Aditya Hrudayam In Telugu – ఆదిత్య హృదయం

aditya hrudayam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఆదిత్య హృదయం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

ఆదిత్యుని విశిష్టత

సూర్యుడు సమస్త సృష్టికి వెలుగును ప్రసాదించేదైవం. ఆ ఆదిత్యుని స్థానము మన హృదయం “సౌరసూక్తం” సూర్యనమస్కారములు ద్వారా సకలరోగములు నివారింపబడతాయన్నది పురాణఉవాచ. రుగ్మతలతో పాటు దారిద్ర్యము తీర్చగలిగే శక్తిమంతుడు శ్రీ సూర్యనాయకుడు. దారిద్ర్యమునకు ములకారకుడైన శనిమహాదేవుడు ఈ సూర్యనారాయణుని సుపుత్రుడు కనుక, సూర్యారాధన దారిద్య్రమును నిర్మూలింపగలదు. పురాణ ఇతిహాసములందు శ్రీ సూర్యనారాయణుని మహిమకు ఎన్నో తార్కాణములు కనిపిస్తాయి.

ఆదిత్య హృదయం స్తోత్రం

శ్రీ గురు గణేశ శారదా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఓం అస్యశ్రీ ఆదిత్య హృదయ స్తోత్రస్య ‘ అగస్త్యఋషి!’ అనుష్టుప్చందః శ్రీ ఆదిత్య దేవతా సర్వదేవాత్మక ఇతి బీజం ‘ తేజస్వీ ఇతి శక్తిః ! రశ్మిమాన్ ఇతి కీలకం ! మమ శ్రీ సూర్య ప్రసాద సిద్ధ్యర్ధే శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రపారే వినియోగః.

కరన్యాసం
ఓం హ్రాం – అంగుష్ఠాభ్యాం నమః
ఓం హ్రీం – తర్జనీ భ్యాం నమః
ఓం హ్రూం – మధ్యమాభ్యాం నమః
ఓం హ్రైం – అనామికాభ్యాం నమః
ఓం హౌం – కనిష్ఠికాభ్యాం నమః
ఓం హ్రః – కరతల కరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసము
ఓం హ్రాం – జ్ఞానాయ హృదయాయ నమః
ఓం హ్రీం – ఐశ్వర్యాయ శిరసేస్వాహా
ఓం హ్రూం – శక్యై శిఖాయైవౌషట్
ఓం హ్రైం – బలాయ కవచాయ హుం
ఓం హౌం – తేజసే నేత్రాభ్యాం వషట్
ఓం హ్రః – వీర్యాయ అస్త్రాయ ఫట్ భూర్భు
వస్సువరోమితి దిగ్బంధః

ధ్యానం

ఓం ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ
నారాయణ స్సరసిజాసన సన్నివిష్టః
కేయూర వాన్మకరకుండల వాన్కిరీటీ
హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః ॥

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణం
ఉపగమ్యా బ్రవీ ద్రామమగస్త్యో భగవాన్ ఋషిః
అగస్త్య ఉవాచ।।

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వా నరీ న్వత్ప సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం
జయావహం జపేన్నిత్య మక్షయ్యం పరమం శుభం

సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం
చింతాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమం

రశ్మిమంతం సుముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వ దేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్స్కందః ప్రజాపతిః
మహేందో ధనదః కాలో యమ స్సోమో హ్యపాంపతిః

పితరో వసవ స్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయు ర్వహ్నిః ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్య స్సవితా సూర్యఃఖగః పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశో భాను ర్హిరణ్యరేతా దివాకరః

హరిదశ్వ స్సహస్రార్చి స్సప్త సప్తి ర్మరీచిమాన్
తిమిరో న్మధన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్

హిరణ్యగర్భ శ్శిశిర సప్తనో భాస్కరో రవిః
అగ్నిగర్భో దితేః పుత్ర శ్శంఖ శ్శిశర నాశనః

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజు స్వామపారగః
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీధీ ప్లవంగమః

ఆతపీ మండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తస్సర్వ భవోద్భవః

నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమో నమః

పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమ స్సహంస్రాంశో ఆదిత్యాయ నమో నమః

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః
పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభి నిఘ్నాయ రుచయే లోక సాక్షిణే

నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభూః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్ని హోత్రంచ ఫలం చైవా గ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

ఏన మాపత్సు కృచేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావ సీదతి రాఘవ

పూజయస్వైన మేకాగ్రో దేవ దేవం జగత్పతిం
ఏత త్రి గుణితం జప్వా యుద్దేషు విజయిష్యసి

ఆస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యధాగతం

ఏతచ్ఛుత్వా మహా తేజా నష్టశోకో భవత్తదా
ధారయా మాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్

అధ రవి రవదన్ని రీక్ష్య రామం ముదిత మనాః పరమం ప్రహృష్య మాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ||

మరిన్ని స్తోత్రములు

Sri Sainatha Dasanama Stotram In Telugu – శ్రీసాయినాథ దశనామస్తోత్రమ్

Sri Sainatha Dasanama Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయినాథ దశనామస్తోత్రమ్

ప్రథమం సాయినాథాయ ద్వితీయం ద్వారకమాయినే
తృతీయం తీర్థరాజాయ చతుర్ధం భక్తవత్సలే
పంచమం పరమాత్మయ షష్టంచ షిర్డివాసినే
సప్తమం సద్గురు నాథాయ అష్టమం అనాథనాథనే
నవమం నిరాడంబరాయ దశమం దత్తావతారనే
ఏతాని దశనామాని త్రిసంధ్య యః పఠేన్నరః
సర్వకష్ట భయాన్ముక్తో సాయినాథ గురు కృపాః

మరిన్ని స్తోత్రములు

Balakanda Sarga 46 In Telugu – బాలకాండ షట్చత్వారింశః సర్గః

Balakanda Sarga 46 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండంలో 46వ సర్గ విశేషాల గురించి తెలుపుతుంది. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమానికి చేరుకుంటాడు. యజ్ఞం ప్రారంభించడానికి సిద్ధమవుతాడు. యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తాటక, సుబాహు, మరిచిలాంటి రాక్షసులు వస్తారు. రాక్షసులను అడ్డుకోవడానికి రాముడు తన అస్త్రశస్త్రాలను ఉపయోగించి వారిని సంహరిస్తాడు.

దితిగర్భభేదః

హతేషు తేషు పుత్రేషు దితిః పరమదుఃఖితా |
మారీచం కశ్యపం రామ భర్తారమిదమబ్రవీత్ ||

1

హతపుత్రాఽస్మి భగవంస్తవ పుత్రైర్మహాబలైః |
శక్రహంతారమిచ్ఛామి పుత్రం దీర్ఘతపోర్జితమ్ ||

2

సాఽహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి |
బలవంతం మహేష్వాసం స్థితిజ్ఞం సమదర్శినమ్ ||

3

ఈశ్వరం శక్రహంతారం త్వమనుజ్ఞాతుమర్హసి |
తస్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపస్తదా ||

4

ప్రత్యువాచ మహాతేజా దితిం పరమదుఃఖితామ్ |
ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే ||

5

జనయిష్యసి పుత్రం త్వం శక్రహంతారమాహవే |
పూర్ణే వర్షసహస్రే తు శుచిర్యది భవిష్యసి ||

6

పుత్రం త్రైలోక్యభర్తారం మత్తస్త్వం జనయిష్యసి |
ఏవముక్త్వా మహాతేజాః పాణినా స మమార్జ తామ్ ||

7

సమాలభ్య తతః స్వస్తీత్యుక్త్వా స తపసే యయౌ |
గతే తస్మిన్నరశ్రేష్ఠ దితిః పరమహర్షితా ||

8

కుశప్లవనమాసాద్య తపస్తేపే సుదారుణమ్ |
తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకార హ ||

9

సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపదా |
అగ్నిం కృశాన్కాష్ఠమపః ఫలం మూలం తథైవ చ ||

10 [కుశాన్]

న్యవేదయత్సహస్రాక్షో యచ్చాన్యదపి కాంక్షితమ్ |
గాత్రసంవహనైశ్చైవ శ్రమాపనయనైస్తథా ||

11

శక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచార హ |
అథ వర్షసహస్రే తు దశోనే రఘునందన ||

12

దితిః పరమసంప్రీతా సహస్రాక్షమథాబ్రవీత్ |
యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మనా ||

13

వరో వర్షసహస్రాంతే మమ దత్తః సుతం ప్రతి |
తపశ్చరంత్యా వర్షాణి దశ వీర్యవతాం వర ||

14

అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః |
తమహం త్వత్కృతే పుత్రం సమాధాస్యే జయోత్సుకమ్ ||

15

త్రైలోక్యవిజయం పుత్ర సహ భోక్ష్యసి విజ్వరః |
ఏవముక్త్వా దితిః శక్రం ప్రాప్తే మధ్యం దివాకరే ||

16

నిద్రయాఽపహృతా దేవీ పాదౌ కృత్వాఽథ శీర్షతః |
దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజామ్ ||

17

శిరఃస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ |
తస్యాః శరీరవివరం వివేశ చ పురందరః ||

18

గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్ |
భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణా ||

19

రురోద సుస్వరం రామ తతో దితిరబుధ్యత |
మా రుదో మా రుదశ్చేతి గర్భం శక్రోఽభ్యభాషత ||

20

బిభేద చ మహాతేజా రుదంతమపి వాసవః |
న హంతవ్యో న హంతవ్య ఇత్యేవం దితిరబ్రవీత్ ||

21

నిష్పపాత తతః శక్రో మాతుర్వచనగౌరవాత్ |
ప్రాంజలిర్వజ్రసహితో దితిం శక్రోఽభ్యభాషత ||

22

అశుచిర్దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా |
తదంతరమహం లబ్ధ్వా శక్రహంతారమాహవే |
అభిదం సప్తధా దేవి తన్మే త్వం క్షంతుమర్హసి ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్చత్వారింశః సర్గః ||

Balakanda Sarga 46 Meaning In Telugu

“ఓ రామా! దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారుల మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది.

“నాధా! నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేసారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమ వంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని అడిగింది.

ఆ మాటలు విన్న కశ్యపుడు దితి తో ఇలా అన్నాడు. ” ఓ దితీ! నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించ గల పుత్రుడు నీకు కలుగుతాడు.” అని వరం ఇచ్చాడు. దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్లిపోయాడు కశ్యపుడు.

కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది.

ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేసాడు. అగ్ని కార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్లు అన్నీ సకాలములో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్లు పట్టేవాడు. సకల ఉపచారములు చేసేవాడు. ఆ ప్రకారంగా 999 సంవత్సరములు ఆమె తపస్సు చేసింది. ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు.

దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి. “ఓ దేవేంద్రా! నేను పరాక్రమ వంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి, నాభర్త అయిన కశ్యపుని వరం అడిగాను. వేయి సంవత్సరముల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్తనాకు వరం ప్రసాదించాడు. ఇంకొక పది సంవత్సరములలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు, నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి.” అని పలికింది.

తరువాత ఆమె నిద్రించడానికి లోపలకు వెళ్లింది. కాని తొందరగా నిద్ర పోవలెనని కోరికతో పొరపాటున ఆమె తల పెట్టుకొని నిద్రించ వలసిన వైపు కాళ్లు పెట్టుకొని నిద్రించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకు తగులుతున్నాయి. ఆ కారణం చేత ఆమె అపవిత్రము అయింది. ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూచి దేవేంద్రుడు సంతోషించాడు.

తరువాత ఇంద్రుడు ఆమె గర్భములోకి ప్రవేశించాడు. ఆమె గర్భములో పెరుగుతున్న పిండమును ఏడు ముక్కలుగా నరికాడు. ఆ ప్రకారంగా నరక బడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది.

ఇంద్రుడు ఆ పిండమును చూచి ” ఏడవ వద్దు ఏడవ వద్దు” అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు.

ఆ ఏడుపు విని దితి మేలుకొంది. తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుని వేడుకొంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భము లోనుండి బయటకు వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు.

“తల్లీ! నన్ను క్షమించు. నీవు తల వైపు కాళ్లు పెట్టుకొని, నీ తల వెంట్రుకలు నీ పాదములకు తగులునట్లు నిద్రించావు. అపచారము చేసావు. ఆ అపచారమును అవకాశముగా తీసుకొని నేను నీ గర్భములో ప్రవేశించాను. యుద్ధములో నన్ను చంపబోవు నీ కుమారుని గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు.” అని ప్రార్థించాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ నలుబది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ సప్తచత్వారింశః సర్గః (47) >>

Balakanda Sarga 35 In Telugu – బాలకాండ పంచత్రింశః సర్గః

Balakanda Sarga 35 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచత్రింశః సర్గలో విశ్వామిత్ర మహర్షి మరికొందరు గంగా నది ఒడ్డుకు చేరుకుంటారు మరియు వారు ఆ నదీతీరంలో విహారం చేస్తారు. అక్కడ గంగా నది గురించి రాముడు పరిశోధనాత్మకంగా అడిగినప్పుడు విశ్వామిత్రుడు గంగానది పురాణాన్ని వివరిస్తాడు, ఆమె తండ్రి హిమాలయాల నుండి దేవతలు ఆమెను ఎలా స్వర్గానికి తీసుకువెళ్లారు.

ఉమాగంగావృత్తాంతసంక్షేపః

ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః |
నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోఽభ్యభాషత ||

1

సుప్రభాతా నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే గమనాయాభిరోచయ ||

2

తచ్ఛ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణికీం క్రియామ్ |
గమనం రోచయామాస వాక్యం చేదమువాచ హ ||

3

అయం శోణః శుభజలోగాధః పులినమండితః |
కతరేణ పథా బ్రహ్మన్సంతరిష్యామహే వయమ్ ||

4

ఏవముక్తస్తు రామేణ విశ్వామిత్రోఽబ్రవీదిదమ్ |
ఏష పంథా మయోద్దిష్టో యేన యాంతి మహర్షయః ||

5

ఏవముక్తా మహర్షయో విశ్వామిత్రేణ ధీమతా |
పశ్యంతస్తే ప్రయాతా వై వనాని వివిధాని చ ||

6

తే గత్వా దూరమధ్వానం గతేఽర్ధదివసే తదా |
జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం దదృశుర్మునిసేవితామ్ ||

7

తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంససారససేవితామ్ |
బభూవుర్మునయః సర్వే ముదితాః సహరాఘవాః ||

8

తస్యాస్తీరే తతశ్చక్రుస్త ఆవాసపరిగ్రహమ్ |
తతః స్నాత్వా యథాన్యాయం సంతర్ప్య పితృదేవతాః ||

9

హుత్వా చైవాగ్నిహోత్రాణి ప్రాశ్య చానుత్తమం హవిః |
వివిశుర్జాహ్నవీతీరే శుచౌ ముదితమానసాః ||

10

విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమంతతః |
సంప్రహృష్టమనా రామో విశ్వామిత్రమథాబ్రవీత్ ||

11

భగవన్ శ్రోతుమిచ్ఛామి గంగాం త్రిపథగాం నదీమ్ |
త్రైలోక్యం కథమాక్రమ్య గతా నదనదీపతిమ్ ||

12

చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః |
వృద్ధిం జన్మ చ గంగాయా వక్తుమేవోపచక్రమే ||

13

శైలేంద్రో హిమవాన్రామ ధాతూనామాకరో మహాన్ |
తస్య కన్యాద్వయం జాతం రూపేణాప్రతిమం భువి ||

14

యా మేరుదుహితా రామ తయోర్మాతా సుమధ్యమా |
నామ్నా మేనా మనోజ్ఞా వై పత్నీ హిమవతః ప్రియా ||

15

తస్యాం గంగేయమభవజ్జ్యేష్ఠా హిమవతః సుతా |
ఉమా నామ ద్వితీయాభూత్కన్యా తస్యైవ రాఘవ ||

16

అథ జ్యేష్ఠాం సురాః సర్వే దేవతార్థచికీర్షయా |
శైలేంద్రం వరయామాసుర్గంగాం త్రిపథగాం నదీమ్ ||

17

దదౌ ధర్మేణ హిమవాంస్తనయాం లోకపావనీమ్ |
స్వచ్ఛందపథగాం గంగాం త్రైలోక్యహితకామ్యయా ||

18

ప్రతిగృహ్య తతో దేవాస్త్రిలోకహితకారిణః |
గంగామాదాయ తేఽగచ్ఛన్కృతార్థేనాంతరాత్మనా ||

19

యా చాన్యా శైలదుహితా కన్యాఽఽసీద్రఘునందన |
ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధనా ||

20

ఉగ్రేణ తపసా యుక్తాం దదౌ శైలవరః సుతామ్ |
రుద్రాయాప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతామ్ ||

21

ఏతే తే శైలరాజస్య సుతే లోకనమస్కృతే |
గంగా చ సరితాం శ్రేష్ఠా ఉమా దేవీ చ రాఘవ ||

22

ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నదీ |
ఖం గతా ప్రథమం తాత గంగా గతిమతాం వర ||

23

సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా |
సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ ||

24

Balakanda Sarga 35 In Telugu Pdf With Meaning

మరునాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అంతరూ ప్రాతః కాలముననే నిద్ర లేచి, సంధ్యావందనము అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధము అయ్యారు. అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయమునకు గంగానదీ తీరమునకు చేరుకున్నారు.

గంగానదీ దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు, మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదీలో స్నానములు చేసి పితృ తర్పణములు విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామిత్రుని చుట్టు కూర్చున్నారు.

విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు. ” ఓ మహర్షీ! ఇచ్చట గంగానది మూడు పాయలుగా ప్రవహించుచున్నది కదా. ఇది ఎలా ఏర్పడినది. ఈ గంగానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది. వివరించండి.” అని అడిగాడు.

విశ్వామిత్రుడు గంగా నది గురించి దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు.

‘ఓ రామా! హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్పర్వతము నివాసము. హిమవత్పర్వతము సకల ధాతువులకు. ఓషధులకు నిలయము.

హిమ వంతుని భార్య పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగ, ఉ మ. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు, తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్లిపోయింది.

హిమవంతుని రెండవ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదటు పెట్టింది. హిమ వంతుడు తనరెండవ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహము చేసాడు. గంగ, ఉమ అక్కా చెల్లెళ్లు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్లింది. ఉమశివుని వెంట కైలాసమునకు వెళ్లింది.

గంగ నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
బాలకాండ 35వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్త్రింశః సర్గః (36) >>

Sri Maha Lakshmi Ashtottara Sata Naamaavali In Telugu – శ్రీమహాలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం

Sri Maha Lakshmi Ashtottara Sata Naamaavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీమహాలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)

ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)

ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)

ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)

ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)

ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)

ఓం తుష్టయే నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)

ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం సదాసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతాయై నమః
ఓం నందాయై నమః (90)

ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ।

మరిన్ని అష్టోత్తరములు

Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః

Sri Sai Baba Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః

(ప్రతి నామమునకు ముందు ఓం శ్రీసాయి అనియు చివర నమః అనియు చదువవలెను.)

  1. ఓం శ్రీ సాయినాథాయ నమః
  2. శ్రీ లక్ష్మీనారాయణాయ
  3. శ్రీ కృష్ణరామ శివ మారుత్యాదిరూపాయ
  4. శ్రీ శేషశాయినే
  5. గోదావరీ తట షిర్డివాసినే
  6. భక్తహృదయాలయాయ
  7. సర్వహృద్వాసినే
  8. భూతవాసాయ
  9. భూతభవిష్యద్భావ వర్జితాయ
  10. కాలాతీతాయ
  11. కాలాయ
  12. కాలకాలాయ
  13. కాల దర్పదమనాయ
  14. మృత్యంజయాయ
  15. అమర్త్యాయ
  16. మార్త్యాభయ ప్రదాయ
  17. జీవధారాయ
  18. సర్వాధారాయ
  19. భక్తావన సమర్థాయ
  20. భక్తావనప్రతిజ్ఞానసమరాయ
  21. అన్నవస్త్రదాయ
  22. ఆరోగ్య క్షేమదాయ
  23. ధనమాంగల్యదాయ
  24. బుద్ధి సిద్ధిప్రదాయ
  25. పుత్రమిత్రకళత్రబంధువే
  26. యోగ క్షేమవహాయ
  27. ఆపద్భాంధవాయ
  28. మార్గబంధవే
  29. భుక్తిముక్తిస్వర్గాపవర్గాదాయ
  30. ప్రియాయ
  31. ప్రీతి వర్ధనాయ
  32. అంతర్యామినే
  33. సచ్చిదాత్మనే
  34. నిత్యానందాయ
  35. పరమసుఖదాయ
  36. పరమేశ్వరాయ
  37. పరబ్రహ్మణే
  38. పరమాత్మనే
  39. జ్ఞాన స్వరూపిణే
  40. జగత్పిత్రే
  41. భక్తానాం మాతృధాతృ పితామహాయ
  42. భక్తాభయప్రదాయ
  43. భక్తవత్సలాయ
  44. భక్తానుగ్రహకారకాయ
  45. శరణాగత వత్సలాయ
  46. భక్తి శక్తిప్రదాయ
  47. జ్ఞాన వైరాగ్యదాయినే
  48. ప్రేమప్రదాయ
  49. సంసార దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయ కరాయ
  50. హృదయగ్రంధి భేదకాయ
  51. కర్మ ధ్వంసినే
  52. శుద్ధ సత్త ్వస్థితాయ
  53. గుణాతీత గుణాత్మనే
  54. అనంత కళ్యాణ గుణాయ
  55. అమిత పరాక్రమాయ
  56. జయనే
  57. దుర్ధర్షాక్షోభ్యాయ
  58. అపరాజితాయ
  59. త్రిలోకేష్వ స్కంధితగతయే
  60. అశక్యరహితాయ
  61. సర్వశక్తి మూర్తయే
  62. సురూప సుందరాయ
  63. సులోచనాయ
  64. బహురూప విశ్వమూర్తయే
  65. అరూపా వ్యక్తాయ
  66. అచింత్యాయ
  67. సూక్ష్మాయ
  68. సర్వాంతర్యామినే
  69. మనోవాగతీతాయ
  70. ప్రేమమూర్తయే
  71. సులభ దుర్లభాయ
  72. అసహాయ సహాయాయ
  73. అనాధనాధ దీనబాంధవే
  74. సర్వభార భృతే
  75. అకర్మానేక కర్మ సుకర్మణే
  76. పుణ్య శ్రవణ కీర్తనాయ
  77. తీర్ధాయ
  78. వాసుదేవాయ
  79. సతాంగతయే
  80. సత్పరాయణాయ
  81. లోకనాథాయ
  82. పాపనాశనాయ
  83. అమృతాంశవే
  84. భాస్కర ప్రభాయ
  85. బ్రహ్మచర్య తపశ్చర్యాదిసువ్రతాయ
  86. సత్యధర్మ పరాయణాయ
  87. సిద్ధేశ్వరాయ
  88. యోగీశ్వరాయ
  89. సిద్ధ సంకల్పనాయ
  90. భగవతే
  91. శ్రీభక్తవశ్యాయ
  92. సత్పురుషాయ
  93. పురుషోత్తమాయ
  94. సత్య తత్వబోధకాయ
  95. కామాది సర్వాజ్ఞాన ధ్వంసినే
  96. అభేదానందాను భవదాయ
  97. సమసర్వమత సమ్మతాయ
  98. శ్రీ దక్షిణామూర్తయే
  99. శ్రీ వేంకటేశ రమణాయ
  100. అద్భుతానంద చర్యాయ
  101. ప్రసన్నార్తి హరాయ
  102. సంసార సర్వదుఃఖక్షయాయ
  103. సర్వవిత్ సర్వతో ముఖా
  104. సర్వాంతర్భహి స్థితాయ
  105. సర్వమంగళ కరాయ
  106. సర్వాభీష్ట ప్రదాయ
  107. సమరస సన్మార్గ స్థాపనాయ
  108. శ్రీ సమర్థ సద్గురు సాయినాధాయ నమః

ధూపమాఘ్రాపయామి (అగరువత్తులు చూపించవలెను.)
దీపం దర్శయామి (దీపారాధన చేయవలెను.)
నైవేద్యం సమర్పయామి (నివేదనము సమర్పించవలెను)
తాంబూలం సమర్పయామి
నీరాజనం దర్శయామి (నివేదనము సమర్పించవలెను) మంత్రపుష్పం సమర్పయామి.

మంత్రపుష్పం

ధాతా పురస్తాద్య ముదాజహార, శక్రః ప్ర విద్వాన్ ప్ర దిశ శ్చతస్రః,
తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే.

మరిన్ని అష్టోత్తరములు

Ayodhya Kanda Sarga 26 In Telugu | అయోధ్యాకాండ షడ్వింశః సర్గః

Ayodhya Kanda Sarga 26 In Telugu

అయోధ్యా కాండ సర్గ 26 రామాయణంలో ఒక కీలకమైన అధ్యాయం, ఇందులో రాజకుటుంబంలో కొనసాగుతున్న భావోద్వేగ వాణిజ్యాలు మరియు పెరుగుతున్న విభేదాలను చూపిస్తుంది. ఈ విభాగంలో, భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి, తన ప్రియతమ అన్నయ్య రాముని వనవాసం గురించి తెలుసుకుంటాడు. తీవ్ర దుఃఖం మరియు అపరాధ భావనతో భరతుడు తన తల్లి కైకేయితో ఎదుర్కొని, ఆమె చర్యలపై తన ఆవేదన మరియు నిరాశను వ్యక్తం చేస్తాడు. ఈ అధ్యాయం కుదుళ్ళ బంధాలను మరియు ఇతిహాసాన్ని లక్షణపరచే బలమైన ధర్మబద్ధతను ఎత్తిచూపుతుంది. రాముడికి భరతుడి విశ్వాసం మరియు అతన్ని తిరిగి అయోధ్యకు తీసుకురావాలనే నిర్ణయం సోదర ప్రేమ, కర్తవ్య మరియు న్యాయం కోసం తపన అంశాలను ప్రదర్శిస్తుంది.

సీతాప్రత్యవస్థాపనమ్

అభివాద్య తు కౌసల్యాం రామః సంప్రస్థితో వనమ్ |
కృతస్వస్త్యయనో మాత్రా ధర్మిష్ఠే వర్త్మని స్థితః ||

1

విరాజయన్రాజసుతో రాజమార్గం నరైర్వృతమ్ |
హృదయాన్యామమంథేవ జనస్య గుణవత్తయా ||

2

వైదేహీ చాపి తత్సర్వం న శుశ్రావ తపస్వినీ |
తదేవ హృది తస్యాశ్చ యౌవరాజ్యాభిషేచనమ్ ||

3

దేవకార్యం స్వయం కృత్వా కృతజ్ఞా హృష్టచేతనా |
అభిజ్ఞా రాజధర్మానాం రాజపుత్రం ప్రతీక్షతే ||

4

ప్రవివేశాథ రామస్తు స్వ వేశ్మ సువిభూషితమ్ |
ప్రహృష్టజనసంపూర్ణం హ్రియా కించిదవాఙ్ముఖః ||

5

అథ సీతా సముత్పత్య వేపమానా చ తం పతిమ్ |
అపశ్యచ్ఛోకసంతప్తం చింతావ్యాకులితేంద్రియమ్ ||

6

తాం దృష్ట్వా స హి ధర్మాత్మా న శశాక మనోగతమ్ |
తం శోకం రాఘవః సోఢుం తతో వివృతతాం గతః ||

7

వివర్ణవదనం దృష్ట్వా తం ప్రస్విన్నమమర్షణమ్ |
ఆహ దుఃఖాభిసంతప్తా కిమిదానీమిదం ప్రభో ||

8

అద్య బార్హస్పతః శ్రీమానుక్తః పుష్యో ను రాఘవ |
ప్రోచ్యతే బ్రాహ్మణైః ప్రాజ్ఞైః కేన త్వమసి దుర్మనాః ||

9

న తే శతశలాకేన జలఫేననిభేన చ |
ఆవృతం వదనం వల్గు ఛత్రేణాభివిరాజతే ||

10

వ్యజనాభ్యాం చ ముఖ్యాభ్యాం శతపత్రనిభేక్షణమ్ |
చంద్రహంసప్రకాశాభ్యాం వీజ్యతే న తవాననమ్ ||

11

వాగ్మినో వందినశ్చాపి ప్రహృష్టాస్త్వం నరర్షభ |
స్తువంతో నాత్ర దృశ్యంతే మంగలైః సూతమాగధాః ||

12

న తే క్షౌద్రం చ దధి చ బ్రాహ్మణా వేద పారగాః |
మూర్ధ్ని మూర్ధాభిషిక్తస్య దధతి స్మ విధానతః ||

13

న త్వాం ప్రకృతయః సర్వాః శ్రేణీముఖ్యాశ్చ భూషితాః |
అనువ్రజితుమిచ్చంతి పౌరజాపపదాస్తథా ||

14

చతుర్భిర్వేగసంపన్నైర్హయైః కాంచనభూషణైః |
ముఖ్యః పుష్యరథో యుక్తః కిం న గచ్ఛతి తేఽగ్రతః ||

15

న హస్తీ చాగ్రతః శ్రీమాంస్తవ లక్షణపూజితః |
ప్రయాణే లక్ష్యతే వీర కృష్ణమేఘగిరిప్రభః ||

16

న చ కాంచనచిత్రం తే పశ్యామి ప్రియదర్శన |
భద్రాసనం పురస్కృత్య యాతం వీరపురస్కృతమ్ ||

17

అభిషేకో యదా సజ్జః కిమిదానీమిదం తవ |
అపూర్వో ముఖవర్ణశ్చ న ప్రహర్షశ్చ లక్ష్యతే ||

18

ఇతీవ విలపంతీం తాం ప్రోవాచ రఘునందనః |
సీతే తత్రభవాంస్తాతః ప్రవ్రాజయతి మాం వనమ్ ||

19

కులే మహతి సంభూతే ధర్మజ్ఞే ధర్మచారిణి |
శృణు జానకి యేనేదం క్రమేణాభ్యాగతం మమ ||

20

రాజ్ఞా సత్యప్రతిజ్ఞేన పిత్రా దశరథేన మే |
కైకేయ్యై మమ మాత్రే తు పురా దత్తో మహావరౌ ||

21

తయాఽద్య మమ సజ్జేఽస్మిన్నభిషేకే నృపోద్యతే |
ప్రచోదితః ససమయో ధర్మేణ ప్రతినిర్జితః ||

22

చతుర్దశ హి వర్షాణి వస్తవ్యం దండకే మయా |
పిత్రా మే భరతశ్చాపి యౌవరాజ్యే నియోజితః ||

23

సోఽహం త్వామాగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనమ్ |
భరతస్య సమీపే తే నాహం కథ్యః కదాచన ||

24

ఋద్ధియుక్తా హి పురుషా న సహంతే పరస్తవమ్ |
తస్మాన్న తే గుణాః కథ్యా భరతస్యాగ్రతో మమ ||

25

నాపి త్వం తేన భర్తవ్యా విశేషేణ కదాచన |
అనుకూలతయా శక్యం సమీపే తస్య వర్తితుమ్ ||

26

తస్మై దత్తం నృపతినా యౌవరాజ్యం సనాతనమ్ |
స ప్రసాద్యస్త్వయా సీతే నృపతిశ్చ విశేషతః ||

27

అహం చాపి ప్రతిజ్ఞాం తాం గురోః సమనుపాలయన్ |
వనమద్యైవ యాస్యామి స్థిరా భవ మనస్వినీ ||

28

యాతే చ మయి కల్యాణి వనం మునినిషేవితమ్ |
వ్రతోపవాసపరయా భవితవ్యం త్వయానఘే ||

29

కాల్యముత్థాయ దేవానాం కృత్వా పూజాం యథావిధి |
వందితవ్యో దశరథః పితా మమ నరేశ్వరః ||

30

మాతా చ మమ కౌసల్యా వృద్ధా సంతాపకర్శితా |
ధర్మమేవాగ్రతః కృత్వా త్వత్తః సమ్మానమర్హతి ||

31

వందితవ్యాశ్చ తే నిత్యం యాః శేషా మమ మాతరః |
స్నేహప్రణయసంభోగైః సమా హి మమ మాతరః ||

32

భ్రాతృపుత్రసమౌ చాపి ద్రష్టవ్యౌ చ విశేషతః |
త్వయా భరతశత్రుఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ ||

33

విప్రియం న చ కర్తవ్యం భరతస్య కదాచన |
స హి రాజా ప్రభుశ్చైవ దేశస్య చ కులస్య చ ||

34

ఆరాధితా హి శీలేన ప్రయత్నైశ్చోపసేవితాః |
రాజానః సంప్రసీదంతి ప్రకుప్యంతి విపర్యయే ||

35

ఔరసానపి పుత్రాన్హి త్యజంత్యహితకారిణః |
సమర్థాన్సంప్రగృహ్ణంతి పరానపి నరాధిపాః ||

36

సా త్వం వసేహ కల్యాణి రాజ్ఞః సమనువర్తినీ |
భరతస్య రతా ధర్మే సత్యవ్రతపరాయణా ||

37

అహం గమిష్యామి మహావనం ప్రియే
త్వయా హి వస్తవ్యమిహైవ భామిని |
యథా వ్యలీకం కురుషే న కస్యచి-
-త్తథా త్వయా కార్యమిదం వచో మమ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షడ్వింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 26 Meaning In Telugu

తల్లి కౌసల్య నుండి ఆశీర్వాదములు పొందిన రాముడు అక్కడనుండి బయలు దేరాడు. ఇంక వనవాసమునకు వెళ్లడానికి మనస్సును సిద్ధం చేసుకుంటున్నాడు. కౌసల్య మందిరమునుండి బయటకు వచ్చాడు.

రాత్రి అంతా ఉపవాసము చేసి జాగరణ చేసిన సీత ఉదయము రాముని రాకకై ఎదురు చూస్తూ ఉంది. “పట్టాభిషేక ముహూర్తము సమీపిస్తూ ఉంది. కాని రాముడు ఇంకా రాలేదు. కారణం ఏమయి ఉంటుంది” అని తనలో తాను తర్కించుకుంటూ
ఉంది.

ఇంతలో రాముడు సీత ఉన్న మందిరములోకి ప్రవేశించాడు. రాముని ముఖంలో కనపడుతున్న బాధను, వ్యధను చూచి సీత మనస్సు కలత చెందింది. అప్పటిదాకా తనలో ఉన్న బాధను అతి కష్టం మీద అణిచి పెట్టుకున్న రాముడు సీతను చూడగానే ఇంక తట్టుకోలేకపోయాడు.

రాముని ముఖంలో కనిపిస్తున్న బాధను చూచి సీత “ప్రభూ! ఏమి జరిగింది. ఎందుకు మీరు మనసులో బాధపడుతున్నారు. ఈరోజు పుష్యమీ నక్షత్రము. తమరి పట్టాభిషేకము జరుగురోజు. వసిష్ఠుల వారు సుముహూర్తము నిశ్చయించినారు కదా! ఆనందము గా ఉండక ఎందుకు మీరు బాధతో విలవిలలాడిపోతున్నారు.

ఎంతటి విపత్కర సమయంలో కూడా తమరి ముఖంలో మాయని చిరునవ్వు ఈ సంతోష సమయంలో మాయమగుటకు కారణమేమి? కాబోయే యువరాజును స్తుతించుటకు నియమింప బడ్డ వంది మాగధులు కనపడటం లేదు. ఏమి కారణము? ఇంకనూ పట్టాభి షేకము జరగలేదా! తమరి తల మీద మంగళకరమైన తేనె, పెరుగు బ్రాహ్మణులు అభిషేకించలేదా!

తమరి వెంట అమాత్యులు, జానపదులు ఎందుకు అనుసరించి రాలేదు. తమరు కాలి నడకన వచ్చారు. పట్టాభిషేక చిహ్నముగా అలంకరించిన రథము ఏమయినది? మీరు వస్తూ ఉంటే మీ ముందు నడవ వలసిన మదగజము కనపడటం లేదు. అసలు తమరి ముఖంలో పట్టాభిషేకము చేసుకొనబోవు రాకుమారుడి సంతోషము ఆనందము కనబడటం లేదు. కారణమేమి?” అని పరి పరి విధాల ప్రశ్నల వర్షం కురిపించింది సీత.

దానికిరాముడు ఇలా బదులు చెప్పాడు. “ఓ సీతా! నా తండ్రి నన్ను అరణ్యవాసమునకు వెళ్లమన్నాడు. నీకు ధర్మములు అన్నీ తెలుసు కదా! ఈ విపరీత పరిణామము ఎందు వల్ల సంభవించినదో వివరంగా
చెబుతాను విను. నా తండ్రి దశరథమహారాజు నిత్యసత్యవ్రతుడు. ఎన్నడూ ఆడిన మాట తప్పడు. నా తండ్రి నా తల్లి కైకకు పూర్వము రెండువరములు ఇచ్చాడట.

నా పట్టాభిషేక వార్త విన్న కైక, నా తండ్రిని ఆ రెండు వరములు ఇవ్వమని కోరింది. అందులో మొదటి వరము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. రెండవ వరము–నాకు మారుగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరగాలి. దానికి నా తండ్రి సమ్మతించాడు. నా తండ్రి మేరకు నేను వనవాసమునకు పోవుచున్నాను. ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను.

నేను లేని సమయములో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. యువరాజు భరతుని ముందు నా గురించి గానీ, నా గుణగణములు గురించి గానీ నీవు మాట్లాడకూడదు. ఎందుకంటే రాజులు తమ ముందు ఇతరులను పొగడటం సహించలేరు. ఇంకొకమాట. నిన్ను పోషించవలసిన బాధ్యత భరతునికి లేదు.

నీవు భరతునికి అనుకూలంగా ఉన్నంత కాలమే నీవు ఇక్కడ క్షేమంగా, నిశ్చింతగా ఉనా తండ్రి దశరథుడు వంశపారంపర్యముగా జ్యేష్టునికి చెందవలసిన రాజ్యమును, భరతునికి ఇచ్చాడు. కాబట్టి నీవు నీమామగారు దశరథునికి, యువరాజు భరతునికి అనుకూలంగా నడచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి.

నేను వనవాసము వెళు తున్నాను. నీవు ధైర్యంగా ఉండు. నేను లేని సమయములో నీవు వ్రతములు, ఉపవాసవ్రతములు చేస్తూ ఉండు. నీవు పొద్దుటే లేచి, పూజాదికములు అయిన తరువాత, నా తండ్రి దశరథునికి నమస్కరించడం మరిచిపోవద్దు. నా తల్లి, నీ అత్తగారు, వృద్ధురాలు అయిన కౌసల్య నేను అడవులకు వెళుతున్నాను. అని కృంగి, కృశించి పోవుచున్నది. ఆమె యోగక్షేమములు చూడటం నీ ధర్మము. ఆమెను గౌరవించు. నా తల్లి కౌసల్య ఒకతేకాదు. నా తల్లులందరూ నీకు పూజనీయులే. వారి నందరినీ గౌరవించు.

నా తమ్ములు భరతుడు, శత్రుఘ్నుడు నీకు సోదర సమానులు మరియు పుత్రసమానులు. వారిని తగురీతిగా ఆదరించు. పైగా భరతుడు ఇక్ష్వాకుకులమునకు, అయోధ్యకు రాజు. అతని మీద పగ ద్వేషము పెంచుకోకు. సాధారణంగా రాజులు తమను సేవించేవారిని ఆదరిస్తారు. లేకపోతే ద్వేషిస్తారు. కాబట్టి భరతుని నువ్వు ఒక రాజుగా ఆదరించు.

నీ ధర్మమును నువ్వు నిర్వర్తించు. ఈ పదునాలుగు సంవత్సరములు నువ్వు అయోధ్యలోనే ఉండు. నేను వనవాసమునకు పోతున్నాను అని మనసు కష్టపెట్టుకోకు. ధైర్యంగా ఉండు. నన్ను సంతోషంగా అరణ్యములకు సాగనంపు.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్వత్.

అయోధ్యాకాండ సప్తవింశః సర్గః (27) >>

Ayodhya Kanda Sarga 25 In Telugu | అయోధ్యాకాండ పంచవింశః సర్గః

Ayodhya Kanda Sarga 25 In Telugu

అయోధ్యా కాండ సర్గ 25 రామాయణంలో ఒక కీలకమైన అధ్యాయం, ఇందులో పాత్రలు ఎదుర్కొనే భావోద్వేగ మరియు నైతిక సంక్లిష్టతలను ముందుకు తీసుకువస్తుంది. ఈ విభాగంలో, తన కుమారుడి వనవాసాన్ని ఒప్పుకోవడానికి దశరథ మహారాజు అనుభవిస్తున్న కష్టాన్ని మనం చూస్తాము. రాముని విడిపోవడం వల్ల అయోధ్య ప్రజలు అనుభవిస్తున్న గాఢమైన దుఃఖాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ ఇతిహాస భాగం రాముని వనవాసం అతని కుటుంబం మరియు రాజ్యం మీద పడిన ప్రగాఢ ప్రభావాన్ని ఎత్తిచూపుతూ, విశ్వాసం, ప్రేమ మరియు ధర్మం (నైతిక కర్తవ్యము) కోరుకునే బాధాకరమైన త్యాగాల అంశాలను ప్రముఖంగా ప్రదర్శిస్తుంది. రాముని తిరుగు ప్రయాణానికి ముంగిలి సిద్ధం చేస్తుంది.

మాతృస్వస్త్యయనమ్

సాఽపనీయ తమాయాసముపస్పృశ్య జలం శుచిః |
చకార మాతా రామస్య మంగలాని మనస్వినీ ||

1

న శక్యసే వారయితుం గచ్ఛేదానీం రఘూత్తమ |
శీఘ్రం చ వినివర్తస్వ వర్తస్వ చ సతాంక్రమే ||

2

యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ |
స వై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు ||

3

యేభ్యః ప్రణమసే పుత్ర చైత్యేష్వాయతనేషు చ |
తే చ త్వామభిరక్షంతు వనే సహ మహర్షిభిః ||

4

యాని దత్తాని తేఽస్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా |
తాని త్వామభిరక్షంతు గుణైః సముదితం సదా ||

5

పితృశుశ్రూషయా పుత్ర మాతృశుశ్రూషయా తథా |
సత్యేన చ మహాబాహో చిరం జీవాభిరక్షితః ||

6

సమిత్కుశపవిత్రాణి వేద్యశ్చాయతనాని చ |
స్థండిలాని విచిత్రాణి శైలా వృక్షాః క్షుపా హ్రదాః ||

7

పతంగాః పన్నగాః సింహాస్త్వాం రక్షంతు నరోత్తమ |
స్వస్తి సాధ్యాశ్చ విశ్వే చ మరుతశ్చ మహర్షయః ||

8

స్వస్తి ధాతా విధాతా చ స్వస్తి పూషా భగోఽర్యమా |
లోకపాలాశ్చ తే సర్వే వాసవప్రముఖాస్తథా ||

9

ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాః సంవత్సరాః క్షపాః |
దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా ||

10

స్మృతిర్ధృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః |
స్కందశ్చ భగవాన్దేవః సోమశ్చ సబృహస్పతిః ||

11

సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః |
యే చాపి సర్వతః సిద్ధా దిశశ్చ సదిగీశ్వరాః ||

12

స్తుతా మయా వనే తస్మిన్పాంతు త్వాం పుత్ర నిత్యశః |
శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవ చ ||

13

ద్యౌరంతరిక్షం పృథివీ నద్యః సర్వాస్తథైవ చ |
నక్షత్రాణి చ సర్వాణి గ్రహాశ్చ సహదేవతాః ||

14

అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితమ్ |
ఋతవశ్చైవ షట్ పుణ్యా మాసాః సంవత్సరాస్తథా ||

15

కలాశ్చ కాష్ఠాశ్చ తథా తవ శర్మ దిశంతు తే |
మహావనే విచరతో మునివేషస్య ధీమతః ||

16

తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా |
రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూరకర్మణామ్ ||

17

క్రవ్యాదానాం చ సర్వేషాం మా భూత్పుత్రక తే భయమ్ |
ప్లవగా వృశ్చికా దంశా మశకాశ్చైవ కాననే ||

18

సరీసృపాశ్చ కీటాశ్చ మా భూవన్గహనే తవ |
మహాద్విపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రా ఋక్షాశ్చ దంష్ట్రిణః ||

19

మహిషాః శృంగిణో రౌద్రా న తే ద్రుహ్యంతు పుత్రక |
నృమాంసభోజినో రౌద్రా యే చాన్యే సత్త్వజాతయః ||

20

మా చ త్వాం హింసిషుః పుత్ర మయా సంపూజితాస్త్విహ |
ఆగమాస్తే శివాః సంతు సిద్ధ్యంతు చ పరాక్రమాః ||

21

సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్గచ్ఛ పుత్రక |
స్వస్తి తేఽస్త్వాంతరిక్షేభ్యః పార్థివేభ్యః పునః పునః ||

22

సర్వేభ్యశ్చైవ దేవేభ్యో యే చ తే పరిపంథినః |
శుక్రః సోమశ్చ సూర్యశ్చ ధనదోఽథ యమస్తథా || [గురుః]

23

పాంతు త్వామర్చితా రామ దండకారణ్యవాసినమ్ |
అగ్నిర్వాయుస్తథా ధూమో మంత్రాశ్చర్షిముఖాచ్చ్యుతాః ||

24

ఉపస్పర్శనకాలే తు పాంతు త్వాం రఘునందన |
సర్వలోకప్రభుర్బ్రహ్మా భూతభర్తా తథర్షయః ||

25

యే చ శేషాః సురాస్తే త్వాం రక్షంతు వనవాసినమ్ |
ఇతి మాల్యైః సురగణాన్గంధైశ్చాపి యశస్వినీ ||

26

స్తుతిభిశ్చానురూపాభిరానర్చాయతలోచనా | [అనుకూలాభిః]
జ్వలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మనా ||

27

హావయామాస విధినా రామమంగలకారణాత్ |
ఘృతం శ్వేతాని మాల్యాని సమిధః శ్వేతసర్షపాన్ ||

28

ఉపసంపాదయామాస కౌసల్యా పరమాంగనా |
ఉపాధ్యాయః స విధినా హుత్వా శాంతిమనామయమ్ ||

29

హుతహవ్యావశేషేణ బాహ్యం బలిమకల్పయత్ |
మధుదధ్యక్షతఘృతైః స్వస్తివాచ్య ద్విజాంస్తతః ||

30

వాచయామాస రామస్య వనే స్వస్త్యయనక్రియాః |
తతస్తస్మై ద్విజేంద్రాయ రామమాతా యశస్వినీ ||

31

దక్షిణాం ప్రదదౌ కామ్యాం రాఘవం చేదమబ్రవీత్ |
యన్మంగలం సహస్రాక్షే సర్వదేవనమస్కృతే ||

32

వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగలమ్ |
యన్మంగలం సుపర్ణస్య వినతాఽకల్పయత్పురా ||

33

అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగలమ్ |
అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ ||

34

అదితిర్మంగలం ప్రాదాత్తత్తే భవతు మంగలమ్ |
త్రీన్విక్రమాన్ప్రక్రమతో విష్ణోరమితతేజసః ||

35

యదాసీన్మంగలం రామ తత్తే భవతు మంగలమ్ |
ఋతవః సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే ||

36

మంగలాని మహాబాహో దిశంతు శుభమంగలాః |
ఇతి పుత్రస్య శేషాంశ్చ కృత్వా శిరసి భామినీ ||

37

గంధైశ్చాపి సమాలభ్య రామమాయతలోచనా |
ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభామ్ ||

38

చకార రక్షాం కౌసల్యా మంత్రైరభిజజాప చ |
ఉవాచాతిప్రహృష్టేవ సా దుఃఖవశవర్తినీ ||

39

వాఙ్మాత్రేణ న భావేన వాచా సంసజ్జమానయా |
ఆనమ్య మూర్ధ్ని చాఘ్రాయ పరిష్వజ్య యశస్వినీ ||

40

అవదత్పుత్ర సిద్ధార్థో గచ్ఛ రామ యథాసుఖమ్ |
అరోగం సర్వసిద్ధార్థమయోధ్యాం పునరాగతమ్ ||

41

పశ్యామి త్వాం సుఖం వత్స సుస్థితం రాజవర్త్మని |
ప్రనష్టదుఃఖసంకల్పా హర్షవిద్యోతితాననా ||

42

ద్రక్ష్యామి త్వాం వనాత్ప్రాప్తం పూర్ణచంద్రమివోదితమ్ |
భద్రాసనగతం రామ వనవాసాదిహాగతమ్ || [భద్రం]

43

ద్రక్ష్యామి చ పునస్త్వాం తు తీర్ణవంతం పితుర్వచః |
మంగలైరుపసంపన్నో వనవాసాదిహాగతః |
వధ్వా మమ చ నిత్యం త్వం కామాన్ సంవర్ధ యాహి భో ||

44

మయార్చితా దేవగణాః శివాదయో
మహర్షయో భూతమహాసురోరగాః |
అభిప్రయాతస్య వనం చిరాయ తే
హితాని కాంక్షంతు దిశశ్చ రాఘవ ||

45

ఇతీవ చాశ్రుప్రతిపూర్ణలోచనా
సమాప్య చ స్వస్త్యయనం యథావిధి |
ప్రదక్షిణం చైవ చకార రాఘవం
పునః పునశ్చాపి నిపీడ్య సస్వజే ||

46

తథా తు దేవ్యా స కృతప్రదక్షిణో
నిపీడ్య మాతుశ్చరణౌ పునః పునః |
జగామ సీతానిలయం మహాయశాః
స రాఘవః ప్రజ్వలితః స్వయా శ్రియా ||

47

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 25 Meaning In Telugu

మనసు దిటవు పరచుకొన్న కౌసల్య, కళ్లు తుడుచుకొని, ముఖం కడుక్కొని, పాదప్రక్షాళనముచేసుకొని ఆచమనము చేసి, రామునికి మంగళకరమైన పనులు చేయుటకు ఉపక్రమించింది. “రామా! నిన్ను అడవులకు వెళ్లకుండా ఆపుటకు సర్వవిధాలా ప్రయత్నించాను. కాని నీ పట్టు విడవకున్నావు.

నాయనా రామా! ధర్మం తప్పకుండా, మంచి మార్గములో నడుస్తూ, వనవాసము పూర్తి చేసుకొని త్వరగా ఈ తల్లి వద్దకు చేరుకో! నీకు సదా శుభంగుతుంది. రామా! నీవు ఏ ధర్మ పరిరక్షణ కొరకు అరణ్యములకు వెళు తున్నావో, ఆ ధర్మమే నిన్ను సదా రక్షిస్తూ ఉండును గాక!. రామా! నీవు దేవాలయములకు వెళ్లి సమస్త దేవతలకు ప్రణామం చెయ్యి. ఆ దేవతలే నిన్ను సదా కాపాడుదురు గాక!

నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రములు, శస్త్రములు నిన్ను సదా కాపాడుగాక! రామా! నీవు నమ్ముకున్న సత్యము, నీవు ఇప్పటి వరకూ చేసిన మాతృ సేవ, పితృ సేవ నిన్ను రక్షించును గాక! ఓ రామా! మంగళ కరములైన సమిధలు, దర్భలు, అగ్నిహోత్రము, దైవ

సన్నిది నిన్ను అనునిత్యమూ రక్షించు గాక! ఈ ప్రకృతి లోని వృక్షములు, నదులు, పక్షులు, క్రూరమృగములు, సరీసృపములు నీకు ఎలాంటి హానీ చెయ్యకుండా, నిన్ను సదా కాపాడుగాక! ఓ రామా! సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, విశ్వేదేవతలు, మరుత్తులు, మహర్షులు, బ్రహ్మదేవుడు, విధి, సూర్యుడు, దేవేంద్రుడు, లోకపాలకులు నీకు సదా మేలు చేయుదురు గాక!

ఓ రామా! నీకు కాలము, ఋతువులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, రాత్రింబగళ్లు, సుముహూర్తములు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుగాక! ఓ రామా! స్మృతులు, శ్రుతులు, బృహస్పతి, సప్తఋషులు, నారదుడు, చంద్రుడు, కుమారస్వామి నిన్ను దయతో కాపాడుడుదురు గాక!

నీ అరణ్యవాస కాలములో దిక్కులు నిన్ను సదా కాపాడుగాక! అరణ్యములలో ఉన్న పర్వతములు, కొండలు, గుహలు, భూమి, ఆకాశము, స్వర్గము, నక్షత్రములు, గృహములు, వాటి అధిష్టాన దేవతలు నిన్ను రాత్రింబగళ్లు, రెండు సంధ్యవేళల్లో కాపాడుదురు గాక ! నీవు అరణ్యములలో ఉన్న ప్రతిదినము, మాసము, సంవత్సరము, నీకు సదా సుఖము నిచ్చు గాక! నీ అరణ్య వాస కాలములో సమస్త దేవతలు, దైత్యులు, నిన్ను కాపాడుదురు గాక!

నీ వనవాస కాలములో నీకు రాక్షసుల నుండి, రుద్రులు, పిశాచముల నుండి క్రూరమృగముల నుండి నీకు భయము లేకుండు గాక! అరణ్యములో ఉన్న కోతులు, తేళ్లు, పాములు, ఇతర కీటకములు, అలాగే సింహములు, పులులు, ఏనుగులు ఇతర
మాంసాహార జంతువులు నిన్ను బాధించకుండా ఉండు గాక!

ఆకాశంలోనూ, భూమి మీదా ఉందే సమస్త దేవతలు నీకు శుభం కలిగించు గాక! నీకు శత్రుభయం లేకుండు గాక! రామా! అనునిత్యము నేను పూజించే విష్ణువు, మహేశ్వరుడు, పంచ భూతములు, నవగ్రహములు, నా పూజలకు సంతసించి నిన్ను సదా రక్షింతురు గాక!” అని కౌసల్య సమస్త దేవతల రక్షలను రామునికి అందించింది.

సమస్త దేవతలకు పూజలు చేసింది. బ్రాహ్మణుల చేత హెూమములు చేయించింది. మంగళాచరణము చేయించింది. హోమము చేసిన బ్రాహ్మణులకు సంతృప్తిగా దక్షిణలు ఇచ్చింది. కౌసల్యకు ఇంకా తృప్తి కలగ లేదు. తాను స్వయంగా మంగళా చరణము చేయసాగింది.

“ఓ రామా! వృత్రాసుర సంహార సమయంలో ఆ దేవేంద్రునికి కలిగిన మంగళము నీకు కలుగుగాక! పూర్వము అమృతము తీసుకు రావడానికి వెళుతున్నప్పుడు గరుత్మంతునికి అతని తల్లి వినత చేసిన మంగళాశాసనము నీకు కలుగుగాక! వామనావతారములో విష్ణువు మూడు అడుగులు కొలిచినప్పుడు విష్ణువునకు కలిగిన మంగళము నీకు కలుగు గాక!”

అని రాముని తలమీద అక్షతలు వేసి ఆశీర్వదించింది కౌసల్య విశల్యకరణి అనే ఓషధిని రామునికి రక్షగా కట్టింది. కౌసల్య ఇవన్నీ చేస్తూ ఉంది కానీ లోపల దుఃఖము పొర్లుకొస్తూ ఉంది. బలవంతాన అణుచుకుంటూ ఉంది.

“రామా! నీవు వనవాసకాలమును అతి త్వరగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చి రాజ్యాధికారమును చేపట్టు. నన్ను, నీ భార్య సీతను సంతోషపెట్టు. రామా! శుభంగా వెళ్లిరా. నేను నిత్యమూ పూజించే శివుడు, విష్ణువు, మహర్షులు, సమస్త దేవతలు
నిన్ను సదా రక్షించుదురు గాక!

“అని కళ్ల నిండా నీళ్లు నిండగా కౌసల్య రామునికి వీడ్కోలు పలికింది. రాముడు కూడా తల్లి కౌసల్యకు భక్తితో ప్రదక్షిణము చేసి పాదాభివందనము చేసి, ఆమె దగ్గర సెలవు తీసుకొని సీత ఉన్న మందిరమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఇరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ పంచవింశః సర్గః (26) >>

Ayodhya Kanda Sarga 24 In Telugu | అయోధ్యాకాండ చతుర్వింశః సర్గః

Ayodhya Kanda Sarga 24 In Telugu

అయోధ్యా కాండ చతుర్వింశః సర్గః రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం, ఇందులో పాత్రల భావోద్వేగాలు మరియు సందిగ్ధతలు ముందు వస్తాయి. ఈ విభాగంలో, దశరథ మహారాజు తన ప్రియమైన కుమారుడు రాముడు వనవాసానికి వెళ్లడం వలన, కైకేయికి ఇచ్చిన మాట యొక్క ఫలితాలను ఎలా ఎదుర్కొంటున్నాడో చూపిస్తుంది. ఈ అధ్యాయం ధర్మం (నైతిక కర్తవ్యము), త్యాగం మరియు ఆవశ్యకమైన బాధ వంటి అంశాలను ప్రదర్శిస్తుంది. ఈ హృదయ విదారక భాగం రాముని యాత్రలో తరువాత జరిగే సంఘటనలకు పునాదిగా ఉండి, ఇతిహాసంలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది.

కౌసల్యార్తిసమాశ్వాసనమ్

తం సమీక్ష్య త్వవహితం పితుర్నిర్దేశపాలనే |
కౌసల్యా బాష్పసంరుద్ధా వచో ధర్మిష్ఠమబ్రవీత్ ||

1

అదృష్టదుఃఖో ధర్మాత్మా సర్వభూతప్రియంవదః |
మయి జాతో దశరథాత్కథముంఛేన వర్తయేత్ ||

2

యస్య భృత్యాశ్చ దాసాశ్చ మృష్టాన్యన్నాని భుంజతే |
కథం స భోక్ష్యతే నాథో వనే మూలఫలాన్యయమ్ ||

3

క ఏతచ్ఛ్రద్దధేచ్ఛ్రుత్వా కస్య వా న భేవద్భయమ్ |
గుణవాన్దయితో రాజా రాఘవో యద్వివాస్యతే ||

4

నూనం తు బలవాఁల్లోకే కృతాంతః సర్వమాదిశన్ |
లోకే రామాభిరామస్త్వం వనం యత్ర గమిష్యసి ||

5

అయం తు మామాత్మభవస్తవాదర్శనమారుతః |
విలాపదుఃఖసమిధో రుదితాశ్రుహుతాహుతిః ||

6

చింతాబాష్పమహాధూమస్తవాదర్శనచిత్తజః |
కర్శయిత్వా భృశం పుత్ర నిఃశ్వాసాయాససంభవః ||

7

త్వయా విహీనామిహ మాం శోకాగ్నిరతులో మహాన్ |
ప్రధక్ష్యతి యథా కక్షం చిత్రభానుర్హిమాత్యయే ||

8

కథం హి ధేనుః స్వం వత్సం గచ్ఛంతం నానుగచ్ఛతి |
అహం త్వాఽనుగమిష్యామి పుత్ర యత్ర గమిష్యసి ||

9

తథా నిగదితం మాత్రా తద్వాక్యం పురుషర్షభః |
శ్రుత్వా రామోఽబ్రవీద్వాక్యం మాతరం భృశదుఃఖితామ్ ||

10

కైకేయ్యా వంచితో రాజా మయి చారణ్యమాశ్రితే |
భవత్యా చ పరిత్యక్తో న నూనం వర్తయిష్యతి ||

11

భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః |
స భవత్యా న కర్తవ్యో మనసాఽపి విగర్హితః ||

12

యావజ్జీవతి కాకుత్స్థః పితా మే జగతీపతిః |
శుశ్రూషా క్రియతాం తావత్స హి ధర్మః సనాతనః ||

13

ఏవముక్తా తు రామేణ కౌసల్యా శుభదర్శనా |
తథేత్యువాచ సుప్రీతా రామమక్లిష్టకారిణమ్ ||

14

ఏవముక్తస్తు వచనం రామో ధర్మభృతాం వరః |
భూయస్తామబ్రవీద్వాక్యం మాతరం భృశదుఃఖితామ్ ||

15

మయా చైవ భవత్యా చ కర్తవ్యం వచనం పితుః |
రాజా భర్తా గురుః శ్రేష్ఠః సర్వేషామీశ్వరః ప్రభుః ||

16

ఇమాని తు మహారణ్యే విహృత్య నవ పంచ చ |
వర్షాణి పరమప్రీతః స్థాస్యామి వచనే తవ ||

17

ఏవముక్తా ప్రియం పుత్రం బాష్పపూర్ణాననా తదా |
ఉవాచ పరమార్తా తు కౌసల్యా పుత్రవత్సలా ||

18

ఆసాం రామ సపత్నీనాం వస్తుం మధ్యే న మే క్షమమ్ |
నయ మామపి కాకుత్స్థ వనం వన్యాం మృగీమివ ||

19

యది తే గమనే బుద్ధిః కృతా పితురపేక్షయా |
తాం తథా రుదతీం రామో రుదన్వచనమబ్రవీత్ ||

20

జీవంత్యా హి స్త్రియా భర్తా దైవతం ప్రభురేవ చ |
భవత్యా మమ చైవాద్య రాజా ప్రభవతి ప్రభుః ||

21

న హ్యనాథా వయం రాజ్ఞా లోకనాథేన ధీమతా |
భరతశ్చాపి ధర్మాత్మా సర్వభూతప్రియం‍వదః ||

22

భవతీమనువర్తేత స హి ధర్మరతః సదా |
యథా మయి తు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివః ||

23

శ్రమం నావాప్నుయాత్కించిదప్రమత్తా తథా కురు |
దారుణశ్చాప్యయం శోకో యథైనం న వినాశయేత్ ||

24

రాజ్ఞో వృద్ధస్య సతతం హితం చర సమాహితా |
వ్రతోపవాసనిరతా యా నారీ పరమోత్తమా ||

25

భర్తారం నానువర్తేత సా తు పాపగతిర్భవేత్ |
భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమమ్ ||

26

అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ |
శుశ్రూషామేవ కుర్వీత భర్తుః ప్రియహితే రతా ||

27

ఏష ధర్మః పురా దృష్టో లోకే వేదే శ్రుతః స్మృతః |
అగ్నికార్యేషు చ సదా సుమనోభిశ్చ దేవతాః ||

28

పూజ్యాస్తే మత్కృతే దేవి బ్రాహ్మణాశ్చైవ సువ్రతాః |
ఏవం కాలం ప్రతీక్షస్వ మమాగమనకాంక్షిణీ ||

29

నియతా నియతాహారా భర్తృశుశ్రూషణే రతా |
ప్రాప్స్యసే పరమం కామం మయి ప్రత్యాగతే సతి ||

30

యది ధర్మభృతాం శ్రేష్ఠో ధారయిష్యతి జీవితమ్ |
ఏవముక్తా తు రామేణ బాష్పపర్యాకులేక్షణా ||

31

కౌసల్యా పుత్రశోకార్తా రామం వచనమబ్రవీత్ |
గమనే సుకృతాం బుద్ధిం న తే శక్నోమి పుత్రక ||

32

వినివర్తయితుం వీర నూనం కాలో దురత్యయః |
గచ్ఛ పుత్ర త్వమేకాగ్రో భద్రం తేఽస్తు సదా విభో ||

33

పునస్త్వయి నివృత్తే తు భవిష్యామి గతక్లమా |
ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితవ్రతే ||

34

పితురానృణ్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే పరం సుఖమ్ |
కృతాంతస్య గతిః పుత్ర దుర్విభావ్యా సదా భువి ||

35

యస్త్వాం సంచోదయతి మే వచ ఆచ్ఛిద్య రాఘవ |
గచ్ఛేదానీం మహాబాహో క్షేమేణ పునరాగతః ||

36

నందయిష్యసి మాం పుత్ర సామ్నా వాక్యేన చారుణా |
అపీదానీం స కాలః స్యాద్వనాత్ప్రత్యాగతం పునః |
యత్త్వాం పుత్రక పశ్యేయం జటావల్కలధారిణమ్ ||

37

తథా హి రామం వనవాసనిశ్చితం
సమీక్ష్య దేవీ పరమేణ చేతసా |
ఉవాచ రామం శుభలక్షణం వచో
బభూవ చ స్వస్త్యయనాభికాంక్షిణీ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్వింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 24 Meaning In Telugu

రాముని నిశ్చయమును విని కౌసల్య తల్లడిల్లి పోయింది. ఆమెకు నోట మాట రాలేదు. రాబోవు చీకటి రోజులను తలచు కొని తల్లడిల్లి పోయింది. “రామా! ప్రతిదినము మృష్టాన్నములు భుజించుటకు అలవాటు పడ్డవాడికి అడవులలో మున్యాశ్రమములలో వారు ఇచ్చు ఆకులు, దుంపలు, పండ్లతో ఎలా జీవిస్తావయ్యా? ఎందుకంటే అయోధ్యలో నీ సేవకులు కూడా నీ కన్నా మెరుగైన భోజనము చేస్తుంటారు కదా! నీవు అడవులలో కందమూలములు ఎలా తిని బతుకుతావు. రామా! నీవంటి సద్గుణములు కలవాడిని, ప్రీతి పాత్రుడిని, నిర్దయగా రాజు అరణ్యము లకు పంపుతున్నాడే ఇంక మాలాంటి వారిగతి ఏమిటి? రామా! నీవు వెళ్లిన తరువాత అయోధ్యలో ఉండటానికి మాకు భయంగా ఉంది.

రామా! నీవు చెప్పినది సత్యము. నీ లాంటి వాడినే అరణ్యము లకు పంపడానికి అనుకూలించిన విధి ఎంత బలమైనదో ఇప్పుడు తెలుస్తూ ఉంది. నీవు వెళ్లిన తరువాత నాకు ఇంక శోకమే మిగిలింది. ఆ శోకాగ్నిలో నేను దగ్ధం అవడం తథ్యం. అందుకే రామా! నన్ను కూడా నీ వెంట తీసుకొనిపో. నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజమందిరము. పద పోదాము.” అని రాముని వెంట వెళ్లడానికి కౌసల్య

ఉద్యుక్తురాలయింది. తన కోసం శోకిస్తున్న తల్లి కౌసల్యను చూచి రాముడు ఇలా అన్నాడు. “అమ్మా! అన్నీ తెలిసిన నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను. నీకు తెలుసు గదా! కైక తండ్రి గారిని తన చెప్పుచేతల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చి నట్టు ఆడిస్తూ ఉంది. ఇంక నువ్వు కూడా ఇక్కడ లేక పోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి? ఆయన బాగోగులు ఎవరు చూచుకుంటారు. నీవు కూడా తండ్రిగారిని విడిచి పెట్టి నాతో అరణ్యములకు వస్తే, తండ్రిగారు జీవించడం కల్ల.

కాబట్టి నీవు తండ్రి గారిని చూచుకుంటే ఇక్కడే ఉండాలి. పైగా, నీ వంటి పతివ్రత భర్తను వదిలిపెట్టి అరణ్యములకు పోవడం అత్యంత క్రూరమైన పని. అది నీ వంటి సౌశీల్యవతులకు తగని పని. ఒక భార్యగా జీవితాంతము భర్తకు సేవ చెయ్యడం నీ కర్తవ్యము. ధర్మము. కాబట్టి నీవు ఇక్కడే ఉండి నీ ధర్మమును పాటించమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.” అన్నాడు రాముడు.

రాముని మాటలకు కౌసల్య బదులు చెప్పలేక పోయింది. “రామా! నీవు చెప్పినట్టే చేస్తాను.” అని మాత్రం అనగలిగింది. తల్లి మాటలకు రాముడు సంతోషించాడు. “అమ్మా! నా తండ్రి దశరథుడు మహారాజు, మనకందరికీ పూజనీయుడు. మనల నందరినీ ఆజ్ఞాపించగల సమర్థుడు. ఆయన ఆజ్ఞలను పాటించడం మన అందరి కర్తవ్యము. నీవు అలా చూస్తూ ఉండగానే పదునాలుగేళ్ల వనవాసము పూర్తి చేసుకొని వచ్చి నీ కళ్లముందు నిలబడతాను. నీవు ఏమి చెబితే అది చేస్తాను.” అని

అన్నాడు రాముడు. కుమారుని మాటలకు కౌసల్యకు ఒక పక్క దుఃఖము, మరొక పక్క సంతోషమూ కలిగాయి. కాని రాముడు వెళ్లిన తరువాత సవతుల మధ్య తన పరిస్థితి ఏమిటి అని తలచుకొనే సరికి ఆమెకు శరీరం వణికిపోయింది.
“రామా! నీవు లేని అయోధ్యలో నేను ఉండలేను. ఈ సవతులు నన్ను బతుకనీయరు. నన్ను నీ వెంట తీసుకొని పో” అని భోరున ఏడవసాగింది. వ్యవహారం మరలా మొదటికి వచ్చింది అనుకున్నాడు. రాముడు. తల్లి ఏడుపు చూచి రామునికి కూడా దుఃఖము పార్లుకొచ్చింది. తల్లిని ఎలా ఓదార్చాలో ఆమె నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియలేదు రామునికి. ఏమైనా సరే మరలా మరొక సారి చెప్పి చూద్దాము అని అనుకున్నాడు రాముడు. తల్లి కౌసల్యతో ఇలా అన్నాడు.

“అమ్మా! అదేంటమ్మా అలా అంటావు. నీవు అయోధ్యకు పట్టమహిషిని. దశరథునికి పట్టపురాణివి. నిన్ను ఎవరేమంటారు. అందరూ నీ కనుసన్నలలో మెలగవలసిన వారే కదా! పైగా మహారాజు గారు నేవెంటనే ఉంటారు. నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది. రాజు ఉన్నంతకాలము నీవు అనాధవు ఎలా అవుతావు? పైగా నా తరువాత యువరాజు భరతుడు ఉంటాడు. భరతునికి నీవు అంటే పంచప్రాణాలు. పైగా భరతుడు ధర్మనిరతి ఎక్కువగా కలవాడు. ఎవరి మాటా విని అధర్మమునకు తలవంచడు. ఇంక నీకేం భయం. కాబట్టి ఆ భయాలు, అనుమానాలు నీ మనసులో నుండి తొలగించు. వృద్ధుడైన మహారాజును కనిపెట్టుకొని ఉండు.

ఒక భార్యగా అది నీ ధర్మము, కర్తవ్యము. అమ్మా! స్త్రీలు ఎన్ని వ్రతములు, ఉప వాసములు, పుణ్య కార్యములు చేసినను, భర్తను నిర్లక్ష్యము చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రము చెబుతుంది కదా! అలాగే ఏ దేవతలకూ పూజలు చేయకున్నా ఏ వ్రతములు ఆచరించకున్నా కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని కూడా చెబుతారు కదా! భర్తకు అనుకూలవతిగా, ఆయనను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండటం భార్యకు పరమధర్మము అని వేదములు, శాస్త్రములు, శ్రుతులు, స్మృతులలో చెప్పబడింది కదా!

అమ్మా! నీవు అయోధ్యలో ఉండి తండ్రి గారిని సేవించు కుంటూ, నా క్షేమం కోసం వ్రతాలూ, పూజలూ చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటే నేను అరణ్యాలలో ఏ బాధా లేకుండా క్షేమంగా ఉంటానమ్మా! నీవు చేసే పూజలూ, వ్రతాలూ నన్ను సదా ఆపదలనుండి రక్షిస్తూ ఉంటయమ్మా! నీవు ఇలా చేసావనుకో ఈ పదునాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి. నేను ఇక్కడ లేని లోటు నీకు తెలియదు. నేను వచ్చిన తరువాత నీవు ఎలా చెబితే అలా చేస్తాను.” అని తల్లిని బుజ్జగించాడు రాముడు.

కౌసల్య కొడుకు మాటలకు మారు మాటాడలేకపోయింది. కళ్లు తుడుచుకొంది. “రామా! విధి బలీయమయింది. అంతకన్నా నీ నిశ్చయము బలమైంది. దానిని ఎవరూ మార్చలేరు. నీవు అరణ్యములకు క్షేమంగా వెళ్లిరా.

నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నీకు సదా క్షేమము కలుగు గాక! నీవు వచ్చిన తరువాత నా దుఃఖములు అన్నీ తొలగి పోతాయి అనే ఆశతో నీ రాక కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తూ ఉంటాను. కాని రామా! మా అందరి మాటను కాదని నిన్ను అరణ్యము లకు వెళ్లమని ప్రేరేపించు చున్న ఆ దైవము యొక్క లీలలను ఎవరూ అర్థం చేసుకోలేరు.

రామా! నీ పద్నాలుగేళ్ల వనవాసము ఒక్కరోజులో గడిచిపోయి ఈరోజే నీవు వనములనుండి తిరిగి వచ్చే రోజు అయితే ఎంత బాగుంటుంది!’ అని ఆశాభావంతో పలికింది కౌసల్య. తనకు నమస్కరించిన రామునికి సదా మంగళం కలగాలని మనసారా ఆశీర్వదించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది నాల్గవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచవింశః సర్గః (25) >>

Ayodhya Kanda Sarga 42 In Telugu – అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 42 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గ, “దశరథాక్రందః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముడు వనవాసానికి వెళ్లిన దుఃఖంలో ఉండి కన్నీళ్లు కారుస్తాడు. రాముడు తన దగ్గర లేనందుకు, అతను చనిపోయే సమయానికి కూడా తన కుమారుడిని చూడలేనందుకు, దశరథ మహారాజు గాఢమైన వ్యధతో విలపిస్తాడు. ఈ సర్గ దశరథుడి బాధ, అతని ప్రేమ, మరియు రాముడి వలన కలిగిన శూన్యతను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది. ఈ కథనం దశరథ మహారాజు, ఆయన కుమారుడు రాముడి మధ్య ఉన్న అనుబంధం, మరియు విధి పట్ల ఆయన బాధ్యతలను ప్రతిబింబిస్తుంది.

దశరథాక్రందః

యావత్తు నిర్యతస్తస్య రజోరూపమదృశ్యత |
నైవేక్ష్వాకువరస్తావత్సంజహారాత్మచక్షుషీ ||

1

యావద్రాజా ప్రియం పుత్రం పశ్యత్యత్యంతధార్మికమ్ |
తావద్వ్యవర్ధతేవాస్య ధరణ్యాం పుత్రదర్శనే ||

2

న పశ్యతి రజోఽప్యస్య యదా రామస్య భూమిపః |
తదాఽర్తశ్చ విషణ్ణశ్చ పపాత ధరణీతలే ||

3

తస్య దక్షిణమన్వాగాత్కౌసల్యా బాహుమంగనా |
వామం చాస్యాన్వగాత్పార్శ్వం కైకేయీ భరతప్రియా ||

4

తాం నయేన చ సంపన్నో ధర్మేణ వినయేన చ |
ఉవాచ రాజా కైకేయీం సమీక్ష్య వ్యథితేంద్రియః ||

5

కైకేయి మా మమాంగాని స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణీ |
న హి త్వాం ద్రష్టుమిచ్ఛామి న భార్యా న చ బాంధవీ ||

6

యే చ త్వామనుజీవంతి నాహం తేషాం న తే మమ |
కేవలార్థపరాం హి త్వాం త్యక్తధర్మాం త్యజామ్యహమ్ ||

7

అగృహ్ణాం యచ్చ తే పాణిమగ్నిం పర్యణయం చ యత్ |
అనుజానామి తత్సర్వమస్మిన్ లోకే పరత్ర చ ||

8

భరతశ్చేత్ప్రతీతః స్యాద్రాజ్యం ప్రాప్యేదమవ్యయమ్ |
యన్మే స దద్యాత్పిత్రర్థం మామాం తద్దత్తమాగమత్ ||

9

అథ రేణుసముధ్వస్తం తముత్థాప్య నరాధిపమ్ |
న్యవర్తత తదా దేవీ కౌసల్యా శోకకర్శితా ||

10

హత్వేవ బ్రాహ్మణం కామాత్స్పృష్ట్వాఽగ్నిమివ పాణినా |
అన్వతప్యత ధర్మాత్మా పుత్రం సంచింత్య తాపసమ్ ||

11

నివృత్యైవ నివృత్యైవ సీదతో రథవర్త్మసు |
రాజ్ఞో నాతిబభౌ రూపం గ్రస్తస్యాంశుమతో యథా ||

12

విలలాప చ దుఃఖార్తః ప్రియం పుత్రమనుస్మరన్ |
నగరాంతమనుప్రాప్తం బుద్ధ్వా పుత్రమథాబ్రవీత్ ||

13

వాహనానాం చ ముఖ్యానాం వహతాం తం మమాత్మజమ్ |
పదాని పథి దృశ్యంతే స మహాత్మా న దృశ్యతే ||

14

యః సుఖేషూషధానేషు శేతే చందనరూషితః |
వీజ్యమానో మహార్హాభిః స్త్రీభిర్మమ సుతోత్తమః ||

15

స నూనం క్వచిదేవాద్య వృక్షమూలముపాశ్రితః |
కాష్ఠం వా యది వాఽశ్మానముపధాయ శయిష్యతే ||

16

ఉత్థాస్యతి చ మేదిన్యాః కృపణః పాంసుకుంఠితః |
వినిశ్శ్వసన్ప్రస్రవణాత్కరేణూనామివర్షభః ||

17

ద్రక్ష్యంతి నూనం పురుషాః దీర్ఘబాహుం వనేచరాః |
రామముత్థాయ గచ్ఛంతం లోకనాథమనాథవత్ ||

18

సా నూనం జనకస్యేష్టా సుతా సుఖసదోచితా |
కంటకాక్రమణక్రాంతా వనమద్య గమిష్యతి ||

19

అనభిజ్ఞా వనానాం సా నూనం భయముపైష్యతి |
శ్వాపదానర్ధితం శ్రుత్వా గంభీరం రోమహర్షణమ్ ||

20

సకామా భవకైకేయి విధవా రాజ్యమావస |
న హి తం పురుషవ్యాఘ్రం వినా జీవితుముత్సహే ||

21

ఇత్యేవం విలపన్రాజా జనౌఘేనాభిసంవృతః |
అపస్నాత ఇవారిష్టం ప్రవివేశ పురోత్తమమ్ ||

22

శూన్యచత్వరవేశ్మాంతాం సంవృతాపణదేవతామ్ |
క్లాంతదుర్బలదుఃఖార్తాం నాత్యాకీర్ణమహాపథామ్ ||

23

తామవేక్ష్య పురీం సర్వాం రామమేవానుచింతయన్ |
విలపన్ప్రావిశద్రాజా గృహం సూర్య ఇవాంబుదమ్ ||

24

మహాహ్రదమివాక్షోభ్యం సుపర్ణేన హృతోరగమ్ |
రామేణ రహితం వేశ్మ వైదేహ్యా లక్ష్మణేన చ ||

25

అథ గద్గదశబ్దస్తు విలపన్మనుజాధిపః |
ఉవాచ మృదుమందార్థం వచనం దీనమస్వరమ్ ||

26

కౌసల్యాయాం గృహం శీఘ్రం రామమాతుర్నయంతు మామ్ |
న హ్యన్యత్ర మమాశ్వాసో హృదయస్య భవిష్యతి ||

27

ఇతి బ్రువంతం రాజానమనయన్ద్వారదర్శినః |
కౌసల్యాయా గృహం తత్ర న్యవేశ్యత వినీతవత్ ||

28

తతస్తస్య ప్రవిష్టస్య కౌసల్యాయా నివేశనమ్ |
అధిరుహ్యాపి శయనం బభూవ లులితం మనః ||

29

పుత్రద్వయవిహీనం చ స్నుషయాఽపి వివర్జితమ్ |
అపశ్యద్భవనం రాజా నష్టచంద్రమివాంబరమ్ ||

30

తచ్చ దృష్ట్వా మహారాజో భుజముద్యమ్య వీర్యవాన్ |
ఉచ్చైఃస్వరేణ చుక్రోశ హారాఘవ జహాసి మామ్ ||

31

సుఖితా బత తం కాలం జీవిష్యంతి నరోత్తమాః |
పరిష్వజంతో యే రామం ద్రక్ష్యంతి పునరాగతమ్ ||

32

అథ రాత్ర్యాం ప్రపన్నాయాం కాలరాత్ర్యామివాత్మనః |
అర్ధరాత్రే దశరథః కౌసల్యామిదమబ్రవీత్ ||

33

రామం మేఽనుగతా దృష్టిరద్యాపి న నివర్తతే |
న త్వా పశ్యామి కౌసల్యే సాధుమాం పాణినా స్పృశ ||

34

తం రామమేవానువిచింతయంతం
సమీక్ష్య దేవీ శయనే నరేంద్రమ్ |
ఉపోపవిశ్యాధికమార్తరూపా
వినిశ్వసంతీ విలలాప కృచ్ఛ్రమ్ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 42 Meaning In Telugu

రాముని రథము వెళుతున్నంత దూరమూ దశరథుడు అటువేపు చూస్తూనే ఉన్నాడు. రథము పోవు వేగముతో రేగిన ధూళితో రథము కనపడటం లేదు. రామునికి తనకూ దూరము పెరిగిపోతున్నట్టు భావించాడు దశరథుడు. దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. ఇంక రాముడు తనకు కనపడడు అనే భావనను తట్టుకోలేకపోయాడు. అలాగే నేలమీద కూలబడ్డాడు. పక్కనే ఉన్న కౌసల్య, కైక ఆయననుపట్టుకున్నారు.

దశరథుడు కైక వంక దీనంగా చూచాడు. “ఓ కైకా! దయచేసి నన్ను తాకవద్దు. నీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు నాకు భార్యవు కావు, బంధువుకావు. నీవు ఎవరని నన్ను తాకుతున్నావు. నీకే కాదు నీ వారికి కూడా నేను ఏమీ కాను. మీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టావో అదే క్షణంలో నేనూ నిన్ను విడిచిపెట్టాను. నీచేయి పట్టుకొని పాణిగ్రహణము చేసి అగ్నిహోత్రము చుట్టు మూడు ప్రదక్షిణములు చేసిన నాడు ముడివడిన మన బంధము నేటితో తెగిపోయినది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ మన ఇద్దరికీ ఎలాంటి సంబంధము లేదు. నీకూ నీ కుమారుడు భరతునికీ ఈ రాజ్యము కావాలి. తీసుకోండి. నన్ను విడిచిపెట్టండి. నేను చచ్చిపోయిన తరువాత మీరు నాకు జలతర్పణము విడవడానికి కూడా నేను అంగీకరించను. మీరు నా శవాన్ని కూడా తాకడానికి నేను అనుమతించను.” అని అన్నాడు దశరథుడు.

చేసేది లేక కైక ఆయనను విడిచిపెట్టింది. కౌసల్య దశరథుని పట్టుకొని లేవనెత్తి ఆయన రథములో కూర్చోపెట్టింది. తరువాత తన అంత:పురమునకు వెళ్లిపోయింది. దశరథుడు రాముని తల్చుకుంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు. బ్రహ్మహత్యాపాతకము చేసిన వాడి మాదిరి భయంతో వణికిపోతున్నాడు. ఇంతలో వార్తాహరులువచ్చి రాముడు అయోధ్యను దాటి వెళ్లిపోయాడు అని చెప్పారు.

“అవును. రాముడు వెళ్లిపోయాడు. రాముడు వెళ్లిన రథచక్రముల జాడలు, రథమునకు కట్టిన గుర్రముల గిట్టల గుర్తులు మాత్రము అయోధ్యలో కనపడుతున్నాయి. రాముని జాడ మాత్రం కనపడటం లేదు. ప్రతిరోజూ చందనము పూసుకొని హంసతూలికా తల్పము మీద నిద్రించే రాముడు ఈ రోజు ఒళ్లంతా మట్టికొట్టుకొని ఉండగా, కటిక నేల మీద నిద్రిస్తాడు కాబోలు. మెత్తని తలగడ లేకుండా నిద్రించని రాముడు కటిక పాషాణమును తల కిందపెట్టుకొని నిద్రిస్తాడేమో! అయోధ్యలో స్నేహితులు, వందిమాగధులు వెంట రాగా
విహరించిన రాముడు రేపటి నుండి మునికుమారులు వెంట రాగా అడవులలో విహరిస్తాడేమో! మెత్తటి తివాచీల మీద నడిస్తేనే కంది పోయే సీత పాదాలు, రేపటి నుండి కటిక రాళ్ల మీద నడవాలి కాబోలు. క్రూరమృగములు అంటేనే భయపడే సీత రేపటినుండి ఆ క్రూర మృగముల భయంకరమైన అరుపులు వింటుందేమో!” అని తనలో తాను అనుకుంటున్నాడు దశరథుడు.

ఇంతలో కైక గుర్తుకు వచ్చింది.

“ఓకైకా! నీ కోరిక తీరిందా! నీకళ్లు చల్లబడ్డాయా! ఇంక నీ ఇష్టం. నీకు మొగుడు లేడు. నీవు విధవరాలవు. రాముడు లేని ఈ లోకంలో నేను ఉండను. నీవే ఈరాజ్యాన్ని పాలించుకో.”అని అరుస్తున్నాడు.

ఈ విధంగా దశరథుడు రాముని కోసరం శోకిస్తున్నాడు. వెనకకు తిరిగి పాడుబడినట్టు ఉన్న అయోధ్యలో ప్రవేశించాడు. అటు ఇటు చూస్తూ వెళుతున్నాడు. అయోధ్యలో ఏ ఇంటి ద్వారము తెరవ బడలేదు. ఏ ఇంటి ముందరా జనం లేరు. దేవాలయాలు, అంగళ్లు, అన్నీ మూసి ఉన్నాయి. రహదారుల మీద జనసంచారము లేదు. అటువంటి అయోధ్య వీధులగుండా దశరథుడు తన అంతఃపురము చేరుకున్నాడు.

ఆరోజు దాకా రాముని మాటలతో రాముని ఆటపాటలతో సందడిగా ఉన్న అంతఃపురము నిశ్శబ్దముగా ఉంది. నిర్మానుష్యమైన ఆ అంత:పురములో ఉండలేకపోయూడు దశరథుడు. “నేను ఇక్కడ ఉండలేను. నన్ను వెంటనే కౌసల్యమందిరమునకు తీసుకొని వెళ్లండి.” అని ఆదేశించాడు. వెంటనే పరిచారికలు దశరథుని కౌసల్య మందిరము నకు తీసుకొని వెళ్లారు. కౌసల్య మందిరములో దశరథుడు ఒక శయ్యమీద పడుకొన్నాడు.

కొడుకులు కోడళ్లు లేని ఆ గృహము దశరథునికి చంద్రుడులేని ఆకాశము మాదిరి అనిపించింది. ఉన్నట్టుండి దశరథుడు ఉ లిక్కిపడుతున్నాడు. ఏడుస్తున్నాడు. “రామా నన్ను విడిచి వెళ్లిపోయావా” అని అరుస్తున్నాడు. “పద్నాలుగేళ్ల వనవాసము ముగించుకొని నా రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినపుడు, ఈ అయోధ్యా పౌరులం దరూ రామునికి ఘనస్వాగతము ఇస్తారు. అప్పటికి నేను ఉండను కదా! ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు కదా!” అని వాపోతున్నాడు. దశరథుడు.

రాత్రి అయింది. దశరథుడు భోజనము చేయలేదు. నిద్రపోలేదు. అర్థరాత్రి కౌసల్యను పిలిచాడు. “కౌసల్యా! నాకుకళ్లు కనిపించడం లేదు. నా దృష్టి రామునితో పాటు వెళ్లిపోయింది. రాముని చూచిన కళ్లతో నేను దేనినీ చూడలేను. నన్ను తాకు. నిన్ను గుర్తుపడతాను.” అని అన్నాడు దశరథుడు.

భర్తమాటలకు కౌసల్యకు దుఃఖము ముంచుకొచ్చింది. దశరథుని చేతి మీద తన చెయ్యివేసి నిమురుతూ ఆయన పక్కనే కూర్చుంది కౌసల్య.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిరెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిచత్వారింశః సర్గః (43) >>