Sri Shiva Aparadha Kshamapana Stotram In Telugu – శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్

Sri Shiva Aparadha Kshamapana Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Aparadha Kshamapana Stotram Telugu

శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్

ఆదౌ కర్మప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రా మేధ్యమధ్యే క్వథయతినితరాం జాఠరో జాతవేదాః,
యద్యద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరాం శక్యతే కేన వక్తుం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

బాల్యే దుఃఖాతిరేకాన్మలలు ళితవపుః స్తన్యపానే పిపాసా
నోశక్య శ్చేంద్రియేభ్యో భవగుణజనితా జంతవో మాం తుదంతి,
నానారోగాతి దుఃఖా ద్దురిత పరవశ శ్శంకరం న స్మరామి
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

ప్రౌఢా హం యౌవనస్థో విషయవిషధరై: పంచభిర్మర్మసంధౌః
దష్టో నష్టో వివేక స్సుత ధనయువతి స్వాదుసౌఖ్యే నిషణ్ణః,
శైవీచింతావిహీనో మమ హృదయమహామానగర్వాధిరూఢం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

వార్ధక్యే చేంద్రియాణాం విగత గతిమతి శ్చాధి దైవాది తాపైః
పాపైరోగైర్వియోగైస్వన వసివపుః ప్రౌఢి హీనం చ దీనమ్,
మిథ్యామోహాభిలాషై ర్థమతి మమ మనో ధూర్జటే ర్ధ్వాన శూన్యం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనప్రత్యవాయాకులాఖ్యం
శ్రాతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గే సుసారే,
నాస్థాధర్మే విచారః శ్రవణమను నయోః కిం నిదిధ్యాసితవ్యం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం
పూజార్థం వా కదాచిద్భహుతరగహనాత్ ఖండబిల్వీదళాని,
నానీతా పద్మమాలా సరసివి కసితా గందపుప్పే త్వదర్థం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

దుగైర్మధ్వాజ్యయుక్తేర్థధిసిత సహితైః స్నాపితం నైవ లింగం
నోలిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః.
ధూపైః కర్పూర దీపైర్వివిధరసయుతైరైవ భక్ష్యోపహారై:
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యై ధృతవహవదనే నార్పితం బీజమంత్రైః
నోతప్తం గాంగతీరే వ్రతజప నియమై రుద్రజాప్యైర్ష వేదైః
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుండలే సూక్ష్మమార్గే
శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే జ్యోతిరూపే సరాఖ్యే,
లింగజ్ఞే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

నగ్నో నిస్సంగ శుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రే న్యస్తదృష్టిర్విదిత భవగుణో నైవ దృష్టః కదాచిత్,
ఉన్మత్తావస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే
సరైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థవైశ్వానరే,
దంతత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్తవృత్తి మఖిలామన్వైస్తు కిం కర్మభిః.

కిం వానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకళత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్,
జ్ఞా త్వైతత్ క్షణభంగురం సపది రేత్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభమ్.

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః,
లక్ష్మీ స్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం శరణద త్వం రక్షరక్షాధునా.

ఇతి శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రం సంపూర్ణమ్

మరిన్ని స్తోత్రములు

Sri Mahalakshmi Vaibhavam In Telugu – శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము

Sri Mahalakshmi Vaibhavam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం… ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి భారతీయ హిందూ సామ్రాజ్యాలులో పూజించబడును ఉన్న ప్రధాన దేవి. ఆమె ధన, సమృద్ధి, ఆరోగ్య, ధర్మ, కీర్తి, ప్రేమ, ఆశీర్వాద మరియు సౌందర్యమును సూచించేవారు. మహాలక్ష్మీదేవి విష్ణువుని పత్ని మరియు ఐశ్వర్యము, ధనము, లక్ష్మీ రూపముగా ఉన్నారు. ఆమెను పరమేశ్వరుడు మరియు విష్ణువు చేత ప్రేమపూర్వకముగా పూజించబడుతారు.

శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము

శ్లో ॥ లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం||

శ్లో ॥ జయతు జయతు లక్ష్మీర్దేవ సంఘాభిపూజ్యా
జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా
జయతు జయతు నిత్యానిర్మల జ్ఞానవేద్యా
జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా |

చరాచర సృష్టిలోని సకల జీవావళికి తల్లి ఆ జగన్మాత లక్ష్మీదేవి. కంటికి రెప్పలా ఆ తల్లి మనలంనదరినీ రక్షిస్తూ వుండటం వల్లనే మనం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఈ భువిలో జీవించ గలుగుతున్నాము. సకల శుభాలూ, సంపదలూ, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ అలౌకిక ఆనందదాయిని, పరతత్వ సంధాయిని, మోక్షప్రదాయిని కూడా అయిన ఆ తల్లిని సమస్త దేవతాగణం సదా సేవిస్తూ వుంటారు. ఆ తల్లి నిత్య సత్యస్వరూపిణి. శాశ్వతమైన, నిజమైన ఆనందం ఆ మాతఅనుగ్రహంవల్లనే లభిస్తుంది. నిజానికి మనమందరం ఆ తల్లి ప్రతిరూపాలమే. అందరి హృదయాలలోను ఆమెనివాసమై వుంటుంది. ఆ విషయం తెలుసు కోవడమే నిజమైనజ్ఞానం. ఆజ్ఞానం కూడా ఆతల్లిని సేవించటంవల్లనే లభిస్తుంది.

యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

జీవులందరిలోనూ చైతన్యశక్తి రూపంగా ఆ విశ్వమాత నెలకొని వుంటుంది. అన్ని రకాల శక్తులూ ఆ తల్లి కరుణ వల్లనే లభిస్తాయి. బ్రహ్మరుద్ర ఇంద్రాదులచే సేవించబడే ఆ మాత స్థితికారకుడైన శ్రీమహావిష్ణువుకు ఇల్లాలు. మహాలక్ష్మైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్” అన్నారు. స్థితికారకుడైన విష్ణుమూర్తి సాత్వికమూర్తి. స్థితి నిర్వాహణ బాధ్యతలో ఆ శ్రీమన్నారాయణమూర్తికి చేదోడు వాదోడుగా తన వంతు పాత్రని ఎంతో సమర్థవంతంగా పోషిస్తుంది విష్ణుపత్ని అయిన శ్రీమహాలక్ష్మీదేవి. దుష్టశిక్షణ చేసి సజ్జనులను రక్షించి ధర్మసంస్థాపన చేయటం కోసం, ఆ జగత్పిత శ్రీమహావిష్ణువు ఏకంగా వివిధ రూప విశేషాలతో అవతారాలను దాల్చటం జరిగిందో, అదే విధంగా జగన్మాత లక్ష్మీదేవి కూడా లోక కళ్యాణానికై అష్టలక్ష్మీ రూప ధారణ చేసింది. ఆ తల్లి ఆ అవతారాలన్నీ తన పిల్లలమైన మన అభ్యున్నతి కోసమే దాల్చింది.

శ్రీ అనే పదం ద్వారా లక్ష్మీదేవి వేదాలలో సంపద, ఐశ్వర్యము, శక్తి, శుభం అనే అర్థాలలో గుర్తించబడింది. విష్ణుపురాణం ద్వారా లక్ష్మీదేవి పుట్టు పూర్వోత్తరాలు, బ్రహ్మవైవర్త, మార్కండేయ పురాణాల ద్వారా లక్ష్మీదేవి ప్రశస్తి, ఆమె నివాస స్థానాలు గురించి వివరంగా తెలుస్తోంది. వేదాంగాలలో ముఖ్యమైనది అయిన శతపథ బ్రాహ్మణంలో లక్ష్మి అందానికి అధిష్ఠానదేవతగా చెప్పటం జరిగింది.

శ్లో ॥ యాసా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయసాక్షి
గంభీరావర్త నాభిః స్తనభరనిమితా శుభ్రవస్త్రోత్తరీయా
లక్ష్మీర్తివైర్గజేంద్రః మణిగణఖచితై స్నాపితా హేమకుంభై:
నిత్యం సాపద్మహస్తామమవసతుగృహేసర్వమాంగళ్యయుక్తా!॥

నిత్యం ఆ లక్ష్మీదేవి ఆరాధన జరిగే వారి గృహంలో సమస్త శుభాలూ నెలకొని వుంటాయి. ఋగ్వేదంలోని శ్రీసూక్తంలో లక్ష్మీదేవి దివ్యమైన గజేంద్రాలు (ఏనుగులు) యిరువైపులా సేవిస్తూ వుండగా మహా పద్మంలో పద్మాసన భంగిమలో కూర్చుని వుంటుంది అని వర్ణించబడింది. ఆ గజేంద్రాలు బంగారు కలశాలతో ఆ తల్లిపై అమృతవర్షం కురిపిస్తూ వుంటాయి. లోక వ్యవహారాలలో “లక్ష్మి” అనే పదం మన నిత్య జీవితంతో పెనవేసుకు పోయిన ఒక మహత్తరమైన ప్రజ్ఞావిశేషం. గృహానికి శోభనిచ్చే ఇల్లాలుని గృహలక్ష్మిగా సంభావిస్తూ వుంటాం. అదృష్టవంతుడైన ఒక వ్యక్తిని గూర్చి చెప్పాలంటే వాడికేమిరా లక్ష్మీ పుత్రుడు అంటాం. అలాగే ఒక అందమైన ఆడపిల్లని చూసినప్పుడు ఆహా ఈ పిల్ల మొహంలో లక్ష్మీకళ తాండవిస్తోంది అని అనుకుంటాం. విరిసిన ముద్ద మందారం, తామరపూవులను చూసినపుడు మనసు దైవీకమైన భావనతో నిండిపోయి ఆ తల్లి లక్ష్మీదేవే గుర్తుకు వస్తుంది.

మరిన్ని:

Uttama Sansari Ila Undali In Telugu – ఉత్తమ సంసారి ఇలా ఉండాలి

Uttama Sansari Ila Undali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఉత్తమ సంసారి ఇలా ఉండాలి నీతికథ.

ఉత్తమ సంసారి ఇలా ఉండాలి.

(ఈ కథ ఆదిపర్వంలో ఉంది.)

” మహామునులారా !

జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు”. అని సూతుడు కథ మొదలు పెట్టాడు.
జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడువకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మపదం చేరడానికి ప్రయత్నిస్తున్నాడు.
అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు.
క్రింద పెద్ద గొయ్యి. దాని ప్రక్కగా ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు.
దానిమీద తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేసే ఋషులు. ఆశ్చర్యంతో వారిని సమీపించి :
‘అయ్యా ! మీరింత తీవ్ర తపస్సు ఎలా చేస్తున్నారు. నాకు కూడా దీని విధానం బోధించండి అన్నాడు.
నాయనా! మేము వరమ విషాదంతో యిలా ఉన్నాం. మా వంశంలో జరత్కారుడనే వాడు పుట్టాడు. వాడు వివాహం చేసుకుని వంశ వృద్ధి చేయకుండా ఉండటం వల్ల ఈ దీన దశలో ఉన్నాం.
ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరత్కారుని మరణంతో తెగి పోతుంది. మేము ఈ నరకకూపంలో పడతాం. వాడు వివాహం చేసు కుని సంతానవంతుడై తే మాకు దివ్యలోకాలు దొరుకుతాయి’ అన్నారు. అప్పుడా ముని :
‘ఆర్యా, నేనే ఆ జరత్కారుడను. మీ శ్రేయస్సు కోసం నేను వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను’ అని తనకు తగిన భార్యకోసం అన్వేషణ ఆరంభించాడు.
తనకు కాబోయే భార్య కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతున్నాడు.
ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడు వాసుకి.
తన చెల్లెలు జరత్కారువును తీసుకొని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి
‘మహామునీ ఈమె నా సోదరి. దీని పేరు జరత్కారువు. మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలూ ఉద్ధరించండి’ అని ప్రార్థించాడు.
అందుకు అంగీకరించాడు జరత్కారుడు.
ఒకానొక సుముహూర్తంలో వివాహం జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యతో
‘ధర్మచారిణి ఈ రోజు మొదలు నా మనస్సుకి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ నియమాన్ని మరువకు ! ” అన్నాడు.
జరత్కారువు ఆ నియమానికి అంగీకరించి, నిరంతరం పతిసేవతో గున్నది.
అలా ఆయన మనసుకి అనుగుణంగా మెంగుతూ, ఆయన అను రాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ, గర్భవతి అయింది.
రోజులు గడుస్తున్నాయి.
ఒకనాడాయన తిరిగి తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన, తన భార్య తొడమీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు.

సూర్యుడు పడమటి కొండకు చేరాడు.
మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తున్నాడు.
అప్పుడామె ఆలోచనలో పడింది.
సంధ్యాసమయంలో జరపవలసిన వేదవిహిత కర్మలకు లోపం రాకూడదు కదా ! ఇప్పుడీయనను లేపితే కోపం వస్తుందేమో! లేవకపోతే ధర్మలోపం జరుగుతుంది. ఆయనకు కోపంవస్తే అది నేను భరించాలి. కాని ధర్మలోపం జరగరాదు కదా అని నిశ్చయించి నిద్ర లేపింది.
సుఖనిద్రకు భంగం కలిగించినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది.
‘ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు?’ అని తీవ్రంగా అడిగాడు.
‘స్వామి | సంధ్యాసమయం అయింది. మీరు విధ్యుక్తకర్మలు జరపాలి కదా !’ అంది.
‘ఎంత వెర్రిదానివి. నేను నిద్రపోతూండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి? ఈ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు. కనుక వా నియమ ప్రకారం నిన్ను విడిచి పెడుతు న్నాను. అయితే యింత కాలం నువ్వు చేసిన పరిచర్య నాకెంతో సంతో షము కలిగించింది.
ఇప్పుడు నువ్వు గర్భవతివి. సూర్య సమ ప్రభావుడైన కుమారుడు నీకు కలుగుతాడు. వాడు ఉభయవంశాలనూ ఉద్ధరిస్తాడు. మవ్వు నిర్వి చారంగా మీ అన్నగారి దగ్గరకు వెళ్ళు’ అని తన కమండలుపు తీసు కుని ఆయన వెళ్ళిపోయాడు.
విచారంతో జరత్కారువు తన అన్న గారి దగ్గరకు వచ్చింది.
జరిగిన విషయం విన్నాడు వాసుకి. సోదరిని ఓదార్చి, ఆదరంతో చూసుకుంటున్నాడు.
నెలలు నిండిన అనంతరం జరత్కారువు మగబిడ్డను కన్నది. వాసుకి పరమానందంతో వారుభయులకూ ఉచిత సేవలు చేయించాడు.
పెరిగిన కుమారునికి ఆ స్తీకుడని పేరు పెట్టారు.
ఆ బాలుడు పెరిగి పెద్దవాడై, పర్వ విద్యలూ నేర్పి పలువురి ప్రశంసలు పొందాడు.
‘ఈ ఆస్తీకుడే జనమేజయ మహారాజు ఆరంభించిన సర్ప యాగాన్ని ఆపి తన తల్లి చుట్టాఅయిన నాగజాతిని మహ వివత్సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతి పొందాడు.” జ్ఞానులయినవారు సంసార కూపంలో మునిగిపోక తమ కర్తవ్యం పూర్తిచేసి విరాగు లవాలి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Hariyavataramitadu Annamayya In Telugu – హరియవతారమితడు అన్నమయ్య

హరియవతారమితడు అన్నమయ్య – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో హరియవతారమితడు అన్నమయ్య కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరియవతారమితడు అన్నమయ్య – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: హరియవతారమితడు అన్నమయ్య
సంఖ్య : 100
పుట:67
రాగం: శ్రీరాగం

శ్రీరాగం

80 హరియవతార మీతఁడు అన్నమయ్య
అరయ మాగురుఁ డీతఁ డన్నమయ్య

||పల్లవి||

వైకుంఠనాథునివద్ద వడిఁ బాడుచున్న వాఁడు
ఆకరమై తాళ్లపాక అన్నమయ్య
ఆకశపు విష్ణుపాదమందు నిత్యమై వున్నవాఁడు
ఆకడీకడఁ దాళ్లపాక అన్నమయ్య

||హరి||

క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచు నున్నవాఁడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుఁడై సూర్యమండలతేజమువద్ద నున్నవాఁడు
ఆ రీతులఁ దాళ్లపాక అన్నమయ్య

||హరి||

యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాఁడు
ఆవటించి తాళ్లపాక అన్నమయ్య
భావింప శ్రీవేంకటేశుపాదములందె వున్నవాఁడు
ఆ (హా)వ భావమై తాళ్లపాక అన్నమయ్య

||హరి||100

అవతారిక:

తాళ్లపాక పెదతిరుమలాచార్యులవారు తన తండ్రి అన్నమాచార్యులవారిని కీర్తిస్తూ చెప్పిన కర్ణపేయమైన కీర్తననాస్వాదించండి. అన్నమయ్య శ్రీహరి అవతారమని చెబుతున్నారు. తన గురువు కూడా అన్నమయ్యయేనంటున్నారు. వైకుంఠవాసమునొందిన తనతండ్రి నిత్యమూ క్షీరాబ్ధిశయనుని సేవించుటలో ఆరితేరియున్నాడట. శ్రీవేంకటేశ్వరుని పాదముల చెంత తన హావభావములను ప్రకటిస్తూ అన్నమయ్య నేటికీ వున్నాడట.

