మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు విశ్వనాథాష్టకమ్గురించి తెలుసుకుందాం…
అనుగ్రహించుటలో ఇతనికితడే సాటి. లోకాలన్నీ ఈయనలోనే వున్నాయి కనుక ఇతనికి మరొకరు సరియెట్లగుదురు? అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈయన కోపగించిన అన్యదేవతల అనుగ్రహంకంటే నయమే; ఈయనకు నిందకూడా పరదేవతల మంత్రపఠనకన్నామేలు చేస్తుంది; ఈయన శరణాగతి బ్రహ్మపట్టముకంటే బలమైనది. ఈ నా మాటలు నోటిమూటలు కావు సాక్ష్యంకూడా వున్నది. నరకాసురుడు, శిశుపాలుడు, ధ్రువుడు… వీళ్ళంతా సాక్షులే అని తన వాదనను వినిపిస్తున్నారు. అన్నమయ్య వైష్ణవ పక్షపాతి అనిపించినా ఆయనవాదన అమోఘం. హరి మురిసెడి కీర్తనములు అమ్మకు చెల్లా!!
భావ వివరణ:
ఓ భక్తులారా! ఇతనికితడే సాటి. ఇతరులు ఈతని సరియౌదురా? పరిమితిలేని లోకములన్నియును ఇతని మేనిలోనివే (దేహంలో వున్నాయి) కావా? (వున్నవి కదా! అని అర్థం)
ఆ పద్మనాభుని భయంకరమైన కోపముతో, అన్యదేవతల వరదానములకంటే మంగళమే జరుగుతుంది. వారి వరములు ఈయన ఆగ్రహంతో సమానం కాదు. ఎందుకంటే నరకాసురుడి విషయంలో యేం జరిగిందో చూడండి. తమితో (ఆసక్తితో) శ్రీకృష్ణుడు నరకుని తల తెగనరికినా ఆయన వరప్రభావముచే నరకచతుర్దశి ఒక పండుగై జత్ప్రసిద్ధమైనది. కాబట్టి ఈ శ్రీహరి అమరిన ఆగ్రహమే గొప్ప మేలు చేస్తుంది.
కరివరదుడు (గజేంద్రరక్షకుడు) అయిన శ్రీహరి పేరుతో జతకలిసిన వారినిందలే మనకు అధికమైన మేలు కలుగజేస్తాయి. పరదేవతల మంత్ర పఠనం హరినింద చేసే పాటి మేలు కూడా చేయదు. నిరతి (విశేషంగా) శిశుపాలుడు శ్రీకృష్ణుని తిట్టీ తిట్టీ చివరికి మేలే పొందాడు కదా! శిశుపాలుని శిరస్సు సుదర్శన చక్రంతో తెగిక్రిందపడ్డా వాడికి హరిద్వార – పాలకపదవీ వైకుంఠ ప్రాప్తి దక్కాయి కదా!
చలిమి (చల్లని) శ్రీవేంకటేశ్వరుని శరణాగతితో, మించిన (శ్రేష్ఠమైన) బ్రహ్మపట్టము (బ్రహ్మపదవి) కూడా సరిపోదు. ఒలిసిన ధ్రువునకు (తనకు కావలసిన ధ్రువునకు) శ్రీహరి ఉన్నత లోకాలిచ్చాడు. ఎందుకంటే బ్రహ్మలోకముపైనున్న ధ్రువమండలాన్ని స్థిరలోకంగా తన భక్తునికిచ్చాడు ఆ నారాయణుడు. నేటికీ పలువురికి మార్గదర్శకమయ్యాడు ఆ చిన్నారి బాలుడు.
నారాయణుడు అంటే నరశరీరమును పొందు భగవంతుడు అని అర్థం. ఈయన పేరు నారాయణుడు కాని ఈయన చేతలు మాత్రం బెంబాడి చేతలు. బెంబేలెత్తిపోయే పనులు చేస్తాడట ఆయన. ఆ నున్నని సుద్దులు నోరుమూసుకుంటే మాయమైపోవు. యుగయుగాలుగా అవి ప్రచారమవుతూనే వుంటాయి. భారతం వ్రాసిన వేసులు (వ్యాసులవారు), భాగవతం చెప్పిన శుకుడు, రామాయణ కావ్యకర్త వాల్మీకి, వాటిని అంతకుముందె గానంచేసి నారదుడు శ్రీహరి లీలలు పొగిడారు. సప్తఋషులు కూడా తిరుమలలో ఆయనను సేవిస్తూనేవున్నారుకదా! నీకథలు యెన్నని చెప్పగలము యెంతని చెప్పగలం, అంటున్నారు అన్నమాచార్యులవారు.
భావ వివరణ:
ఓదేవదేవా! నీపేరు నారాయణుడు. అంటే నరరూపం ధరించినవాడవు. కాని నీ చేతలు (పనులు) బెంబాడి చేతలు. (బెంబేలెత్తించే పనులు). నున్నని నీ సుద్దులు (మనోహరమైన నీ కథలు) నోరుమూసుకున్నన్ పోదు (ఇంకొకరికి చెప్పనంతమాత్రాన తెలియకుండాపోవు). ఎందుకంటే యుగానికి ఒకడు పుట్టి వాటిని ప్రచారం చేస్తూనే వుంటాడు.
ద్వాపరయుగంలో వేసులు (వేదవ్యాసులవారు) పుట్టి మాకు వినుటకు భారతగాధను చెప్పినారు. నీవు పాలు వెన్న దొంగిలించటం, మోసంతో యుద్ధంలో పాండవులకు సాయం చేయటం మొదలైన కథలన్నీ చదివాం. రాసికెక్క (ప్రసిద్ధుడైన) శుకమహర్షి రవ్వగా (నాణ్యమైన విధమున) ఆసల (వ్యామోహంతో) నీవు పరకాంతలనంటిన సుద్దులు (పరాయిస్త్రీల పొందునాసించితివని కథలు కథలుగా) బొగడ జొచ్చె (కీర్తించాడు). అదే భాగవతమై జగత్ప్రసిద్ధమైనది.
త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి సంతగా (వల్లెవేసినట్లు) నీవు రామచంద్రునిగా తాటక మొదలైన రాక్షసులను జంపినదెల్లా రామాయణములో రంతున (పెద్దగా ధ్వనించునట్లు) చెప్పినాడు. (అంతకు ముందే (కృతయుగారంభంలోనే) నారదుడు బ్రహ్మమానసపుత్రుడై అవతరించి దండె మీటి (మహతి అనే తన వీణను మీటుతూ) నీవు వేటాడి జీవహింస (దుష్టసంహారం) చేస్తావని, యింతటా (ఈలోకమంతా) చాటినాడు.
అసలు వేదకాలంలోనే అజుడు (బ్రహ్మ) వేదమువలె నీవు మీనై కొన్నాళ్ళుండితివంటా మత్స్యపురాణంలో నీ చేతలన్నీ వోడక (వదలక) కీర్తించాడు. తోడనే (దానితోపాటే) తొల్లియును (అనాదిగా) సప్తఋషులు, యీడనే ఈ తిరుమల శిఖరాలమీద, ఈ శ్రీవేంకటాద్రిపై ఇరవైతివని (నెలకొంటివని) అనుచూ అదె (ఆ మాటనే) చెప్పిరి. మరి ఈ నాటికీ మేము తెల్లవారింది మొదలు నీపై పాడుతున్నామంటే… అది వారందరి చలువవల్లనే తండ్రీ!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.
సాయిబాబా పూజా విధానం
పూజా విధానము
శ్రీ మహా గణాపతయే నమః, శ్రీగురుభ్యోనమః, అపవిత్రః పవిత్రోవా సర్వావస్థామ్ గతోపివా. యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష (నీరు శిరస్సున చల్లుకొనవలెను.)
