Enni Mahimalavade Yi Devudu In Telugu – ఎన్నిమహిమలవాడె యీ దేవుడు

ఎన్నిమహిమలవాడె యీ దేవుడు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఎన్నిమహిమలవాడె యీ దేవుడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎన్నిమహిమలవాడె యీ దేవుడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన: ఎన్నిమహిమలవాడె యీ దేవుడు
సంఖ్య : 177
పుట: 119
రాగం: హిందోళవసంతం

హిందోళవసంతం

46 ఎన్నిమహిమలవాఁడె యీ దేవుఁడు
కన్నులపండువలెల్లాఁ గదిసిన ట్టుండెను

||పల్లవి||

పోలింప కర్పూరకాపు పురుషోత్తమునికి
యే లీ నుండెనని యెంచి చూచితే
పాలజలనిధిలోనఁ బవళింపఁగా మేన
మేలిమి మీఁగఁడంటిన మెలుపుతో నుండెను

||ఎన్ని||

తట్టుపునుఁగుకాపు దైవశిఖామణికి
యెట్టుండె నని మరి చూచితే
చిట్టకాన రేపల్లెలో చీఁకటితప్పు సేయఁగా
అట్టిరాత్రులు మేన నంటిన ట్టుండెను

||ఎన్ని||

అలమేలుమంగతోడ నట్టె సొమ్ము ధరించఁగ
యేలమి శ్రీవేంకటేవు నెంచి చూచితే
కలిమిగల యీ కాంత కౌఁగిటఁ బెనఁగఁ గాను
నిలువెల్లా సిరులై నిండిన ట్టుండెను

||ఎన్ని||

అవతారిక:

ఈ తిరుమలేశుడు యెన్ని మహిమలు గలవాడె! అని ఆశ్చర్యపడుతున్నారు అన్నమాచార్యులవారు. ఆ మహిమలన్నీ కన్నులపండువగా శోభిల్లుతున్నాయని అంటున్నారు. అన్నమయ్యకి ఈ మధురమైన భావలహరియెలా వస్తుందా అనిపించి, ఏడుకొండలవాడే ఆ భావలహరిని ఆయనలో యెగసిపడేలా చేస్తాడు అని సమాధానపడ్డాను. శ్రీమహాలక్ష్మియైన అలమేల్మంగ ఈ స్వామి కౌగిట్లో కరిగే తరుణంలో ఆవిడ ఒంటిమీద నగలన్నీ ఈయనకు అంటుకున్నాయట. భళి భళీ! నీ వూహ భావాతీతమయ్యా! అన్నమయ్యా!

భావ వివరణ:

ఈ దేవదేవుడు యెన్ని మహిమలు కలవాడో యేమని చెప్పగలను? అవి కన్నులపండుగలై అన్నీ నన్ను దగ్గరై అలరించుచున్నవి.

ఈస్వామికి కర్పూరపు వంటిపై మెత్తారు. ఆకలింప (ఆరంగారంగవేసిన) ఆకాపు ఈ పురుషోత్తమునికి ఎలావున్నదంటే… పాలసముద్రములో, పవ్వళించినందున అలల తాకిడికి అంటిన లేతలుంగారు రంగు మీగడ బాగా అంటుకొని మెలపుతో (మెత్తినట్లుగా) వున్నది.

పునుగుపిల్ల నుంచి తీసిన సుగంధద్రవ్యము తట్టుపునుగు. దేవతలందరిలో శిఖామణి (తలమానికమైన) ఈ స్వామి నిమజ్జనానంతరం తట్టు పునుగు కాపు వేస్తారు (మెత్తుతారు). మరి పరికించి చూచితే అది యెట్లా వుంటుందంటే… చిట్టకాన (శృంగారలీలగా) అలనాడు రేపల్లెలో ఈ శంగారరాయుడు అనేక “చీకటి తప్పులు” సేసినందున ఆ రాత్రులన్నీ ఈయన వంటిపై ఒకదాని తర్వాత ఒకటి అంటుకొని, అందాలమేనిపై ఆ తట్టు పునుగుకాపు ఇంకా అందము పెంచుతున్నది. నేడు అలమేల్మంగతో చేరిన ఈ మహానుభావుడు అట్టె (అదిగో) యెలావున్నాడంటే… కలిమికాంత (శ్రీమహాలక్ష్మియైన) ఆదేవిని ఈ శ్రీవేంకటేశ్వరుడు బిగి కౌగిట జేర్చగా, పెనగులాడెడి, ప్రేయసి ఒంటిపై నగలన్నీ ఈ చిలిపి శ్రీనావాసునికి అటుకొన్నవా అన్నట్లుంది. అందుచేతనే ఈయనకు నిలువెల్లా సిరులై (నగలై) నిండిపోయినవా అన్నట్లుంది. ఇకపై చెప్పే శక్తి నాకు లేదు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vitharanasili Vikramarkudu In Telugu – వితరణశీలి విక్రమార్కుడు

Vitharanasili Vikramarkudu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

విక్రమార్కుని సాహసగాధల నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వితరణశీలి విక్రమార్కుడు నీతికథ. 

వితరణశీలి విక్రమార్కుడు

విక్రమార్కుని ధైర్యసాహసాలు దానపరోపకారగుణాలు త్యాగనిరతి పేరుప్రతిష్ఠలు దిగ్దిగంతాలకు వ్యాపించినాయి. ఒకరోజు అవంతీరాజు ఒకభట్రాజు పద్యాల ద్వారా విక్రమాదిత్యుని గుణగణాలను విన్నాడు. ఇంత నీతిమంతుడు సత్యనిష్ఠుడు గుణాగ్రగణ్యుడు లోకంలో ఉంటాడా? అని అశ్చర్యమేసింది ఆయనకు. విక్రమార్కుని మీద కించిత్ అసూయపడి “నాకు విక్రమార్కుడంత కీర్తిప్రఖ్యాతులు ఎలావస్తాయి?” అని విచారించసాగినాడు. అదే ఆలోచిస్తూ పరాకుగా ఉండటం మొదలుపెట్టాడు.

ఒకరోజు అవంతీరాజు వద్దకు ఒక సన్యాసి వచ్చాడు. యథావిధిగా అతనిని పూజించి రాజు “స్వామి! విక్రమార్కుని గుణగణములు నేను ఒక భట్రాజు ద్వారా విన్నాను. ఆ విక్రముడంతటివాడు మీ భూమిమీదు లేడు. అట్టి యసస్సు నాకెలా వస్తుందో చెప్పండి” అని ప్రార్థించాడు. సన్యాసి “రాజా! నీకొక సూక్ష్మోపాయం చెబుతాను. హిమవన్నగర సమీపములో ఒక కాళికాలయం ఉన్నది. సిద్ధప్రదేశమైన ఆ ఆలయం వద్ద కొందరు యోగపురుషులు హోమక్రియలు చేస్తుంటారు. నీవక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శుచివై ఆలయప్రాంతంలోకి ప్రవేశించు. గుండమొకటి త్రవ్వి కాళికాదేవికై హోమముచేసి చివరికి గుండములో దూకి నిన్ను నువ్వే పూర్ణాహుతి చేసుకో. దయాసాగరులైన ఆ యోగపురుషులు నిన్ను రక్షిస్తారు. నీ సాహసానికి మెచ్చి దేవి కరుణిస్తుంది” అని హితము చెప్పాడు.

సదాచారుడైన రాజు అటులనే చేశాడు. ప్రత్యక్షమైన కాళికాదేవితో “ప్రతిదినమూ ఏడుకోట్ల ధనం నాకు రావాలి” అని అడిగాడు. “నాయనా! ప్రతిరోజూ నీవు హోమంచేసి పూర్ణాహుతి నిచ్చినట్లయితే నీవు కోరుకున్నట్టే జరుగుతుంది” అని దేవి చెప్పి అంతర్ధానమయినది. అవంతీరాజు యోగపురుషులకు కృతజ్ఞతలు తెలిపి నగరానికి వచ్చి దేవి ఆజ్ఞానుసారం చేసి ప్రతిరోజూ ఏడుకోట్లు సంపాదించాడు. ఆ ధనముతో ఎన్నో అద్భుతమైన దానధర్మాలు చేసి దానకర్ణుడని ప్రఖ్యాతిని పొందినాడు.

Vitharanasili Vikramarkudu Katha

విమలుడైన విక్రమాక్రుడు అవంతీరాజు యొక్క కీర్తిని విన్నాడు. తక్షణమే హిమవత్పర్వతములోని కాళికాలయానికి వెళ్ళి స్నానముచేసి శుచి అయ్యి ఆలయములో హోమముచేసి తన శరీరాన్ని పూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై వరంకోరుకోమన్నది. కైలాశశిఖరమంత ఉన్నత హృదయం కల విక్రమాదిత్యుడు ఇలా కోరినాడు “గుణవంతుడైన అవంతీరాజు తన శరీరాన్ని పూర్ణాహుతిని చేయకుండానే ఆ ధనం అతనికి వచ్చేటట్టు దానితో అతడు మరిన్ని దానధర్మాలు చేసుకునేటట్టు అనుగ్రహించు తల్లీ”. దేవి విక్రమార్కుని త్యాగనిరతి చూసి “తథాస్తు” అని ఆశీర్వదించింది.

ఈ విషయం తెలుసుకున్న అవంతీరాజు విక్రమాదిత్యుని వద్దకు వచ్చి “రాజా! నీ వితరణశీలత అపూర్వము అద్వితీయము. నీవంటి సౌశీల్యుడైన రాజు యీ భువిలో పుట్టబోడు” అని స్తుతించి కృతజ్ఞతలను తెలుపుకొని వెళ్ళిపోయాడు.

పిల్లలూ! మరి మనకింతటి విశాల హృదయం వితరణగుణం ఉన్నాయా?

మరిన్ని నీతికథలు మీకోసం:

Accutum Daniyedi Namamu Galiginayatti In Telugu – అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి

అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి
సంఖ్య : 104
పుట: 70
రాగం: సామంతం

సామంతం

1 అచ్చుతుఁ డనియెడి నామముగలిగినయట్టి నీవెకాక
కుచ్చి నీకు నేశరణని కొలిచితి గురుతుగఁ గావఁగదే

||పల్లవి||

అణురూపగు మశకములోపల నణఁగిన నీకంటే
గుణించి యెంచి చూచినను కొంచె మింక నేది
ప్రణుతింపంగ బ్రహ్మాండకోట్లు భరియించు నీకంటే
గణనకు నెక్కుడు నీవేకాక ఘన మిఁక నేది

||అచ్చు||

దాకొని జగములు పుట్టించుబ్రహ్మకు తండ్రివి నీవే
కైకొని చదువులఁ దెలిసిచూడ రక్షకు లిఁక మరి వేరీ
యేకోదశముగ వటపత్రమున యీఁదేటి నీకంటే
దీకొని పలికిన కాలంబులు కొనదేవుఁడు మఱి వేఁడీ

||అచ్చు||

శ్రీవేంకటమున వరము లొసఁగేటి శ్రీపతి నీకంటే
తావునఁ గన్నులఁజూడఁగఁ బ్రత్యక్షదైవము మరివేఁడీ
వేవేలకు వైకుంఠవిభుఁడవై వెలసిన నీకంటే
భావించి చూచిన నంతరంగమునఁ బరోక్షదైవము మరివేఁడీ

||అచ్చు||

అవతారిక:

శ్రీమన్నారాయణుని స్తుతిస్తున్నారు అన్నమాచార్యులవారు. ‘కుచ్చి’ అంటే కుచించుకుపోయి, లేక బాగా తగ్గిపోయి అని అర్థం. అచ్చుతుడంటే ‘చ్యుతి’ లేక నాశనమెరుగనివాడు. “ఓ ప్రభూ! అచ్చుతుడనే పేరుగల నీవు కాక, రక్షించే వారెవరు వున్నారు? అణకువతో నిన్ను శరణని కొలిచితేచాలు. ఈ మాటే గుర్తుగా మమ్ము గావగదే!” అంటున్నారు భక్తిని ప్రకటించాలి అంటే శరణాగతిని మించిన ఉపాయము లేదు. ఈ కీర్తన వివరణ అనుకున్నంత తేలికకాదని పల్లవి చదవంగానే అర్థం అయింది. అయితేనేమి ఆదిలోనే ఆదిదేవునితో అంతయు నీవేహరి పుండరీకాక్ష! అన్నాము కదా! ఇంకా భయమెందుకు? పదండి ముందుకు.

భావ వివరణ:

ఓ దేవదేవా! అచ్చుతుడు (అచ్యుతుడు) అనే పేరుగల నీవు తప్పించి, మాకు మరొక దిక్కులేదు. నీకు నేను కుచ్చి (వినమ్రుడనై) నీవే శరణని కొలిచితిని. నన్ను గురుతుగ (నన్నే లక్ష్యముగా) కావగ (రక్షింపు తండ్రీ)

అణురూపములోనున్న (అత్యల్ప పరిమాణముగల) మశకము (దోమ) లోపలకూడా అణగియున్న నీకంటే లెక్క కట్టటానికి, కొంచెమింకనేది (అల్ప ప్రాణియేదీ?) ప్రణుతింపగా (కీర్తించగా) అనంత కోటి బ్రహ్మాండములను నీ వుదరములో భరిస్తున్నావు. గణనకు నెక్కిన (ప్రసిద్ధుడైన) దెవరు? ఎవ్వరూ లేరయ్యా!

దాకొని (అవ్యక్తుడవై) జగములనన్నింటినీ సృజించు పరమేష్ఠి అయిన బ్రహ్మదేవుని సృజించి నీవు ఆయనకు తండ్రిగారైనావు. ఆనాడు సోమకుడు అనే రాక్షసుడు ఆయన దగ్గరనుంచి చదువులను (వేదములను కాజేస్తే నీవు కైకొని (పూనుకొని) వాడిని చంపి, వాటిని కాపాడినావు. నీకంటే రక్షకులెవరు?

ఏకోదకముగా (ఒక్క నీరు తప్ప ఇంకేమీ లేనట్లుగా వున్నప్పుడు, వటపత్రశాయివై (ఒక్క మఱియాకుపై పవ్వళించిన శిశువు వలె యీదేటి (తేలిన) నీకంటే దీకొని పలికిన (ధైర్యంగా చెప్పాలంటే) కాలంబుల కొనదేలిన (యుగాంతాలలో కూడావుండే దేవుడు మఱివేఁడి (ఇంకలేడయ్యా!)

శ్రీవేంకటాద్రి మీద వెలసి వరములనొసగే శ్రీపతీ! నీకంటే తావున గన్నుల జూడ (నెలకొని చూడాలంటే) ఇంకొక ప్రత్యక్షదైవము లేనేలేడు. వేవేలకు (వేలకొద్దీ శరణాగతుల కొరకు) వైకుంఠపతివై ఈ తిరుమలలో వెలసిన నీకంటే అంతరంగమున (మానసాకాశమున) భావించి చూచిన (భావనలో నిలిపి సందర్శించిన) ఇంకమరి యొక పరోక్షదైవము (ఇంద్రియములకు _గోచరింపని పరమాత్మ) మరి వేఁడీ (ఇంకాయెవ్వరున్నారు?)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Bhu Suktam In Telugu – భూ సూక్తం

Bhu Suktam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ భూ సూక్తం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

Bhu Suktam In Telugu Lyrics

భూ సూక్తం

ఓం భూమిర్భూమ్నా ద్యౌర్వరిణాఽంతరిక్షం మహిత్వా ।
ఉపస్థే తే దేవ్యదితేఽగ్నిమన్నాద-మన్నాద్యాయాదధే ॥

ఆఽయంగౌః పృశ్ఞిరక్రమీ-దసనన్మాతరం పునః ।
పితరం చ ప్రయంథ్-సువః ॥

త్రిగ్ంశద్ధామ విరాజతి వాక్పతంగాయ శిశ్రియే ।
ప్రత్యస్య వహద్యుభిః ॥

అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి రోచనా ।
వ్యఖ్యన్-మహిషః సువః ॥

యత్త్వా క్రుద్ధః పరోవపమన్యునా యదవర్త్యా ।
సుకల్పమగ్నే తత్తవ పునస్త్వోద్దీపయామసి ॥

యత్తే మన్యుపరోప్తస్య పృథివీ-మనుదధ్వసే ।
ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్న్ ॥

మేదినీ దేవీ వసుంధరా స్యాద్వసుధా దేవీ వాసవీ ।
బ్రహ్మవర్చసః పితృణాం శ్రోత్రం చక్షుర్మనః ॥

దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరీ ।
సదనే సత్యాయనే సీద ।

సముద్రవతీ సావిత్రీ ఆహనో దేవీ మహ్యంగీ ।
మహో ధరణీ మహోఽత్యతిష్ఠత్ ॥

శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్నీ వ్యాపినీ సరసిజ ఇహ ।
వాయుమతీ జలశయనీ స్వయం ధారాజా సత్యంతో పరిమేదినీ
సోపరిధత్తంగాయ ॥

విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియామ్ ।
లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్ ॥

ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి ।
తన్నో ధరా ప్రచోదయాత్ ।

శృణ్వంతి శ్రోణామమృతస్య గోపాం పుణ్యామస్యా ఉపశృణోమి వాచమ్ ।
మహీందేవీం-విష్ణుపత్నీ మజూర్యాం ప్రతీచీమేనాగ్ం హవిషా యజామః ॥

త్రేధా విష్ణు-రురుగాయో విచక్రమే మహీం దివం పృథివీ-మంతరిక్షమ్ ।
తచ్ఛ్రోణైత్రిశవ ఇచ్ఛమానా పుణ్యగ్గ్ శ్లోకం-యజమానాయ కృణ్వతీ ॥

స్యోనాపృథివిభవానృక్షరానివేశనీ యచ్ఛానశ్శర్మ సప్రథాః ॥

అదితిర్దేవా గంధర్వా మనుష్యాః పితరో సురాస్తేషాగ్ం సర్వ భూతానాం మాతా మేదినీ మహతా మహీ ।
సావిత్రీ గాయత్రీ జగత్యుర్వీ పృథ్వీ బహులా విశ్వా భూతాకతమాకాయాసా సత్యేత్యమృతేతి వసిష్ఠః ॥

ఇక్షుశాలియవసస్యఫలాఢ్యే పారిజాత తరుశోభితమూలే ।
స్వర్ణ రత్న మణి మంటప మధ్యే చింతయేత్ సకల లోకధరిత్రీమ్ ॥

శ్యామాం-విచిత్రాం నవరత్న భూషితాం చతుర్భుజాం తుంగపయోధరాన్వితామ్ ।
ఇందీవరాక్షీం నవశాలి మంజరీం శుకం దధానాం శరణం భజామహే ॥

సక్తుమివ తితఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచ మక్రత ।
అత్రా సఖాస్సఖ్యాని జానతే భద్రైషాం-లక్ష్మీర్నిహితాధివాచి ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

మరిన్ని భక్తి యోగం:

Nijayitee In Telugu – నిజాయితీ

Nijayitee

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

స్వాతంత్ర్య సమరయోధులనాటి నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… నిజాయితీ కథ. 

నిజాయితీ

భారతదేశపు వైద్య విధానం ఆయుర్వేదం. బ్రిటిషర్లు మనదేశాన్ని ఆక్రమించి వారి వైద్యవిధానమైన అల్లోపతి ని ప్రవేశపెట్టకముందు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంలో ఉండేది. కాని బ్రిటిషర్ల పాలనవలనో మనలో అలవాటైన బానిస భావన వలనో మెల్లిమెల్లిగా ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. చాలామంది ఆయుర్వేదం పనికిరాదని తోసివేశారు. అట్టి కాలంలో బెంగాలుకు చెందిన ఓ ప్రముఖ విద్యావేత్త ఆయుర్వేదాన్ని కాపాడుకోవటానికి నడుంకట్టాడు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారుచేసే ఒక సంస్థను స్థాపించాడు.

అలా ఎంతో కష్టపడి ప్రతికూలమైన పరిస్థితులలో సంస్థని నడుపుతుండగా ఒకనాడు ఆ విద్యావేత్తకు ఒక భీషణమైన సమస్య ఎదురయ్యింది. ఆ సంస్థ తయారు చేసిన ఎన్నో మందులు ఏదో కారణముగా పాడైపోయాయి. ఆ విద్యావేత్త ఎంతో దుఃఖించాడు. అతని విచారం చూసి అక్కడే ఉన్న ఓ ఉద్యోగి ఇలా పలికాడు “అయ్యా! మీరు విచారించకండి. ఇంకా ఈ మందులు పూర్తిగా పాడు అవ్వలేదు. ఇంకొన్నాళ్ళు సునాయాసంగా మనం వీటిని అమ్మవచ్చు. అట్లు చేయకున్న మనకు చాలా నష్టం వస్తుంది. ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలన్న మీ ఆశయం కూడా అప్పుడు నెరవేరక పోవచ్చు”.

ఇటువంటి అవినీతి భరితమైన మాటలు విని ఆ విద్యావేత్త మండిపడుతూ ఇలా జవాబిచ్చాడు “నష్టమొస్తుందని పాడైపోతున్న మందుల్ని అమ్ముతామా? అట్టి నీచమైన కార్యాన్ని నేనెన్నడూ చేయలేను. ఆయుర్వేదం ధర్మం ఉన్నచోటే ఔషధాలు పనిచేస్తాయని చెప్పింది. కనుక నా ఆశయం ధర్మస్థాపనే”. అలా హితబోధ చేసి ఆ మందులన్నిటిని బయటపడ వేయించి తన ఆదర్శాన్ని కాపాడుకొన్నాడు. తరువాత ఆ విద్యావేత్త లోని నిజాయితీని అందరూ కొనియాడారు.

ఆ ప్రసిద్ధ విద్యావేత్త ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్. భారతీయుల యొక్క విజ్ఞానము గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఈయన ఎన్నో వ్యాసాలు వ్రాసినారు. “Chemical Knowledge of the Hindus” అనే వ్యాసం మనమందరం చూడదగినది. ఈ వ్యాసంలో ప్రఫుల్ల చంద్ర గారు మన భారతదేశం ఆధ్యాత్మికత బోధించడంలోనే కాదు విజ్ఞాన పరంగా కూడా ఎంతో ముందున్నదని చెబుతారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. నిజాయితీ యొక్క ప్రాముఖ్యత మనమీ కథలో తెలుసుకొన్నాము. ఎంత నష్టమైనా రాని ఏమైనా కానీ ఎన్నడు అవినీతికి పాల్పడరాదని శ్రీ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ గారు మనకు చూపించారు.
  2. మన స్వదేశీ విజ్ఞానం యొక్క గొప్పతనం చంద్ర గారి వ్యాసాల ద్వారా తెలుసుకొన్నాము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Mallikarjuna Stotram In Telugu – శ్రీ మల్లికార్జున స్తోత్రమ్

Sri Mallikarjuna Stotram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మల్లికార్జున స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Mallikarjuna Stotram In Telugu Lyrics

శ్రీ మల్లికార్జున స్తోత్రమ్

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్,
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమశ్శంకరపార్వతీభ్యామ్.

టీక. నవయౌవనాభ్యాం = నిత్యనూతనమగు యౌవనమును గల్గినట్టియు, పరస్పర = అన్యోన్యము, అశ్లిష్ట = ఆలింగనముఁ జేసికొనఁబడిన, వపుః = శరీరమును, ధరాభ్యాం = ధరించినట్టియు, నాగేంద్రకన్యా = హిమవ త్పుత్రికయు, వృష కేతనాభ్యాం = నృవభధ్వజమును గల్గినట్టియు, శివాభ్యాం = మంగళకరులైన, శంకరపార్వతీభ్యాం = పార్వతీపరమేశ్వరుల కొఱకు, నమోనమః = ముమ్మాటికి నమస్కారము ( ఇందు మొదట నొక – నమః, నాల్గవపాదాది నమోనమః – అని రెండును గలిని ముమ్మారు నమ స్కారమని యర్థము.)

తా. నిత్యనూత్న యౌవనశోభితులును, పరస్పరాలింగిత శరీరులు నర్ధనారీశ్వర రూపులును, హైమవతీ వృషభవ తాకములను గలిగి శోభన దేహమున నొప్పారు పార్వతీపరమేశ్వరులకు మా నమస్కారము.

నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్,
విభూతి పాటీరవిలేపనాభ్యాం
నమో నమశ్శంకరపార్వతీభ్యామ్.

టీక. శివాభ్యాం=మంగళకరులైనట్టియు, వృష వాహనాభ్యాం = వృష భము వాహనము: గఁ గలిగినట్టియు; విరించి = బ్రహ్మ చేత, విష్ణు = విష్ణువుచేత, ఇంద్ర = దేవేంద్రునిచేత, సుపూజితాభ్యాం = బాగుగఁ బూజింపఁబడినట్టియు, విభూతిపాటీరవిలేపనాభ్యాం = భస్మ మొక వైపు నను, మంచిగంద మొక ప్రక్కను మైపూతగాఁగలిగినట్టి, శంకరపార్వతీభ్యాం = పార్వతీపర మేశ్వరులకు, నమః, నమోనమః = ముమ్మాటికి నమస్కారము,

తా. శుభాకారులైనట్టియు, వృషభ వాహనారూఢులును, బ్రహ్మ విష్ణ్వంద్రాదులచేఁ బూజింపఁబడునట్టియు, విభూతియు, మంచిగందము నిరుప్రక్కలఁ బ్రత్యేకముగఁ బూసి కొన్న దేహముగల ఆ పార్వతీపరమేశ్వరులు నా నమస్కారములను గ్రహింతురుగాక!

అనఘం జనకం జగతాం ప్రథమం
వరదం కరశూలధరం సులభమ్,
కరుణాంబునిధిం కలుషాపహరం
ప్రణమామి మహేశ్వరమేకమహమ్.

టీక. అనఘం = పాపరహితుఁడును, జగతాం = లోకములకు, జనకం = తండ్రియైనట్టివాఁడును, ప్రథమం = దేవతలలో నాద్యుఁడైనట్టివాఁడును, వరదం = వరము లిచ్చు వాఁడును, కరశూలధరం = చేతియందు శూలా యుధమును ధరించినవాఁడును, సులభం = సౌలభ్యముగలవాఁడును (ఆఁగా భగవతుఁడు భక్తసులభుఁడనుట) కరణాంబునిధిం = దయా సముద్రుఁడును,కల షాపహరం = ఆశ్రితుల పాపమునుబోగొట్టువాఁడును, ఏకం = ఆద్వితీయమైన, మహేశ్వరం = శ్రీ శైలనాథుని, అహం = నేను, ప్రణమామి = నమస్కరించుచు న్నాను.

తా. పుణ్యరాశియు, సర్వలోకజనకుఁడును, ఆద్యుఁడును, వర ప్రదాతయు, శూలపాణియు, సులభుఁడును, దయాసము ద్రుఁడును, జీవులాశ్రయించినచోఁ బాపములు హరించు వాఁడును, నద్వైతమూర్తి యునగు నా శివుని నే నెల్లప్పుడు నమస్కరించుచున్నాను.

అమలం కమలోద్భవగీతగుణం
శమదం సమదా సుర నాశకరమ్,
రమణీయరుచిం కమనీయ తనుం
నమ, సాంబశివం నతపాపహరమ్.

టీక. ఆమలం = స్వచ్ఛుఁడైనట్టియు, కమలోద్భవ = బ్రహ్మచే, గీత = కీర్తింపఁబడిన, గుణం = గుణములు గలవాఁడును, శమదం = ఇంద్రియ నిగ్రహప్రదుఁడును, సమదాసుర = మదముతోఁ గూడిన రాక్షసులకు, నాశకరం = వినాశకరుఁడైనట్టివాఁడును, రమణీయ = సుందరమైన, రుచిం = కాంతిగలవాఁడును, కమనీయ = కోరఁదగిన, తనుం = దేహముగలవాఁడును, నత = నమస్కరించెఁడివారి, పాపహరం = పాపముల హరించునట్టి, సాంబశివం = అర్థనారీశ్వరుఁడగు శివుని, నమ = నమస్కరింపుమా !

తా. ఓ మనసా! నీవు – నిర్మలుఁడును, బ్రహ్మాది దేవతాస్తూయ మానుఁడును, మనోనిగ్రహప్రదుఁడును, మదించిన రాక్షసుల మదమడంచినవాఁడును, సుందరమగు కాంతియు, స్వచ్ఛమై రమణీయ దేహముగల సాంబశివుని నమస్కరింపుము – నీ నమస్కారముచే నీ పాతకము లాతఁడడంచును.

శివం, శంకరం బంధురం సుందరేశం
నటేశం, గణేశం, గిరీశం, మహేశం,
దినేశేందునేత్రం సుగాత్రం మృడా నీ
పతిం శ్రీగిరీశం హృదా భావయామి.

టీక. శివం = మంగళకరుఁడును, శంకరం = సుఖప్రదుఁడును, బంధురం = ప్రేమయుక్తుఁడును, సుంద రేశం = సౌందర్యరాశియును, నటేశం = నట రాజైశెట్టియు, గణేశం = ప్రమథగణ ప్రభువైనట్టియు గిరీశం = కైలా సాధిపతియు, మ హేశమ్ = సర్వేశ్వగుడైనట్టియు, దినేనేందునేత్రం = సూర్యచంద్రుల కన్నులుగాఁ గలవాఁడును, సుగాత్రం = మంచి దేహము గలవాఁడును, మృడానీపతిం = పార్వతీపతియునగు, శ్రీగిరీశం = శ్రీశైలాధిపతియగు మల్లి కార్జునుని, హృదా = నామనస్సుచేత, భావయామి = తలఁచుచున్నాను.

తా. లోకమంగళప్రదుఁడును, సర్వసుఖంకరుఁడును, సుందరేశ, నటేశ, గణేశ, గిరీశ, మహేశాది నామములు ధరించిన వాఁడును, సూర్యచంద్రులఁ గన్నులుగాఁగలవాఁడును, మంచి దేహముతోఁగూడి పార్వతీప్రియుఁడైయున్న మల్లికార్జున స్వామిని నా మనసులోఁదలఁచుకొందును.

భృంగీచ్ఛానటనోత్కటః, కరిమదగ్రాహీ, స్ఫురన్మాధవా
హ్లాదో, నాయుదతో, మహసితవపుః, పంచేషుణా చాదృతః,
సత్పక్షః సుమనోవనేషు, స పునస్సాక్షాన్మదీయే మనో
రాజీవే, భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః.

టీక. భృంగీచ్ఛానటనోత్కటః = భృంగియను ప్రమధగణనాయకుని లయానుసారము నాట్యముఁజేయు వేడ్కగలవాఁడును, కరిమవగ్రాహీ = గజేంద్రుని మదమడంచినవాఁడును, స్ఫురన్మాధవాహ్లాదః = ప్రకాశవంతుఁడగు విష్ణువున కాహ్లాదమిచ్చువాఁడును, నాదయుతః = ప్రణవ నాదముతోఁగూడినవాఁడును, మహాసితవపుః = మిక్కిలి తెల్లనగు శరీరము గలవాఁడును, పంచేషుణా చ = మన్మధునిచేత, ఆదృతః = ఆదరింపఁ బడినవాఁడును, సుమనోవనేషు = మంచిమనస్సుల నెడి వనములందు, సత్పక్షః = సదాశ్రయముగల పతంగమువంటివాఁడును, భ్రమరాధిపః = భ్రమరాంబానాథుఁడును, శ్రీశైలవాసీ = శ్రీగిరియందా వాసముగల, సః = ఆ, విభుఃపునః = ప్రభువగు మల్లికార్జున దేవుఁడయితే, సాక్షాత్ = ప్రత్యక్షముగ, మదీయే = నా సంబంధమైన, మనోరాజీవే = మనస్స సెడి కలువపూవునందు, విహరతాం విహారముఁజేయును గాక!

తా. భృంగి లయానుసారము నాట్యముఁ జేయువాఁడును, గజాసుర సంహారకుఁడును, విష్ణుమనోహ్లాదకుఁడును, ప్రణవ నాదప్రియుఁడును, ధవళాంగుఁడును, మన్మధునిచే నుతింపఁబడిన వాఁడును, సత్పురుష వృక్షపాతముగల శ్రీశైలవాసియైన భ్రమరాంబికాపతినా మనో రాజీవమున నుండుగాక!

సోమోత్తంస స్సుర పరిషదామేష జీవాతురీశః
పాశచ్ఛేత్తా పదయుగ జుషాం ఫుల్లమల్లీనికాశః,
ద్యేయో దేవః ప్రకటిత వధూరూపవామాత్మభాగః
శ్రీశైలాగ్రే కలితవసతి ర్విశ్వరక్షాధురీణః.

టీక. సోమోత్తంసః = చంద్రుఁడు శిరోభూషణ ముగఁ గలవాఁడును, సుర పరిషదాం = దేవ సంఘములకు, జీవాతుః = బ్రదుకుఁచెఱువుఁ జూపిన వాఁడును, ఏషః = ఈ ముందు భాగముననున్న, ఈశః = ఈశ్వరుఁడును (నియమనశీలుఁడు) పదయుగ = తన పాదద్వంద్వమును. జుషాం = ఆశ్రయించినవారలయొక్క, పాళచ్ఛేత్తా = సంసార పాశమును ద్రెంచువాఁడును, ఫుల్ల = వికసించిన, మళ్లీ = మల్లెపూలతో, నికాశః = సమానమైనవాఁడు, (తెల్లని దేహము గలవాఁడనుట) ప్రకటితే = స్పష్ట ఫఱచు చున్న, వనరూప= ఆఁడురూపము. వామ = ఎడమదగు, ఆత్మ భాగః = తన దేహభాగముఁ గలవాఁడును, శ్రీశైలాగే = శ్రీశైల శిఖరమున, కలితవసతిః = కల్పించుకొనిన నివాసముగలవాఁడును, విశ్వరక్షాధురీణః = ప్రపంచర క్షణ భారమునుగలిగిన, దేవః = మల్లి కార్జ·న దేవుఁడు, ధ్యేయః = ధ్యానగోచరుఁడగు గాక !

తా. చంద్ర శేఖరుఁడును, దేవసంఘములు కాధారుఁడును, తన చరణముల నాశ్రయించినవారి భవబంధచ్ఛేదకుఁడును, మల్లెపూలవలె తెల్లనికాంతిగల శరీరమును ధరించినవాఁడును, అర్ధనారీశ్వరుఁడైన మల్లికార్జున దేవుఁడు నా ధ్యానమున గోచరించుఁగాక!

ఏణం పాణౌ, శిరసి తరుణోల్లాస మేణాంక ఖండం
పార్శ్వే వామే వపుషి తరుణీం, దృక్షు కారుణ్యలీలామ్,
భూతిం ఫాలే, స్మితమపి ముఖే, గంగమంభః కపర్దే,
బిభ్రత్ప్రేమ్ణా, భువనమఖిలం శ్రీగిరీశస్స పాయాత్.

టీక. పాణౌ = చేతియందు, ఏణం = లేడిని; శిరసి = తలపైన, తరుణోల్లాసం = యౌవనముచేఁ బ్రకాశించు (అనఁగా సప్తమ్యష్టమినాఁటి) ఏణాంక ఖండం — చంద్రకళను; వామే = ఎడమదైన, పార్శ్వే = భాగ మందు (ప్రశ్కయందు) వపుషి = శరీరమున, తరుణీం – ఆఁడురూప మును; దృక్షు=చూపులందు, కారుణ్యలీలాం = దయాపిలాసమును; ఫాలే = నొసటియందు, భూతిం = ఓ భూతిని, ముఖే = వదనమందు, = స్మితూపి = చిఱునవ్వును, కపర్దే = జటాజూటమున, గాంగం = గంగ సంబంధమైన, ఆంభః = ఉదకమునఁ; బిభ్రత్ = ధరించునట్టి, సః = ఆ, శ్రీ గిరీశః = శ్రీగిరిప్రభువగు మల్లికార్జునుఁడు, ఆఖిలం = చరాచర రూపమగు, భువనం = విశ్వమును, పాయాత్ = రక్షించుఁగాక!

తా. హస్తమున లేడిని, తలపై బాలచంద్రుని, వామదేహమున నారిని, చూపులలో దయను, ఫాలమున విభూతిని ముఖమునఁజిఱునవ్వును, జటాజూటమున గంగోదకమ ను ధరించిన శ్రీశైలవాసుఁడు ప్రీతితో నీ విశ్వమంతటిని రక్షించుఁగాక !

శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృషాళిశీతే
స్ఫీతే సౌవర్ణరత్నస్ఫురితనవగృహే దివ్యపీఠే శుభార్హే,
ఆసీనస్సోమచూడస్స కరుణనయన స్సాంగనస్స్మేరవక్త్రః
శంభుశ్శ్రీ భ్రామరీశః ప్రకటితవిభవో దేవతా సార్వభౌమః.

టీక. స్వర్ణశృంగే = బంగారు గోపురములుగల, శ్రీశైలే = శ్రీగిరియందు, మణిగణరచితే = మణిసముదాయముచే నిర్మింపఁబడినదియు, కల్పవృక్షాళిళీ తే = కల్పవృక్ష సమూహముతోఁ జల్లనైనట్టియు, స్ఫీతే = విశాలమైనట్టియు, సౌవర్ణరత్నస్ఫురిత = బంగారముతోను, రత్నములతోఁ బ్రకాశించు, సవగృహే = నూతనాలయమందు, శుభార్హే = మంగళో చితమైన, దివ్యపీఠే = శోభించు పీఠముపై, ఆసీనః = కూర్చున్నావాఁడును, సోమచూడః = చంద్రుని శిరముననుంచుకొనినవాఁడును, పకరణ నయనః = దయతోఁగూడిన నేత్రములుగలవాఁడును, సాంగనః = ఆఁడు దానితోఁగూడినవాఁడును, (అర్ధనారీశ్వరుఁడనులు) స్మేరవక్త్రః = నవ్వుచున్న ముఖముతో నున్నవాఁడును, శ్రీ భ్రామరీశః = మంగళ పతి యగు భ్రమరాంబకుఁ బతియును, దేవతాసార్వభౌమః = దేవతలలో సమ్రాట్టయిన, శంభుః = శివుఁడు, ప్రకటిత విధవః = తన వైభవ మును బ్రకాశింపఁ జేయుచుండెను.

తా. కనకగోపురములుగల శ్రీగిరియందు, కల్పవృక్షచ్ఛాయ విశాలమై, రత్నములు పొదివిన బంగరు కాంతులతో నొప్పు నాలయమన, మంగళాసనముపైఁ గూరుచుండి, పార్వతిని వామాంకమున నిడుకొని, దయా కటాక్షములఁ బఱపు దేవతా సార్వభౌముఁడైన ఆ భ్రమరాంబాపతి తనవైభ వము నాత్మీయులకఁ బ్రకటించుచుండెను.

యా యోగిబృంద హృదయాంబజ రాజహంసీ
మందస్మితస్తుతముఖీ మధుకైట భఘ్నీ,
విఘ్నాంధకార పట భేదపటీయసీ సా
మూర్తిః కరోతు కుతుకం భ్రమరాంబికాయాః.

టీశ. యా = ఏ భ్రమరాంబామూర్తి, యోగిబృంద = యోగీశ్వరసముదాయము యొక్క. హృదయాంబుజ = హృదయమను పద్మమందు. రాజహంసీ = రాజరాజ హంసాంగనయయ్యెనో, మందస్మిత = ఛిఱు, నవ్వుచే, స్తుశముఖీ = కొనియాడఁడ గిస మేముగలడ య్యెనో, మధుకైట భఘ్నీ = మధుకైటభాది రాక్షస విధ్వంసకారిణియో, విఘ్నాంధకార = విఘ్నముల నెడు చీఁకటి యొక్క, పట = సముదాయమును, భేదపటీయసీ = చీల్చివేయ సమర్థ రాలో, సా = ఆ, భ్రమరాంబికాయాః = భ్రమ రాంబాదేవియొక్క, మూర్తిః = స్వరూపము, కుతుకం = ఉల్లాస మును, శరోతు చేయఁ గాక!

తా. ఏ మూర్తిని యోగిబృందము హృదయాంబుజమున నిల్పెనో, ఎల్లప్పుడేమూర్తి చిఱునవ్వుమోముతో విలసిల్లు చుండునో, ఏమూర్తి మధుకైటభాది రాక్షస నిహంత్రియో, ఏమూర్తి విఘ్నాంధకార నిర్మూలన మొనర్చునో ఆభ్రమ రాంబాదేవియొక్క మూర్తిమా కుల్లాసమును గల్గించుఁగాక!

కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి ఫాలస్థలీం
కర్పూరద్రవ మిశ్రచూర్ణ ఖపురామోదోల్లస ద్వీటికామ్,
లోలాపాంగ తరంగితైరతి కృపాసారైర్నతా నందినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.

టీశ. కస్తూరీతిలక = కస్తురిబొట్టుతో, అంచిత = కూడి, ఇందు విలసత్ = చంద్రునితోఁ బ్రకాశించుచు, ప్రోద్భాసి = మిక్కిలి కాంతివంతమైన, = ఫాలభాగముగలదియు, కర్పూరద్రవ పచ్చ క ప్పుర పు ద్రవమాతో, మిశ్ర = కలిసిన, చూర్ణఖపురా= తుంగము స్తెలపొడితో, ఆమోద = పరిమళముతో, ఉల్లసత్ = ఉల్లాసమునుగొల్పెడి, వీటి కాం= తాఁబూలచర్వణము గలదియు, లోలాపాంగ తరంగితైః = చం చలములగు క్రీగటిప్రసారముల వెడి తరంగములతో గూడిన, (అతి) కృపాసా రైః = జమితమగు దయావర్షములచేత, నతానందినీం = సమస్యరించు భక్తుల కానందమిచ్చునదియు, శ్రీశైలస్థలవాసినీం = శ్రీశైల ప్రదేశమున శపించనట్టి, భగవతీం = షడ్గుణేశ్వర్యవంతురాలగు, శ్రీమాతరం = శ్రీమాతను (జగడంబను) భావయే = ధ్యానించుచున్నాను.

తా. కస్తూరీ తిలకమ తోను, చంద్రకళతో నొప్పగు నొగులు గలదియు, కర్పూరాది పరిమళవస్తు మిశ్రమగు తాంబూల చర్వణగలదియు, డయావర్షమున విలసిల్లు కటాక్ష ప్రసార ముల భ క్తులకానంద మొసఁగు శ్రీశైల వాసినియైన భ్రమ రాంబా తల్లిని, నా మనసులో ధ్యానించుచున్నాను.

రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహామ్,
రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.

టీక. రాజత్ … గమనాం :- రాజత్ = ప్రకాశించెడి, మత్తమరాళ = మదించిన రాజహంసవలె, మందగమనాం = మొల్లనికులకు నాడకఁగల దియు, రాజీవపత్రేక్షణాం = పద్మపత్రములవలె విశాలమైనకన్నులుగల దియు, రాజీవప్రభవాది = బ్రహ్మ మొదలగు, దేవ = దేవతలయొక్క, మకుటైః = కిరీటములచే, రాజత్ పదాంభోరుహాం = ప్రకాశించు పాద పద్మములఁగలదియు, రాజీన = పద్మమువలె, ఆయత = వెడల్పయిన, పత్ర = మకరి కాపత్రములతో, మండిత = అలంకరింపఁబడిన, కుచాం = స్తనద్వయముగలదియు, రాజాధి రాజేశ్వరీ = రాజాధి రాజులకుఁగూడ రాజ్ఞియైన, శైలస్థలవాసినీం = శ్రీ శైలక్షేత్రనివాసియగు, శ్రీ మాతరం శ్రీమాతయను నామము ధరించి, భగవతీం = సద్గుణె శ్వర్యపన్నయగు భ్రమరాంబికను, భావయే = నా హృదయమునఁ దలఁచుచున్నాను.

తా. రాజహంసగమనయు, పద్మపత్రాయతాక్షియు, బ్రహ్మాది దేవతలు నమస్కరింపుచుండ వారి మణికిరీటములతో నలంకరింపఁబడిన పాదపద్మములు గలదియు, మకరికాపత్ర రచనగల నురోజభాగముతో శోభిల్లుచు రాజరాజేశ్వరీ, శ్రీమాతా, భగవతీయను నామములతో నొప్పారు శ్రీశైల భ్రమరాంబ నాత్మలో ధ్యానించుచున్నాను.

శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
గానాసక్తమనోజ్ఞయౌవనలసద్గంథర్వకన్యావృతామ్,
దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.

టీశ. శ్రీనాథ = విష్ణువుచే ఆదృత = ఆదరింపఁబడి, పాలిత = పాలించిన త్రిభువనాం = మాల్లోకముగలడియు, శ్రీ చక్రసంచారిణీం = శ్రీచక్ర మందుఁ = దిరుగాడునదియు, గానాసక్త = సంగీతాసక్తిగల, మనోజ్ఞ యౌవన = మనోహరిమైన తరుణవయస్సుతో. లసత్ = ప్రకాశించెడి, గంధర్వకన్యా = గంధర్వకుమారికులతో, వృతాం = చుట్టుకొనఁబడినదియు, దీనానాం = దీనులగువారికి, అతివేల = హద్దుమీరిన, భాగ్య = సంపదను, జననీం = కల్గించునదియు, దివ్యాంబర = ప్రకాశించు వస్త్రమలతో, అలంకృతాం = అలంకరింపఁబడినదియు, శ్రీశైలస్థల వాసి = శ్రీ శైల క్షేత్రని వాసి : యైన, భగవతీం = పూజ్యురాలుగు, శ్రీమాతరం = శ్రీమద్య్రమరాంబికను, భావయే = తలఁచుచున్నాను.

తా. విష్ణ్వాది దేవ జ్యేష్ఠు లాదరించురీతి లోకరక్షణ మొనర్చు నదియా, శ్రీ చక్రనివాసినియై, చక్కఁగ గాన మొనర్చుచు యౌవనములోనున్న గంధర్వకన్యలతోఁ బరి వేష్టింపఁబడి, దీనులకు భాగ్యము లొడఁగూర్చెడి శ్రీశైలనివాసియగు శ్రీ మాతృమూర్తిని మనసులోఁదలఁచెద,

ఉభౌ దర్వీకుంభౌ మణికనకసంభావితగుణౌ
దధానా పాణిభ్యామమృతరసమృష్టాన్నకలితౌ,
కలాడ్యా కళ్యాణీ కలితసదనా శ్రీగిరిశిర
స్యసౌ భ్రామర్యంభా రచయతు మదిష్టార్థవిభవమ్.

టీక. మణిశనక సంభావిఠగుణా మణులతోను, బంగారముతోను తయారు గావింపఁబడిన క్రమాన్వయము) ఉభౌ రెండైన, దర్వీకుంభౌ తెడ్డును, పాత్రయును, ఆమృతరసమృష్టాన్న కలితే = ఆమృతర సమును – (దర్వితోను) అన్నమును (పాత్రతోను) లిగియున్న వానిని, భ్యాం = హ స్తద్వంద్వముచే, దధానా = ధరించునదియు, కలాఢ్యా = సర్వకళాసంపూర్ణురాలును, కల్యాణీ = మంగళాంగియు, శ్రీ గిరిశిరసి = శ్రీశైలశిఖరమున, కలితపదనా = ఆవాసమును గల్పించుకొనిన, అసౌ = ఈ; భ్రామర్యంబా = భ్రమరాంబ, మడిష్టార్థ విభవమ్ = నాకిష్టమైన సంపదను, రచయతు= కూర్చుఁగాక !

తా. మణులతోఁ గూర్చబడిన తెడ్డు నమృతముతో నింపి యొక్క చేతను, బంగరుపాత్రలో నన్నమును నింపుకొని వేటొక చేతను ధరించినదియు, చతుష్షష్టి కళలతో ఁగూడి నదియు, కల్యాణగాత్రియగు శ్రీ శైల భ్రమరాంబిక నా యభీష్ట భాగ్యము లొసఁగుఁగాక.

Sri Vinayaka Vrata Katha In Telugu – శ్రీ వినాయక వ్రత కథ

Sri Vinayaka Vrata Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వినాయక వ్రత కథ గురించి తెలుసుకుందాం…

Vinayaka Vrata Katha In Telugu

శ్రీ వినాయక వ్రత కథ

(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.)
కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి.

పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశార ణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనము లను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగి పోయి,సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.

“ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ని దర్శించి తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటు వంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధి ప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి, స్నానంచేసి, నిత్య కర్మలు నెరవేర్చుకుని తమశక్తి మేరకు బంగారంతోగాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మనుచేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కుల్లో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్యపురాణ, పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదు లను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజచేయాలి. విప్రులకు దక్షిణతాంబూ లాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదంవలన సకల కార్యములూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకీ అత్యుత్తమ మైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.

కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతంచేయడం వల్లనే శ్యమంతకమణితోపాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.

పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ నీవు నాయుదర మందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియం దుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దుమేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని, వారిని పిలిపించి తనభవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగునాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై “ఏమి కావాలో కోరుకోండి.. ఇస్తాను” అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది. శివుడ్ని అప్పగించు” అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకు డగు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి, నా చర్మము నీవు ధరించు” అని ప్రార్థించాడు. తన గర్భంలో వున్న శివుడ్ని తీసుకోవ చ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. ‘దుష్టాత్ములకు ఇటువంటి వర మును ఇవ్వరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.

మరిన్ని వ్రతాలు:

Evvari Bhagyam Bettunndo In Telugu – ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో

ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో
సంఖ్య : 43
పుట: 29
రాగం: భైరవి

భైరవి

64 ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
దవ్వు చేరువకు తానే గురుతు

||పల్లవి||

పరమమంగళము భగవన్నామము
సురులకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిగిన యెదుటనె ఉన్నది
వరుసల మఱచిన వారికి మాయ

||ఎవ్వరి||

వేదాంత సారము విష్ణుభక్తియిది
ఆదిమునులమత మయినది
సాధించువారికి సర్వసాధనము
కాదని తొలగినకడుశూన్యంబు

||ఎవ్వరి||

చేతి నిధానము శ్రీ వేంకటపతి
యేతల జూచిన నిందరికి
నీతియు నిదియే నిజసేవకులకు
పాతకులకు నది భవసాగరము

||ఎవ్వరి||

అవతారిక:

ఎవరి అదృష్టం యెలావుంటుందో యెవరు చెప్పగలరు? అని పాడుతున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. “దవ్వు చేరువకు తానే గురుతు” అంటే, యెవ్వడు ఆయనకు దూరమైనవాడో, యెవరు దగ్గరవాడో తానే తెలిసినవాడు. ఇంకెవరికీ తెలియదు అని అర్థం. ఆనాడు శిశుపాలుడి తల నరికాడు కాని వాడు ఆయన నమ్మిన ద్వారపాలకుడు. “బావా! యెప్పుడు వచ్చితీవు” అని ధుర్యోధనుణ్ణి ఆప్యాయంగా పలుకరిస్తాడు. కాని తొడలు విరగకొట్టించి చంపించాడు. మరి మనబోటి వారేం చేయాలి? సత్ప్రవర్తనతో, శరణాగతితో, స్థిరభక్తితో, ఆ ఏడుకొండలవాడిని సేవించడం. అట్లా చేయనివారి గతి యేమిటి? భవసాగరంలో కొట్టుమిట్టాడటమే.

భావ వివరణ:

ఓ ప్రజలారా! ఎవ్వరి భాగ్యం (అదృష్టము) యెట్లా వుంటుందో, యెవ్వరు చెప్పగలరు? “దవ్వు చేరువకు తానే గురుతు” (ఆ సర్వేశ్వరునకు ఎవ్వరు దూరమో? ఎవ్వరు దగ్గరవారో? ఎవరు చెప్పగలరు?)

భగవన్నామసంకీర్తనము పరమమంగళకరమైనది. అది నరులకే కాదు సురులకు (దేవతలకు) కూడా శుభప్రదమైనది. ఇరవుతో నెరిగిన (సమూలంగా తెలిసికొంటే), అది యెదుటనే వున్నది. అంటే దాని ఫలితం ప్రత్యక్షంగా కనబడుతుంటుంది. వరుసల మరచిన (దేవుడెవరు జీవుడెవరు అనే క్రమము మరచినచో) వారికి మాయ (వారు మాయకు లోనై తామే అధికులమని హిరణ్యకశిపునివంటి భ్రష్ఠులైపోతారు).

వేదము విష్ణువును కీర్తిస్తుంటే… వేదాంతము యొక్క సారము విష్ణు భక్తిని ప్రతిపాదిస్తున్నది. ఆదికాలమునాటి మునులయొక్క మతము కూడా విష్ణుభక్తియే. సాధనతో విష్ణుభక్తిని పెంపొందించుకొంటే వారికి సర్వమూ సాధ్యమవుతాయి. విష్ణుని కాదని తొలగిన (దుర్యోధనుడు తనకి కృష్ణుడు వద్దు, కాని కృష్ణుని యాదవ సేన కావాలని కోరుకున్నాడు) కడు శూన్యము (ఏదీ దక్కదు) మిగులుతుంది.

శ్రీవేంకటేశ్వరుడు చేతిలోవున్న నిధానము (నిధివంటివాడు.) ఏతలజూచిన (ఏవిధంగా చూచినా) ఇందరికి (ఈ జీవకోటికి) నీతియు (ధర్మవంతమైనది) ఆ దేవదేవుని శరణాగతియే. నిజసేవకులకు (అసలైన హరిదాసులకు) ఇదియే దిక్కు మరి పాతకులకు (పాపాత్ములకు) అది భవసాగరమున (సంసార సాగరంలో) మునక. ఇంతవరకు అందులో మునిగినవాడు తేలలేదు. తేలడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Shila Sampada In Telugu – శీలసంపద

Shila Sampada

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శీలసంపద కథ. 

శీలసంపద

ఖాండవవన దహనమప్పుడు లోకైకవీరుడైన అర్జునుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా మయాసురుడు మయసభను నిర్మించి ధర్మరాజుకివ్వాలని సంకల్పించుకున్నాడు. మయాసురుడు ఆ భవ్య మయసభను పవిత్ర హిమాలయాలలో నిర్మించి తన మాయశక్తితో ఇంద్రప్రస్థానికి తెచ్చాడు. మయసభలోని అద్భుతాలను పొగడటానికి మాటలుచాలవు. మయసభ అంతా కనక రత్న మణిమయము. మయసభలోని స్తంభాలు ద్వారాలు తోరణాలు వనాలు తటాకాలు అన్నీ మణిమయాలే. రాజసూయ యాగానికి వచ్చిన ఎందఱికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించి నభూతో నభవిష్యతి అని పొగడబడినది ఆ మయసభ. మయసభ విభవం పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుని అసూయామాత్సర్యాలు మరింత చెలరేగాయి. పాండవుల కీర్తి సంపదలను తలచుకొని తీవ్రంగా దుఃఖిస్తూ తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు దుర్యోధనుడు. మత్సరమనే ఘోరసర్పముచే కాటువేయబడ్డ తన కొడుకుకి ఇలా హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు

“కుమారా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యమున్నదా? ఈ లోకంలో సంతృప్తి ఉన్నవాడే ధనవంతుడు. సంతృప్తి లేకుండా కుబేర సంపద ఉన్నా వాడు సంతోషముగా ఉండలేడు. నాయనా! శీలవంతుడైన ధర్మనందనుని శ్రీలక్ష్మి ఎన్నడూ విడువదు. శీలవంతుని ఆశ్రయించే సకల సంపదలు సుగుణములు ఉంటాయి. కాబట్టి నీవు కూడా ధర్మాత్ములైన పాండవులవలె శీలవంతుడవు కమ్ము. తానుతో సిరిసంపదలు వాటంతట అవే వస్తాయి”. కుమారునికి ఒక ఇతిహాసం చెప్పాడు

“ప్రహ్లాదుడు సర్వగుణ సంపన్నుడు విద్యా పారంగతుడు పరమ విష్ణుభక్తుడు. ధర్మం తప్పకుండా తన ప్రజలను పాలించేవాడు. తన సౌశీల్య ప్రభావం చేత త్రిలోకాధిపత్యం ఇంద్రత్వం ప్రాప్తించింది ప్రహ్లాదునికి. చతుర్భువనాలను జనరంజకముగా పాలించసాగాడు ఆ ప్రహ్లాదుడు. ఇలా ప్రహ్లాదుని వలన పదవీ భ్రష్టుడైన శచీపతి గురువైన బృస్పతులవారిని తనకు మళ్ళీ ఇంద్రపదవి సిద్ధించే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బృహస్పతి విష్ణు అవతారుడైన పరశురాముని ఆశ్రయించమని చెప్పాడు. గురు ఆజ్ఞపాటించి ఇంద్రుడు భార్గవరాముని శరణుజొచ్చి ఉపాయం బోధించమని ప్రార్థించాడు. “అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతనినే అడుగు. ఆ శక్తిని అతనివద్దనుండే పుచ్చుకో” అని చెప్పాడు భార్గవుడు.

విద్యార్జన గురుసుశ్రూష వలనే సాధ్యం అని తెలిసిన దేవేంద్రుడు విప్రవేషం ధరించి ప్రహ్లాదునికి శిష్యుడై అతనిని భక్తితో సేవించటం మొదలుపెట్టాడు. అలా ఎంతో కాలం ప్రహ్లాదుని సేవించినాడు వజ్రి. ప్రసన్నుడైన ప్రహ్లాదుడు “నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?” అని విప్రవేషంలో ఉన్న ఇంద్రుని అడిగాడు. శచీపతి తన అభీష్టం వ్యక్త పఱచినాడు. అప్పుడు ప్రహ్లాదుడు

“కుమారా! నేనెప్పుడూ రాజునని గర్వించను. ఎవఱినీ నొప్పించను. వారికి హితమేచేస్తాను. ఈర్ష అసూయ ద్వేషం పగ మొదలైనవి నా దరి చేరనివ్వను. అడిగినవాడికి లేదనకుండా సంతోషపెడతాను. నా పురాకృత పుణ్యం వలన నాకీ సౌశీల్యం అబ్బినది” అని చెప్పాడు. “ఓ దయామయా! దానశీలా! నీ శీలం నాకు ప్రసాదించు” అని అడిగాడు ఇంద్రుడు. “అయ్యో పాపం!” అని ప్రహ్లాదుడు తన శీలాన్ని దేవేంద్రునికి దానం ఇచ్చి పంపివేశాడు.

ఇంద్రుడు వెళ్ళాడో లేదో ప్రహ్లాదునిలోనుండి ఒక దివ్య తేజఃపుంజము పురుషాకృతిదాల్చి బయటికి వచ్చింది. “నీవెవరు?” అని ఆశ్చర్యాముగా అడిగాడు ప్రహ్లాదుడు.

“నేను నీ శీలాన్ని. ఆ విప్రునికి నన్ను దానం ఇచ్చావు కదా. వెళుతున్నాను” అని చెప్పి వెళిపోయింది శీలము. ఒకతేజస్సు తరువాత ఒకటి ప్రహ్లాదుని వీడిపోయినాయి. ఒక తేజస్సు అన్నది “నేను సత్యమ్. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. శీలంతో పాటూ నేను నిన్ను విడుస్తున్నాను”. మరొక తేజస్సు అన్నది “రాజా! నేను ఋజుప్రవర్తనమ్. సత్యము లేని చోట నేనుండలేను”. “నేను బలమ్. సత్ప్రవర్తన లేనివాడి వద్ద నేనుండను” అని వెళ్ళిపోయింది బలమ్. చివరికి ఆదిలక్ష్మి బయటికి వచ్చి “నేను శ్రీలక్ష్మిని. బలం ఉన్నచోటే నేనుంటాను. వెళుతున్నాను” అని అన్నది. అప్పుడు ప్రహ్లాదుడు “అమ్మా! లోకమాతా! నీవూ నన్ను విడిచిపోతున్నావా? ఈ అభాగ్యునిపై దయ చూపవా? వెళ్ళద్దు తల్లీ! ఆ విప్రుడు ఎవఱు తల్లీ?” అని ప్రార్థించాడు. “అతడు దేవేంద్రుడు. పోగొట్టుకున్న రాజ్యమును సంపాదించడనికి నీవద్దకు వచ్చాడు. అన్ని సంపదలకూ మూలమైన శీలమును నీవు అతనికి దానమిచ్చావు కావున శీలాన్ని అనుసరించి మేమందఱమూ వెళుతున్నాము” అని సర్వాణి చెప్పింది. నిజమైన శ్రీహరి భక్తులకు సాధ్యం కానిదేమున్నది? ప్రహ్లాదుడు మళ్ళీ తన సద్గుణాలను సంపదలను అచిరకాలంలోనే సంపాదించుకున్నాడు. కనుక నీవెల్లప్పుడూ సౌశీల్యుడవై వర్ధిల్లు నాయనా!” అని కుమారునికి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

సౌశీల్యం యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. శీలమున్న వాడి వద్దనే సకల సంపదలుంటాయి. కాబట్టి మొదట శీలవంతులము కావడం ముఖ్యము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Vedavatti Yika Nemi Vedakeru Chadiveru In Telugu – వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు

వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు
సంఖ్య : 535
పుట: 359
రాగం: సాళంగనాట

సాళంగనాట

40 వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా.

||పల్లవి||

తోలె నదె గరుడనిఁ దొడఁగి బాణునిమీఁద
వాలెను కంసునిమీఁద వడి నెగసి
కేలుచాఁచి చక్రమునఁ గెడపె శిశుపాలు
వేలుపుల రాయఁడైన విష్ణుని నెఱఁగరా.

||వేద||

తొక్కెను బలీంద్రునిఁ దొల్లి పాతాళానఁ గుంగ
మొక్కలాన జల ధమ్ము మొనకుఁ దెచ్చె
పక్కన బ్రహ్మాండము పగులించెఁ బెనువేల
వెక్కనపుదైవమైన విష్ణుని నెఱఁగరా.

||వేద||

భేదించె రావణాదిభీకరదైత్యులనెల్ల
నాదించె శంఖమున నున్నతజయము
సేదదేర నిపుడును శ్రీవేంకటాద్రిమీఁద
వీది వీది మెరసేటి విష్ణుని నెఱఁగరా.

||వేద||535

అవతారిక:

“వేదవట్టు” అంటే వేద ప్రవచనము చేయటం. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు వేదము తెలిసిన పండితులతో అంటున్నారు ‘ఇంకా యేమి వేదప్రవచనాలు చేస్తారు? యేమి వెదుకుతారు? యేమేమి చదువుతారయ్యా! మీకీ మాత్రం తెలియదా? వేదాంత వేద్యుడు విష్ణువుగాక వేరెవరున్నారు?’. ఈ కీర్తనలో జలధమ్ము అంటే ‘జలధియమ్ము’ అని భావించాలి. పెనువేలు అంటే బొటనవ్రేలని అర్థం. అనంతకోటి బ్రహ్మాండాలను తన బొటన వేలికింద నొక్కివేయగలడట ఈ విశ్వరూపుడు మరేమనుకొన్నారు?

భావ వివరణ:

ఓ అయ్యలారా! యిక వేదవట్టి (వేద ప్రవచనములు చేసి) యేమి వెదకెదరయ్యా! యేమి చదివేరు? వేదాంతము వేదాంతము ద్వారా, వేద్యుడు (తెలియదగినవాడు) యెవరు? విష్ణువే కదా! ఈ సంగతినెరుగరా? ఏమి వింత!!

మీరు ఆయన కృష్ణావతారం గురించి వినలేదా? ఆ శ్రీకృష్ణుడు అదె గరుత్మంతునిపైనెక్కి తోలె (వెడలినాడు). బాణాసురనెదుర్కొని చిత్తుచేశాడు. వడి (వేగముగా) కంసునిపై నెగసి (దండెత్తి) వాలెను (మీదపడ్డాడు). కేలుచాచి (చేయిచాచి) చక్రాయుధాన్ని అందుకొని శిశుపాలుని కెడపె (పడవేసెను). అట్టి లీలలు చేసిన వేలుపులరాయుడు (దైవశిఖామణి) యైన విష్ణువునెరుగరా? ఏమి ఆశ్చర్యము!

ఈయన తొల్లి (కృతయుగంలో) బలీంద్రుని (బలి అను దానవేంద్రుని) పాతాళమునకు క్రుంగునట్లు తలపై కాలుంచి త్రొక్కెను. ఈయన త్రేతాయుగములో మొక్కలా (శౌర్యముతో) జలధిని (సాగరమును) అమ్ముమొనకు దెచ్చే (బాణముయొక్క మొనకు తెచ్చి శరణాగతుని చేసెను. పక్కన భవిష్యత్తులో ఈయన తన పెనువేల (బ్రొటనవేలితో) బ్రహ్మాండమునే పగులించె బ్రద్దలు కొడతాడు. ఓ అయ్యలారా! వెక్కసపు దైవమైన (సర్వాధికుడైన దేవుడు) విష్ణువునెరుగరా?

ఈయనే శ్రీరాముడై రావణుడు మొదలైన భయంకర దైత్యులను సంహరించాడు. తన పాంచజన్యశంఖమును వున్నతముగ పూరించి జయధ్వానములు చేసెను. యుగయుగాలలో ఇవన్నీ చేసి అలసిన శ్రీమహావిష్ణువు ఈ కలియుగంలో సేదతీరుటకు (విశ్రాతికి) శ్రీవేంకటాద్రిమీద శ్రీ వేంకటేశ్వరుడై నిలిచినాడు. అదిగో తిరు వీధులలో మెరసేటి (కాంతులు వెదజల్లుతున్న) ఈ విష్ణుదేవుని ఎరుగరా? ఏమి విచిత్రం!!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: