Hari Neeve Sarvatmakudavu In Telugu – హరి నీవే సర్వాత్మకుడవు

హరి నీవే సర్వాత్మకుడవు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో హరి నీవే సర్వాత్మకుడవు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరి నీవే సర్వాత్మకుడవు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : హరి నీవే సర్వాత్మకుడవు
సంఖ్య : 441
పుట : 297
రాగం : దేశి

దేశి

32 హరి నీవే సర్వాత్మకుడవు
యిరవగు భావన యియ్యగదే ॥

||పల్లవి||

చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యగదే ॥

||హరి||

పారక మానదు పాపపు మనసిది
యీరసములతో నెందైనా
నీరజాక్షయిది నీమయమేయని
యీ రీతుల తల పియ్యగదే ॥

||హరి||

కలుగక మానవు కాయపు సుఖములు
యిలలోపలగల వెన్నైనా
అలరిన శ్రీవేంకటాధిప నీకే
యిలనర్పితమను యిహమియ్యగదే ॥

||హరి|| 441

అవతారిక:

మనం వేరు, పరులు వేరు అనే భావనవుండటం వల్లనే మనం కొందరిని ప్రేమిస్తాం, కొందరిని ద్వేషిస్తాము. కానీ శరీరాలు వేర్వేరైనా ఆత్మలన్నిటికి మూలకారణం పరమాత్మ అనే తత్త్వం తెలిసనవాడు సర్వాత్మకుడైనవాడు శ్రీహరి ఒక్కడే అని తెలిసికొని ఎవ్వరినీ ద్వేషించడు. ఓ దేవదేవా నాకు కూడా అటువంటి భావనే ఇయ్యవయ్యా! అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈ ప్రపంచంలోవున్నవన్నీ నీ అర్పణ కొరకే స్వామీ! అంటున్నారు. ఈ భావవివరణ వ్రాసేటప్పుడు నాకు కలిగిన తృప్తి నేను మాటలలో వర్ణించలేను.

భావ వివరణ:

ఓ శ్రీహరీ! నీవే సర్వాత్మకుడవు (అన్ని ఆత్మలకు మూలమైనవాడవు). నాకునూ అట్టి నీవే అన్ని ఆత్మలలోగలవనె ఇరవగు భావన (సుస్థిరమైన అభిప్రాయమును) ఇయ్యగదే (ఈయవయ్యా!)

నాకు చూడాలనే కోరిక కలిగితే చాలు నా కన్నులు దేన్ని పడితే దాన్ని చూస్తాయి. ఇతరములు (అనవసరమైన ఇతర విషయములన్నింటినీ, యేడ నేవైన (యెక్కడైనా యేమైనా) చూస్తాయి. అవి చూడటం మానవు. నీడలన్ (నీ ఆశ్రయంలో) అన్నీ నీ ప్రతిరూపాలే అనునట్టి, ఈడువడని (చెడిపోని) తెలివి (జ్ఞానమును) ఈయగదే (ఇమ్ము ప్రభూ!).

నేను నాకళ్లుమూసుకున్నా నన్ను చెడగొట్టే ఇంకొకటుంది. అదే నా మనస్సు. పాపచింతనతో కూడిన నా మనస్సు అనవసరమైన వాటిమీద పారక మానదు (ప్రసరించక వదలదు). ఈ రసములతో యెందైనా యెవరికైనా యెన్నో పాపపు ఆలోచనలే వస్తాయి. ఓ నీరజాక్షా! ఈ రసములు కూడా నీమాయలే (నీవలననే కలిగినవి) అనునట్టి తలపును ఇయ్యగదే (ఈయరాదటయ్యా!)

ప్రభూ! నా కళ్ళూ మనస్సు ఒక్కసారి విజృంభించాయంటే, నా కాయము (దేహము) వున్నదే అది తగులుకొంటుంది. దానికెప్పుడూ సుఖం కావాలి. దానికి ఒక సుఖం చాలదు. ఎన్నయినా కావాలి కావాలి అనే అంటుంటుంది. దానికి ఈ ప్రపంచమంతా ఇచ్చినా చాలదు. అలరిన శ్రీవేంకటాధిప (ఏడు కొండలపై శోభించుచున్న) ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ ప్రపంచంలో వున్నవన్నీ నీకు అర్పితమైనవే అనే ఇహము (ఈ ప్రాపంచిక జ్ఞానమును) ఇయ్యవయ్యా తండ్రీ!.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Maitreyi Sthotram In Telugu | మైత్రేయి స్తోత్రం

Maitreyi Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మైత్రేయి స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Maitreyi Sthotram In Telugu Lyrics

మైత్రేయి స్తోత్రం

జగద్గురో నమస్తుభ్యం హిమాలయ నివాసినే,
నమస్తే దివ్య దేహాయ మైత్రేయాయ నమోనమః.

1

నమోజ్ఞాన స్వరూపాయ మాయామోహ విదారిణే,
నిర్మలాయ ప్రశాంతాయ మైత్రేయాయ నమోనమః

2

నమస్తే బోధి సత్త్వాయ నమస్తే పుణ్యమూర్తయే,
పూర్ణానంద స్వరూపాయ మైత్రేయాయ నమోనమః.

3

సిద్ధి బుద్ధి ప్రయుక్తాయ సిద్ధి బుద్ధి ప్రదాయినే
భవభీతి వినాశాయ మైత్రేయాయ నమో నమః

4

నమస్తే కర్మ నిష్ణాయ యోగినాంపతయే నమః,
బ్రహ్మ జ్ఞాన స్వరూపాయ మైత్రేయాయ నమోనమః

5

నమస్తే గురుదేవాయ నమస్తే ధర్మ సేతవే,
నారాయణ నిరుక్తాయ మైత్రేయాయ నమోనమః.

6

నమస్తే కరుణాసింధో ప్రేమ పీయూష వర్షిణే,
జగద్భంధో నమస్తుభ్యం మైత్రేయాయ నమోనమః.

7

మరిన్ని స్తోత్రాలు:

Harikrishna Melukonu Adhipurusha In Telugu – హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
సంఖ్య : 543
పుట : 365
రాగం : భూపాళం

భూపాళం

38 హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
తరవాత నా మోము తప్పకిటు చూడు.

||పల్లవి||

మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి
బాలులదె పిలిచేరు బడి నాడను
చాలు నిఁక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు –
వేళాయ నాతండ్రి వేగ లేవే,

॥హరి||

కను దెరవు నాతండ్రి కమలాప్తుఁ డుదయించె కమలాప్తు
వనిత మొకమజ్జనము వడిఁ దెచ్చెను
మొనసి మీతండ్రి యిదె ముద్దాడఁ జెలఁగీని
దనుజాంతకుండ యిఁకఁ దగ మేలుకోవే.

॥హరి||

లేవె నాతండ్రి నీలీలలటు వొగడేరు
శ్రీ వేంకటాద్రిపతి శ్రీరమణుఁడా
దేవతలు మునులుఁ జెందిననారదాదులు
ఆవలనుఁ బాడేరు ఆకసమునందు.

||హరి|| 543

అవతారిక:

మధురాతి మధురమైన మేలుకొలుపు కీర్తన నాస్వాదించి తరించండి. అన్నమాచార్యులవారి ఋణం తీరదని అనిపిస్తున్నది కదా! నా తండ్రి మేలుకోరా నా అన్న మేలుకో అని యెన్నిసార్లు బ్రతిమిలాడుతున్నారో చూడండి. జన్మకి ఇట్లాంటికీర్తన ఒక్కటి చాలదా? కొసమెఱుపు యేమిటంటే “వనిత మొకమజ్జనము వడిదెచ్చెను” అనే చరణం నందగోపుడు రేపల్లె గొల్లవారికి యేలిక కదా! వాళ్ళ పనిమనిషి వాళ్ళ అబ్బాయి పళ్ళుతోముకోవడానికి గోరువెచ్చని నీళ్ళు తెచ్చి సిద్ధంగా వున్నదట. మొకమజ్జనము అంటే ముఖమును నీళ్ళతో కడుగుకొనుట.

భావ వివరణ:

ఓ ఆదిపురుషా! హరీ! కృష్ణా ‘మేలుకో నాన్నా! తరువాత తప్పకుండా నా మోము (ముఖమును) ఇటుచూడు. (నా మాట విను తండ్రీ!)

నా యన్న మేలుకొనరా! బడినాడను (నీతో కూడి ఆడుకొందామని) అదే నీతోడి బాలలు మెల్లనే (మన వసారాలో) నిలుచుని నిన్ను పిలిచేరు. లే తండ్రీ! ఇక నిద్దురలు చాలును కన్నా! చద్దికూళ్ళ పొద్దువేళాయె (చద్ది యన్నం తినే వేళయింది నాన్నా!) నా తండ్రీ! వేగ లేవే (తొందరగా
లేచిరావయ్యా!)

అదిగోచూడు… కమలాప్తుడుదయించె (కమలబాంధవుడైన సూర్యభగవానుడు ఉదయించినాడు) నా తండ్రీ! కన్నులు తెరువమయ్యా! మొకమజ్జనకు (నీ ముఖము కడుగుకొనుటకు నీళ్ళను) వనిత (పనిపిల్ల) వడి దెచ్చెను (శ్రీఘ్రముగా తీసికొచ్చింది). ఇవే నీతండ్రి నందగోపుడు, మొనసి (పూనుకొని) ముద్దాడ (గబగబా ముద్దులు పెట్టుకొందామని) యెదురు చూస్తున్నాడయ్యా! ఓ దనుజాంతకా! (పూతన వంటి రాక్షసులను అంతమొందించినవాడా!) ఇక మేలుకోవయ్యా!

నా తండ్రీ! నీవు చేసిన నీ లీలలన్నింటినీ వొగడేరు (పొగడుచున్నారయ్యా!) లేవె (లేచిరావయ్యా!) ఇప్పుడు నీవు ఈ తిరుమల వేంకటకృష్ణయ్యవు, శ్రీదేవీ వల్లభుడవు. అదిగో చూడవయ్యా! ఆవలను (నీవాకిటి బయట) దేవతలు, మునులు, నారదాది భక్తులు సుప్రభాతమును పాడుచున్నారు. ఆకాశములో యెంత గుంపువున్నదో చూడు తండ్రీ! ఇంతమందికి నీ దర్శనం కావాలంటే యెంత సమయం పడుతుంది? లే నాన్నా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Uppavadamu Gavayya Uyyala Mancham Meeda In Telugu – ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద
సంఖ్య : 102
పుట : 74
రాగం : కాంబోధి

కాంబోధి

26 ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద
గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా.

||పల్లవి||

పవ్వళించే వీడ వచ్చి పాయనినీయలపెల్ల
మువ్వంకమేనితోడ ముచ్చట దీఱ
నవ్వేటి శ్రీసతిచూపు నాటినచిత్తపుమేన
క్రువ్వనికలువదండై గోవిందరాజా.

॥ఉప్ప||

నిద్దిరించే వీడ వచ్చి నిలుచున్నయలపెల్ల
ప్రొద్దు వొద్దునకుఁ దీర భోగీంద్రుపై
యిద్దరుసతులు నీకు నేచినతాళగతుల
గుద్దేటిపాదములతో గోవిందరాజా.

॥ఉప్ప||

మెండుగ మేలికొంటివి మించిన కౌఁగిటిలోన
కొండుకపాయపుసిరి కోపించంగా
ఉండవయ్యా సుఖలీల నుడివోనిప్రియముతో
కొండలకోనేటిరాయ గోవిందరాజా.

॥లలల||

అవతారిక:

‘ఉప్పవడము’ అవటం అంటే రాజీకి రావడం అన్నమాట. ఉయ్యాలమంచం మీద నీకు నీ దేవేరుల మాట వినక తప్పదు. గొప్ప గొప్ప కన్నులున్న గోవిందరాజువి నీవు. అయినా సరే, అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈ కీర్తనలో వేంకట మకుటం లేకపోవటం విశేషమే.

ఇటువంటి శృంగార కీర్తనల భావవివరణలో చిక్కేమిటంటే “యద్భావం తద్భవతి” – అంటే నీ భావన నీ భావానుగుణ్యంగానే వుంటుంది. కొండల కోనేటిరాయుడే ఈ గోవిందరాజు అంటున్నారు. కొండుకపాయపుసిరి అంటే చిన్నపిల్లవంటి శ్రీదేవి, కోపించిందట స్వామిపైన… యెందుకో? జాగ్రత్తగా చదివి భావించి పరవశించండి.

భావ వివరణ:

ఓ గోవిందరాజా! నీ విప్పారిన గొప్ప గొప్ప నయనాలు నీ భావములను తెలుపుతూనే వున్నాయి. నీవు ఈ ఉయ్యాలమంచము మీద భూదేవి, శ్రీదేవి సమేతుడవై వూగుచున్నావు. ఇప్పుడైనా, ఉప్పవడము గావయ్య (రాజీ మార్గానికి రావయ్యా!)

ఓ గోవిందరాజా! ఈ వైపునకు వచ్చి నీ అలసట దీరునట్లు ముచ్చట దీరగా, మువ్వంకమేనితో (మూడు అవస్థలను పొందుతున్న దేహముతో) నిదురించవయ్యా! చిరునవ్వులొలుకు శ్రీసతి చూపులు నీ చిత్తము పై నీ నాటుకొంటుండగా నీ వామె మెడలో క్రువ్వని కలువదండైనావు (వాడని కలువపూలహారమైనావు స్వామీ!)

ఈడ వచ్చి ప్రొద్దు వొద్దునకు (పూట పూటకు) నిలుచున్న అలు పెల్లదీర (అలసట యంతయు దీరునట్లు) భోగీంద్రునిపై (ఆదిశేషునిపై) విశ్రాంతిగా నిదురించవయ్యా! నీకు భూదేవి, శ్రీదేవి అను ఇద్దరు భార్యలు, యేచిన తాళగతుల (అతిశయించిన తాళానుగుణముగా) గుద్దేటి పాదములతో తన సతులను తనపాదములతో తేలికపాటి తాడనములిచ్చుచున్నాడు. ఈ గోవిందరాజస్వామి చిలిపి చేష్టలేమని వర్ణింతుము?

ప్రభూ! నీవు మెండుగా (మేలుగా) మేలుకొనినది కూడా, కొండొక ప్రాయపుసిరి కౌగిటిలోననే (లేబ్రాయపు చిన్నదైన శ్రీదేవిని గాఢాలింగనముననే) ఆమె నిదుర చెడి ఆమె నీపై కోపించినదాయెను. అయినదేమో అయినదని ఆమెను వూరడించి ఉడివోని ప్రియమున (తరగని అనురాగముతో) సుఖలీల (సుఖముగా) వుండవయ్యా! ఓ గోవిందరాజా! నీవే కొండలకోనేటిరాయుడవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Shiva Manasa Puja Stotram In Telugu – శివమానస పూజా స్తోత్రము

Shiva Manasa Puja Stotram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివమానస పూజా స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Shiva Manasa Puja Stotram Lyrics In Telugu

శివమానస పూజా స్తోత్రము 

శ్లో॥ రత్నైఃకల్పిత మాసనం హిమజలైఃస్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం |
జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ||

1

సౌవర్ణే మణిఖండరత్న రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్వా ప్రభోస్వీకురు||

2

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా హ్యేతత్సమస్తంమయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||

3

ఆత్మాత్వం గిరిజామతి స్సహచరాః ప్రాణశ్శరీం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షణవిధిః స్తోత్రాణి సర్వాంగిరో
యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభోః తవారాధనం ||

4

కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం |
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||

5

మరిన్ని స్తోత్రములు

Dasa Sloki Stuti In Telugu – దశ శ్లోకే స్తుతిః

Dasa Sloki Stuti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దశ శ్లోకే స్తుతిః గురించి తెలుసుకుందాం…

Dasa Sloki Stuti Telugu

దశ శ్లోకే స్తుతిః

సాంబో నః కులదైవతం పశుపతే సాంబ! త్వదీయా వయం!
సాంబం స్తొమి సురాసురోరగ గణాసాంబేన సంతారితాః
సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్పరం సో భజే
సాంబస్యాను చరోస్మ్యహం మమ రతి స్సాంబే పరబ్రహ్మణి.

విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణా జేతుం న శక్తేః స్వయం
యం శంభుం భగవన్ వయం తు పశవో స్మాకం త్వమేశ్వరః
స్వ స్వస్థాన నియోజితా స్సుమనస స్వస్థా బభూవు స్తతః
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

క్షోణీ యస్య రథో రథాంగయుగళం చంద్రార్కబింబద్వయం
కోదండః కనకాచలో హారి రభూదాణో విధి స్శారధిః
తూణీరో జలధిర్హయా శ్రుతిచయో మౌర్వి భుజంగాధిపః
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

యేనే పాదిత మంగజాంగ భీసితం దివ్యాంగ రాగై స్సమం
యేన స్వీకృత మబ్జ సంభవ శిర సౌవర్ణపాత్రై స్సమం
యేనాంగీకృత మచ్యుతస్య నయనం పూజారవిందై స్సమం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

గోవిందా దధికం న దైవత మితి ప్రోచ్చార్య హాస్తావుభా
వృద్ధృత్యాల థ శివస్య సన్నిధిగతో వ్యాసో మునీనాం వరః
యస్య స్తంభితపాణి రానతి కృతా నందీశరేణా భవత్
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

ఆకాశ శ్చికురాయతే దశదిశా భోగో దుకూలాయతే
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరా నందః స్వరూపాయతే
వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

విష్ణుర్యస్య సహస్ర నామ నియమా దంబోరుహాణ్యర్చయన్
ఏకో నోపచితేషు నేత్ర కమలం నైజం పదాబ్జద్వయే
సంపూజ్యా సురసంహితం విదలయం త్రైలోక్యపాలో భవత్
తస్మిన్మే హృదయం సుఖీన రమతాం సాంబే పరబ్రహ్మణి.

శౌరిం సత్యగిరం వరాహ వపుషం పాదాంబుజా దర్శనే
చక్రే యో దయయా సమస్త జగతాం నాథం, శిరో దర్శనే
మిథ్యావాచ మపూజ్య మేవ సతతం హంస స్వరూపం విధిం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

యస్యాసన్ ధరణీ జాలాగ్ని పవన వ్యోమార్క చంద్రా దయో
విఖ్యాతాస్తనవో ష్టధా పరిణతా నాన్యత్తతో వర్తతే
ఓంకారార్థ వివేచినీ శ్రుతిరియం చారి చష్ట తుర్యం శివం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

విష్ణుబ్రహ్మ సురాధిప ప్రభృతయ స్సర్వే పి దేవాయదా
సంభూతా జ్జలధే ర్విషాత్పరిభవం ప్రాప్తా స్తదా సత్వరం
తానార్తాన్ శరణాగతానితి సురాస్యో రక్ష దగ్ధక్షణాత్
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

ఇతి శ్రీ శంకారాచార్య కృత దశ శ్లోకీ స్తుతి

మరిన్ని స్తోత్రములు

Mangala Harathi Patalu In Telugu | మంగళ హారతి పాటలు

Mangala Harathi Patalu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంగళ హారతి పాటలు  గురించి భక్తి గీతాలలో తెలుసుకుందాం…

Mangala Harathi Patalu In Telugu

మంగళ హారతి పాటలు

పల్లవి:

శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా నిరామయా సర్వమంగళా

||శ్రీలలితా||

జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీవశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి

||శ్రీలలితా||

అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళలజ్యోతుల కర్పూర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి.

||శ్రీలలితా||

శీతాద్రి శిఖరాన

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మాతల్లి లత్తుకకు నీరాజనం –
నిండైన నీరాజనం – భక్తి మెండైన నీరాజనం.
యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం – భక్తి పొంగారు నీరాజనం
నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు
మాతల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం – భక్తి తాళాల నీరాజనం.
మనుజాళి హృదయాల తిమిరాలు కరిగించు
మాతల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం – భక్తి నృత్యాల నీరాజనం.
చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
మాతల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం – భక్తి జతనాల నీరాజనం.
శ్రీ లలితా పూజా విధానం
పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం – భక్తి కనరాగ నీరాజనం.
దహరాన కనిపించు ఇనబింబమనిపించు
మాతల్లి కుంకుమకు నీరాజనం
కెంపైన నీరాజనం – భక్తి పెంపైన నీరాజనం.
తేటి పిల్లలవోలె గాలి కల్లల లాడు.
మాతల్లి కురులకు నీరాజనం
నీలాల నీరాజనం – భక్తి భావాల నీరాజనం.
జగదేక మోహినీ సర్వేశదేహినీ
మాతల్లి రూపులకు నీరాజనం
నిలువెత్తు నీరాజనం – భక్తి విలువెత్తు నీరాజనం.

అండగా నీవు మాకు ఉండాలనీ

అండగా నీవు మాకు ఉండాలనీ
దండ నీ మెడలో వేశానమ్మా
కొండంత నీ ప్రేమ కావాలని
కోటి దండాలు నీకే పెడుతున్నానమ్మా.

॥అండ||

రాగద్వేషాలు మాలో నశించాలని
రత్న సింహాసన మమరించావమ్మా
రాజరాజేశ్వరి రమ్యముగా ఏతెంచి
మా పూజలందుకొని కాపాడవమ్మా.

॥అండ||

పవిత్ర మౌనీ పాదము మాకు ఆధారమని
పాలాభిషేకాలు చేశానమ్మా
పవిత్రమౌనీ నామము మానోట పలకాలని
పసుపు కుంకుమతో నిను అర్చించానమ్మా.

॥అండ||

తామసమును పోగొట్టే తరుణీమణి నీవని
పరిమళ తాంబూలాన్ని అందించానమ్మా
నా జీవన సర్వస్వం నీకే అంకితమని
కర్పూర నీరాజన మిస్తున్నానమ్మా.

॥అండ||

మధురమౌ నా మనసును మంత్రపుష్పముచేసి
మహేశ్వరి ముందుంచి మైమరచానమ్మా
ఆత్మ ప్రదక్షిణతో ఐక్యమై పోవాలని
అనుక్షణము నీ దీవెన ఆశించానమ్మా.

॥అండ||

మంగళ హారతి పాటలు:

Saptashloki Gita In Telugu – సప్తశ్లోకీ గీతా

Saptashloki Gita

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సప్తశ్లోకీ గీతా గురించి తెలుసుకుందాం…

Saptashloki Gita Telugu

సప్తశ్లోకీ గీతా

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్,
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్.

1

స్థానే హృషీకేశ ! తవ ప్రకీర్త్యా, జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ,
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, సర్వే నమస్యంతి చ సిద్ధసంఘా

2

సర్వతః పాణిపాదం తత్సర్వతో క్షిశిరోముఖమ్,
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి.

3

కవిం పురాణమనుశాసితారమణోరణీయాంసమనుస్మరేద్యః,
సర్వస్య ధాతారమచింత్యరూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.

4

ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్,
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్.

5

సర్వస్య చాహం హృది సన్నివిష్టో, మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ,
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాంతకృద్వేదవిదేవ చాహమ్.

6

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు,
మామేవైష్యసి యుకైవ మాత్మానం మత్పరాయణః.

7

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సప్తశ్లోకీ గీతా

మరిన్ని కీర్తనలు:

Sri Katyayani Devi Vratha Katha In Telugu – శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ

Sri Katyayani Devi Vratha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. వామన పురాణం ప్రకారం, మహిషాసుర అనే రాక్షసుడిపై వారి కోపం శక్తి కిరణాల రూపంలో వ్యక్తమైనప్పుడు దేవతల మిశ్రమ శక్తుల నుండి ఆమె సృష్టించబడింది . కాత్యాయన ఋషి యొక్క ఆశ్రమంలో కిరణాలు స్ఫటికీకరించబడ్డాయి , అతను దానికి సరైన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి ఆమెను కాత్యాయని లేదా “కాత్యాయన కుమార్తె” అని కూడా పిలుస్తారు. కాళికా పురాణం వంటి గ్రంథాలలో , ఆమెను మొదట పూజించినది ఋషి కాత్యయన అని పేర్కొనబడింది, అందుకే ఆమె కాత్యాయని అని పిలువబడింది . ఏది ఏమైనప్పటికీ, ఆమె దుర్గా యొక్క ప్రదర్శన లేదా స్వరూపం మరియు నవరాత్రి పండుగ యొక్క ఆరవ రోజున పూజించబడుతుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కాత్యాయని దేవి వ్రత  కథ గురించి తెలుసుకుందాం…

Sri Katyayani Devi Vratha Katha in Telugu

శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ

పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిశారన్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహుపురానములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి! నీవెన్నియో పురానములను వినిపించిటివి మరియు సందర్భానుసారముగా వ్రతములను, వ్రత మహాత్యములను తెలిపితివి. అయ్యా! ఇప్పుడు మాకొక ధర్మసందేహము తీర్చవలెను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించెను. ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రి యగు దక్షప్రజాపతి యజ్ఞ కుండమున పడి దేహ త్యాగామోనరించెను గదా! ఆ విధముగా, జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షిమ్పలేక పోయేనా? లేక సతీ దేవి యందు అనురాగాములేక మౌనముగా ఊరకుండెన? ఈశ్వరునకు భార్యా వియోగము యెట్లు సంభవించెను? మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి. అప్పుడు సూత మహర్షి ఓ మునులారా! మీ సందేహమును తప్పక పోగొట్టేడను. సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను.

దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవి ఈశ్వరునకు భార్యగా నోసంగెను. సతి దేవి పరమేశ్వరునితో కలిసో కైలాసమున సుఖముగా ఉంది కృతయుగము అంటాయి గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతిదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము అయ్యెను. సతి దేవి, ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచిన్చుచుండగా పక పకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కారించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాదా! మీరు ఎక్కడకు వెళ్ళినారు? ఏదులకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుమాట్లాడితినా? అని ప్రశించెను. వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ! నాకు విశునువు తండ్రివంటివాడు నేను అతనికి తండ్రివంతివాడను, మా యిరువురకు ఏ విధమగు అంతరమును లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీ రామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోను, సోదరుడగు లక్ష్మణుడి తోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వేద్దకుచూ ఆ అడవింతయు గాలించెను. సీత ఎక్కడను గానరాక, శ్రీరాముడు సీతా వియోగాభాదచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టాను, రెమ్మను సీతను చూసినారా? అని అడుగుతూ పోవుచుండెను. ఒక చోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివా, నాసీతను జూచితివా? అని ప్రశ్నించెను. ణా తండ్రియగు విష్ణువు కేక విన్నవెంటనే నేను అచ్చటకు వెళ్లి శ్రీ రాముని ఎదుట నిలబడితిని. కాని మానవరూపములో నున్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లు గానే ముందుకు బోయెను. అందుకే నీను నవ్వుచుంటిని. ఇంతే తప్ప మరియొక కారణము లేదుసుమా! అని ఈశ్వరుడు పలికెను.

ఆ మాటలు విన్న సతి ఓ నాదా! మీ మాటలు నమ్మ శక్యముగాలేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే మతి దప్పుతఎమి? సీతకోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇవి నమ్మశక్యముగాలేవు మీరు పరిహాసమాడుచున్తిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేక పోవుటయా? అని పల్కెను. వెంటనే శివుడు సతీ నీవు ణా మాటలు నమ్మని యెడల స్వయముగా నేవే అచటకుబోయి ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా చూడుము. నీకు అంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీ దేవి ఓ నాదా! నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్లి అచట శ్రీ రామ చంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి, చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదమై రాముని పరీక్షించదలచి “నేను సీతగా మారిపోవలేయునని” తలంచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పాడెను. అదే సమయమునకు కైలాసమండున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏవిధముగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని గాంచి కనులుమూసుకొని చేతులోగ్గి నమస్కారము గావించి మరల చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నాతల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించాసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాతా! నన్ను మోసగిమ్పదలచితివా? నాకు నాభార్య తప్ప మరియొక స్త్రీ నిజస్వరూపములో కనపడును. అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామా! నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమును దాల్చితిని. నీ సీత ఎచ్చట నున్నను మహాసాద్వియై యున్దగలదు. అని పలికి అదృశ్యమయ్యెను.

శివుడుకూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియు తెలియనివానివలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాదా! నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని, నిజముగా అతడు మహావిష్ణువై ఉండికూడా మానవునివలె, పామరునివలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని యెటుల పరీక్షించితివి? అని ప్రశ్నించెను. వెంటనే ఆమె ఓ నాదా! నీవు పరీక్షినిచిన విధముగానే నేనుకూడా పరీక్షించితిని అని చెప్పెను. అప్పుడు శివుడు, నీవుదాల్చిన ణా తల్లి రూపము ఇప్పటికి నాకన్నులకు కనబడుచున్నది. నీవు నాతల్లివి, అని ఆ సతీ దేవికి నమస్కరించి వెళ్లి పోయెను. అంతట ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒకతప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్దమాడుట మరియొక తప్పు. దీనిచే నేను కళంకము నోదితిని. ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని. అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను. అని అనేక విధములుగా ఆలోచించి, కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలువిధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుత యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను. సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్నాద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యగ్నమోనరించు కోరికను కలిగించెను.

ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింప దలచి శివునకు హవిర్భాగమివ్వకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగామునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగామునకు పరమేశ్వరునితో కలిసి వెల్లుదుమని ఈశ్వరుని కోరెను. ఆ యాగామునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్లి తీరవలేయునని మంకు పట్టు పట్టేను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుడు, బృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను.

దక్షుని యాగామందపములోనికి సతీదేవి ప్రవేశించి అచట తనవారేవ్వారు పలకరింప పోవుటచే అవమానముగా భావించి రాగులుచున్న అగ్ని గుండముచెంతకు చేరి చేతులు జోడించి “ఓ అగ్ని దేవా! నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని. ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను. కావున కళంక మొందిన ణా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగినవాడును, నిర్మలమగు మనసున్న ధీరహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము”. అని ప్రార్ధించి భగ భగ మండుచున్న అగ్నిగుండము లోనికి దుమికెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ బృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతి మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారామును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవారికకు చేరి తనవంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాతికను స్మశాన వాటికగా మార్చెను.

ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను . ఆ సమయమున పరమేశ్వరుని లలాతమునుంది చెమట బిందువొకటి భూమిపై బడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భూన భువనాన్తరములు ప్రతిధ్వనించునట్లు రోదన చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునొంది ఆ శిశువును ఒడిలోనికి జేర్చుకొని స్థన్య మోసంగెను. అప్పుడు రుద్రుడు ఆమెతో “ఓ భూదేవి నీవు చాలా పున్యాత్మురాలవు. ఈ ణా శిశువును నీవు పెంచుకొనుము. ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్థకనాముడు కాగలదు. ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అనికూకా పిలిచెదరు. నవగ్రహములలో ఇతడు ఒక గ్రహముకాగలదు. ఇతడు ఇంట కాలము నన్నాశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు విన్దురో వారికి కుజదోష పరిహారముఅగును”. అని శివుడు పలికి వెడలి మరియొక చోట సమాధి నిష్టాగరిష్టుడయ్యేను.

హిమవంతుడు ఒక పర్వత రాజు. అతడు నిర్మలమైన, చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మేనాదేవి. ఆ మేనాదేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని. అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే “కాత్యాయని” అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే “పార్వతి” అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి. ఆ కాత్యాయని శుక్ల పక్షములోని చంద్రునివలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోనే సర్వవిద్యా కలాకోవిదయై వెలుగొందెను . మరియు అఖండ మగు ఈశ్వరాధన ఆమెతో పెల్లుబికసాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతికి యుక్తవయసు రాగానే, దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మొనరించుటకు మన్మధుని బంపేను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్న పరచిన మన్మధుని మూడవ నేత్రముతో భాస్మిపతలము గావించి వెడలిపోయెను.

పార్వతి తన కన్నుల యెదుట జరిగిన సంఘటన గాంచి భయపడక, ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము గావిన్చుకోదలచి కటోరమైన తపము సలిపెను. ఆ తపస్సు చే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరనకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవో పేతముగా శివపార్వతి కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించెను.

శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో వుండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై బడి తన భర్తను బ్రతికింపమని ప్రార్ధింపగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రాతీదేవికి మాత్రమె కనిపించునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలందరూ పరమేశ్వరుని దయా దృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్శము కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో “ఓ నాదా! కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గతజన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమోనరించితిని. తిరిగి అతడు నీ లలాటమునుంది చెమట బిందువు రూపములో నీకు దూరము కావడమువలన మరల నేను నీకు దగ్గరైతిని. కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు గూడా బాధలేకుండా చేయగలరు అని ప్రార్ధించెను. వెంటనే శివుడు ఆమెతో “ఓ పార్వై! కుజుని జన్మకతను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చితిని. ఎప్పుడు నీకోరిక ననుసరించి లోకములోని జనులకు కుజదోషపరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయు చుంటిని. ఆ వ్రాతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు, ప్రదోషకాలమగుటచే నేనునూ అందు భాగాస్వాములమైతిమి. “కాత్యాయని వ్రతము” అను పేరుతొ భూలోకములో సుస్తిరముకాగలదు. అని పలికెను. ఆమాటలు విని పార్వతి ఎటో సంతోశాపడెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోతిదేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను. అని సూత మహర్షి శోవ్నకాడులకు వినిపించెను.

వ్రత విధానము:

వివాహ ప్రతిబంధక దోషములున్ననూ నివారణ అగుటకు, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకునూ కాత్యాయని వ్రతముతో సాతియైనది మరియొకటి లేదు. ఈ వ్రతమును ఆచరిన్చువారికి భక్తి విశ్వాసములు ముఖ్యము. తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించవలెను. ఆ రోజు ఉదయము కాళ్ళకృత్యములు, తీర్చుకొని భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను. ముందుగా గణపతిపూజచేసి ఆపిదప ఒక కలశమును ఏర్పాటుచేసి అందు సగమువరకూ పవిత్రోదకము పోసి మామిదిచిగుళ్ళనుంచి, ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై వుంచి, ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై వుంచి, అందు పరమేశ్వరుని నామంకమున వున్న కాత్యాయనిదేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్ధలతో ఇరవదిఒక్క ఉపచారములతో ఆ దేవిని పూజించావలేయును. ఎర్రని పుష్పములతో, పసుపు, కుంకుమ లతో పూజించవలెను. బంగారముతోగాని, పసుపుకోమ్ముతోగాని వారి వారి శక్తానుసారము మంగళ సూత్రములను కలశామునకు అలంకరించవలెను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు చేరుకుగాడతో కోసిన ఏడు చేరుకుముక్కలను కలిపి నైవేద్యము చేయవలెను. భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని, ఆ అక్షతలను అమ్మవారిమీది వుంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనము జరుపవలెను. ఈ విధముగా ఏడు వారములు వ్రతము భక్తితో జరుపవలేయును. మధ్యలో ఎవారమైన అద్దంకి వచ్చినచో ఆపై వారము జరుపుకోవలెను. ఏనామిదవ మంగళవారము ఉద్యాపన జరుపవలేయును. ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటుపోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను, ఏడు చేరుకుముక్కలను శక్త్యానుసారముగా చీర, రవికలగుడ్డ వాయనమిచ్చి వారినుండి ఆశీస్సులు పొంది, వారికి భోజనము పెట్టవలెను. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి, శీఘ్రముగా వివాహమగును. మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును. పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను, రుక్మిణి ఈ వ్రతమాచరించి వుద్యాపననాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించెను.

మరిన్ని వ్రతాలు:

Sri Shiva Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్

Sri Shiva Ashtottara Shatanama Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Ashtottara Shatanama Stotram Lyrics

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్

శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః,
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ||

1

శంకర శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః,
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠోభక్తవత్సలః ||

2

భవశ్శర్వస్త్రిలోకేశ శ్శితికంఠఃశ్శివాప్రియః,
ఉగ్రః కపాలి కామారి అంధకాసుర సూదనః ॥

3

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః,
భీమః పరశుహస్తశ్చ మృగపాణి ర్జటాధరః ॥

4

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః,
వృషాంకో వృషభారూఢా భస్మోద్ధూళిత విగ్రహః ||

5

సామప్రియస్స్వరమయ స్త్రయీమూర్తిరనీశ్వరః,
సర్వజ్ఞః పరమాత్మా సోమసూర్యాగ్ని లోచనః ||

6

హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్ర స్సదాశివః,
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ||

7

హిరణ్యరేతా దుర్దర్ష్ గిరీశో గిరీశోఁనఘః,
భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ||

8

కృత్తివాసాః పురారాతి ర్భగవాన్ ప్రమథాధిపః,
మృత్యుంజయ సూక్ష్మతను ర్జగద్వ్యాపీ జగద్గురుః ||

9

వ్యోమకేశో మహాసేనజనక శ్చారు విక్రమః,
రుద్రోభూతపతిః స్థాణు రహిర్భుధ్న్యో దిగంబరః ॥

10

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్విక శ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశు రజః పాశవిమోచకః ॥

11

మృడః పశుపతిర్దేవో మహాదేవోవ్యయో హరిః,
పూషదంతభిదవ్యగ్రోదక్ష్యాధ్వరహరో హరః ||

12

భగనేత్రభి దవ్యక్తస్సహస్రాక్షస్సహస్రపాత్,
అపవర్గ ప్రదో2 నంత స్తారకః పరమేశ్వరః ||

13

ఏవం శ్రీశంభుదేవస్య నామ్నా మష్టోత్తరంశతమ్.
శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ సమాప్తమ్.

మరిన్ని స్తోత్రములు