ఆచమనము
ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. (ప్రతిసారి ఉద్ధరిణతో నీరు తీసుకొని త్రాగవలెను. నమస్కారము చేస్తూ ఈ క్రింది విధంగా చదవండి.)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్ట మైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అష్టైశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతారు. ముత్తయిదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈవ్రతం ఆచరించడంవలన తమ కోరికలు నెరవేరతాయని స్త్రీలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత కథ మీకోసం…
వ్రత పూర్వ వృత్తాంతం
శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్నే వరలక్ష్మీ వ్రతమని అంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడారు.ఆ ఆటలో పార్వతి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు. ఇరువురి వాదనలూ విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పాడు. దానితో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్టు రోగం ప్రాప్తించేటట్లు శపించింది… చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. వరలక్ష్మీ వ్రతమును శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే నీ రోగం పోతుందని పార్వతీదేవి శాపవిమోచనం తెలియజేసింది. చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతమును ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మీ వ్రతమును పార్వతీదేవి కూడా ఆచరించగా కుమార స్వామి జన్మించాడు. నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతమును చేసి రాజ్యాలను పొందారని చెబుతారు. ఇది స్థూలంగా వరలక్ష్మీ వ్రతం పూర్వ చరిత్ర.
శ్రీ వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభం
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మునులరా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి” అని అడిగింది. అందుకా త్రినేత్రుడు “దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలి.” అని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి “దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. “కాత్యాయనీ! పూర్వకాలంలో మగధ దేశంలో విష్ణుకుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆపట్టణంలో చారుమతి అనే ఒక బ్రహ్మణ స్త్రీ ఉండేది. అమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాత: కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాత:కాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.
వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో చారుమతికి కలలో సాక్షాత్కారించింది. “ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు ఇస్తానని” చెప్పి అంతర్థానమైంది. చారుమతి చాలా సంతోషించింది. “హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నలను పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది.” అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహనికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపం పై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో “సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకన్నారు. (శక్తి కొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.
ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును జేయవచ్చును. అట్లు చేసినచో సర్వసౌభాగ్యములును కలిగి సుఖముగానుందురు. ఈ కథను వినువారలకు, చదువువారలకు వరలక్ష్మీ వ్రత ప్రసాదము వలన సకల సుఖములు
కలుగును.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు అచ్యుతాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…
Sri Raghavendra Ashtottara Shathanamavali In Telugu Lyrics
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చిరంజీవులు నీతికథ.
చిరంజీవులు
(అరణ్యపర్వంలో మార్కండేయుడు చెప్పిన కథ యిది)
పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కం డేయ ముని దర్శనభాగ్యం లభించింది.
ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించారు. కుశల ప్రశ్నలు సాగి నవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన క్లేశాలకు ఆయన కొంత సేపు విచారించి, యింతకంటే దుఃఖాల పాలయిన శ్రీరామచంద్రుల కథ, నలదమయంతుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించాడు.
అలా వారికి ఏవేవో పురాతన రాజవంశాల గాథలూ, మహర్షుల విశేషాలూ చెపుతున్నాడు.
ఒకనాడు ధర్మరాజు వినయంగా, చేతులు జోడించి
‘మహర్షీ ! నా కొక ప్రశ్న వచ్చింది’ అని అడగడానికి సంకో చించాడు. మార్కండియుడు చిరునవ్వు నవ్వి
‘తెలియని విషయాలు తెలుసుకోవడం దోషం కాదు నాయనా! నీ సందేహం ఏమిటి, అడుగు’ అన్నాడు.
‘మహామునీ। మాకు తెలిసినంత వరకూ మీరే చిరంజీవులు, మీరు కాక మరెవరయినా చిరంజీవులున్నారా’ అని అడిగాడు.
మార్కండేయ ముని చిరునవ్వుతో, తన తెల్లని వండు గడ్డం నవ రించి, ‘ధర్మనందనా ! మంచి ప్రశ్న అడిగావు. తప్పకుండా తెలుసుకో దగ్గది. సావధానంగా విము
ప్రాచీన కాలంలో ఇంద్రద్యుమ్నుడనే పేరుగల మహారాజు ఉండే వాడు. ఆయన ఎన్నెన్నో దానాలు చేశాడు. ప్రపంచంలో అంతటి ధర్మ పురుషుడు లేడని ఖ్యాతి పొందాడు. రాజర్షిగా పేరుపొంది ప్రజలందరి మన్ననలూ పొందిన ఆ పుణ్య పురుషుడు కాలం చెల్లగానే స్వర్గం చేరాడు.
అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పటికి ఆ మహారాజు పుణ్య కర్మలతో సాధించుకున్న ఫలం పూర్తిగా అయిపోయిందని క్రిందికి పంపేశారు.
భూలోకానికి వస్తుండగా నేను కనిపించాను. కనిపించగానే నన్ను చూచి: ‘మహర్షీ ! మీరు పన్ను ఎరుగుదురా?’ అని అడిగాడు.
అప్పటికి నేను చిరకాలంగా తీర్థయాత్రలతో, పుణ్యకర్మలతో, ఉప వాస వ్రతంతో కృశించి ఉన్నాను. అందుచేత ‘నాకు గుర్తులేదయ్యా’ అన్నాను.
‘స్వామీ! మీకంటె ముందు పుట్టిన ప్రాణి ఏదయినా జీవించి ఉన్నదా ?’ అని అడిగాడు.
‘ హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావారకరం అనే పేరు గల గుడ్లగూబ ఉంది అది నా కంటే పెద్దది. కొంచెం శ్రమ పడితే దానిని చూడగలవు, ‘ అన్నాను.
ఇంద్రద్యుమ్నుడు నన్ను వెంటబెట్టుకుని హిమాలయానికి వచ్చి ఆ గుడ్ల గూబను చేరి: ‘నువ్వు నన్ను ఎరుగుదువా?’ అన్నాడు. తెలి యదని తల ఊపింది, ఆ పక్షి. ‘అయితే నీ కంటే ముందు పుట్టిన వారిని ఎవరినయినా ఎరుగుదువా?’ అని అడిగాడు.
‘అయ్యా! ఇక్కడకు యోజనాల దూరంలో ఒక సరోవరం ఉంది. దానిని ఇంద్రద్యుమ్న సరోవరం అని పిలుస్తారు. ఆ కొలనులో వాడీ జంఘమనే పేరు గల కొంగ ఉంటుంది. అది నాకంటే పెద్దది, ‘ అంది.
ముగ్గురూ కలిసి ఆ చెరువు దగ్గరకు చేరారు. ఆ మహారాజు మామూలు ప్రశ్న అడిగాడు. అప్పుడా కొంగః
‘ ఈ కొలనులోనే ఆకూపారం అనే పేరు గల తాబేలు ఉంది, అది నాకంటె ముందు పుట్టింది’, అని జవా బిచ్చింది.
ఆకూపారాన్ని పిలిచి యిదే ప్రశ్న వేయగా, అది కన్నీరు విడుస్తూ:
‘అయ్యా ! ఆయన వెయ్యి మారులు యజ్ఞం చేసి వెయ్యి యూవ స్తంభాలు వేయించాడు. ఆయన దానం చేసిన గోపుల రాకపోకలతో భూమి దిగబడి యింత సరోవరం అయింది. ఇది ఆయన చలవ”, అంది.
ఆ క్షణంలో దేవతలు ఆయనను స్వర్గం తీసుకు వెళ్ళారు. అంటే మన కీర్తి భూలోకంలో ఉన్నంత కాలం మనం స్వర్గంలో ఉంకాం.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు మహాలక్ష్మ్యష్టకమ్ గురించి తెలుసుకుందాం…
తే॥ ఓ మహామాయ రూపిణీ! నమసుమములు
నీవు శ్రీపీఠ వాసివి దేవవినుత
శంఖ చక్ర గదా హస్త! జనని! జేతు
వందనం మహాలక్ష్మిశ్రీవనితకిపుడు
తా॥ ఓ మహామాయా స్వరూపిణి నీకు నమస్కారము. నీవు శ్రీపీఠ నివాసినివి. దేవతలందరిచే కొని యాడబడి పూజించబడు దానవు. ఓ శంఖ చక్ర గదాధరీ తల్లీ! మహాలక్ష్మీ నీకు వందన మొనరించెదను.
శ్లో॥ 2
నమస్తే గరుడా రూఢీ, డోలాసుర భయంకరి।
సర్వ పాపహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥
తా॥ గరుత్మంతుని అధిరోహించు తల్లికి వందనము చేతును. నీవలన డోలాసురునికి భయము కలిగినది. నీవలన అన్ని పాపములు నశించును. తల్లీ! మహాలక్ష్మీ నీకు వందనమొనరించెదను.
శ్లో॥ 3
సర్వజ్ఞే సర్వవరదే, సర్వ దుష్ట భయంకరీ
సర్వ దుఃఖహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥
తే॥ సర్వమును దెలిసిన తల్లి సర్వ వరద
సర్వ దుష్ట భయంకరి జనని నీవె
సర్వ దుఃఖముల్ బాపెద వుర్వియందు
వందనం మహాలక్ష్మి శ్రీవనితకిపుడు
తా॥ సర్వము తెలిసిన ఓ తల్లీ నీవు అందరినీ అనుగ్రహించుదానవు. దుర్మార్గులందరికీ నీవు
భయంకరివి. ఈలోకంలో దుఃఖములన్నీ తొలగించు దానవు. ఓ మహాలక్ష్మీ నీకు ఇదే నమస్కరించు చున్నాను.
తా॥ సిద్ధిబుద్ధులను కలుగజేయు దేవి తిండి మోక్షములన ఈ లక్ష్మి పూనుకుని అందించును. ఈ తల్లి మంత్రములకు అధిష్ఠానదేవత ఓ మహాలక్ష్మి నీకు ఇపుడు నమస్కరించు చున్నాను.
తే॥ ఆది అంతముల్ లేనిదా ఆదిశక్తి
యోగ మెరిగిన దాయమ్మ యోగలభ్య
ఈమె విష్ణుప్రియయును మహేశ్వరీమె
వందనం మహాలక్ష్మిశ్రీవనితకిపుడు
తా॥ ఆ ఆదిశక్తికి ఆదియు అంత్యములు లేవు. యోగముచే లభించు ఆ దేవి యోగ విద్య నెరిగిన తల్లి. ఈమె శ్రీమహావిష్ణువుకు ప్రియురాలు మహేశ్వరి. ఆ మహాలక్ష్మికి ఇదే నమస్కరించు చున్నాను.
Mahalakshmi Ashtakam Telugu
శ్లో॥ 6
స్థూల సూక్ష్మ, మహారౌద్రే, మహాశక్తే మహోదరే।
మహాపాపహరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే॥
తే॥ పఠనమొకసారి నిత్యము పాపముక్తి
రెండుసార్లైన ధనధాన్య ‘మెండు’ కలుగ
మూడు మారుల శత్రుల ముప్పు దొలగు
శ్రీమహాలక్ష్మి సర్వదా చేయు శుభము
తా॥ ఈ అష్టకము ఒకసారి పఠించిన ప్రతిదినమూ పాప విముక్తి కలుగును. రెండు పర్యాయములైనచొ సమృద్ధిగా ధనధాన్య లాభము, మూడు మారులకు శత్రుభయనాశనము చేసి శ్రీమహాలక్ష్మి సర్వదా శుభములిచ్చుగాక.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కణికనీతితో కార్యాలు సాధించాలి నీతికథ.
కణికనీతితో కార్యాలు సాధించాలి
( ఈ కథ ఆదిపర్వం కోసేది )
హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు ముగ్గురు మంత్రులున్నారు.
అందులో ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు, ధర్మ పరుడు, నీతికోవిదుడు.రెండవవాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వ హిస్తూ, నిరంతరం ధృతరాష్ట్రుని అంతరంగిక సలహాదారుగా ఉంటాడు.
మూడవ వాడు కణికుడు. ఈ కణికుడు కూటనీతి కుశలుడు. అంటే !
మోసంతో కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల నీతిపరుడైనా కణికుడు తన మహారాజుకి చెప్పిన కథ మీరు చదవబోతున్నారు.
మహారాజా !
అనగా అనగా ఓ మహారణ్యం.
ఆ అడవిలో ఎన్నో క్రూరమృగాలు, యథేచ్ఛగా విహరిస్తు న్నాయి. అక్కడ ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది. తన పనులన్నీ ఇతరులచేత చేయించుకుని, పని పూర్తికాగానే వాటిని మోసంచేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూండేది. ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు. పులి, తోడేలు, ముంగిప, ఎలుక. వీటితో కలిసి మెలిసి ఉన్నట్టు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నారు.
ఆరోజులలో ఒకనాడు – .
పిక్కబలీసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటబడింది. ఆ లేడి ఈ మిత్రబృందాన్ని దూరంనుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. నిను కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా, దాన్ని పట్టడం సాధ్యం కావడంలేదు. బాగా ఆలోచించింది నక్క. మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని:
” స్నేహితులారా ! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యంకాదు. ఇప్పుడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంతరుచిగా ఉంటుందో చూపించింది.
అన్నిటికీ నోరూరింది.
“ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతు రతతో అటేచూస్తూ.
అది కొంతసేపు ఆలోచన అభినయించింది.
“ఆ ఇప్పుడు ఆలోచన వచ్చింది.”
” జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. ఈ లేడి మెలకు వగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలకబావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అద నులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే అంది.
దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.
అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతు లేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళుజాపి నిద్రపోతున్నది లేడి. నక్క పలహా ప్రకారం అలికిడి కాకుండా ఎంకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతూండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతోపాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.
అప్పుడా నక్క:
“స్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందు చేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది.
అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.
అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని.
నక్క బొటబొటా కన్నీప కారుస్తూంటే చూసిన పులి :
“బావా ! ఎందుకు విచారిస్తున్నావు? అంది.
“ఏం చెప్పను పులిబావా : ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో
తెలుసా ? ‘పులి ఎంత పెద్ద జంతువైతే ఏం లాభం. నేను కాళ్ళు కొరి కితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గులేకుండా,’ అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలి గింది, అంటూ నక్క కన్నీరు విడిచింది.
పులికి పౌరుషం వచ్చింది.
“మిత్రమా! ఎఇక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను. ” అంటూ వెళ్లిపోయింది.
అంతలో ఎలక రాగా –
విన్నావా, ఎలకబావా ! ఈ లేడిని పులి ముట్టుకుంది కనక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎంకము తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది. అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.
మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా! పులిబావకు నీ మీద కోపంవచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట”, అనడంతో తోడేలు దౌడు తీసింది.
అప్పుడు ముంగిస రాగా, చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్ని చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను” అనగా అది తోక ముడిచి పారిపోయింది. హాయిగా ఆ లేడిమాంసం ఆరగించింది నక్క. విన్నారా ! మహారాజా ! తెలివితో వంచనతో మనకార్యాలు చక్క బెట్టుకోవాలి అన్నాడు కణికుడు. ఇదే కణిక నీతి.