Harikrishna Melukonu Adhipurusha In Telugu – హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
సంఖ్య : 543
పుట : 365
రాగం : భూపాళం

భూపాళం

38 హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
తరవాత నా మోము తప్పకిటు చూడు.

||పల్లవి||

మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి
బాలులదె పిలిచేరు బడి నాడను
చాలు నిఁక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు –
వేళాయ నాతండ్రి వేగ లేవే,

॥హరి||

కను దెరవు నాతండ్రి కమలాప్తుఁ డుదయించె కమలాప్తు
వనిత మొకమజ్జనము వడిఁ దెచ్చెను
మొనసి మీతండ్రి యిదె ముద్దాడఁ జెలఁగీని
దనుజాంతకుండ యిఁకఁ దగ మేలుకోవే.

॥హరి||

లేవె నాతండ్రి నీలీలలటు వొగడేరు
శ్రీ వేంకటాద్రిపతి శ్రీరమణుఁడా
దేవతలు మునులుఁ జెందిననారదాదులు
ఆవలనుఁ బాడేరు ఆకసమునందు.

||హరి|| 543

అవతారిక:

మధురాతి మధురమైన మేలుకొలుపు కీర్తన నాస్వాదించి తరించండి. అన్నమాచార్యులవారి ఋణం తీరదని అనిపిస్తున్నది కదా! నా తండ్రి మేలుకోరా నా అన్న మేలుకో అని యెన్నిసార్లు బ్రతిమిలాడుతున్నారో చూడండి. జన్మకి ఇట్లాంటికీర్తన ఒక్కటి చాలదా? కొసమెఱుపు యేమిటంటే “వనిత మొకమజ్జనము వడిదెచ్చెను” అనే చరణం నందగోపుడు రేపల్లె గొల్లవారికి యేలిక కదా! వాళ్ళ పనిమనిషి వాళ్ళ అబ్బాయి పళ్ళుతోముకోవడానికి గోరువెచ్చని నీళ్ళు తెచ్చి సిద్ధంగా వున్నదట. మొకమజ్జనము అంటే ముఖమును నీళ్ళతో కడుగుకొనుట.

భావ వివరణ:

ఓ ఆదిపురుషా! హరీ! కృష్ణా ‘మేలుకో నాన్నా! తరువాత తప్పకుండా నా మోము (ముఖమును) ఇటుచూడు. (నా మాట విను తండ్రీ!)

నా యన్న మేలుకొనరా! బడినాడను (నీతో కూడి ఆడుకొందామని) అదే నీతోడి బాలలు మెల్లనే (మన వసారాలో) నిలుచుని నిన్ను పిలిచేరు. లే తండ్రీ! ఇక నిద్దురలు చాలును కన్నా! చద్దికూళ్ళ పొద్దువేళాయె (చద్ది యన్నం తినే వేళయింది నాన్నా!) నా తండ్రీ! వేగ లేవే (తొందరగా
లేచిరావయ్యా!)

అదిగోచూడు… కమలాప్తుడుదయించె (కమలబాంధవుడైన సూర్యభగవానుడు ఉదయించినాడు) నా తండ్రీ! కన్నులు తెరువమయ్యా! మొకమజ్జనకు (నీ ముఖము కడుగుకొనుటకు నీళ్ళను) వనిత (పనిపిల్ల) వడి దెచ్చెను (శ్రీఘ్రముగా తీసికొచ్చింది). ఇవే నీతండ్రి నందగోపుడు, మొనసి (పూనుకొని) ముద్దాడ (గబగబా ముద్దులు పెట్టుకొందామని) యెదురు చూస్తున్నాడయ్యా! ఓ దనుజాంతకా! (పూతన వంటి రాక్షసులను అంతమొందించినవాడా!) ఇక మేలుకోవయ్యా!

నా తండ్రీ! నీవు చేసిన నీ లీలలన్నింటినీ వొగడేరు (పొగడుచున్నారయ్యా!) లేవె (లేచిరావయ్యా!) ఇప్పుడు నీవు ఈ తిరుమల వేంకటకృష్ణయ్యవు, శ్రీదేవీ వల్లభుడవు. అదిగో చూడవయ్యా! ఆవలను (నీవాకిటి బయట) దేవతలు, మునులు, నారదాది భక్తులు సుప్రభాతమును పాడుచున్నారు. ఆకాశములో యెంత గుంపువున్నదో చూడు తండ్రీ! ఇంతమందికి నీ దర్శనం కావాలంటే యెంత సమయం పడుతుంది? లే నాన్నా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Uppavadamu Gavayya Uyyala Mancham Meeda In Telugu – ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద
సంఖ్య : 102
పుట : 74
రాగం : కాంబోధి

కాంబోధి

26 ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద
గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా.

||పల్లవి||

పవ్వళించే వీడ వచ్చి పాయనినీయలపెల్ల
మువ్వంకమేనితోడ ముచ్చట దీఱ
నవ్వేటి శ్రీసతిచూపు నాటినచిత్తపుమేన
క్రువ్వనికలువదండై గోవిందరాజా.

॥ఉప్ప||

నిద్దిరించే వీడ వచ్చి నిలుచున్నయలపెల్ల
ప్రొద్దు వొద్దునకుఁ దీర భోగీంద్రుపై
యిద్దరుసతులు నీకు నేచినతాళగతుల
గుద్దేటిపాదములతో గోవిందరాజా.

॥ఉప్ప||

మెండుగ మేలికొంటివి మించిన కౌఁగిటిలోన
కొండుకపాయపుసిరి కోపించంగా
ఉండవయ్యా సుఖలీల నుడివోనిప్రియముతో
కొండలకోనేటిరాయ గోవిందరాజా.

॥లలల||

అవతారిక:

‘ఉప్పవడము’ అవటం అంటే రాజీకి రావడం అన్నమాట. ఉయ్యాలమంచం మీద నీకు నీ దేవేరుల మాట వినక తప్పదు. గొప్ప గొప్ప కన్నులున్న గోవిందరాజువి నీవు. అయినా సరే, అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈ కీర్తనలో వేంకట మకుటం లేకపోవటం విశేషమే.

ఇటువంటి శృంగార కీర్తనల భావవివరణలో చిక్కేమిటంటే “యద్భావం తద్భవతి” – అంటే నీ భావన నీ భావానుగుణ్యంగానే వుంటుంది. కొండల కోనేటిరాయుడే ఈ గోవిందరాజు అంటున్నారు. కొండుకపాయపుసిరి అంటే చిన్నపిల్లవంటి శ్రీదేవి, కోపించిందట స్వామిపైన… యెందుకో? జాగ్రత్తగా చదివి భావించి పరవశించండి.

భావ వివరణ:

ఓ గోవిందరాజా! నీ విప్పారిన గొప్ప గొప్ప నయనాలు నీ భావములను తెలుపుతూనే వున్నాయి. నీవు ఈ ఉయ్యాలమంచము మీద భూదేవి, శ్రీదేవి సమేతుడవై వూగుచున్నావు. ఇప్పుడైనా, ఉప్పవడము గావయ్య (రాజీ మార్గానికి రావయ్యా!)

ఓ గోవిందరాజా! ఈ వైపునకు వచ్చి నీ అలసట దీరునట్లు ముచ్చట దీరగా, మువ్వంకమేనితో (మూడు అవస్థలను పొందుతున్న దేహముతో) నిదురించవయ్యా! చిరునవ్వులొలుకు శ్రీసతి చూపులు నీ చిత్తము పై నీ నాటుకొంటుండగా నీ వామె మెడలో క్రువ్వని కలువదండైనావు (వాడని కలువపూలహారమైనావు స్వామీ!)

ఈడ వచ్చి ప్రొద్దు వొద్దునకు (పూట పూటకు) నిలుచున్న అలు పెల్లదీర (అలసట యంతయు దీరునట్లు) భోగీంద్రునిపై (ఆదిశేషునిపై) విశ్రాంతిగా నిదురించవయ్యా! నీకు భూదేవి, శ్రీదేవి అను ఇద్దరు భార్యలు, యేచిన తాళగతుల (అతిశయించిన తాళానుగుణముగా) గుద్దేటి పాదములతో తన సతులను తనపాదములతో తేలికపాటి తాడనములిచ్చుచున్నాడు. ఈ గోవిందరాజస్వామి చిలిపి చేష్టలేమని వర్ణింతుము?

ప్రభూ! నీవు మెండుగా (మేలుగా) మేలుకొనినది కూడా, కొండొక ప్రాయపుసిరి కౌగిటిలోననే (లేబ్రాయపు చిన్నదైన శ్రీదేవిని గాఢాలింగనముననే) ఆమె నిదుర చెడి ఆమె నీపై కోపించినదాయెను. అయినదేమో అయినదని ఆమెను వూరడించి ఉడివోని ప్రియమున (తరగని అనురాగముతో) సుఖలీల (సుఖముగా) వుండవయ్యా! ఓ గోవిందరాజా! నీవే కొండలకోనేటిరాయుడవు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Shiva Manasa Puja Stotram In Telugu – శివమానస పూజా స్తోత్రము

Shiva Manasa Puja Stotram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివమానస పూజా స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Shiva Manasa Puja Stotram Lyrics In Telugu

శివమానస పూజా స్తోత్రము 

శ్లో॥ రత్నైఃకల్పిత మాసనం హిమజలైఃస్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం |
జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ||

1

సౌవర్ణే మణిఖండరత్న రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్వా ప్రభోస్వీకురు||

2

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా హ్యేతత్సమస్తంమయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||

3

ఆత్మాత్వం గిరిజామతి స్సహచరాః ప్రాణశ్శరీం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షణవిధిః స్తోత్రాణి సర్వాంగిరో
యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభోః తవారాధనం ||

4

కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం |
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||

5

మరిన్ని స్తోత్రములు

Dasa Sloki Stuti In Telugu – దశ శ్లోకే స్తుతిః

Dasa Sloki Stuti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దశ శ్లోకే స్తుతిః గురించి తెలుసుకుందాం…

Dasa Sloki Stuti Telugu

దశ శ్లోకే స్తుతిః

సాంబో నః కులదైవతం పశుపతే సాంబ! త్వదీయా వయం!
సాంబం స్తొమి సురాసురోరగ గణాసాంబేన సంతారితాః
సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్పరం సో భజే
సాంబస్యాను చరోస్మ్యహం మమ రతి స్సాంబే పరబ్రహ్మణి.

విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణా జేతుం న శక్తేః స్వయం
యం శంభుం భగవన్ వయం తు పశవో స్మాకం త్వమేశ్వరః
స్వ స్వస్థాన నియోజితా స్సుమనస స్వస్థా బభూవు స్తతః
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

క్షోణీ యస్య రథో రథాంగయుగళం చంద్రార్కబింబద్వయం
కోదండః కనకాచలో హారి రభూదాణో విధి స్శారధిః
తూణీరో జలధిర్హయా శ్రుతిచయో మౌర్వి భుజంగాధిపః
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

యేనే పాదిత మంగజాంగ భీసితం దివ్యాంగ రాగై స్సమం
యేన స్వీకృత మబ్జ సంభవ శిర సౌవర్ణపాత్రై స్సమం
యేనాంగీకృత మచ్యుతస్య నయనం పూజారవిందై స్సమం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

గోవిందా దధికం న దైవత మితి ప్రోచ్చార్య హాస్తావుభా
వృద్ధృత్యాల థ శివస్య సన్నిధిగతో వ్యాసో మునీనాం వరః
యస్య స్తంభితపాణి రానతి కృతా నందీశరేణా భవత్
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

ఆకాశ శ్చికురాయతే దశదిశా భోగో దుకూలాయతే
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరా నందః స్వరూపాయతే
వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

విష్ణుర్యస్య సహస్ర నామ నియమా దంబోరుహాణ్యర్చయన్
ఏకో నోపచితేషు నేత్ర కమలం నైజం పదాబ్జద్వయే
సంపూజ్యా సురసంహితం విదలయం త్రైలోక్యపాలో భవత్
తస్మిన్మే హృదయం సుఖీన రమతాం సాంబే పరబ్రహ్మణి.

శౌరిం సత్యగిరం వరాహ వపుషం పాదాంబుజా దర్శనే
చక్రే యో దయయా సమస్త జగతాం నాథం, శిరో దర్శనే
మిథ్యావాచ మపూజ్య మేవ సతతం హంస స్వరూపం విధిం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

యస్యాసన్ ధరణీ జాలాగ్ని పవన వ్యోమార్క చంద్రా దయో
విఖ్యాతాస్తనవో ష్టధా పరిణతా నాన్యత్తతో వర్తతే
ఓంకారార్థ వివేచినీ శ్రుతిరియం చారి చష్ట తుర్యం శివం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

విష్ణుబ్రహ్మ సురాధిప ప్రభృతయ స్సర్వే పి దేవాయదా
సంభూతా జ్జలధే ర్విషాత్పరిభవం ప్రాప్తా స్తదా సత్వరం
తానార్తాన్ శరణాగతానితి సురాస్యో రక్ష దగ్ధక్షణాత్
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి.

ఇతి శ్రీ శంకారాచార్య కృత దశ శ్లోకీ స్తుతి

మరిన్ని స్తోత్రములు

Mangala Harathi Patalu In Telugu | మంగళ హారతి పాటలు

Mangala Harathi Patalu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంగళ హారతి పాటలు  గురించి భక్తి గీతాలలో తెలుసుకుందాం…

Mangala Harathi Patalu In Telugu

మంగళ హారతి పాటలు

పల్లవి:

శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా నిరామయా సర్వమంగళా

||శ్రీలలితా||

జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీవశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి

||శ్రీలలితా||

అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళలజ్యోతుల కర్పూర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి.

||శ్రీలలితా||

శీతాద్రి శిఖరాన

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మాతల్లి లత్తుకకు నీరాజనం –
నిండైన నీరాజనం – భక్తి మెండైన నీరాజనం.
యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం – భక్తి పొంగారు నీరాజనం
నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు
మాతల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం – భక్తి తాళాల నీరాజనం.
మనుజాళి హృదయాల తిమిరాలు కరిగించు
మాతల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం – భక్తి నృత్యాల నీరాజనం.
చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
మాతల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం – భక్తి జతనాల నీరాజనం.
శ్రీ లలితా పూజా విధానం
పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం – భక్తి కనరాగ నీరాజనం.
దహరాన కనిపించు ఇనబింబమనిపించు
మాతల్లి కుంకుమకు నీరాజనం
కెంపైన నీరాజనం – భక్తి పెంపైన నీరాజనం.
తేటి పిల్లలవోలె గాలి కల్లల లాడు.
మాతల్లి కురులకు నీరాజనం
నీలాల నీరాజనం – భక్తి భావాల నీరాజనం.
జగదేక మోహినీ సర్వేశదేహినీ
మాతల్లి రూపులకు నీరాజనం
నిలువెత్తు నీరాజనం – భక్తి విలువెత్తు నీరాజనం.

అండగా నీవు మాకు ఉండాలనీ

అండగా నీవు మాకు ఉండాలనీ
దండ నీ మెడలో వేశానమ్మా
కొండంత నీ ప్రేమ కావాలని
కోటి దండాలు నీకే పెడుతున్నానమ్మా.

॥అండ||

రాగద్వేషాలు మాలో నశించాలని
రత్న సింహాసన మమరించావమ్మా
రాజరాజేశ్వరి రమ్యముగా ఏతెంచి
మా పూజలందుకొని కాపాడవమ్మా.

॥అండ||

పవిత్ర మౌనీ పాదము మాకు ఆధారమని
పాలాభిషేకాలు చేశానమ్మా
పవిత్రమౌనీ నామము మానోట పలకాలని
పసుపు కుంకుమతో నిను అర్చించానమ్మా.

॥అండ||

తామసమును పోగొట్టే తరుణీమణి నీవని
పరిమళ తాంబూలాన్ని అందించానమ్మా
నా జీవన సర్వస్వం నీకే అంకితమని
కర్పూర నీరాజన మిస్తున్నానమ్మా.

॥అండ||

మధురమౌ నా మనసును మంత్రపుష్పముచేసి
మహేశ్వరి ముందుంచి మైమరచానమ్మా
ఆత్మ ప్రదక్షిణతో ఐక్యమై పోవాలని
అనుక్షణము నీ దీవెన ఆశించానమ్మా.

॥అండ||

మంగళ హారతి పాటలు:

Saptashloki Gita In Telugu – సప్తశ్లోకీ గీతా

Saptashloki Gita

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సప్తశ్లోకీ గీతా గురించి తెలుసుకుందాం…

Saptashloki Gita Telugu

సప్తశ్లోకీ గీతా

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్,
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్.

1

స్థానే హృషీకేశ ! తవ ప్రకీర్త్యా, జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ,
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, సర్వే నమస్యంతి చ సిద్ధసంఘా

2

సర్వతః పాణిపాదం తత్సర్వతో క్షిశిరోముఖమ్,
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి.

3

కవిం పురాణమనుశాసితారమణోరణీయాంసమనుస్మరేద్యః,
సర్వస్య ధాతారమచింత్యరూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.

4

ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్,
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్.

5

సర్వస్య చాహం హృది సన్నివిష్టో, మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ,
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాంతకృద్వేదవిదేవ చాహమ్.

6

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు,
మామేవైష్యసి యుకైవ మాత్మానం మత్పరాయణః.

7

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సప్తశ్లోకీ గీతా

మరిన్ని కీర్తనలు:

Sri Shiva Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్

Sri Shiva Ashtottara Shatanama Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Ashtottara Shatanama Stotram Lyrics

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్

శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః,
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ||

1

శంకర శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః,
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠోభక్తవత్సలః ||

2

భవశ్శర్వస్త్రిలోకేశ శ్శితికంఠఃశ్శివాప్రియః,
ఉగ్రః కపాలి కామారి అంధకాసుర సూదనః ॥

3

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః,
భీమః పరశుహస్తశ్చ మృగపాణి ర్జటాధరః ॥

4

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః,
వృషాంకో వృషభారూఢా భస్మోద్ధూళిత విగ్రహః ||

5

సామప్రియస్స్వరమయ స్త్రయీమూర్తిరనీశ్వరః,
సర్వజ్ఞః పరమాత్మా సోమసూర్యాగ్ని లోచనః ||

6

హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్ర స్సదాశివః,
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ||

7

హిరణ్యరేతా దుర్దర్ష్ గిరీశో గిరీశోఁనఘః,
భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ||

8

కృత్తివాసాః పురారాతి ర్భగవాన్ ప్రమథాధిపః,
మృత్యుంజయ సూక్ష్మతను ర్జగద్వ్యాపీ జగద్గురుః ||

9

వ్యోమకేశో మహాసేనజనక శ్చారు విక్రమః,
రుద్రోభూతపతిః స్థాణు రహిర్భుధ్న్యో దిగంబరః ॥

10

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్విక శ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశు రజః పాశవిమోచకః ॥

11

మృడః పశుపతిర్దేవో మహాదేవోవ్యయో హరిః,
పూషదంతభిదవ్యగ్రోదక్ష్యాధ్వరహరో హరః ||

12

భగనేత్రభి దవ్యక్తస్సహస్రాక్షస్సహస్రపాత్,
అపవర్గ ప్రదో2 నంత స్తారకః పరమేశ్వరః ||

13

ఏవం శ్రీశంభుదేవస్య నామ్నా మష్టోత్తరంశతమ్.
శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ సమాప్తమ్.

మరిన్ని స్తోత్రములు

Sri Katyayani Devi Vratha Katha In Telugu – శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ

Sri Katyayani Devi Vratha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. వామన పురాణం ప్రకారం, మహిషాసుర అనే రాక్షసుడిపై వారి కోపం శక్తి కిరణాల రూపంలో వ్యక్తమైనప్పుడు దేవతల మిశ్రమ శక్తుల నుండి ఆమె సృష్టించబడింది . కాత్యాయన ఋషి యొక్క ఆశ్రమంలో కిరణాలు స్ఫటికీకరించబడ్డాయి , అతను దానికి సరైన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి ఆమెను కాత్యాయని లేదా “కాత్యాయన కుమార్తె” అని కూడా పిలుస్తారు. కాళికా పురాణం వంటి గ్రంథాలలో , ఆమెను మొదట పూజించినది ఋషి కాత్యయన అని పేర్కొనబడింది, అందుకే ఆమె కాత్యాయని అని పిలువబడింది . ఏది ఏమైనప్పటికీ, ఆమె దుర్గా యొక్క ప్రదర్శన లేదా స్వరూపం మరియు నవరాత్రి పండుగ యొక్క ఆరవ రోజున పూజించబడుతుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కాత్యాయని దేవి వ్రత  కథ గురించి తెలుసుకుందాం…

Sri Katyayani Devi Vratha Katha in Telugu

శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ

పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిశారన్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహుపురానములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి! నీవెన్నియో పురానములను వినిపించిటివి మరియు సందర్భానుసారముగా వ్రతములను, వ్రత మహాత్యములను తెలిపితివి. అయ్యా! ఇప్పుడు మాకొక ధర్మసందేహము తీర్చవలెను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించెను. ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రి యగు దక్షప్రజాపతి యజ్ఞ కుండమున పడి దేహ త్యాగామోనరించెను గదా! ఆ విధముగా, జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షిమ్పలేక పోయేనా? లేక సతీ దేవి యందు అనురాగాములేక మౌనముగా ఊరకుండెన? ఈశ్వరునకు భార్యా వియోగము యెట్లు సంభవించెను? మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి. అప్పుడు సూత మహర్షి ఓ మునులారా! మీ సందేహమును తప్పక పోగొట్టేడను. సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను.

దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవి ఈశ్వరునకు భార్యగా నోసంగెను. సతి దేవి పరమేశ్వరునితో కలిసో కైలాసమున సుఖముగా ఉంది కృతయుగము అంటాయి గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతిదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము అయ్యెను. సతి దేవి, ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచిన్చుచుండగా పక పకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కారించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాదా! మీరు ఎక్కడకు వెళ్ళినారు? ఏదులకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుమాట్లాడితినా? అని ప్రశించెను. వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ! నాకు విశునువు తండ్రివంటివాడు నేను అతనికి తండ్రివంతివాడను, మా యిరువురకు ఏ విధమగు అంతరమును లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీ రామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోను, సోదరుడగు లక్ష్మణుడి తోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వేద్దకుచూ ఆ అడవింతయు గాలించెను. సీత ఎక్కడను గానరాక, శ్రీరాముడు సీతా వియోగాభాదచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టాను, రెమ్మను సీతను చూసినారా? అని అడుగుతూ పోవుచుండెను. ఒక చోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివా, నాసీతను జూచితివా? అని ప్రశ్నించెను. ణా తండ్రియగు విష్ణువు కేక విన్నవెంటనే నేను అచ్చటకు వెళ్లి శ్రీ రాముని ఎదుట నిలబడితిని. కాని మానవరూపములో నున్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లు గానే ముందుకు బోయెను. అందుకే నీను నవ్వుచుంటిని. ఇంతే తప్ప మరియొక కారణము లేదుసుమా! అని ఈశ్వరుడు పలికెను.

ఆ మాటలు విన్న సతి ఓ నాదా! మీ మాటలు నమ్మ శక్యముగాలేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే మతి దప్పుతఎమి? సీతకోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇవి నమ్మశక్యముగాలేవు మీరు పరిహాసమాడుచున్తిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేక పోవుటయా? అని పల్కెను. వెంటనే శివుడు సతీ నీవు ణా మాటలు నమ్మని యెడల స్వయముగా నేవే అచటకుబోయి ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా చూడుము. నీకు అంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీ దేవి ఓ నాదా! నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్లి అచట శ్రీ రామ చంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి, చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదమై రాముని పరీక్షించదలచి “నేను సీతగా మారిపోవలేయునని” తలంచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పాడెను. అదే సమయమునకు కైలాసమండున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏవిధముగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని గాంచి కనులుమూసుకొని చేతులోగ్గి నమస్కారము గావించి మరల చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నాతల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించాసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాతా! నన్ను మోసగిమ్పదలచితివా? నాకు నాభార్య తప్ప మరియొక స్త్రీ నిజస్వరూపములో కనపడును. అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామా! నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమును దాల్చితిని. నీ సీత ఎచ్చట నున్నను మహాసాద్వియై యున్దగలదు. అని పలికి అదృశ్యమయ్యెను.

శివుడుకూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియు తెలియనివానివలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాదా! నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని, నిజముగా అతడు మహావిష్ణువై ఉండికూడా మానవునివలె, పామరునివలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని యెటుల పరీక్షించితివి? అని ప్రశ్నించెను. వెంటనే ఆమె ఓ నాదా! నీవు పరీక్షినిచిన విధముగానే నేనుకూడా పరీక్షించితిని అని చెప్పెను. అప్పుడు శివుడు, నీవుదాల్చిన ణా తల్లి రూపము ఇప్పటికి నాకన్నులకు కనబడుచున్నది. నీవు నాతల్లివి, అని ఆ సతీ దేవికి నమస్కరించి వెళ్లి పోయెను. అంతట ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒకతప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్దమాడుట మరియొక తప్పు. దీనిచే నేను కళంకము నోదితిని. ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని. అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను. అని అనేక విధములుగా ఆలోచించి, కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలువిధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుత యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను. సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్నాద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యగ్నమోనరించు కోరికను కలిగించెను.

ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింప దలచి శివునకు హవిర్భాగమివ్వకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగామునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగామునకు పరమేశ్వరునితో కలిసి వెల్లుదుమని ఈశ్వరుని కోరెను. ఆ యాగామునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్లి తీరవలేయునని మంకు పట్టు పట్టేను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుడు, బృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను.

దక్షుని యాగామందపములోనికి సతీదేవి ప్రవేశించి అచట తనవారేవ్వారు పలకరింప పోవుటచే అవమానముగా భావించి రాగులుచున్న అగ్ని గుండముచెంతకు చేరి చేతులు జోడించి “ఓ అగ్ని దేవా! నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని. ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను. కావున కళంక మొందిన ణా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగినవాడును, నిర్మలమగు మనసున్న ధీరహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము”. అని ప్రార్ధించి భగ భగ మండుచున్న అగ్నిగుండము లోనికి దుమికెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ బృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతి మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారామును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవారికకు చేరి తనవంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాతికను స్మశాన వాటికగా మార్చెను.

ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను . ఆ సమయమున పరమేశ్వరుని లలాతమునుంది చెమట బిందువొకటి భూమిపై బడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భూన భువనాన్తరములు ప్రతిధ్వనించునట్లు రోదన చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునొంది ఆ శిశువును ఒడిలోనికి జేర్చుకొని స్థన్య మోసంగెను. అప్పుడు రుద్రుడు ఆమెతో “ఓ భూదేవి నీవు చాలా పున్యాత్మురాలవు. ఈ ణా శిశువును నీవు పెంచుకొనుము. ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్థకనాముడు కాగలదు. ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అనికూకా పిలిచెదరు. నవగ్రహములలో ఇతడు ఒక గ్రహముకాగలదు. ఇతడు ఇంట కాలము నన్నాశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు విన్దురో వారికి కుజదోష పరిహారముఅగును”. అని శివుడు పలికి వెడలి మరియొక చోట సమాధి నిష్టాగరిష్టుడయ్యేను.

హిమవంతుడు ఒక పర్వత రాజు. అతడు నిర్మలమైన, చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మేనాదేవి. ఆ మేనాదేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని. అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే “కాత్యాయని” అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే “పార్వతి” అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి. ఆ కాత్యాయని శుక్ల పక్షములోని చంద్రునివలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోనే సర్వవిద్యా కలాకోవిదయై వెలుగొందెను . మరియు అఖండ మగు ఈశ్వరాధన ఆమెతో పెల్లుబికసాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతికి యుక్తవయసు రాగానే, దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మొనరించుటకు మన్మధుని బంపేను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్న పరచిన మన్మధుని మూడవ నేత్రముతో భాస్మిపతలము గావించి వెడలిపోయెను.

పార్వతి తన కన్నుల యెదుట జరిగిన సంఘటన గాంచి భయపడక, ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము గావిన్చుకోదలచి కటోరమైన తపము సలిపెను. ఆ తపస్సు చే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరనకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవో పేతముగా శివపార్వతి కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించెను.

శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో వుండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై బడి తన భర్తను బ్రతికింపమని ప్రార్ధింపగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రాతీదేవికి మాత్రమె కనిపించునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలందరూ పరమేశ్వరుని దయా దృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్శము కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో “ఓ నాదా! కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గతజన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమోనరించితిని. తిరిగి అతడు నీ లలాటమునుంది చెమట బిందువు రూపములో నీకు దూరము కావడమువలన మరల నేను నీకు దగ్గరైతిని. కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు గూడా బాధలేకుండా చేయగలరు అని ప్రార్ధించెను. వెంటనే శివుడు ఆమెతో “ఓ పార్వై! కుజుని జన్మకతను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చితిని. ఎప్పుడు నీకోరిక ననుసరించి లోకములోని జనులకు కుజదోషపరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయు చుంటిని. ఆ వ్రాతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు, ప్రదోషకాలమగుటచే నేనునూ అందు భాగాస్వాములమైతిమి. “కాత్యాయని వ్రతము” అను పేరుతొ భూలోకములో సుస్తిరముకాగలదు. అని పలికెను. ఆమాటలు విని పార్వతి ఎటో సంతోశాపడెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోతిదేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను. అని సూత మహర్షి శోవ్నకాడులకు వినిపించెను.

వ్రత విధానము:

వివాహ ప్రతిబంధక దోషములున్ననూ నివారణ అగుటకు, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకునూ కాత్యాయని వ్రతముతో సాతియైనది మరియొకటి లేదు. ఈ వ్రతమును ఆచరిన్చువారికి భక్తి విశ్వాసములు ముఖ్యము. తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించవలెను. ఆ రోజు ఉదయము కాళ్ళకృత్యములు, తీర్చుకొని భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను. ముందుగా గణపతిపూజచేసి ఆపిదప ఒక కలశమును ఏర్పాటుచేసి అందు సగమువరకూ పవిత్రోదకము పోసి మామిదిచిగుళ్ళనుంచి, ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై వుంచి, ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై వుంచి, అందు పరమేశ్వరుని నామంకమున వున్న కాత్యాయనిదేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్ధలతో ఇరవదిఒక్క ఉపచారములతో ఆ దేవిని పూజించావలేయును. ఎర్రని పుష్పములతో, పసుపు, కుంకుమ లతో పూజించవలెను. బంగారముతోగాని, పసుపుకోమ్ముతోగాని వారి వారి శక్తానుసారము మంగళ సూత్రములను కలశామునకు అలంకరించవలెను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు చేరుకుగాడతో కోసిన ఏడు చేరుకుముక్కలను కలిపి నైవేద్యము చేయవలెను. భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని, ఆ అక్షతలను అమ్మవారిమీది వుంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనము జరుపవలెను. ఈ విధముగా ఏడు వారములు వ్రతము భక్తితో జరుపవలేయును. మధ్యలో ఎవారమైన అద్దంకి వచ్చినచో ఆపై వారము జరుపుకోవలెను. ఏనామిదవ మంగళవారము ఉద్యాపన జరుపవలేయును. ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటుపోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను, ఏడు చేరుకుముక్కలను శక్త్యానుసారముగా చీర, రవికలగుడ్డ వాయనమిచ్చి వారినుండి ఆశీస్సులు పొంది, వారికి భోజనము పెట్టవలెను. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి, శీఘ్రముగా వివాహమగును. మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును. పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను, రుక్మిణి ఈ వ్రతమాచరించి వుద్యాపననాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించెను.

మరిన్ని వ్రతాలు:

Rudrashtakam In Telugu – రుద్రాష్టకమ్

రుద్రాష్టకమ్ (Rudrashtakam)

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు రుద్రాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Rudrashtakam Lyrics Telugu

రుద్రాష్టకమ్

నమామీశ మీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం।
నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశ మాకాశవాసం భజేహం॥

1

నిరాకార మోంకార మూలం తురీయం గిరిజ్ఞాన గోతీత మీశం గిరీశం।
కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసారసారం నతో హం॥

2

తుషారాద్రి సంకాశ గౌరం గంభీరం మనోభూతకోటి ప్రభా శ్రీశరీరం।
స్ఫురన్మౌళికల్లోలినీ చారుగాంగం లసత్ఫాలబాలేందు భూషం మహేశం॥

3

చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం।
మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి॥

4

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం।
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం॥

5

కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ।
చిదానంద సందోహ మోహాపకారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ ।

6

న యావద్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పఠే వా నరాణాం।
న తావత్సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస॥

7

నజానామి యోగం జపం నైవ పూజాం నతో హం సదా సర్వదా దేవ తుభ్యం।
జరాజన్మ దుఃఖాఘతాతప్యమానం ప్రభోపాహి ఆపన్నమీశ ప్రసీద!॥

8

మరిన్ని అష్టకములు

Mukunda Mala Stotram In Telugu – ముకుందమాలా

Mukunda Mala Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ముకుందమాలా స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Mukunda Mala Stotram Telugu

ముకుందమాలా

ఘుష్యతే యస్య నగరే, రంగయాత్రా దినే దినే,
తమహం శిరసా వందే, రాజానం కులశేఖరమ్.
శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి, భక్తప్రియేతి భవలుంఠనకోవిదేతి,
నాథేతి నాగశయనేతి జగన్నివాసే, త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకుంద !

1

జయతు జయతు దేవో దేవకీనందనోయం
జయతు జయతు కృష్ణా వృష్టివంశ ప్రదీపః,
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః
జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః.

2

ముకుంద ! మూగ్షా ప్రణిపత్య యాచే
భవన్తమేకాన్త మియన్త మర్దమ్,
అవిస్మృతి స్త్వచ్చరణారవిందే
భవే భవే మే స్తు భవత్ప్రసాదాత్.

3

నాహం వందే తవచరణయోర్ద్వంద్వమద్వంద్వ హేతోః
కుంభీపాకం గురుమపి హరే ! నారకం నాపనేతుమ్,
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతమ్.

4

నా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్భవ్యం భవతు భగవన్ ! పూర్వకర్మానురూపమ్,
ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు.

5

దివి వా భువి వా మమాస్తు వాసః
నరకే వా నరకాంతక ప్రకామమ్,
అవధీరిత శారదారవిందౌ
చరణా తే మరణేపి చింతయామి.

6

కృష్ణ ! త్వదీయ పదపంకజ పంజరాంత
మద్వైవ మే విశతు మానసరాజహంసః
ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తెః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే.

7

చింతయామి హరిమేవ సంతతం
మందమందహసితాననాంబుజమ్,
నందగోపతనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితమ్.

8

కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే
శ్రమముషి భుజవీచి వ్యాకులే గాధమార్గే
హరిసరసి విగాహ్యాపీయ తేజో జలౌఘం
భవమరుపరిభిన్నః ఖేదమద్య త్యజామి.

9

సరసిజనయనే సశంఖచక్రే
మురభిది మా విరమస్వ చిత్త! రంతుమ్,
సుఖతర మపరం న జాతు జానే
హరిచరణస్మరణామృతేన తుల్యమ్.

10

మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః
నామీనః ప్రభవన్తి పాపరిపవః స్వామీ నను శ్రీధరః,
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః.

11

భవజలధి గతానాం ద్వంద్వ వాతాహతానాం
సుత దుహితృ కళత్రత్రాణభారార్దితానామ్,
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతో నరాణామ్.

12

భవజలధి మగాధం దుస్తరం నిస్తరేయం
కథమహమితి చేతో మాస్మగాః కాతరత్వమ్,
సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా
నరకభిది నిషణ్ణా తారయిష్య త్యవశ్యమ్.

13

తృష్ణాతోయే మదనపవనోద్ధూతమోహోర్మిమాలే
దారావర్తే తనయసహజగ్రాహసంఘాకులే చ,
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాల నస్త్రిధామన్
పాదాంభోజే వరద ! భవతో భక్తినావం ప్రయచ్ఛ.

14

మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబే
మాశ్రాషం శ్రావ్యబంధం తవచరితమపాస్యాన్యదాఖ్యానజాతమ్,
మాస్మార్షం మాధవ ! త్వామపి భువనపతే ! చేతసా పహ్నువానాన్
మాభూవం త్వత్సపర్యా వ్యతికరరహితో జన్మజన్మాన్తరే పి.

15

జిహ్వే ! కీర్తయ కేశవం మురరిపుం చేతో ! భజ శ్రీధరం
పాణిద్వంద్వ! సమర్చయాచ్యుతకథాః శ్రోత్రద్వయ ! త్వం శృణు,
కృష్ణం లోకయ లోచనద్వయ ! హరేర్గచ్ఛాంధ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ ! ముకుందపాదతులసీం మూర్ధన్ ! నమాధోక్షజమ్.

16

హేలోకాః! శృణుత ప్రసూతిమరణవ్యాధేశ్చికిత్సామిమాం
యోగజ్ఞాః సముదాహరన్తి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః,
అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం
తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యన్తికమ్.

17

హేమర్త్యాః ! పరమం హితం శృణుత వో వక్ష్యామి సంక్షేపతః
సంసారార్ణవ మాపదూర్మిబహుళం సమ్యక్రవిశ్య స్థితాః,
నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం
మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః.

18

పృథ్వీ రేణురణుః పయాంసి కణికాః ఫల్గుః స్ఫులింగో లఘుః
తేజో నిశ్శ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః,
క్షుద్రా రుద్ర పితామహప్రభృతయః కీటాః సమస్తాః సురాః
దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధిః.

19

బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః
కంఠేన స్వరగద్గదేన నయనే నోధీర్ణ బాష్పాంబునా,
నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాది నాం
అస్మాకం సరసీరుహాక్ష ! సతతం సంపద్యతాం జీవితమ్.

20

హే గోపాలక ! హే కృపాజలనిధే ! హే సింధుకన్యాపతే !
హే కంసాంతక ! హే గజేంద్రకరుణాపారీణ ! హే మాధవ !
హే రామానుజ ! హే జగత్రయగురో ! హే పుండరీకాక్ష ! మాం
హే గోపీజననాథ ! పాలయ పరం జానామి న త్వాం వినా.

21

భక్తాపాయభుజంగగారుడ మణి స్త్రైలోక్యరక్షామణిః
గోపీలోచనచాతకాంబుదమణిః సౌందర్యముద్రామణిః,
యః కాంతామణిరుక్మిణీఘనకుచద్వంద్వైకభూషామణిః
శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాల చూడామణిః.

22

శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్య మంత్రం
సంసారోత్తారమంత్రం సముపచితతమస్సంఘ నిర్యాణమంత్రమ్,
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగసందష్టసంత్రాణమంత్రం
జిహ్వే ! శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్యమంత్రమ్.

23

వ్యామోహప్రశమౌషధం మునిమనోవృత్తిప్రవృత్తా ్యషధం
దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనైకౌషధమ్,
భక్తాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం
శ్రేయఃప్రాప్తికరౌషధం పిబ మనః ! శ్రీకృష్ణదివ్యౌషధమ్.

24

ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం
మేదశ్ఛేదఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని,
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద –
ద్వంద్వాంభోరుహసంస్మృతిర్విజయతే దేవస్సనారాయణః.

25

శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాంఛితం పాపినో పి,
హా నః పూర్వం వాక్రవృత్తా న తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్.

26

మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే !
మత్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ,
త్వద్భృత్యభృత్యపరిచారక భృత్యభృత్య –
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ !

27

నాథే నః పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్ఠతి,
యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశ మల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో ! మూకా వరాకా వయమ్.

28

మదన ! పరిహర స్థితిం మదీయే
మనసి ముకుంద పదారవిందధామ్ని,
హరనయన కృశానునా కృశో సి
స్మరసి న చక్ర పరాక్రమం మురారేః.

29

తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్
మధు క్షరంతీవ సతాం ఫలాని,
ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే !
నామాని నారాయణ గోచరాణి.

30

ఇదం శరీరం పరిణామపేశలం
పతత్యవశ్యం శ్లథసంధి జర్జరమ్,
కిమౌషధైః క్లిశ్యసి మూఢ ! దుర్మతే !
నిరామయం కృష్ణరసాయనం పిబ.

31

దారా వారాకరవరసుతా తే తనూజో విరించిః
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గః ప్రసాదః,
ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీ తే
మాతా మిత్రం బలరిపుసుతస్త్వయ్యతో న్యన్నజానే.

32

కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం
కృష్ణనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః,
కృష్ణాదేవ సముస్థితం జగదిదం కృష్ణస్య దాసో స్మ్యహం
కృష్ణ తిష్ఠతి సర్వమేతదఖిలం హేకృష్ణ ! రక్షస్వ మామ్.

33

తత్త్వం ప్రసీద భగవన్ ! కురు మయ్యనాథే
విష్ణో! కృపాంపరమకారుణికః కిల త్వమ్,
సంసార సాగర నిమగ్నమనంత ! దీనమ్
ఉద్దరు మర్హసి హరే ! పురుషోత్తమో సి.

34

నమామి నారాయణపాదపంకజం
కరోమి నారాయణపూజనం సదా,
వదామి నారాయణనామ నిర్మలం
స్మరామి నారాయణ తత్త్వమవ్యయమ్.

35

శ్రీ నాథ ! నారాయణ ! వాసుదేవ !
శ్రీ కృష్ణ ! భక్తప్రియ ! చక్రపాణే !
శ్రీ పద్మనాభాచ్యుత ! కైటభారే !
శ్రీ రామ ! పద్మాక్ష ! హరే ! మురారే !

36

అనంత ! వైకుంఠ ! ముకుంద ! కృష్ణ !
గోవింద ! దామోదర ! మాధవేతి,
వక్తుం సమర్ధో పి న వక్తి కశ్చిత్
అహో జనానాం వ్యసనా భిముఖ్యమ్.

37

ధ్యాయంతి యే విష్ణుమనంత మవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితమ్,
సమాహితానాం సతతాభయప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీమ్.

38

క్షీరసాగరతరంగశీకరా సారతారకిత చారుమూర్తయే,
భోగిభోగశయనీయశాయినే, మాధవాయ మధువిద్విషే నమః.

39

యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రే ద్విజన్మ వరపద్మ శరావభూతామ్,
తేనాంబుజాక్షచరణాంబుజషట్పదేన
రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ.

40

ఇతి శ్రీ ముకుందమాలా సంపూర్ణా

మరిన్ని స్తోత్రములు