భావ వివరణ:

ఈ అన్నమయ్య స్వయముగా శ్రీహరి అవతారమే. ఈయనే మాకు జన్మనిచ్చి శ్రీహరి భక్తియు నొసగిన గురుపుంగవులు.

వైకుంఠనాథునివద్ద ఆకరమై (స్థానమును పొందిన వాడై) ఈ తాళ్ళపాక అన్నమాచార్యులవారు వడి (వేగముగా) హరిని కీర్తించుచు పాడుచున్నారు. ఆకాశవీధిలో విష్ణుని పాదపద్మముల చెంత ఈయన నిత్యమై (శాశ్వతుడై) వున్నాడు. ఈ తాళ్ళపాక అన్నమయ్య ఆకడ (ఆ వైకుంఠసీమలోను) ఈ కడ (తిరుమల శిఖరాలచెంతను) హరి సేవలోనే గడుపుతున్నారు.

ఆరితేరిన (నిష్ణాతులైన) ఈ తాళ్ళపాక అన్నమయ్య, క్షీరసాగరశయనుడైన శ్రీహరిని ఇట్టే సేవింపుచూ వున్నవాడు. అదే ఆయనకు నిత్యకృత్యమైనది. సూర్యమండలపు దివ్యతేజస్సుతో వెలుగులు జిమ్మే చోట అన్నమయ్య ధీరుడై తేజో మూర్తియైయున్నాడు.

ఈవల (ఈ కలియుగంలో) సంసారలీల ప్రకారం ఇందిరానాథునితో ఈ తాళ్ళపాక అన్నమయ్య ఆవటించి (పొందికతో) యున్నవాడు. భావించిచూడగా శ్రీవేంకటేశ్వరుని పాదపద్మముల చెంతనే తన హావభావములను ప్రకటించుచు తేజోరూపుడై ఈ అన్నమాచార్యులవారు హరిసేవలో వున్నారు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Indulonane Nevvariboludu In Telugu – ఇందులోననే నెవ్వరిబోలుదు

ఇందులోననే నెవ్వరిబోలుదు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఇందులోననే నెవ్వరిబోలుదు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇందులోననే నెవ్వరిబోలుదు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: ఇందులోననే నెవ్వరిబోలుదు
సంఖ్య : 581
పుట: 390
రాగం: పాడి

పాడి

78 ఇందులోన నే నెవ్వరిఁబోలుదు
అంది నీవాఁడ నేననుకొంటిఁజుమ్మీ

||పల్లవి||

జలజనాభ నీ శరణనువారలు
అల నారదసనకాదులు
కెలన మరియు నీ కింకరవర్తులు
తెలిసినబ్రహ్మాదిదేవతలు

||ఇందు||

నోరార హరి నిను నుతించువారలు
చేరువనుండేటిశేషాదులు
ధారుణిలో నీదాసాన(ను?) దాసులు
మారుతిముఖ్యులు మహామహులు

||ఇందు||

బడి నీచే ముక్తివడసినవారలు
సుడిగొనుమునిజనశుకాదులు
కడఁగిన శ్రీవేంకటపతి నీవే
తడవి నన్ను దయదలఁచుమీ

||ఇందు||581

అవతారిక:

శ్రీమన్నారాయణుని ఆశ్రయించేవారిలో మూడు రకాలవారుంటారు. నారదమహర్షివంటి శరణాగతులు, ఆదిశేషునివంటి దాసులు, శుకమహర్షివంటి జీవన్ముక్తులు. వీరందరి ఆశయం ఒకటే అయినా అవలంభించిన మార్గాలలో భిన్నత్వమున్నది. ఇందులో నేనెవ్వరి బోలుదును స్వామీ! అని ప్రశ్నిస్తున్నారు అన్నమాచార్యులవారు. నేనుమాత్రం నీవాడను అనుకొంటూనే బ్రతుకు వెళ్ళమారుస్తున్నానని అంటున్నారు. తడవి నన్ను దయచూడుము ప్రభూ! నవవిధ భక్తిలో యేదోఒక విధమున తనను కడతేర్చమని బ్రతిమిలాడుతున్నారు అన్నమాచార్యులవారు.

భావ వివరణ:

ఓ దేవదేవా! ఈ క్రిందివారిలో నేనెవ్వరి బోలియున్నానో తెలుపుము ప్రభూ! అంది (స్థిరపడి) ఇంతవరకు నేను నీవాడనే అని అనుకొంటున్నాను సుమా!

ఓ జలజనాభా! (పద్మనాభా) ఆనాటి నారదుడు సనకసనందనాది ఋషులు కెలన (దిక్కు) నీవే అన్నారు. వారు నీ శరణాగతులు. శరణని నిన్ను ఆశ్రయించినవారు. మరియు తెలిసిన (విఖ్యాతులైన) బ్రహ్మాదిదేవతలు నీ కింకరవర్తులు (భృత్యులు) వీరంతా ఆవిధముగా నీ శరణాగతులై నిశ్చింతగానున్నారు.

