Durga Saptashati Pradhanika Rahasyam In Telugu | దుర్గా సప్తశతీ ప్రధానిక రహస్యం

Durga Saptashati Pradhanika Rahasyam In Telugu

Durga Saptashati Pradhanika Rahasyam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దేవీ సూక్తం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దుర్గా సప్తశతీ ప్రధానిక రహస్యం

అస్య శ్రీసప్తశతీరహస్యత్రయస్య నారాయణ ఋషిః అనుష్టుప్చందః శ్రీమహాకాలీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతా యథోక్తఫలావాప్త్యర్థం జపే వినియోగః |

రాజోవాచ |

భగవన్నవతారా మే చండికాయాస్త్వయోదితాః |
ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం వక్తుమర్హసి ||

ఆరాధ్యం యన్మయా దేవ్యాః స్వరూపం యేన చ ద్విజ |
విధినా బ్రూహి సకలం యథావత్ప్రణతస్య మే ||

ఋషిరువాచ |

ఇదం రహస్యం పరమమనాఖ్యేయం ప్రచక్షతే |
భక్తో సీతి న మే కించిత్తవావాచ్యం నరాధిప ||

సర్వస్యాద్యా మహాలక్ష్మీస్త్రిగుణా పరమేశ్వరీ |
లక్ష్యాలక్ష్యస్వరూపా సా వ్యాప్య కృత్స్నం వ్యవస్థితా ||

మాతులుంగం గదాం ఖేటం పానపాత్రం చ బిభ్రతీ |
నాగం లింగం చ యోనిం చ బిభ్రతీ నృప మూర్ధని ||

తప్తకాంచనవర్ణాభా తప్తకాంచనభూషణా |
శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజసా ||

శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరీ |
బభార రూపమపరం తమసా కేవలేన హి ||

సా భిన్నాంజనసంకాశా దంష్ట్రాంచితవరాననా |
విశాలలోచనా నారీ బభూవ తనుమధ్యమా ||

ఖడ్గపాత్రశిరఃఖేటైరలంకృతచతుర్భుజా |
కబంధహారం శిరసా బిభ్రాణా హి శిరఃస్రజమ్ ||

తాం ప్రోవాచ మహాలక్ష్మీస్తామసీం ప్రమదోత్తమామ్ |
దదామి తవ నామాని యాని కర్మాణి తాని తే ||

మహామాయా మహాకాలీ మహామారీ క్షుధా తృషా |
నిద్రా తృష్ణా చైకవీరా కాలరాత్రిర్దురత్యయా ||

ఇమాని తవ నామాని ప్రతిపాద్యాని కర్మభిః |
ఏభిః కర్మాణి తే జ్ఞాత్వా యోధీతే సోశ్నుతే సుఖమ్ ||

తామిత్యుక్త్వా మహాలక్ష్మీః స్వరూపమపరం నృప |
సత్త్వాఖ్యేనాతిశుద్ధేన గుణేనేందుప్రభం దధౌ ||

అక్షమాలాంకుశధరా వీణాపుస్తకధారిణీ |
సా బభూవ వరా నారీ నామాన్యస్యై చ సా దదౌ ||

మహావిద్యా మహావాణీ భారతీ వాక్ సరస్వతీ |
ఆర్యా బ్రాహ్మీ కామధేనుర్వేదగర్భా సురేశ్వరీ ||

అథోవాచ మహాలక్ష్మీర్మహాకాలీం సరస్వతీమ్ |
యువాం జనయతాం దేవ్యౌ మిథునే స్వానురూపతః ||

ఇత్యుక్త్వా తే మహాలక్ష్మీః ససర్జ మిథునం స్వయమ్ |
హిరణ్యగర్భౌ రుచిరౌ స్త్రీపుంసౌ కమలాసనౌ ||

బ్రహ్మన్ విధే విరించేతి ధాతరిత్యాహ తం నరమ్ |
శ్రీః పద్మే కమలే లక్ష్మీత్యాహ మాతా స్త్రియం చ తామ్ ||

మహాకాలీ భారతీ చ మిథునే సృజతః సహ |
ఏతయోరపి రూపాణి నామాని చ వదామి తే ||

నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరమ్ |
జనయామాస పురుషం మహాకాలీం సితాం స్త్రియమ్ ||

స రుద్రః శంకరః స్థాణుః కపర్దీ చ త్రిలోచనః |
త్రయీ విద్యా కామధేనుః సా స్త్రీ భాషా స్వరాక్షరా ||

సరస్వతీ స్త్రియం గౌరీం కృష్ణం చ పురుషం నృప |
జనయామాస నామాని తయోరపి వదామి తే ||

విష్ణుః కృష్ణో హృషీకేశో వాసుదేవో జనార్దనః |
ఉమా గౌరీ సతీ చండీ సుందరీ సుభగా శివా ||

ఏవం యువతయః సద్యః పురుషత్వం ప్రపేదిరే |
చక్షుష్మంతో2 నుపశ్యంతి నేతరే తద్విదో జనాః ||

బ్రహ్మణే ప్రదదౌ పత్నీం మహాలక్ష్మీర్నృప త్రయీమ్ |
రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చ శ్రియమ్ ||

స్వరయా సహ సంభూయ విరించోండమజీజనత్ |
బిభేద భగవాన్ రుద్రస్తదౌర్యా సహ వీర్యవాన్ ||

అండమధ్యే ప్రధానాది కార్యజాతమభూన్నృప |
మహాభూతాత్మకం సర్వం జగత్ స్థావరజంగమమ్ ||

పుపోష పాలయామాస తల్లక్ష్మ్యా సహ కేశవః |
మహాలక్ష్మీరేవమజా రాజన్ సర్వేశ్వరేశ్వరీ ||

నిరాకారా చ సాకారా సైవ నానాభిధానభృత్ |
నామాంతరైర్నిరూప్యెషా నామ్నా నాన్యేన కేనచిత్ ||

ఇతి ప్రాధానికం రహస్యం సంపూర్ణమ్ |

మరిన్ని స్తోత్రాలు:

Devi Suktam In Telugu | దేవీ సూక్తం

Devi Suktam In Telugu

Devi Suktam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దేవీ సూక్తం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దేవీ సూక్తం

ఓం అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమా”దిత్యెరుత విశ్వదే”వైః |
అహం మిత్రావరుణోభా బిభర్మ్యహమి”స్త్రాగ్నీఅహమశ్విన్తోభా ||

అహం సోమమా సోమమాహనసం” బిభర్మ్యహం త్వష్టా”రముత పూషణం భగమ్” |
అహం దధామి ద్రవిణం హవిష్మతే సుప్రావ్యే ఏయజమానాయ సున్వతే ||

అహం రాష్ట్రీ” సంగమనీ వసూ”నాం చికితుషీ” ప్రథమా యజ్ఞియా”నామ్ |
తాం మా” దేవా వ్యదధుః పురుత్రా భూరిస్థాత్రాం భూర్యా” వేశయన్”తీమ్ ||

మయా స్కో అన్నమత్తి యో విపశ్యతి యః ప్రాణితి యఈ”౦ శ్రుణోత్యుక్తమ్ |
అమన్తవోమాన్త ఉపక్షియన్తి శ్రుధిశ్రుత శ్రద్ధివం తే” వదామి ||

అహమేవ స్వయమిదం వదామి జుష్ట”౦ దేవేభిరుత మానుషేభిః |
యం కామయే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తమృషిం తం సుమేధామ్ ||

అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవేహన్త వా ఉ |
అహం జనా”య సమదం” కృణోమ్యహం ద్యావా”పృథివీ ఆవివేశ ||

అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోనిరప్స్వ౬౧న్తః సముద్రే |
తతో వితిష్ఠ భువనాను విశ్వో తామూం ద్యాం వర్ష్మణోపస్పృశామి ||

అహమేవ వాత౬ఇవ ప్రవా”మ్యారభమాణా భువనాని విశ్వా” |
పరో దివా పరఏనా పృథివ్యె తావతీ మహినా సంబభూవ ||

ఓం శాస్త్రి: శాస్త్రి: శాస్త్రి: ||

మరిన్ని స్తోత్రాలు:

Durga Saptashati Vaikruthika Rahasyam In Telugu | దుర్గా సప్తశతీ వైకృతిక రహస్యం

Durga Saptashati Vaikruthika Rahasyam In Telugu

Durga Saptashati Vaikruthika Rahasyam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దుర్గా సప్తశతీ వైకృతిక రహస్యం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దుర్గా సప్తశతీ వైకృతిక రహస్యం

ఋషిరువాచ |

త్రిగుణా తామసీ దేవీ సాత్త్వికీ యా త్రిధోదితా |
సా శర్వా చండికా దుర్గా భద్రా భగవతీర్యతే ||

యోగనిద్రా హరేరుక్తా మహాకాలీ తమోగుణా |
మధుకైటభనాశార్థం యాం తుష్టావాంబుజాసనః ||

దశవక్త్ర దశభుజా దశపాదాంజనప్రభా |
విశాలయా రాజమానా త్రింశల్లోచనమాలయా ||

స్ఫురద్ధశనదంష్ట్రా సా భీమరూపాపి భూమిప |
రూపసౌభాగ్యకాంతీనాం సా ప్రతిష్ఠా మహాశ్రియామ్ ||

ఖడ్గబాణగదాశూలశంఖచక్రభుశుండిభృత్ |
పరిఘం కార్ముకం శీర్షం నిశ్చోతద్రుధిరం దధౌ ||

ఏషా సా వైష్ణవీ మాయా మహాకాలీ దురత్యయా |
ఆరాధితా వశీకుర్యాత్ పూజాకర్తుశ్చరాచరమ్ ||

సర్వదేవశరీరేభ్యో యావిర్భూతామితప్రభా |
త్రిగుణా సా మహాలక్ష్మీః సాక్షాన్మహిషమర్దినీ ||

శ్వేతాననా నీలభుజా సుశ్వేతస్తనమండలా |
రక్తమధ్యా రక్తపాదా నీలజంఘోరురున్మదా ||

సుచిత్రజఘనా చిత్రమాల్యాంబరవిభూషణా
చిత్రానులేపనా కాంతిరూపసౌభాగ్యశాలినీ ||

అష్టాదశభుజా పూజ్యా సా సహస్రభుజా సతీ |
ఆయుధాన్యత్ర వక్ష్యంతే దక్షిణాధఃకరక్రమాత్ ||

అక్షమాలా చ కమలం బాణో సిః కులిశం గదా |
చక్రం త్రిశూలం పరశుః శంఖో ఘంటా చ పాశకః ||

శక్తిర్దండశ్చర్మ చాపం పానపాత్రం కమండలుః |
అలంకృతభుజామేభిరాయుధైః కమలాసనామ్ ||

సర్వదేవమయీమీశాం మహాలక్ష్మీమిమాం నృప |
పూజయేత్ సర్వలోకానాం స దేవానాం ప్రభుర్భవేత్ ||

గౌరీదేహాత్సముద్భూతా యా సత్త్వెకగుణాశ్రయా |
సాక్షాత్సరస్వతీ ప్రోక్తా శుంభాసురనిబర్హిణీ ||

దధౌ చాష్టభుజా బాణాన్ముసలం శూలచక్రభృత్ |
శంఖం ఘంటాం లాంగలం చ కార్ముకం వసుధాధిప ||

ఏషా సంపూజితా భక్త్యా సర్వజ్ఞత్వం ప్రయచ్ఛతి |
నిశుంభమథినీ దేవీ శుంభాసురనిబర్హిణీ ||

ఇత్యుక్తాని స్వరూపాణి మూర్తీనాం తవ పార్థివ |
ఉపాసనం జగన్మాతుః పృథగాసాం నిశామయ ||

మహాలక్ష్మీర్యదా పూజ్యా మహాకాలీ సరస్వతీ |
దక్షిణోత్తరయోః పూజ్యే పృష్ఠతో మిథునత్రయమ్ ||

విరంచిః స్వరయా మధ్యే రుద్రో గౌర్యా చ దక్షిణే |
వామే లక్ష్మ్యా హృషీకేశః పురతో దేవతాత్రయమ్ ||

అష్టాదశభుజా మధ్యే వామే చాస్యా దశాననా |
దక్షిణే౬ ష్టభుజా లక్ష్మీర్మహతీతి సమర్చయేత్ ||

అష్టాదశభుజా చైషా యదా పూజ్యా నరాధిప |
దశాననా చాష్టభుజా దక్షిణోత్తరయోస్తదా ||

కాలమృత్యూ చ సంపూజ్యౌ సర్వారిష్టప్రశాంతయే |
యదా చాష్టభుజా పూజ్యా శుంభాసురనిబర్హిణీ ||

నవాస్యాః శక్తయః పూజ్యాస్తదా రుద్రవినాయకౌ |
నమో దేవ్యా ఇతి స్తోత్రైర్మహాలక్ష్మీం సమర్చయేత్ ||

అవతారత్రయార్చాయాం స్తోత్రమంత్రాస్తదాశ్రయాః |
అష్టాదశభుజా చైషా పూజ్యా మహిషమర్దినీ ||

మహాలక్ష్మీర్మహాకాలీ సైవ ప్రోక్తా సరస్వతీ |
ఈశ్వరీ పుణ్యపాపానాం సర్వలోకమహేశ్వరీ ||

మహిషాంతకరీ యేన పూజితా స జగత్ప్రభుః |
పూజయేజ్జగతాం ధాత్రీం చండికాం భక్తవత్సలామ్ ||

అర్ఘ్యాదిభిరలంకారైర్గంధపు ప్పెస్తథాక్షతైః ||
ధూపైర్దీపైశ్చ నైవేద్యైర్నానాభక్ష్యసమన్వితైః ||

రుధిరాక్తేన బలినా మాంసేన సురయా నృప |
ప్రణామాచమనీయేన చందనేన సుగంధినా ||

సకర్పూరైశ్చ తాంబూలైర్భక్తిభావసమన్వితైః |
వామభాగే గ్రతో దేవ్యాశ్ఛిన్నశీర్షం మహాసురమ్ ||

పూజయేన్మహిషం యేన ప్రాప్తం సాయుజ్యమీశయా |
దక్షిణే పురతః సింహం సమగ్రం ధర్మమీశ్వరమ్ ||

వాహనం పూజయేద్దేవ్యా ధృతం యేన చరాచరమ్ |
[* కుర్యాచ్ఛ స్తవనం ధీమాంస్తస్యా ఏకాగ్రమానసః | *]
తతః కృతాంజలిర్భూత్వా స్తువీత చరితైరిమైః ||

ఏకేన వా మధ్యమేన నైకేనేతరయోరిహ |
చరితార్ధం తు న జపేజ్జపంఛిద్రమవాప్నుయాత్ ||

స్తోత్రమంత్రైః స్తువీతేమాం యది వా జగదంబికామ్ |
ప్రదక్షిణనమస్కారాన్ కృత్వా మూర్ధ్ని కృతాంజలిః ||

క్షమాపయేజ్జగద్ధాత్రీం ముహుర్ముహురతంద్రితః |
ప్రతిశ్లోకం చ జుహుయాత్ పాయసం తిలసర్పిషా ||

జుహుయాత్ స్తోత్రమంత్రైర్వా చండికాయై శుభం హవిః |
నమో నమః పదైర్దేవీం పూజయేత్ సుసమాహితః ||

ప్రయతః ప్రాంజలిః ప్రహ్వః ప్రాణానారోప్య చాత్మని |
సుచిరం భావయేద్దేవీం చండికాం తన్మయో భవేత్ ||

ఏవం యః పూజయేద్భక్త్యా ప్రత్యహం పరమేశ్వరీమ్
భుక్త్వా భోగాన్ యథాకామం దేవీసాయుజ్యమాప్నుయాత్ ||

యోన పూజయతే నిత్యం చండికాం భక్తవత్సలామ్ |
భస్మీకృత్యాస్య పుణ్యాని నిర్దహేత్ పరమేశ్వరీ ||

యో న పూజయతే నిత్యం చండికాం భక్తవత్సలామ్ |
భస్మీకృత్యాస్య పుణ్యాని నిర్దహేత్ పరమేశ్వరీ ||

తస్మాత్ పూజయ భూపాల సర్వలోకమహేశ్వరీమ్ |
యథోక్తేన విధానేన చండికాం సుఖమాప్స్యసి ||

ఇతి వైకృతికం రహస్యం సంపూర్ణమ్ ||

మరిన్ని స్తోత్రాలు:

Sri Mallikarjuna Mangalasasanam In Telugu – శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్

Sri Mallikarjuna Mangalasasanam In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్గురించి తెలుసుకుందాం…

Sri Mallikarjuna Mangalasasanam In Telugu Lyrics

శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే,
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్.

టీక. ఉమాకాంతాయ = పార్వతీరమణుఁడైనట్టియు, కాంతాయ = మనోహరుఁడైనట్టియు, కామితార్థ = కోర్కెలను, ప్రదాయినే = ఇచ్చువాఁడును, శ్రీ గిరీశాయ = శ్రీశైలనివాసియు, దేవాయ = దేవుఁడైన మల్లినాథాయ = మల్లి కార్జున ప్రభువుకొఱకు, మంగళం = శుభమగుఁగాక !

తా. ఉమాధవుఁడును, అతి మనోహరుఁడును, సర్వఫల ప్రదాతయు నగు శ్రీగిరి మల్లికార్జునస్వామికి మంగళమగుఁగాక !

సర్వమంగళరూపాయ శ్రీనగేంద్రనివాసినే,
గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్.

టీక. సర్వమంగళరూపాయ = సర్వమంగళ స్వరూపమును ధరించినట్టియు, శ్రీనగేంద్రనివాసినే = శ్రీ గిరియందు నివసించియున్నట్టియు, గంగా ధరాయ = గంగను ధరించినట్టియు, నాథాయ = లోక నాథుఁడైనట్టి, శ్రీ గిరీశాయ = శ్రీ శైలమల్లికార్జునునికొఱకు, మంగళమ్ = మంగళమగుఁగాక !

తా. సర్వమంగళరూపుఁడును, శ్రీగిరి నివాసియా, గంగాధరుఁడును, లోకనాథుఁడు నైన మల్లికార్జునుని కొఱకు మంగళమగుఁగాక !

సత్యానందస్వరూపాయ నిత్యానందవిధాయినే,
స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్.

టీక. సత్యానందస్వరూపాయ = సదానందస్వరూపుఁడును, నిత్యానంద విధాయినే = నిత్యానందమును గలుగఁజేయువాఁడును, స్తుత్యాయ = స్తోత్రముఁజేయఁదగిన వాఁడును, శ్రుతిగమ్యాయ = వేదవేద్యుఁడును, (అగు) శ్రీగిరీశాయ = శ్రీగిరిమల్లికార్జునకు, మంగళం = మంగళమగుఁగాక !

తా. సచ్చిదానందరూపధారియు, జీవులకు నిత్యానందమొసఁగు వాఁడును, వేదవేద్యుఁడైన శ్రీగిరి మల్లికార్జునునకు మంగళమగుఁగాక !

ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే,
సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్.

టీక. ముక్తిప్రదాయ = మోక్షము నిచ్చునట్టివాఁడును, ముఖ్యాయ = ప్రధానదైనమైనట్టియు, భక్తానుగ్రహకారిణే = భక్తులపై దయఁగల వాఁడును, సౌమ్యాయ = శాంతిప్రదుఁడైన, శ్రీగిరీశాయ = శ్రీగిరిప్రభువగు మల్లికార్జునునికొఱకు, మంగళమ్ = శుభముగలుగుఁగాక !

తా. మోక్షదాయకుఁడును, సర్వామరముఖ్యుఁడును, భక్తాను గ్రహప్రదుఁడును, సుందరాతి సుందరుఁడునై, శాంతిసౌఖ్య ములిచ్చు శ్రీగిరీశునకు మంగళమగుఁగాక !

మరిన్ని స్తోత్రాలు:

Vidura Neethi Patinchi Sukhinchandi In Telugu – విదుర నీతి పాటించి సుఖించండి

Vidura neethi Patinchi Sukhinchandi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విదుర నీతి పాటించి సుఖించండి నీతికథ.

విదుర నీతి పాటించి సుఖించండి

(ఈ కథ ఉద్యోగపర్వంలో ఉంది.)

వెళ్ళాడు.
వచ్చాడు సంజయుడు.
తష్కప్రియాలతోవెళ్ళి, శూన్యహస్తాలతో తిరిగివచ్చాడు. వస్తూనే ధృతరాష్ట్రమహారాజును దర్శించి, రాయబారం విఫలమయిందని, విశేషా అన్నీ మరుసటి ఉదయం మహాసభలో కురు, గురు, వృద్ధబాంధవమంత్రి, సామంత, దండనాథులందరూ ఉండగా వివరంగా చెపుతానని స్వగృహ నికి వెళ్ళాడు.

సంజయుడు వెళ్ళడంతో మహారాజు మనసు మథనపడసాగింది. కుటుంబకలహం ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళనతో ఆ వృద్ధ రాజు హృదయంలో కల్లోలం పుట్టింది. రాత్రికి రాత్రి మనశ్శాంతి కలిగించే ప్రియవాక్యాలు వింటూ నిద్రపోదామని మహామంత్రి విమరునికి కబురు చేశాడు. కౌరవసామ్రాజ్యానికి నిండు గౌరవం తెచ్చే మంత్రి పదవిని నిరా డంబరంగా నిర్వహించే నిరహంకారుడు, నిశ్చలమనస్కుడైన విదురుడు మహారాజు పిలుపును రాత్రివేళ అందుకోవడం అదే మొదటి సారి.

మొదటిసారే ఆయినా ఆ దీవిశారదుడు నిశ్చలచిత్తంతో రాజమంది రానికి విచ్చేసి తనరాకను ద్వారపాలకునిద్వారా మహారాజుకి తెలిమ జేశాడు.

తక్షణం లోవలకు రమ్మని అనుజ్ఞ అయింది.
విదురుడువచ్చి నమస్కరించి, రాజాఙ్ఞానుసారం ఆసీమ డయ్యాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తనకు నిద్ర పట్టటంలేదనీ, హృదయానికి శాంతి కలిగించేమాటలు చెప్పవలసిందనీ అడిగాడు.

‘మహారాజా! మీకు నిద్రపట్టడంలేదంటే నాకు చిత్రంగా ఉంది. బలవంతునితో విరోధం తెచ్చుకున్న దుర్బలులకూ, ఇతరుల సంపదను హరించినవారికీ, కామం పెచ్చు పెరిగినవారికి, దొంగలకుమాత్రమే రాత్రి నిద్రపట్టదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ లక్షణాలన్నీ మీకున్నట్లు వే నెరుగుదును. అటువంటప్పుడు మీకు నిద్రపట్టకపోవడానికి కారణం ఏమిటో నా కవగాహన కావడంలేదు’.

అని ఎదురుప్రశ్న వేయడంతో ధృతరాష్ట్రుడు కొంచెం చికాగ్గా- “నేను నీ ముఖంనుండి ధర్మప్రవచనమే కోరుతున్నాను’ అన్నాడు.

‘ మహారాజా ! ఉత్తమగుణాలూ, ఉన్నతాశయాలూ, ఉదాత్త ధర్మాలూకల ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. కాగలిగిన శక్తి ఉన్నా ఆ కుంతీసుతుడు మీ మాటకెన్నడూ ఎదురు చెప్పలేదు. అయినా మీరు వారిని కారడవులకు పంపారు. మీకు బుద్ధిలేదనీ, ధర్మజ్ఞులుగారనీ అవలేం. అయినా వాటిని అనుసరించేవృష్టి మీకు లోపించింది. వారికి రావలసిన రాజ్యభాగంకూడా వారి కివ్వలేని స్థితిలో ఉన్నారు మీరు.

దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాది అయోగ్యులపై అపరిమిత మైన విశ్వాసం ఉంచి ఈ సామ్రాజ్యభారం అంతా వారిచేతులలో ఉంచారు.

అలా ఉంచి శాంతిని వాంఛించడం వివేకమా మహారాజా?
సాత్త్విక స్వభావమూ, ఉద్యోగయత్నము, క్లేశపహనమూ, ధర్మబద్ధ దృష్టికల పురుషుడు ఎన్నడూ వంచితుడుకాడు. ఇటువంటి విద్వాంసులు దుష్టులకు దూరంగా ఉంటారు. మహారాజా! ధర్మార్థాలను అమసరిస్తూ, లోకవ్యవహారం గ్రహిస్తూ, భోగచింతలేకుండా పురుషార్థాలు సేవిస్తూ, అప్రస్తుతప్రసంగాలు చెయ్యకుండా, దుర్లభాలు వాంఛించ కుండా, పోయినవాటికోసం శోకించకుండా, ఎటువంటి వివత్తులువచ్చినా, ధైర్యంకోల్పోకుండా, ప్రారంభించిన పనిని నిర్విఘ్నంగా పరిసమాప్తం । చెయ్యనిదే విడువకుండా, సోమరితనాన్ని దరిజేరనివ్వకుండా, మనస్సును స్వాధీనంలో ఉంచుకోగలవాడే విద్వాంసుడు.

ఆదరిస్తే ఆనందిస్తూ, అనాదరానికి ఆగ్రహం పొందడం విద్వాం మఖ లక్షణంకాదు. వారిహృదయం గంభీరంగా గంగావడి చదృశంగా ఉంటుంది. విద్వాంమలబుద్ధి విద్యను అనుసరిస్తుంది. విద్య వారి బుద్ధికి థా. బీ. 4

అదుపులో ఉంటుంది. విద్యా వివేకమూ, లేకుండా గర్వంతో చరించే వాడు మూర్ఖుడు. దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ, లేనిపోని ఆశలు పెట్టుకునేవాడూ, అంతే.

స్వీయ ధర్మం విడిచి, యితరుల మార్గాలసాగేవాడూ, స్నేహితు లతో అసంబద్ధంగా చరించేవాడూ, శత్రువులతో సఖ్యంగా ఉంటూ, బల వంతునితో వైరం పెంచుకునేవాడూ, మిశ్రశూన్యుడూ, ఎదుటివారు కోర కుండానే సంభాషించేవాడూ, కృతఘ్నులను విశ్వసించేవాడూ, పరులలో దోషాలే చూచేవాడూ, అకారణంగా ఆవేశానికి లొంగేవాడూ, అనర్హులకు ఉపదేశాలిచ్చేవాడూ …. వీరందరూ మూర్ఖులే ప్రభూ!

విద్యా, దానాలు ఎంత విరివిగా ఉన్నా, ఆ రెండింటిలో అహం కారం లేకుండా ఉండేవాడే విద్వాంసుడు.

తనపోషణలో ఉన్నవారికి భోజనభాజనాలు సమకూర్చకుండా తన పొట్టనింపుకునేవాడు వరమమూర్ఖుడు. విషంఉన్నదే. అది త్రాగినవానినే చంపుతుంది. వాడిమొన కలిగిన బాణం గుచ్చుకున్న వాడే యమసదనం చేరుతాడు. మరి ప్రజలో ! ….

ఈ ప్రజాసమూహం ప్రభువును పదభ్రష్టునిచేసి, పరలోకానికే పంపగలదు.

విధి నిషేధాలు

మహారాజా!
ఏకాకిగా – అంటే ఒంటరిగా భోజనంచెయ్యకూడదు. విషము నమ స్యలు ఎదురయినప్పుడు తనకుతానై నిశ్చయాలు తీసుకోకూడదు. ఒంట రిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ న్వి దిస్తూంటే ఒక్కడుగా మేల్కొని ఉండరాదు,

వహనశక్తి కలవారిలో అసమర్థత ఉంటుందని అంటారు. కాని, అసమర్థులలో సహనం ఉండనే ఉండదు. క్షమ కంటే బలీయ మయినది లేదు. అది పురుషులకు అలంకారంకూడా.

అల్పబుద్ధులనూ, అదే పనిగా ఆలోచించే వారినీ, త్వరత్వరగా నిర్ణయాలు మార్చేవారినీ, స్తోత్ర పాఠకులనూ రహస్య సమాలోచనకు ఆహ్వానించ కూడదు.

కుటుంబంలోని వృద్ధులనూ, దారిద్యంలో వడ్డ ఉన్నత కుటుంబీ కులనూ, అటువంటి దశనే అనుభవించే స్నేహితులనూ, సంతాన విహి నయై, భర్తను కోల్పోయిన సోదరినీ, ఆదరించి ఆశ్రయమిచ్చి పోషించాలి.

సమయం, సందర్భం లేకుండా కోపం తెచ్చుకునేవాడూ, సేవ కుల కష్ట సుఖాలతో నిమిత్తం లేకుండా వారిచేత సేవ చేయించుకునే వాడూ, వారి కృషికి తగిన వేతనాలూ, బహుమతులూ యివ్వని ప్రభు వును అచిరకాలంలోనే ప్రజలు క్రిందికి దింపుతారు.

ప్రభూ పన్నులు వసూలు చేయడంలో కూడా అధికారులు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. పూలదండలు కట్టివాడు మొక్కకి ఏ చేటు రాకుండా దాన్ని పెంచుతూనే పువ్వులు కోపెట్టు, పన్నులు వమాలు చెయ్యాలే తప్ప, బొగ్గులవ్యాపారిలా చెట్టు మొదలంటా నరకకూడదు.

గో, నారీ, విప్రజనులమీద, స్వజనంమీద శౌర్యం ప్రకటించే వారు అరముగ్గిన పండులా నేల కూలుతారు.

విశాల ప్రాంతంలో ఒక్కటిగా పెరిగే చెట్టు గట్టి వేళ్ళతో బలంగా పెరుగవచ్చు. కాని ఒక్క గాలివాన వివరిందో మహారాజాః సమూలంగా నేలకూలి పోతుంది. అదే వృక్ష సమూహం మధ్యలో ఉంటే అప్పుడది అంత సులభంగా గాలికి వరిగిపోదు. అందు చేతనే వజ్జములు సంఘంగా ఉండాలనీ, వారంతా పరస్పర సహకారంతో చరించాలనీ, బుధులు చెపుతూ ఉంటారు.

ఆకాశాన్ని పిడికిటి పోటుతో వంచేద్దామనుకునే వాడూ, ఇంద్రధనస్సును తవ బాహు బలంతో పంచుదామమకునేవాడూ, మార్యకిరణాలను దోసిట పడదామనుకునే వాడూ, వీరందరూ మూర్ఖులే అంటారు స్వాయం భువనుమవుం

ప్రియం – హితం

మనకు ప్రీతికలిగే మాటలు చెప్పేవారు అయాచితంగానే అనే కులు లభిస్తారు. కాని, మన శ్రేయస్సుకోరి హితవు చెప్పేవాడు దొరకడు. ఓవేళ హితబోధ చేసే వారున్నా, వినేవాడుండడు. ధర్మదృష్టి విడువ కుండా స్వామియొక్క ప్రియాప్రియాలతో నిమిత్తం లేకుండా హితవు చెప్పగలవాడే ఉత్తమ సేవకుడు.

సేవకుల జీవనభారం గ్రహించి వారికి వేతనా లివ్వకపోయినా, మంత్రులు భోగవంచితు అయినా ఆ ప్రభువు వడచ్యుతుడు కాక తప్పదు.

ప్రభువుమాట పెడచెవిని పెట్టి యితర కార్యాలలో తిరిగే సేవకుని, అహంకారంతో ప్రభువుకు ప్రతికూలంగా చరించేవానినీ, మరుక్షణమే పదవి నుండి తొలగించాలి. ప్రభువుకు గల బలాలలో బాహుబలం మెద టిదే అయినా, దాన్ని ఘనంగా భావించరాదు. ఇక రెండవ బలం ఉత్తముడయిన మంత్రి. తరువాత ధనబలం. పితృ, పితామహప్రాప్త మున్నదే అది సహజం. అన్నింటినీ మించినది బుద్ధిబలం. స్త్రీ – సౌభాగ్యశాలిని. కనుక ఆమె గృహాలంకారం. అందుకే ఆమెను రక్షించు కోవడం పురుషుని విధి.

మహారాజా ! సర్వసద్గుణ సంపన్నులూ, ధర్మ మర్మజ్ఞులూ అయిన పాండవులతో విరోధం ఉచితం కాదు. అందుచేత వారిభాగం వారికిచ్చి సంతోషించండి’ అన్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Ennadu Parushyapu Matalaadaradu In Telugu – ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

Ennadu Parushyapu Matalaadaradu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు కథ. 

ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

నహుష మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి. అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూరువునికి రాజ్యభారమొసగి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేదవేదాంగ పాఱంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. హవిస్సులతో దేవతలను తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు. కామ క్రోధాది అరిషడ్వర్గాలను జయించి సహస్ర దివ్యవర్షములు తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. ముప్పది ఏండ్లు నిరాహారిగా ఒక్క ఏడాది వాయుభక్షణ చేసి తరువాత పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు. అటు తరువాత ఒక్క ఏడాది సముద్రమధ్యములో ఒంటికాలుమీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యనిధి ప్రభావంవల్ల దివ్యవిమానములో దేవలోకానికి వెళ్ళాడు.

అక్కడ దేవర్షుల పూజలందుకొని బ్రహ్మలోకం చేరాడు. అక్కడ అనేక కల్పములు ఉండి బ్రహ్మర్షుల చేత పూజలందుకొన్నాడు! ఆ తరువాత ఇంద్రలోకాని వచ్చాడు. ధర్మాత్ముడు మహాతపశ్శక్తి సంపన్నుడు అయిన యయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయముగా వచ్చి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు. మహావిభవోపేతుడైన ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు “ఏమి తపస్సు చేశావయ్య మహానుభావా? నువ్వు సామాన్యుడవు కావు! శతసహస్ర వర్షముల తపస్సు సామాన్యులకు సాధ్యమా?”.

సాక్షాత్ దేవేంద్రుడంతటివాడు ఇలా పొగిడేసరికి యయాతి ప్రారబ్ధవశాత్తు ఇలా పారుష్య వాక్యాలు అన్నాడు “ఓ అమరేంద్రా! సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ మునిగణముల తపస్సులు నా తపస్సుకు సాటిరావు”. “ఔరా! ఇంత గొప్పవాడయ్యికూడా గర్వమును వీడలేదు కదా!” అని అనుకొని ఇంద్రుడు యయాతితో “మహనీయులైన మహర్షుల తపస్సులను గర్వముతో కించపఱచినావు. లోకశ్రేయస్సుకై తమ జీవితాలను ధారపోసిన ఆ మహనీయులనెన్నడూ అవమానించరాదు. ఓ యయాతి! ఈ ఒక్క మాటతో నీవు సంపాదించుకొన్న తపశ్శక్తి అంతా అంతరించిపోయింది. ఇక నీకు ఈ లోకములో ఉండటానికి అర్హతలేదు. అధోలోకానికి పో” అని శపించాడు.

తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో శరణువేడి యయాతి “ఓ దేవేంద్రా! ఏ క్షణాన నేను పూజ్యులైన మహర్షులను అవమానించానో ఆ క్షణమే నా శక్తి అంతా కరిగిపోయింది. నన్ను అధోలోకాలకు పంపకు. నాకు సత్సంగత్యం లేకుండా చేయకు. సత్ భువనములో సత్పురుషుల సాంగత్యములో నన్ను ఉండనివ్వు” అని ప్రార్థించాడు. పశ్చాత్తాపముతో కుమిలిపోతున్న యయాతిని కరుణించి దేవేంద్రుడు యయాతికి సద్భువనములో నివసించుటకు అనుజ్ఞ ఇచ్చాడు.

సద్భువనములో ఉండి ఆ యయాతి అచిరకాలములోనే అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించాడు. అహంకారమును పూర్తిగా విడిచి మహాతేజోమయుడయ్యాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దౌహిత్రులైన అష్టకుడు ప్రతర్దనుడు వసుమంతుడు ఔసీనరుడు మరియు శిబి సద్భువనమునకు వచ్చిరి. అనంతపుణ్యసంపదతో వెలిగిపోతున్న యయాతిని పూజించి “స్వామి! మీరెవరు” అని అడిగారు. యయాతి తన కథను చెప్పి “నాయనలారా! ఎంత కొంచెమైనా గర్వము ఎన్నడు ఉండరాదు. గర్వముతో నేను పారుష్యవాక్యములు మాట్లాడి ఉత్తములైన మహర్షులను అవమానించినాను. మీరెన్నడు అట్టి తప్పుచేయవద్దు. వాక్పారుష్యము విషము కన్నా అగ్ని కన్నా భయంకరమైనది” అని హితవు చెప్పాడు. యాయాతిని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించి ఆయనవద్ద ఎన్నో రహస్యములైన ధర్మోపదేశాలు పొందారు అష్టకాదులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. గర్వము అహంకారము ఎంత కొంచెముగా ఉన్నా హాని కాలుగచేస్తాయి. ఒక్కచిన్న పారుష్యవాక్యము వలన తన తపశ్శక్తినంతా పోగొట్టుకున్నాడు యయాతి.
  2. ఎన్నడూ ఉత్తములను అవమానించరాదు. మహర్షుల తపస్సులు తన తపస్సుతో సాటిరావని అని యయాతి వారిని అవమానించాడు.
  3. ఒక సజ్జనుడెన్నడూ తప్పుచేయడు. పొరబాటుగా చేసినా దానికి పశ్చాత్తాపము చెంది ఆ తప్పు నెన్నడు మళ్ళీ చేయడు. సజ్జనుడైన యయాతి తను చేసిన తప్పును దౌహిత్రుల వద్ద చెప్పుకొని ఆ తప్పు చేయవద్దని హితవు చెప్పాడు.
  4. ఒక మనిషి యొక్క ఉద్ధారణకు సత్సంగత్యం చాలా అవసరము. ఈ విషయం తెలిసిన యయాతి సత్సంగత్య భాగ్యము కలిగించమి ఇంద్రుని కోరుకున్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Vinayaka Ashtottara Shatanamavali In Telugu – శ్రీ వినాయకాష్టోత్తర శతనామావళిః

Sri Vinayaka Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు వినాయకాష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Sri Vinayaka Ashtottara Shatanamavali

శ్రీ వినాయకాష్టోత్తర శతనామావళిః

(ఈ క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజచేయాలి.)

  • ఓం గజాననాయ నమః
  • ఓం గణాధ్యక్షాయ నమః
  • ఓం విఘ్నరాజాయ నమః
  • ఓం వినాయకాయ నమః
  • ఓం ద్వైమాతురాయ నమః
  • ఓం ద్విముఖాయ నమః
  • ఓం ప్రముఖాయ నమః
  • ఓం సుముఖాయ నమః
  • ఓం కృతినే నమః
  • ఓం సుప్రదీపాయ నమః
  • ఓం సుఖనిధయే నమః
  • ఓం సురాధ్యక్షాయ నమః
  • ఓం సురారిఘ్నాయ నమః
  • ఓం మహాగణపతయే నమః
  • ఓం మాన్యాయ నమః
  • ఓం మహాకాలాయ నమః
  • ఓం మహాబలాయ నమః
  • ఓం హేరంబాయ నమః
  • ఓం లంబజఠరాయ నమః
  • ఓం హ్రస్వగ్రీవాయ నమః
  • ఓం మహోదరాయ నమః
  • ఓం మదోత్కటాయ నమః
  • ఓం మహావీరాయ నమః
  • ఓం మంత్రిణే నమః
  • ఓం మంగళస్వరాయ నమః
  • ఓం ప్రమధాయ నమః
  • ఓం ప్రథమాయ నమః
  • ఓం ప్రాజ్ఞాయ నమః
  • ఓం విఘ్నకర్ర్తే నమః
  • ఓం విఘ్నహంత్రే నమః
  • ఓం విశ్వనేత్రే నమః
  • ఓం విరాట్పతయే నమః
  • ఓం శ్రీపతయే నమః
  • ఓం వాక్పతయే నమః
  • ఓం శృంగారిణే నమః
  • ఓం ఆశ్రితవత్సలాయ నమః
  • ఓం శివప్రియాయ నమః
  • ఓం శీఘ్రకారిణే నమః
  • ఓం శాశ్వతాయ నమః
  • ఓం బలాయ నమః
  • ఓం బలోత్థితాయ నమః
  • ఓం భవాత్మజాయ నమః
  • ఓం పురాణపురుషాయ నమః
  • ఓం పూష్ణే నమః
  • ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః
  • ఓం అగ్రగణ్యాయ నమః
  • ఓం అగ్రపూజ్యాయ నమః
  • ఓం అగ్రగామినే నమః
  • ఓం మంత్రకృతే నమః
  • ఓం చామీకరప్రభాయ నమః
  • ఓం సర్వస్మై నమః
  • ఓం సర్వోపాస్యాయ నమః
  • ఓం సర్వకర్ర్తే నమః
  • ఓం సర్వనేత్రే నమః
  • ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
  • ఓం సర్వసిద్ధియే నమః
  • ఓం పంచహస్తాయ నమః
  • ఓం పార్వతీనందనాయ నమః
  • ఓం ప్రభవే నమః
  • ఓం కుమారగురవే నమః
  • ఓం అక్షోభ్యాయ నమః
  • ఓం కుంజరాసుర భంజనాయ నమః
  • ఓం ప్రమోదాయ నమః
  • ఓం మోదకప్రియాయ నమః
  • ఓం కాంతిమతే నమః
  • ఓం ధృతిమతే నమః
  • ఓం కామినే నమః
  • ఓం కపిత్థవనప్రియాయ నమః
  • ఓం బ్రహ్మచారిణే నమః
  • ఓం బ్రహ్మరూపిణే నమః
  • ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః
  • ఓం జిష్ణవే నమః
  • ఓం విష్ణుప్రియాయ నమః
  • ఓం భక్తజీవితాయ నమః
  • ఓం జితమన్మథాయ నమః
  • ఓం ఐశ్వర్యకారణాయ నమః
  • ఓం జ్యాయసే నమః
  • ఓం యక్షకిన్నర సేవితాయ నమః
  • ఓం గంగాసుతాయ నమః
  • ఓం గణాధీశాయ నమః
  • ఓం గంభీరనినదాయ నమః
  • ఓం వటవే నమః
  • ఓం అభీష్టవరదాయ నమః
  • ఓం జ్యోతిషే నమః
  • ఓం భక్తనిధయే నమః
  • ఓం భావగమ్యాయ నమః
  • ఓం మంగళప్రదాయ నమః
  • ఓం అవ్యక్తాయ నమః
  • ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
  • ఓం సత్యధర్మిణే నమః
  • ఓం సఖయే నమః
  • ఓం సరసాంబునిధయే నమః
  • ఓం మహేశాయ నమః
  • ఓం దివ్యాంగాయ నమః
  • ఓం మణికింకిణీ మేఖలాయ నమః
  • ఓం సమస్త దేవతామూర్తయే నమః
  • ఓం సహిష్ణవే నమః
  • ఓం సతతోత్థితాయ నమః
  • ఓం విఘాతకారిణే నమః
  • ఓం విశ్వగ్ధృశే నమః
  • ఓం విశ్వరక్షాకృతే నమః
  • ఓం కళ్యాణగురవే నమః
  • ఓం ఉన్మత్తవేషాయ నమః
  • ఓం అపరాజితే నమః
  • ఓం సమస్త జగదాధారాయ నమః
  • ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
  • ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
  • ఓం విఘ్నేశ్వరాయ నమః
  • ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః

మరిన్ని అష్టోత్తరములు:

Sri Raghavendra Kavacham In Telugu | శ్రీ రాఘవేంద్ర కవచం

Sri Raghavendra Kavacham

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… ఈ క్రింద ఇచ్చిన లింకు నందు శ్రీ రాఘవేంద్ర కవచం ఇవ్వబడినది. అది ఏమిటో తెలుసుకుందాం…

Sri Raghavendra Kavacham In Telugu Lyrics

శ్రీ రాఘవేంద్ర కవచం

కవచం రాఘవేంద్రస్య యతీంద్రస్య మహాత్మనః |
వ్యమి గురువర్యస్య వాంఛితార్థ ప్రదాయకమ్ ||

1

మహాత్ముడు, యతి శ్రేష్ఠుడు, గురువర్యుడు నగురాఘ వేంద్రునియొక్క వాంఛితార్ధము నొసంగు కవచమును చెప్పుచున్నాను.

ఋషిరస్యప్పణాచార్య ఛందొనుష్టుప్ ప్రకీర్తితమ్ |
దేవతా శ్రీరాఘ వేంద్రగురురిష్టార్థ సిద్ధయే ||

2

ఈ కవచమునకు ఋషి అప్పణాచార్యులు, ఛందస్సు అనుష్టుప్పు, దేవత శ్రీరాఘ వేంద్రగురువు, ఇష్టార్థసిద్ధి కొఱకు ఇది చెప్పబడినది.

అష్టోత్తరశతం జాప్యం భ క్తియు క్తేన చేతసా |
ఉద్యత్ ప్రద్యోతనద్యోతద్భర్మ కూర్మాస నేస్థితమ్ ||

3

ప్రకాశించు సూర్యునివలె వెలుగొందు సువర్ణకూర్మాస నమునందు కూర్చుండి భక్తితో గూడిన మనస్సుతో నూట యెనిమిది మారులు దీనిని జపింపవలెను.

ఖద్యఖద్యోతనద్యోత ప్రతాపం రామమానసమ్ |
ధృత కాషాయవసనం తులసీహారవక్షసమ్ ||

4

సూర్యునిప్రకాశము వంటి ప్రతాపము గలవాడు, రామ మానసుడు, కాషాయ వస్త్రములను ధరించినవాడు, తులసీ మాలలచే శోభిల్లు వక్షస్థలము గలవాడు.

దోర్దండ విలసద్దండ క మండలువిరాజితమ్ |
అభయజ్ఞానముద్రాక్షమాలసీల కరాంబుజమ్ ||

5

భుజదండములయందు విరాజిల్లు దండకమండలములు గలవాడు, అభయజ్ఞానముద్ర అక్షమాల హస్తమునందు గలవాడు.

యోగీంద్రవంద్య పాదాబ్జం రాఘవేంద్రగుణం భజే
శిరోరక్షతు మే నిత్యం రాఘ వేంద్రో౭ఖ లేష్టదః ||

6

యోగీంద్రులచే నమస్కరింపదగు పాదపద్మములు గలవాడు నగు రాఘవేంద్ర గురువును సేవించుచున్నాను. సమ స్తవాంఛలను దీర్చునట్టి రాఘ వేంద్రుడు నిత్యము నాశిరస్సును రక్షించుగాక !

పాపాద్రిపాట నే వజ్రః కేశాన్ రక్షతు మే సదా !
క్షమాసురగణాధీశో ముఖం రక్షతు మే గురుః ॥

7

పాపములనెడు పర్వతమును ఛేధించుటయందు వజ్రా యుధము వంటివాడై న రాఘవేంద్రుడు ఎల్లప్పుకునా కేశములను రక్షించుగాక ! భూసురగణముల కధీశుడు, గురువునగు శ్రీరాఘ వేంద్రుడు నా ముఖమును రక్షించుగాక !

హరి సేవాలబ్ధసర్వసంపత్ ఫాలం మమావతు |
దేవస్వభావోఒవతు మే దృశౌ తత్వప్రదర్శకః ||

8

హరిసేవవలన లభించిన సర్వసంపదలు గలిగిన రాఘ వేంద్రుడు నాఫాల భాగమును కాపాడుగాక ! దేవస్వభావుడు, తత్త్వజ్ఞానమును ప్రదర్శించువాడు నగు రాఘ వేంద్రుడు నాదృక్కులను కాపాడుగాక !

ఇష్టప్రదానే కల్పద్రుః శ్రోత్రే శ్రుత్యర్థబోధకః |
భవ్యస్వరూపో మే నాసాం జిహ్వంమేవతుభవ్యకృత్ ||

9

ఇష్టార్థముల నొసంగుటయందు కల్పవృక్షమువంటివాడు శ్రుత్యర్థములను బోధించువాడు నగురాఘ వేంద్రుడు నాశ్రోత్ర ములను (చెవులను) భవ్య స్వరూపుడు నానాసికను, శుభంకరుడు నాజిహ్వను (నాలుకను) రక్షించుగాక !

ఆస్యం రక్షతు మే దుఃఖతూలసంఘాగ్ని చర్యకః |
సుఖధై.ర్యాదిసుగుణో భ్రువౌ మమ సదావతు ||

10

దుఃఖములనెడు దూది మూటలను అగ్నివలె దగ్ధము చేయువాడు నా ముఖమును, సుఖము ధైర్యము మున్నగు సుగుణములు గలవాడు నా కనుబొమ్మలను ఎల్లప్పుడు రక్షించుగాక !

ఓస్టౌ రక్షతు మే సర్వగ్రహనిగ్రహశ క్తిమాన్ |
ఉపప్ల వోదధి సేతుర్దంతాన్ రక్షతు మే సదా ||

11

సర్వగ్రహములను నిగ్రహించుటయందు సామర్ధ్యము గలవాడు నా ఓష్ఠములను (పెదవులను), ఉపద్రవములనెడు సముద్రమునకు సేతువువంటివాడు నా దంతములను ఎల్లప్పుడు రక్షించుగాక !

నిర స్తదోషో ”మే పాతు కపోతా సర్వపాలకః |
నిరవద్యమహావేషః కంఠం మే౭వతు సర్వదా ||

12

దోషములు లేనివాడు, సర్వపాలకుడు నాక పోలములను (చెంపలను), దోషము లేని మహా వేషముగలవాడు నా కంఠమును అన్ని వేళల రక్షించుగాక !

కర్ణమూలే తు ప్రత్యర్థి మూకత్వకరవాఙ్మమ |
బహువాదిజయీ పాతు హస్తా స త్తత్వవాదకృత్ ||

13

ప్రత్యర్థులను మూగివారినిగా జేయువాడు. నా కర్ణములను. (చెవులను) పెక్కండ్రు వాదులను జయించువాడు, సత్తత్వమును గూర్చి వాదించువాడు నా హస్తములను రక్షించుగాక!

కరౌ రక్షతు మే విద్వత్ పరిజ్ఞేయని శేష వాన్ |
వాగ్వైఖరీభవ్య శేషజయీ వక్ష స్థలం మమ ||

14

విద్వాంసులు దెలిసికొన దగిన విశేషములు గలవాడు నా కరములను రక్షించుగాక ! వాగై ఖరి చేత గొప్పవాడైన అది శేషువును జయించినవాడు నా వక్షస్థలమును రక్షించుగాక !

సతీసంతానసంపత్తి భ క్తిజ్ఞానాదివృద్ధికృత్ |
స్తనౌ రక్షతు మే నిత్యం శరీరావద్యహానికృత్ ||

15

పత్నీ పుత్రసంతాన సంపదను భ క్తిజ్ఞానాదులను వృద్ధి చేయువాడు, శరీరము నందలి దోషములను నశింప జేయు వాడు నగురాఘ వేంద్రుడు నా స్తనములను రక్షించుగాక!

పుణ్యవర్ధనపాదాబ్జాభి షేకజలసంచయః |
నాభిం రక్షతు మే పార్శ్వౌ ద్యునదీతుల్య సద్గుణః ||

16

పుణ్యమును పెంచునట్టి పాదపద్మముల యందలి అభిషేక జలముయొక సమూహముగలవాడు నానాభిని రక్షించుగాక. ఆకాశగంగతో సమాన మైన సద్గుణములుగలవాడు రెండువైపుల నన్ను రక్షించుగాక !

పృష్టం రక్షతు మే నిత్యం తాపత్రయవినాశకృత్ |
కటిం మే రక్షతు సదా వంధ్యా సత్పుత్రదాయకః ||

17

తాపత్రయమును నాశముచేయువాడు ఎల్లప్పుడు నాపృష్టమును ( వెనుక భాగమున్ను రక్షించుగాక ! గొడ్రాలికి సత్పుత్రులనొసంగువాడు ఎల్లప్పుడు నా కటి (నడుమును) భాగమును రక్షించుగాక !

జఘనం మే౭వతు సదా వ్యంగస్వంగ సమృద్ధికృత్ |
గుహ్యం రక్షతు మే పాపగ్రహారిష్ట వినాశకృత్ ||

18

వికలాంగులకు సహితముమంచి అవయవముల యొక్క పాటవము నొసంగువాడు నిత్యము నాజఘనములను (పిరుదులను) రక్షించుగాక! పాపగ్రహాదుల వలన సంభవించు అనర్థములను నాశన మొనరించువాడు నాగుహ్యాంగములను రక్షించుగాక !

భక్తాఘవిధ్వంసకరనిజమూర్తి ప్రదర్శకః |
మూర్తిమాన్ పాతు మేరోమం రాఘవేంద్రో జగద్గురుః ||

19

భక్తుల పాపములను విధ్వంస మొనరించునట్టి తన స్వరూపమును ప్రదర్శించువాడు, జగద్గురువు నగు శ్రీరాఘ వేంద్ర స్వామి రోమములను మూర్తిమంతుడై రక్షించుగాక !

సర్వతంత్ర స్వతంత్రో సౌ జానునీ మే సదా౭వతు |
జంఘే రక్షతు మే నిత్యం శ్రీమధ్వమతవర్ధనః ||

20

సర్వతంత్ర స్వతంత్రు డైనవాడు నాజానువులను (మోకాళ్ళను) రక్షించుగాక! మధ్యమత వర్ధను డైనవాడు నాజంఘములను (పిక్క్లను) రక్షించుగాక !

విజయీంద్రక రాజ్జోత సుధీంద్రవరపుత్రకః |
గుల్ఫౌ శ్రీరాఘ వేంద్రో మే యతిరాట్ సర్వదావతు ||

21

శ్రీవిజయీంద్ర కరపద్మములనుండి ఉద్భవించినవాడైన సుధీంద్రునివరపుత్రుడు, శిష్యుడు, యతీశ్వరుడు నైనశ్రీరాఘ వేంద్రస్వామి నాగుల్ఫములను (చీలమండలను రక్షించుగాక !

పాదౌ రక్షతు మే సర్వఅభయహరీ కృపానిధిః |
జ్ఞాన భక్తి సుపుత్రాయుర్యశః శ్రీ పుణ్యవర్ధనః ||

22

సర్వజనులకు అభయము నిచ్చునట్టిదాయానిధి, జ్ఞానము, భక్తి, సుపుత్రులను, ఆయుష్యమును, యశశును, సంపదను, పుణ్యమును వృద్ధి యొనరించువాడు. నా పాదములను రక్షించుగాక !

కరపాదాంగులీస్సర్వా మసూవతు జగద్గురుః |
ప్రతివాడి జయస్వంత భేదచిహ్నాదరో గురుః ||

23

ప్రతివాదులను జయించునపుడు తన హృదయమున భేద (ద్వైతచిహ్నమును) ఆదరమున ధరించు చిహ్నమును జగద్గురువు నా కరపాదాంగుళీయకములను రక్షించుగాక !

సఖానవతు మే సర్వాన్ సర్వశాస్త్ర విశారదః |
అపరోక్షకృతశ్రీశః ప్రాచ్యాం దిశి సదావతు ||

24

సర్వశాస్త్రవిశారదుడు నా నఖములను రక్షించుగాక ! శ్రీపతిని ప్రత్యక్ష మొనరించుకొనినవాడు, నన్ను తూర్పుదిక్కు నందు సదా రక్షించుగాక !

స దక్షిణే చావతు మాం సముపేక్షిత భావజః ।
అపేక్షితప్రదాతా చ ప్రతీచ్యామవతూ ప్రభుః ॥

25

మన్మథుని ఉపేక్షించినవాడు నన్ను దక్షిణదిక్కునందు సదారక్షించుగాక ! అపేక్షితములు (కోరినకోర్కెలు) నిచ్చు ప్రభువు నన్ను పడమర దిక్కునందు రక్షించుగాక !

Sri Raghavendra Kavacham In Telugu 

దయాదాక్షిణ్య వై రాగ్యవాక్పాటవముఖాంకితః |
సదోదీచ్యామవతు మాం శాపానుగ్రహశక్తిమాన్ ||

26

దయ, దాక్షిణ్యము, వైరాగ్యము, వాక్పాటవములతో కూడిన ముఖము కలవాడు, శాపానుగ్రహశక్తి కలవాడు, నన్ను ఉత్తరదిక్కు నందు సదా రక్షించుగాక !

నిఖి లేంద్రియదోషఘ్నో మహానుగ్రహకృద్గురుః |
అధశోర్ధ్వం చావతు మామాష్టాక్షరమనూదితః ||

27

సర్వేంద్రియ దోషములను పోగొట్టి మహానుగ్రహమును సంపాదింప జేయునట్టి గురువు నా అధో దేశమును, అష్టాక్షర మంత్రముచే నిరూపితు డైనగురువు నా ఊర్ధ్వ దేశమును రక్షించుగాక !

ఆత్మాత్మీయాఘరాశిఘ్నా మాం రక్షతు విధిక్షు చ |
చతుర్ణాం చ పునర్థానాం దాతా ప్ర్రాతః సదావతు ||

28

నా యొక్కయు, నా ఆత్మీయుల యొక్కయు, పాప సమూహములను నాశన మొనరించు నట్టివాడు, ధర్మార్థకామ మోక్షములను చతుర్విధ పురుషార్థముల నిచ్చు నట్టివాడు, దిక్కులయందు, విదిక్కులందు నన్ను రక్షించుగాక!

సంగ మ్కేవతు మాం నిత్యం తత్వవిత్ సర్వసౌఖ్యకృత్ |
మధ్యాహ్నేగమ్యమహిమా మాం రక్షతు మహాయశాః ||

29

తత్వములు నెరింగినవాడు, సర్వ సౌఖ్యములను సంపా దించువాడు, మధ్యాహ్న సమయమున మహిమ తెలియుటకు శక్యముగానివాడు నన్ను సంగమమున రక్షించుగాక !

మృతపోత ప్రాణదాతా సాయాహ్నే మాం సదావతు |
వేదిస్థ పురుపోజ్జీవీ నిశీథే పాతు మాం గురుః ||

30

చనిపోయిన బాలకులకు ప్రాణదాత నన్ను సాయం కాలమున రక్షించుగాక! అరుగుపైనున్న పురుషుని జీవింప జేసిన వాడు సన్ను రాత్రియందు రక్షించుగాక !

వహ్నిస్థమాలికోద్ధర్తా వహ్ని తాపాత్సదావతు |
సమగ్రటీకావ్యాఖ్యాతా గురు ర్మే విషయే: ఒవతు ||

31

అగ్నిలో పడిన రత్నమాలికను ఉద్దరించినవాడు, అగ్ని పాతమునుండి నన్ను రక్షించుగాక! సంపూర్ణముగ టీకా వాఖ్యాన మొనరించిన గురువు విషయములనుండి నన్ను సదా రక్షించుగాక !

కాంతా రేవతు మాం నిత్యం భాట్టసంగ్రహకృద్గురుః |
సుధాపరిమళోద్ధర్తా సుచ్ఛందస్తుసదావతు ||

32

భాట్ట సంగ్రహమహా గ్రంథమును రచించిన గురువు నన్ను అరణ్యములందు రక్షించుగాక! శ్రీమన్న్యాయ సుధకు పరిమళ వ్యాఖ్యానమును రచించినవాడు, మంచి అభిప్రాయముల యందు సదా నన్ను రక్షించుగాక !

రాజచోరవిష వ్యాధియాదోవన్యమృగాదిభిః |
అపస్మారాపహర్తా నః శాస్త్రవిత్ సర్వదావతు ||

33

రాజభయము, చోరభయము, విషవ్యాధులు, జలజంతువులు, వన్యమృగములు వీనినుండి రక్షించువాడు, సర్వ శాస్త్రములు నెరింగినవాడు నన్ను అపస్మార రోగమునుండి రక్షించుగాక !

గతౌ సర్వత్ర మాం పాతూపనిషదర్థ కృద్గురుః |
ఋగ్వ్యాఖ్యానకృదాచార్యః స్థితా రక్షతు మాం సదా ||

34

ఉపనిషదర్థములను ఆచరించిన గురువు అంతటా నన్ను రక్షించుగాక ! ఋగ్వేద వ్యాఖ్యానముల నొనరించిన గురువు, స్థితిలో నన్ను రక్షించుగాక !

మంత్రాలయనివాసీ మాం జాగ్రత్ కాలే సదావతు |
న్యాయముక్తావలీకర్తా స్వప్నే రక్షతు మాం సదా ||

35

మంత్రాలయమున నివసించువాడు నన్ను జాగ్రత్కాల మందు సదా రక్షించుగాక ! న్యాయముక్తావళి యను మహా గ్రంథమును రచించినవాడు నన్ను సదా స్వప్నములో రక్షించుగాక !

మాం పాతు చంద్రికావ్యాఖ్యాకర్తా సుప్తాహి తత్త్వకృత్ |
సుతంత్రదీపికాకర్తా ముక్తా రక్షతు మాం గురుః ||

36

చంద్రికా వ్యాఖ్యానమును రచించినవాడు, తత్త్వ మెరిగినవాడు, సుతంత్ర దీపికయను గ్రంథమును రచించినవాడు, నన్ను ముక్తిలో రక్షించుగాక !

గీతార్థసంగ్రహకర్తా సదా రక్షతు మాం గురుః |
శ్రీమధ్వమతదుగ్ధాబ్ధి చంద్రోవతు సదానఘః ||

37

గీతార్థ సంగ్రహమును రచించిన గురుదేవుడు నన్ను యెల్లప్పుడు రక్షించుగాక! మధ్వ మత మనెడు క్షీరసాగరము నుండి ఉద్భవించిన చంద్రుడు నిత్యము నన్ను రక్షించుగాక !

ఇతి శ్రీ రాఘవేంద్రస్య కవచం పాపనాశనమ్ |
సర్వవ్యాధిహరం సద్యః పావనం పుణ్యవర్ధనమ్ ||

38

ఇది శ్రీరాఘవేంద్ర కవచము. పాపములను నశింప జేయునది. సర్వ వ్యాధులను హరించునది. ఇది సత్యము, పావనము, పుణ్యములను వృద్ధి చేయునది.

య ఇదం పఠతే నిత్యం నియమేన సమాహితః |
అదృష్టిః పూర్ణదృష్టిః స్యా దేడమూకోపివాక్పతిః ||

39

నియమముగా నిష్టకలవాడై నిత్యము ఈ కవచమును పఠించినచో, దృష్టి లేనివాడు పూర్ణ దృష్టివంతుడగును, మూగవాడు వాక్పతి యగును.

పూర్ణాయుః పూర్ణ సంపత్తి భ క్తి జ్ఞానాదివృద్ధికృత్ |
పీత్వా వారినలో యేన కవచేనాభిమంత్రితమ్ ||

40

ఈకవచముతో మంత్రించిన ఉదకమును ద్రావినచో పూర్ణాయుర్దాయము, పూర్ణ సంపద, భక్తి, జ్ఞానాభివృద్ధి కలవాడగును.

జహాతి కుషిగాన్ రోగాన్ గురువర్య ప్రసాదతః |
ప్రదక్షిణ నమస్కారాన్ గురో వృందావనస్య యః ||

41

గురు దేవునకు, బృందావనమునకు ప్రదక్షిణ నమస్కార ముల నొనరించినవాడు గురువు అనుగ్రహమువలన ఉదర రోగ ముల నన్నింటిని నశింపజేసికొనగలడు.

కరోతి పరయా భక్త్యా తదేతత్ కవచం పఠన్ |
పంగుః కుణిశ్చపోగండః పూర్ణాంగో జాయతేధ్రువమ్ ||

42

భ క్తి తోకూడుకొని ఈకవచమును పఠించువాడు, కుంటి వాడై నను అంగహీను డైసను పూర్ణాంగుడగును.

శేషాశ్చ కుష్టపూర్వాశ్చ నశ్యంత్యామయరాశయః |
అష్టాక్ష రేణ మంత్రేణ స్తోత్రేణ కవచేన చ ||

43

అష్టాక్షరమంత్రమును, కవచమును, స్తోత్రమును పఠించినచో కుష్ఠు ‘మొదలైన మిగిలిన భయంకర వ్యాధులు నశించిపోవును.

వృందావనే సన్నిహితమభిషి చ్య యథావిధి |
యంతే మంత్రాక్షరాణ్యష్టా విలిఖ్యాత్ర ప్రతిష్టితం ||

44

బృందావనము చెంత మంత్రాక్షరములను యెనిమిదింటిని లిఖించి, యంత్రమునుంచి యథావిధిగా అభిషేకింపవలెను.

షోడశై రుపచారైశ్చ సంపూజ్య త్రిజగద్గురుమ్ |
అష్టోత్తర శతాఖ్యాభిరర్చయేత్ కుసుమాదిభి ||

45

త్రిజగములకు గురువైన శ్రీరాఘ వేంద్రస్వామిని పోడ శోపచారములతో పూజింపవలెను. అష్టోత్తరశతనామములను బల్కుచు పుష్పములు నర్పింపవలెను…

ఫలైశ్చ వివిధై రేవ గురోరర్చాం ప్రకుర్వతః |
నామశ్రవణమా తేణ గురువర్య ప్రసాదతః ||

46

భూత ప్రేతపిశాచాద్యాః విద్రవంతి దిశో దశ |
పఠేదేతత్ త్రికం నిత్యం గురో వృందావనాంతికే ||

47

నిత్యము బృందావనము చెంత యీ మూడింటిని ( స్తోత్ర, కవచ, మంత్రములను) పఠించి వివిధములగు ఫలములతో గురు దేవు నర్చించినచో, గురుదేవుని నామశ్రవణ మాత్రముననే ఆయన ప్రసాదమువలన భూత ప్రేతపిశాచాదులు పది దిక్కులకు పారిపోవును.

దీపంసం యోజ్య విద్యావాన్ సభాసు విజయీభవేత్ |
రాజచోరమహావ్యాఘ్రసర్పనక్రాది పీడనమ్ ||

48

విద్యావంతు డైనవాడు బృందావనము చెంత దీపమును వెలిగించినచో సభలలో విజయమును పొందగలడు. అతడు రాజువలన, చోరులవలన, వ్యాఘ్రాది క్రూర జంతువులవలన, సర్పములవలన, మొసళ్ళవలన పీడ లేనివాడగును.

కవచస్య ప్రభావేన భయం తస్య నజాయతే |
సోమసూర్యోపరాగాదికాలే వృందావనాంతికే ||

49

సూర్యచంద్ర గ్రహణ సమయములో బృందావనము చెంత నీకవచమును పఠించిన వానికి ఈకవచప్రభావమున ఎట్టి భయము యుండదు.

కవచాదిత్రికం పుణ్యం అప్పణాచార్యదర్శితం |
జపేద్యః స ధనం పుత్రాన్ భార్యాం చ సుమనోహరామ్ ||

50

శ్రీఅప్పణాచార్యులు రచించిన పుణ్యమయము లేన ఈకవచత్రయము (కవచము, స్తోత్రము, మంగళాష్టకము) ను జపించువాడు ధనమును, భార్యను, పుత్రులను, సంపదలను పొందగలడు.

జ్ఞానం భక్తిం చ వై రాగ్యం భుక్తిం ముక్తిం చ శాశ్వతీమ్ |
మోదతే నిత్యం గురువర్య ప్రసాదతః ||

51

ఈకవచత్రికమును కవచము, స్తోత్రము, మంగళాష్ట కము) పఠించినవాడు ” గురుదేవుని అనుగ్రహము వలన జ్ఞాన మును, భక్తిని, వైరాగ్యమును, భక్తిని, శాశ్వతమగు ముక్తిని పొంది సంతోషము కలవాడగును.

మరిన్ని కవచాలు మీకోసం:

Vinayaka Chavithi Vratha Katha In Telugu – వినాయక చవితి వ్రత క‌థ‌

Vinayaka Chavithi Vratha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. హిందువులు ఏ కార్యక్రమం ప్రారంభించినప్పుడు, విఘ్నాలు లేకుండా, ఆటంకాల లేకుండా జరగాలని వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వినాయక చవితి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

Vinayaka Pooja Lo Chadavalsina Vrata Katha

వినాయకోత్పత్తి

Vinayaka Chavithi Vratham

కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడ ముచ్చటైన బాలుడుగా కనిపిం చింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో వుంచి, ఎవరినీ లోనికి రానివ్వ రాదని చెప్పి లోపలకు వెళ్ళింది.

శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో వున్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనము చేసి, లోపలికి వెళ్లాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.

విఘ్నేశాధిపత్యం

ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇమ్మని డు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నారు. అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి “మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర న నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగివెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడు కున్నాడు. వినాయకుని బుద్ధిసూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫల దాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నియూ నారాయణుని అధీనములు. అనగా నారాయణ మంత్రం అధీనంలో వుంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడు కోట్ల యాభైలక్షల నదులలో వినాయకుడి ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ”ని ప్రార్థించాడు.

చంద్రుని పరహాసం

Chandruni Parahasam

అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకా యలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పంచి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్నిచేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గవుతాయి అనే సామెత నిజ విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతిచెందాడు. అంత పార్వతి శోకించుచూ చంద్ర ప్రదే “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి చూసిన వారు పాపాత్ములై నీలాపనిందల పొందురుగాక” అని శపించింది.

ఋషిపత్నులకు నీలాపనిందలు

ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞంచేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులకు మోహించి, శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపముదక్క మిగిలిన ఋషి పత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్ని దేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి, ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి ఈ నీలాపనింద కలిగింది.

దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరు నికి తెలుపగా, అతడు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు “ఓ పార్వతీ! నీ శాపమువల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహించుకోవా”లని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది “ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు”అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితినాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇలా కొంతకాలం గడచెను.

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి, స్తుతిం చాడు. మాటల సందర్భంగా స్వామీ ! సాయంకాలమయింది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఒక సెలవు అని పూర్వవృత్తాంతమంతయూ శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలుపిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. “ఆహా! ఇక నాకెట్టి అపనింద రానున్నదో”అని అనుకున్నాడు.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపా దించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాదచేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చు దానిని ఏఆప్తునకైన నెవ్వరు ఇవ్వరనిన సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగ ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతివిని, కృష్ణుడు, మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోషఫలమని అను కున్నాడు. దానినిబాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది.

Samantakopakhyana

అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని బడద్రోసి వృక్షములు, రాళ్ళతోను, తుదకు ముష్టిఘాతములతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్నవ్యక్తి రావణహంతకుడగు శ్రీరాముడే అని తెలుసు కున్నాడు. అంజలి ఘటించి దేవాదిదేవా! ఆర్తజనపోషా! భక్తరక్షా నిన్ను శ్రీరామ చంద్రునిగా తెలిసికొంటిని. ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరు కొమ్మనగా, నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం జేయవలెనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీకోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అదిమొదలు మీనామ స్మరణచేయుచూ అనేకయుగములు గడిపాను, ఇపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇకజీవితేచ్చలేదు. నాఅపరాధములు క్షమించి కాపాడుము. నీకన్న వేరు దిక్కులేదు” అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయూ తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలాఅన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటువచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తనకుమార్తెనగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్య మునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోను, మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు.

సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు “అయ్యో! లేనిపోని నిందమోపి దోషము నకు పాల్పడితి”నని విచారించి మణిసహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపుమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణివలదని తిరిగిఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్త మున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనుక నీలాప నింద బాపుకొంటిరి మాకేమిగతి” యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపద శుద్ధ చతుర్ధిని ప్రమాదవశంబున చంద్ర దర్శనమయ్యెనేని ఆనాడు గణపతిని యధావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక” అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి, తమ ఇళ్ళకువెళ్ళి ప్రతిసంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమతమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో వున్నారు.

సర్వేజనాః సుఖినోభవంతు.

మరిన్ని వ్రతాలు:

Sri Rama Kavacham In Telugu – శ్రీ రామ కవచం

Sri Rama Kavacham Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… ఈ క్రింద ఇచ్చిన లింకు నందు శ్రీ రామ కవచం ఇవ్వబడినది. అది ఏమిటో తెలుసుకుందాం…

Sri Rama Kavacham Telugu

శ్రీ రామ కవచం

అగస్తిరువాచ

ఆజానుబాహుమరవిందదళాయతాక్ష-
-మాజన్మశుద్ధరసహాసముఖప్రసాదమ్ ।
శ్యామం గృహీత శరచాపముదారరూపం
రామం సరామమభిరామమనుస్మరామి ॥ 1

అస్య శ్రీరామకవచస్య అగస్త్య ఋషిః అనుష్టుప్ ఛందః సీతాలక్ష్మణోపేతః శ్రీరామచంద్రో దేవతా శ్రీరామచంద్రప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।

అథ ధ్యానం

నీలజీమూతసంకాశం విద్యుద్వర్ణాంబరావృతమ్ ।
కోమలాంగం విశాలాక్షం యువానమతిసుందరమ్ ॥ 1

సీతాసౌమిత్రిసహితం జటాముకుటధారిణమ్ ।
సాసితూణధనుర్బాణపాణిం దానవమర్దనమ్ ॥ 2

యదా చోరభయే రాజభయే శత్రుభయే తథా ।
ధ్యాత్వా రఘుపతిం క్రుద్ధం కాలానలసమప్రభమ్ ॥ 3

చీరకృష్ణాజినధరం భస్మోద్ధూళితవిగ్రహమ్ ।
ఆకర్ణాకృష్టవిశిఖకోదండభుజమండితమ్ ॥ 4

రణే రిపూన్ రావణాదీంస్తీక్ష్ణమార్గణవృష్టిభిః ।
సంహరంతం మహావీరముగ్రమైంద్రరథస్థితమ్ ॥ 5

లక్ష్మణాద్యైర్మహావీరైర్వృతం హనుమదాదిభిః ।
సుగ్రీవాద్యైర్మాహావీరైః శైలవృక్షకరోద్యతైః ॥ 6

వేగాత్కరాలహుంకారైర్భుభుక్కారమహారవైః ।
నదద్భిః పరివాదద్భిః సమరే రావణం ప్రతి ॥ 7

శ్రీరామ శత్రుసంఘాన్మే హన మర్దయ ఖాదయ ।
భూతప్రేతపిశాచాదీన్ శ్రీరామాశు వినాశయ ॥ 8

ఏవం ధ్యాత్వా జపేద్రామకవచం సిద్ధిదాయకమ్ ।
సుతీక్ష్ణ వజ్రకవచం శృణు వక్ష్యామ్యనుత్తమమ్ ॥ 9

అథ కవచం

శ్రీరామః పాతు మే మూర్ధ్ని పూర్వే చ రఘువంశజః ।
దక్షిణే మే రఘువరః పశ్చిమే పాతు పావనః ॥ 10

ఉత్తరే మే రఘుపతిర్భాలం దశరథాత్మజః ।
భ్రువోర్దూర్వాదలశ్యామస్తయోర్మధ్యే జనార్దనః ॥ 11

శ్రోత్రం మే పాతు రాజేంద్రో దృశౌ రాజీవలోచనః ।
ఘ్రాణం మే పాతు రాజర్షిర్గండౌ మే జానకీపతిః ॥ 12

కర్ణమూలే ఖరధ్వంసీ భాలం మే రఘువల్లభః ।
జిహ్వాం మే వాక్పతిః పాతు దంతపంక్తీ రఘూత్తమః ॥ 13

ఓష్ఠౌ శ్రీరామచంద్రో మే ముఖం పాతు పరాత్పరః ।
కంఠం పాతు జగద్వంద్యః స్కంధౌ మే రావణాంతకః ॥ 14

ధనుర్బాణధరః పాతు భుజౌ మే వాలిమర్దనః ।
సర్వాణ్యంగులిపర్వాణి హస్తౌ మే రాక్షసాంతకః ॥ 15

వక్షో మే పాతు కాకుత్స్థః పాతు మే హృదయం హరిః ।
స్తనౌ సీతాపతిః పాతు పార్శ్వం మే జగదీశ్వరః ॥ 16 ॥

మధ్యం మే పాతు లక్ష్మీశో నాభిం మే రఘునాయకః ।
కౌసల్యేయః కటీ పాతు పృష్ఠం దుర్గతినాశనః ॥ 17 ॥

గుహ్యం పాతు హృషీకేశః సక్థినీ సత్యవిక్రమః ।
ఊరూ శారంగధరః పాతు జానునీ హనుమత్ప్రియః ॥ 18

జంఘే పాతు జగద్వ్యాపీ పాదౌ మే తాటకాంతకః ।
సర్వాంగం పాతు మే విష్ణుః సర్వసంధీననామయః ॥ 19

జ్ఞానేంద్రియాణి ప్రాణాదీన్ పాతు మే మధుసూదనః ।
పాతు శ్రీరామభద్రో మే శబ్దాదీన్విషయానపి ॥ 20

ద్విపదాదీని భూతాని మత్సంబంధీని యాని చ ।
జామదగ్న్యమహాదర్పదలనః పాతు తాని మే ॥ 21

సౌమిత్రిపూర్వజః పాతు వాగాదీనీంద్రియాణి చ ।
రోమాంకురాణ్యశేషాణి పాతు సుగ్రీవరాజ్యదః ॥ 22

వాఙ్మనోబుద్ధ్యహంకారైర్జ్ఞానాజ్ఞానకృతాని చ ।
జన్మాంతరకృతానీహ పాపాని వివిధాని చ ॥ 23

తాని సర్వాణి దగ్ధ్వాశు హరకోదండఖండనః ।
పాతు మాం సర్వతో రామః శారంగబాణధరః సదా ॥ 24

ఇతి శ్రీరామచంద్రస్య కవచం వజ్రసమ్మితమ్ ।
గుహ్యాద్గుహ్యతమం దివ్యం సుతీక్ష్ణ మునిసత్తమ ॥ 25

యః పఠేచ్ఛృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహితః ।
స యాతి పరమం స్థానం రామచంద్రప్రసాదతః ॥ 26

మహాపాతకయుక్తో వా గోఘ్నో వా భ్రూణహా తథా ।
శ్రీరామచంద్రకవచపఠనాచ్ఛుద్ధిమాప్నుయాత్ ॥ 27

బ్రహ్మహత్యాదిభిః పాపైర్ముచ్యతే నాత్ర సంశయః ।
భో సుతీక్ష్ణ యథా పృష్టం త్వయా మమ పురాః శుభమ్ ।
తథా శ్రీరామకవచం మయా తే వినివేదితమ్ ॥ 28

మరిన్ని కవచాలు: