంటనే పరిచారికలు దశరథుని కౌసల్య మందిరము నకు తీసుకొని వెళ్లారు. కౌసల్య మందిరములో దశరథుడు ఒక శయ్యమీద పడుకొన్నాడు.
కొడుకులు కోడళ్లు లేని ఆ గృహము దశరథునికి చంద్రుడులేని ఆకాశము మాదిరి అనిపించింది. ఉన్నట్టుండి దశరథుడు ఉ లిక్కిపడుతున్నాడు. ఏడుస్తున్నాడు. “రామా నన్ను విడిచి వెళ్లిపోయావా” అని అరుస్తున్నాడు. “పద్నాలుగేళ్ల వనవాసము ముగించుకొని నా రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినపుడు, ఈ అయోధ్యా పౌరులం దరూ రామునికి ఘనస్వాగతము ఇస్తారు. అప్పటికి నేను ఉండను కదా! ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు కదా!” అని వాపోతున్నాడు. దశరథుడు.
రాత్రి అయింది. దశరథుడు భోజనము చేయలేదు. నిద్రపోలేదు. అర్థరాత్రి కౌసల్యను పిలిచాడు. “కౌసల్యా! నాకుకళ్లు కనిపించడం లేదు. నా దృష్టి రామునితో పాటు వెళ్లిపోయింది. రాముని చూచిన కళ్లతో నేను దేనినీ చూడలేను. నన్ను తాకు. నిన్ను గుర్తుపడతాను.” అని అన్నాడు దశరథుడు.
భర్తమాటలకు కౌసల్యకు దుఃఖము ముంచుకొచ్చింది. దశరథుని చేతి మీద తన చెయ్యివేసి నిమురుతూ ఆయన పక్కనే కూర్చుంది కౌసల్య.