ఓ శ్రీహరీ! ఆదిశేషుడు నీ చేరువనే వుండి నీకు పానుపువలె సేవించుచు, నోరార (వేయినోళ్ళతో) నిన్ను కీర్తించుచు నీవాడైనాడు. మారుతి (ఆంజనేయుడు) మొదలైన మహామహులు ఈ ధారుణిలో (భూమిపై) నీదాస్యమును తరించే మార్గముగా నెంచుకొన్నారు. వారంతా నీ దాసానుదాసులుగావుండి నీ భక్తులకు యెన్నో వుపకారాలు చేస్తున్నారు.

ఓ పరమపురుషా! శుకమహర్షి, భారతము వ్రాసిన తన తండ్రి వ్యాసునివలె, తను కూడా భాగవతము వినిపించి బడి (శీఘ్రముగా) నీచే ముక్తిని బడసినాడు. వారంతా సుడిగొను (చుట్టుకొని) నీవద్దనే వుండే జీవన్ముక్తులు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవే నన్ను కడగి (యత్నించి) తడవి (గ్రహించి) దయదలచవయ్యా! ఎందుకంటే నేను నీవాడను తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

  1. వారిధిశయన వో వటపత్రపరియంక
  2. వైష్ణవులసొమ్ము నేను వారు నీసొమ్ములింతే
  3. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
  4. అంజినీదేవి కొడుకు హనుమంతుడు
  5. అప్పడైన హరియెక్కె నదివో తేరు
  6. అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ

Kousalya Nandana Rama Kamalaptakula Rama In Telugu – కౌసల్యానందనరామ కమలాప్తకులరామ

కౌసల్యానందనరామ కమలాప్తకులరామ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కౌసల్యానందనరామ కమలాప్తకులరామ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కౌసల్యానందనరామ కమలాప్తకులరామ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
సంఖ్య : 275
పుట: 185
రాగం: సాళంగనాట

సాళంగనాట

54 కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
భాసురవరద జయపరిపూర్ణ రామ

||పల్లవి||

మునుప దశరథరాముఁడవై తమ్ములు నీవు
జనించి తాటకఁ జంపి జన్నము గాచి
వెనుకొని హరువిల్లు విరిచి సీతఁ బెండ్లాడి
అనుమతి పరశురామునిచేఁ గైకొంటిని

॥కౌస॥

సుప్పనాతి శిక్షించి సొరిది రుషులఁ గాచి
అప్పుడే ఖరదూషణాదులఁ గొట్టి
చొప్పుతో మాయామృగము సోదించి హరియించి
కప్పి హనుమంతు బంటుఁగా నేలుకొంటిని

॥కౌస॥

సొలసి వాలి నడఁచి సుగ్రీవుఁ గూడుక
జలధి బంధించి లంక సాధించి
వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించీ
చెలఁగితి వయోధ్యలో శ్రీవేంకటేశుఁడా

॥కౌస॥275

అవతారిక:

కౌసల్యానందనుడైన శ్రీరాముని కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. సూర్యవంశతిలకుడైన ఈయన శోభాయమానమైన వరములనిస్తాడట. పరిపూర్ణమైన జయమునిస్తాడట. ఇదివరలో చెప్పినట్లే ఇది కీర్తనే కాక రామాయణ పునశ్చరణ కూడా. అన్నమయ్యకు రామకథ ఆదినుంచి చెప్పటమే అలవాటు. ఈ రాముడు అనుమతి పరశురామునిచేగైకొనెనట. అంటే.. దుష్టశిక్షణకు అనుమతిని పొందాడన్నమాట. నాయనా! నా అవతార లక్ష్యం పరిసమాప్తమయింది, దుష్ట క్షత్రం నశించి ధర్మరక్షణ క్షాత్రానికి తెరలేచింది, ఇక ధర్మరక్షణ భారం నీదే అని అనుమతినిచ్చాడట రామునికి పరశురాముడు.

భావ వివరణ:

కౌసల్యానందనుడవైన (కౌసల్యాదేవికుమారుడవైన) రామా! నీవు కమలాప్తకుల (సూర్యవంశమున జన్మించిన) రామచంద్రుడవు భాసురవరదుడవు (శోభాయమానమైన వరములనను గ్రహించువాడవు). పరిపూర్ణమైన జయమునిచ్చు రామయ్యవు.

మునుపు (ఇదివరలో) నీవు దశరథరాముడవై తమ్ముల మువ్వురితో జన్మించావు. తాటకను సంహరించి విశ్వామిత్రుని జన్నము (యజ్ఞమును) గాచినావు (రక్షించినావు) వెనుకొని (తదనంతరము) శివధనస్సును విరిచి సీతాదేవిని పెండ్లాడినావు. పరశురామునిచే అనుమతిగైకొని దుష్టశిక్షణకు శ్రీకారం చుట్టితివి. అవతారావిష్కరణకు పూనుకొన్నావు.

చుప్పనాతి అని పేరుగాంచిన శూర్పనఖను శిక్షించి స్త్రీయని వదలినావు. సొరిది (ఆక్రమములో) అనేక మంది ఋషులను రక్షించినావు. ఆవెనుక ఖరదూషణాదులను సంహరించితివి. చొప్పుతో (ఆవిధముగా) మాయామృగమును (మాయలేడిని) సోదించి హరించితివి (వెదకి సంహరించితివి. హనుమంతునికప్పి (బ్రాహ్మణునివలె వచ్చిన హనుమంతుని గుర్తించి బంటుగా నేలుకొంటివి.

సొలసి (పరిక్రమించి) వాలిని అడచితివి (సంహరించితివి) సుగ్రీవుని గూడుక (కూడుకొని) జలధిని బంధించి సేతువును నిర్మించి, లంకను జయించితివి. వెలయ (అతిశయించి) రావణాసురుని గెలిచి విభీషణునికి మన్నింపుతో లంకారాజ్యప్రదానము చేసితివి. ఆపై అయోధ్యలో పట్టాభిషిక్తుడవైనావు. ఓ శ్రీవేంకటేశ్వరా! అదయ్య నీరామ గాధ. ఇది విని తరించామయ్యా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sadanandamu Sarveshwara Ni In Telugu – సదానందము సర్వేశ్వర నీ

సదానందము సర్వేశ్వర నీ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సదానందము సర్వేశ్వర నీ- కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సదానందము సర్వేశ్వర నీ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : సదానందము సర్వేశ్వర నీ-
సంఖ్య : 369
పుట: 248
రాగం: దేవగాంధారి

దేవగాంధారి

53 సదానందము సర్వేశ్వర నీ-
పదారవిందముపై భక్తి

||పల్లవి||

నయనానందము నరులకు సురలకు
జయమగు హరి నీసాకారము
నయమగుశ్రవణానందము వినినను
క్రియగలిగిననీకీర్తనము

||సదా||

చెలఁగి యందరికి జిహ్వానందము
పలుమరుఁ గొనునీప్రసాదము
నలుగడ దేహానందము బుధులకు
బలునీపాద ప్రణామములు

||సదా||

ధరఁ బరమానందము నీదాస్యము
గరిమల శ్రీవేంకటవిభుఁడా
నరహరి నిత్యానందము నినుఁ దగ-
నరవిరిఁ జేయసమారాధనము

||సదా||369

అవతారిక:

ప్రతిజీవీ సంతోషం కోసమే జీవిస్తాడు. సంతోషంకోసమే వెంపర్లాడతాడు. అయితే రేయింబవళ్ళలాగా, సంతోషమూ దు:ఖమూ రెండూ సదా (కలకాలంవుండేవి కావు) వస్తుంటాయి పోతుంటాయి. మరి సదానందము (యెప్పుడూ ఆనందాన్నిచ్చే దేమిటి? ఆ సర్వేశ్వరుడి పాదారవిందములపై భక్తి అని అంటున్నారు అన్నమాచార్యులవారు. నయనాందము, శ్రవణానందము, జిహ్వానందము, దేమానందము, పరమానందము, నిత్యానందము – యేమిటేమిటో వివరిస్తున్నారు విని తరించండి. జ్ఞానము అంటే ఇదే సుమా!

భావ వివరణ:

ఓ సర్వేశ్వరా! నా పదారవిందములపై భక్తి (నీపాదపత్మములపై అచంచలమైన భక్తిప్రపత్తి) సదానందము (సర్వకాల సర్వావస్థలయందు ఆనందమునొసగునది).

నరులకు సురులకు నయనానందమయుయేది? (కన్నులకు ఆనందము నొసగునదేమిటి?) శ్రీహరీ! సర్వులకు జయము నొసగే నీసాకార (ఆకారముతో కూడిన) రూపముకంటే నయనానందకరము మరొకటి లేదు. ఇక వినినను (వినుటకు) నయముగ (స్వాంతనము కలిగించే శ్రవణానందము (చెవులకు ఆనందకరమైనది యేది? క్రియగలిగిన (పూనిక గలిగిన) నీ నామసంకీర్తనము మాత్రమే ఆ శ్రవణానందము నీయగలదు.

జిహ్వా (నాలుక) కలిగించే ఆనందమువల్ల నేనరులు దేనినైనా భుజించగలుగుతున్నారు. చెలగి (అతిశయించి) అందరికీ అట్టి జిహ్వానందము కలిగించునది యేదీ? యెన్నోసార్లు స్వీకరించే ఆస్వామి ప్రసాదమే జిహ్వానందకరము. ఇక లుధులకు (బుద్ధిమంతులకు) దేహమునకు ఆనందము కలిగించునదేది? నలుగడ (అనిచోట్లలో) బలమైన నీపాదములకు జేయు ప్రణామములు (సాష్టాంగవందనములే) దేహానందము గరిమల (మహిమగల శ్రీవేంకటేశ్వరుడా! ధరలో (భూలోకంలో) పరమానందమునొసగునదేది? నీకు చేసే దాస్యమే (భృత్యునిగా జీవించుటే) ఓనరహరీ! నిత్యానందము (ప్రతిరోజూ ఆనందము) నొసగునదేది? తగునట్లు అరవిరి (వినమృలై ముకుళిత హస్తములతో) జేయు నీసమారాధనమే నిత్యానందములు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Narayana Mantra pushpam In Telugu – నారాయణ మంత్రపుష్పం

Narayana Mantra pushpam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. మంత్ర పుష్ప అనేది పూజల ముగింపులో, హిందూ దేవతలకు పుష్పాలను సమర్పించే సమయంలో, పాడే వేద శ్లోకం. మంత్రం, వేద మంత్రాల పుష్పగా, పరిగణించబడుతుంది. ఈ మంత్రం యజుర్వేదంలోని తైత్తిరీయ ఆరణ్యకం నుండి తీసుకోబడింది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంత్ర పుష్పం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

నారాయణ మంత్రపుష్పం

ఓం ధాతా పురస్తాద్యముదాజహార,
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః
తమేవం విద్యానమృత ఇహ భవతి,
నాన్యః పంథా అయనాయ విద్యతే.
ఓం సహస్ర శీర్ షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం.
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరిం.
విశ్వమేవేదం పురుషస్త ద్విశ్వముఅపజీవతి,
పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం,
పరోజ్యోతి రాత్మా నారాయణః పరః,
నారాయణ పరంబ్రహ్మ తత్త్వం నారాయణః పరః
నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః
యచ్చకించిజ్జగ త్సర్వం దృశ్యతే శ్రూయతే పివా,
అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః
అనన్తమవ్యయం కవిగ్ం సముద్రేఒన్తం విశ్వశమ్భువమ్
పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్
అధో నిష్ట్యా వితస్త్యానే నాభ్యాముపరి తిష్ఠతి
జ్వాలామాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్,
సన్తతరం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం.
తస్యాన్తో సుషిరగం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠతం,
తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః.
సోగ్రభు గ్విభజ నిష్ఠ న్నాహార మజరః కవిః
తిర్యగూర్థ్వ మధశ్శాయీ రశ్శయస్తస్య సంతతా,
సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తగః,
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః,
నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవారశూకవ తన్వీ పీతా భాస్వత్యణూపమా,
తస్య శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః,
స బ్రహ్మ స శివ స్స హరిస్సేంద్ర స్పోక్షరః పరమః స్వరాట్.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,
నమో వయం వై శ్రవణాయ కుర్మహే
స మే కామా న్కామకామాయ మహ్యం
కామేశ్వరోవైశ్రవణో దదాతు.
కుబేరాయవైశ్రవణాయ, మహారాజాయ నమః
తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః, దివీచ చక్షురాతతం,
తద్విప్రాసో విపన్యవో జాగృవాంస స్సమింధతే విష్ణోర్యత్పరమం పదమ్.
నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్ /
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.
( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ప్రదక్షిణ

(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో: యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం.
సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
ఛత్రం ధారయామి
చామరైః ధారయామి
గీతం శ్రావయామి
నృత్యం శ్రావయామి
ఆందోళికా మారోపయామి
సమస్త రాజోపచారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః, సాష్టాంగనమస్కారన్ సమర్పయామి

ప్రార్ధన:

అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం,
హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకమ్.
సగుణం చ గుణాతీతం గోవిందం గరుడధ్వజం
జనార్దనం జనానందం జానకీవల్లభం హరిమ్.
ప్రణమామి సదా భక్త్యా నారాయణ మజం పరం,
దుర్గమే విషమే ఘోరే శత్రుణా పరిపీడితమ్.
నిస్తారయతు సర్వేషు తథా నిష్టభయేషు చ
నామాన్యేతాని సంకీర్త్య ఫల మీప్సిత మాప్నుయాత్
సత్య్నారాయణం దేవం వందేహం కామదం ప్రభుం,
లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ప్రార్ధనా నమస్కారమ్ సమర్పయామి.

సర్వోపచారాలు:

చత్రమాచ్చాదయామి,చామరేణవీచయామి,నృత్యందర్శయామి,
గీతంశ్రాపయామి,ఆందోళికంనారోహయామి
సమస్తరాజోపచార పూజాం సమర్పయామి.
శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వోపచారాన్ సమర్పయామి

ఫలమ్

ఇదం ఫలం మయా స్థాపితం పురతస్తవ.
తేన మే సఫలా వాప్తి ర్భవే జ్జన్మని జన్మని
శ్లో// యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజా క్రియాదిషు,
నూన సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్.

క్షమా ప్రార్థన:

(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన
యాత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ రమా సత్యనారాయణ స్వామి పూజావిధానం సంపూర్ణం
(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను.)

అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీవిష్ణు పాదోదకం పావనం శుభమ్ //

తదుపరి ఇక్కడ స్వామి వ్రత కథ చదువవలెను.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

మరిన్ని భక్తి యోగాలు:

Sri Krishna Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ కృష్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Krishna Ashtottara Shatanama Stotram Telugu

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్

శ్రీకృష్ణః కమలానాథో, వాసుదేవస్సనాతనః,
వసుదేవాత్మజః పుణ్యో, లీలామానుషవిగ్రహః.

1

శ్రీవత్సకౌస్తుభధరో, యశోదావత్సలో హరిః,
చతుర్భుజాత్తచక్రాసి, గదాశంఖాద్యుదాయుధః.

2

దేవకీనందన శ్రీశో, నందగోపప్రియాత్మజః,
యమునావేగ సంహారీ, బలభద్ర ప్రియానుజః.

3

పూతనాజీవితహర, శ్శకటాసురభంజనః,
నందవ్రజజనానందీ సచ్చిదానంద విగ్రహః.

4

నవనీత విలిప్తాంగో నవనీతనటో నఘః,
నవనీతనవాహారో ముచుకుందప్రసాదకః.

5

షోడశస్ర్తీ సహస్రేశః త్రిభంగీమధురాకృతిః,
శుకవాగమృతాబ్దేందుః గోవిందో యోగినాం పతిః.

6

వత్సవాటచరో నంతో, ధేనుకాసురభంజనః,
తృణీకృతతృణావర్తో, యమళార్జునభంజనః.

7

ఉత్తాలతాలభేత్తా చ, తమాల శ్యామలాకృతిః,
గోపగోపీశ్వరో యోగీ, కోటిసూర్యసమప్రభః.

8

ఇళాపతిః పరంజ్యోతిః, యాదవేంద్రో యదూద్వహః,
వనమాలీ పీతవాసాః, పారిజాతాపహారకః.

9

గోవర్ధనాచలోద్ధర్తా, గోపాలస్సర్వపాలకః,
అజో నిరంజనః కామజనకః కంజలోచనః.

10

మధుహా మధురానాథ్, ద్వారకానాయకో బలీ,
బృందావనాంత సంచారీ, తులసీ దామభూషణః.

11

శ్యమంతకమణేర్హర్తా, నరనారాయణాత్మకః,
కుబ్జా కృష్ణాంబరధరో, మాయీ పరమపూరుషః.

12

ముష్టికాసుర చాణూర, మల్లయుద్ధ విశారదః,
సంసారవైరీ కంసారి, మురారిర్నరకాంతకః.

13

అనాదిబ్రహ్మచారీ చ, కృష్ణావ్యసనకర్శకః,
శిశుపాల శిరశ్చేత్తా, దుర్యోధన కులాంతకః.

14

విదురాక్రూర వరదో, విశ్వరూప ప్రదర్శకః,
సత్యవాక్సత్యసంకల్పః, సత్యభామారతో జయీ.

15

సుభద్రాపూర్వజో విష్ణుః భీష్మముక్తి ప్రదాయకః.
జగద్గురు ర్జగన్నాథో, వేణునాద విశారదః.

16

వృషభాసుర విధ్వంసీ, బాణాసురకరాంతకః,
యుధిష్టిరప్రతిష్ఠాతా, బర్హిబర్హావతంసకః.

17

పార్థసారథిరవ్యక్తో, గీతామృతమహోదధిః,
కాళీయఫణి మాణిక్య, రంజిత శ్రీపదాంబుజః.

18

దామోదరో యజ్ఞభోక్తా, దానవేంద్రవినాశకః,
నారాయణః పరం బ్రహ్మ, పన్నగాశనవాహనః.

19

జలక్రీడాసమాసక్త, గోపీవస్త్రాపహారకః,
పుణ్యశ్లోకస్తీర్థపాదో, వేదవేద్యో దయానిధిః.

20

సర్వతీర్థాత్మకస్సర్వగ్రహరూపీ పరాత్పరః,
ఏవం శ్రీకృష్ణదేవస్య, నామ్నామష్టోత్తరం శతమ్.

21

కృష్ణనామామృతం నామ, పరమానందదాయకమ్,
అత్యుపద్రవదోషఘ్నం, పరమాయుష్యవర్ధనమ్.

22

ఇతి శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రమ్.

మరిన్ని అష్టోత్తరములు:

Devani Paksapatamo Tirigelokulavelto In Telugu – దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో

దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
సంఖ్య : 422
పుట: 284
రాగం: నారాయణి

నారాయణి

41 దేవ నీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
శ్రీవిభుఁడ నీవేకాదా చిత్తములోనయ్యా.

||పల్లవి||

దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదు:ఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువిఁ బుణ్యపాపముల భోగము వేరేలయ్యా.

||దేవ||

విని కిందరి కొకటే విషయాలు నొకరీతే
మునిఁగేటిజాతిభేదములివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆఁకలియు నొకటే
పెనఁగేటిగుణముల పెక్కు జాడ లేలయ్యా.

||దేవ||

అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింక సేసీ నీమాయ లిందుకే నీశరణంటే
కాంతుఁడ న న్నిందుకే కాచితివి నేఁడయ్యా.

||దేవ||422

అవతారిక:

అన్నమాచార్యులవారి కీర్తనలలో పల్లవి చాల చిక్కులు తెచ్చిపెడుతుంటుంది. “ఓ దేవదేవా! శ్రీకాంతుడా! పైకి చూడటానికి జరిగేవన్నీ నీకు పక్షపాత బుద్ధి వున్నదా అనే భ్రమ కలిగిస్తాయి. లేకపోతే అనుక్షణం భ్రమల లోనే వుండే ఈ లోకులలోని ‘వెల్తి’ (తక్కువ భాగ్యమో, యెక్కువ భాగ్యమో) యెందుకు కలుగుతున్నాయి? మరి మా అందరి చిత్తములో అంతర్యామివి నీవొక్కడివే అయితే ఈ హెచ్చుతగ్గులెందుకు వస్తున్నాయి?” మా శారీరక ధర్మాలు ఒక్కటే శారీర దారుఢ్యాలు వేరు, వినేది ఒకటే అర్థమయ్యేది వేర్వేరు, ఆకలి వొకటే అరుగుదల వేర్వేరు. ఒకడిది మంచి గుణం ఒకడిది చెడ్డగుణం యెందుకిలా? యేమిటి నీ మాయ?

భావ వివరణ:

ఓ దేవదేవా! నీ పక్షపాత వైఖరియో లేక తిరిగేలోకుల వెల్తియో (భ్రమలకు లోనయ్యే లోకుల యొక్క భాగ్యప్రాప్తిలోని విభేదమో) తెలియకుండా వున్నది. మా అందరి చిత్తములో అంతర్యామిగా నీవే వుండగా ఓ శ్రీవిభుడా! ఇలా యెందుకు ఒకరు గొప్ప ఒకరు తక్కువ అవుతున్నారు?

దేవా! ప్రపంచంలో మానవులందరికీ రేయింబవళ్ళు ఒక్కలాగే వుంటాయి కదా? మరి వారి సుఖదు:ఖాలు ఒకేలా యెందుకుండటంలేదు? హెచ్చుతగ్గులెందుకు? అన్ని జీవుల భవము (పుట్టుక) ప్రాణములు ఒక్కటే కదా? మరి లోకంలో పాపపుణ్యములనుభవించడంలో తేడా యెందుకు వస్తున్నది?

ప్రభూ! అందరి వినికి (వినేశక్తి) ఒక్కటే… విషయాలు (విషయములపై ఆసక్తీ) ఒక్కటే, మరి, మునిగేటి (అంతులేని) జాతిభేదము యెందుకు కలుగుతున్నది. అనయము (నిరంతరం) మన చూచే శక్తి ఒక్కటే… ఆకలిదప్పులూ ఒక్కటే కాని మనలో పెనవేసుకొన్న గుణాలలో తేడాలన్నీ యెందుకు వుంటున్నవి?

ఓ శ్రీవేంకటేశ్వరా! మా అందరిలోనూ అంతర్యామిగా చరించేది. నీవొక్కడివే, మరి మాకు వేర్వేరు చింతలు, వేర్వేరు చిలుగులు (ఉపద్రవములు) యెందుకు కలుగుతున్నాయి? ఏమిటి నామాయ? ఏమిటీ విచిత్రం? అందుకే నీకు శరణు అంటున్నాను. ఓ అయ్యా! అందుకే నీవు నన్ను నిరంతరం కాపాడుతున్నావు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: