మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు సూర్యాష్టకంగురించి తెలుసుకుందాం…
నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో
వూరకే నీదాసులమై వున్నారము
చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర
గారవించి కరుణించి కావఁగదవే
||తల||368
అవతారిక:
చక్కటి వైరాగ్య దీపికవంటి కీర్తననావిష్కరిస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. “ఓ దైవమా! నీమాయలకు తలతోక వుండవయ్యా! మేము మాత్రం తెలియనివాటిని తెలుసునని, తెలిసినవాటిని తెలియవని తలపోస్తూ తిరుగుతుంటాము. మాకు దేంట్లోనూ నేర్పులేదు. మాకు తెలిసిందల్లా నీ దాసులుగా వుండటం. మమ్మల్ని యెలాగో వొకలాగ ఒడ్డునపడవెయ్యవయ్యా! కరుణించు” అంటున్నారు.
భావ వివరణ:
ఓ దేవదేవా! నీ మాయలకు (లీలలకు) తలలేదు తోకలేదు (ఆరంభం యెప్పుడు జరుగుతుందో తెలియదు. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు). నీమాయ ఆవరించినంతసేపూ, పిచ్చిపట్టినట్లు తెలిసీ తెలియక యేవేవో భ్రమలలో పడి, తిరుగాడుతూనే వుంటాము.
మా అంత పిచ్చివాళ్ళున్నారా ప్రభూ! మా ఈ శరీరం యెట్లా వచ్చిందో మాకు తెలియదు. దీనికి ఆలోచనలెలావస్తున్నాయో తెలియదు. సంసార సుఖము యెట్లా వుంటుందో తెలియదు. వెనక ముందేటిదో వివేకమెరుగము (పూర్వజన్మలో నేనెవరినో తెలియదు. మళ్ళీ నేను చచ్చాక యేమవుతానో తెలియదు). బ్రతికున్నంతకాలమూ ప్రతిరోజూ యేమో తిరుగుతూనే వుంటాము. ఏమిటి నీమాయ?
తల్లి కడుపులో యెప్పుడు యెలా పడ్డామో తెలియదు. ఏ క్షణాన గుటుక్కుమని కన్ను మూస్తామో తెలియదు. నాకు ధనమెలా వచ్చిందో, యెన్నాళ్ళుంటుందో, వున్నట్లుండి యెప్పుడు పోతాయో తెలియదు. శ్రీహరియొక్క ఈ “నిర్మాణ చక్రములో” మట్టు లేకుండా (పొందిక లేకుండా) తిరుగుతూనే వున్నాము. విచిత్రమేమంటే అట్లా తిరుగుతున్నా మేమే దిట్టలము (సమర్థులము) అని అనుకొంటుంటాము.
నీ కృపతో చివరికి ఒకనాటికి నాకు జ్ఞానోదయమయింది. నేర్వవలసిన దేమిటో తెలిసింది. ఇక నాకు నేర్పుతోను పనిలేదు. నిలిచినది వొక్కటేననే నేర్పు యేదో అది నా స్వంతమయింది. ఇక వూరకనే నీ దాసులమై వున్నారు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవే నన్ను వెదకి చేరుకుని నన్ను యేలినావు. ఇక నన్ను విడువకు. గారవించి కరుణించి కావగదవే (మన్నించి కరుణతో రక్షించుము తండ్రీ!) నాకు నీవే దిక్కు.
దశరథనందనుడైన శ్రీరామచంద్రమూర్తిని అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో కూడా రామాయణ ఘట్టములను | వర్ణిస్తూ రాముని నామాలను సన్నుతిస్తున్నారు. అన్నమాచార్య కీర్తనా యజ్ఞంలో ఈ దీక్షితులు సమర్పిస్తున్న ఈ కీర్తన సంఖ్య 1000. సహస్రాక్షుడు, సహస్రబాహువు, సహస్రముఖుడు, సహస్రరూపుడు అయిన ఆ “సాసముఖుని” సహస్రకీర్తనల వివరణతో అర్చించగలుగుతున్నాను. ఈ జన్మకిది చాలు. అన్నమయ్య అన్నట్లు “ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఱి, యిదిగాక వైభవంబికవొకటి కలదే”!
భావ వివరణ:
దశరథనందునడవైన ఓ శ్రీరామచంద్రా! నమో నమో! నీకు వేలకొలది వందనములు. మమ్ము రక్షింపుము తండ్రీ! నీవెవ్వరివి ప్రభూ “కమనీయ శరణాగత వజ్రపంజరుడవు” (నీ శరణార్థులకు మనోజ్ఞమైన వజ్రపు కవచము వంటి రక్షకుడవు).
ఓ రామంచంద్రా! నీవు నీదాసులు రక్షణకై యెప్పుడూ కోదండమును ధరించియే వుంటాను, అనే దీక్ష నిర్వహించిన దీక్షితుడవు. ఆదిత్యకులములో (సూర్య వంశములో) జన్మించిన సకల శస్త్రాస్త్రపారంగతుడవు. మాయలేడివలె వచ్చిన మారీచుని సోదించు (వెదుకునట్టి) తలగుండు గండవు (శిక్షగా తలపై పెట్టుకొని తిరిగే పెద్దబండ వంటి మొనగాడివి). అంటే మారీచునివంటి కపటుల పాలిటి యముడివి అని భావము.
ఖరదూషణుల తలలను ఖండించి పదివేల మంది రాక్షసులను క్షణంలో మట్టుబెట్టావు. శరధిని బంధించి (వారధి నిర్మించి) విభీషణునికి వరదుడవైన ప్రతాపశాలివి. విశ్వామిత్రుని యాగమును సంరక్షించిన | జగజ్జెట్టివి. పుడమియందు జన్మించి, రావణాసురని చంపగలిగి కూడా “నేడుపోయి విశ్రాంతి తీసికొని తిరిగి రేపటికి తేరుకొని రా!” అని వదలివైచి వాడి గర్వాన్ని సమూలంగా హరించిన వీరాధివీరుడవు.
కీర్తితో అయోధ్యాపురాధీశ్వరుడవై యేలిన చక్రవర్తివి. గెలుపుమీరిన (కీర్తికాంత, భూకాంత, శ్రీకాంతలను కూడా గెలిచిన) జానకీరమణుడవు. కపిసేనలో అలఘులైన (ఉద్దండులైన) సుగ్రీవుడు అంగదుడు మొదలైన వారందరిచే సేవించబడినవాడవు. ఇంతే కాదు స్వామీ! నీవు సలలితము (దివ్యసౌందర్యోపేతమైన) శ్రీవేంకటశిఖర నివాసివైన మా దైవము శ్రీవేంకటేశ్వరుడవూ నీవే.
అన్నమాచార్యులవారి ఈ కీర్తన అర్థం కావాలంటే పురాణాలమీద మంచి పట్టు వుండితీరాలి. ఆతడే జగన్మూలమైన శ్రీవేంకటాద్రిమీది దైవము అని కీర్తిస్తున్నారు. ఈ స్వామి కమలాప్తుడైన సూర్యునిలోని వెలుగై దీప్తించువాడు. ఈయన జలధిసుతునకు బావగారు అంటున్నారు. మరి ఆబావమరిది యెవరో? ఈయన కొండవంటి రాకాసిని కొట్టినవాడట. మరి ఆ రాకాసియెవరో? శ్రీవేంకటాద్రి కొండరూపు తానేపో అంటున్నారు. అంటే ఏంటి? భావవివరణ చదివితే అన్నీ పూసగుచ్చినట్లు అర్థమవుతాయి మరి.
ఇంకా చెప్పాలంటే, ఆయన జలధిని బంధించినవాడు (సేతువును సాగరముపై నిర్మించిన శ్రీరాముడు). లంక (లంకిణి) అను రాక్షసిని సంహరించినవాడు (చంపించినవాడు). ఆయనే జలధి జొచ్చిన దైత్యుని | (వేదములను అపహరించి సముద్రంలో దాగిన సోమకాసురుని) చంపిన శ్రీమన్నారాయణుడు కూడా ఆయనే. జలధిసుతునకు (క్షీరసాగర | మథనమున పుట్టిన చంద్రునికి) వరుస బావ (అతని యొక్క సోదరి శ్రీలక్ష్మిని పెండ్లాటుచేత వరుసకు బావ) అయినవాడు. అటువంటి | క్షీరసాగరముపై పవ్వళించు స్వామియే పో మా దైవము.
ఇంతేకాక తన శ్రీకృష్ణావతారమున ఈయనే కొండను (గోవర్ధన పర్వతమును) గొడుగువలె చేతబట్టుకొని గోవులను, గోకులమును రక్షించినాడు. ఈతడే కొండవంటి రాకాసిని (రాక్షసి పూతనని) గొట్టినవాడు | (చనుబాలు త్రాగు నెపముతో సంహరించినవాడు). కొండలకు నెక్కుడైన (కొండలలో అత్యంత శ్రేష్ఠమైన) శ్రీవేంకటాద్రిపైన కొండరూపములో వున్నాడు (ఆ వేంకటాద్రి పడుకొని వున్న స్వామి శిరస్సును స్ఫురింపజేస్తుంది). తానేపో (ఆ శ్రీవేంకటేశ్వరుడే పో) మా దైవము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ రాఘవేంద్ర స్తోత్రంగురించి తెలుసుకుందాం…
Sri Raghavendra Sthotram In Telugu
గోలోకవాసి, శ్రీహరి పార్ష దుడు నైనశ్రిశంఖుకర్ణుడు బ్రహ్మదేవు నా దేశానుసారముగ యీ యవనిపై బ్రహ్మదేవు శ్రీ ప్రహ్లాదునిగ, శ్రీ విభీషణునిగ, శ్రీ బాహ్లికునిగా, శ్రీ వ్యాస నాయతీర్థునిగ, శ్రీ రాఘ వేంద్ర తీర్థునిగా యుగయుగములంద వత పంచి శ్రీ హరిశక్తిని, భక్తిని ప్రచారమొనరించి ధర్మసంస్థా సనము గావించెను. ఆపావన చరిత్రుని దివ్యలీలలను శ్రీ రాఘ వేంద్ర కల్పవృక్ష గ్రంథములో వర్ణించి కృతార్థుడ నై తిని.
మంగళకరమగు స్వరూపము గలవాడును, దూది మొత్తము నగ్నివలె వివిధ సాంసారిక దుఖఃములను విధ్వంస మొనర్చువాడును, ఆనందము గలవాడును, ధైర్యశాలియు, సమస్త దుష్టగ్రహములను నిర్మూలింపదగిన మహాశక్తి కల వాడును, ఉపద్రవ సముద్రముల ను తరించుటకు సేతువు వంటి అగు శ్రీరాఘవేన్ద్ర స్వామి మమ్ము రక్షించు గాక.
ఈ ప్రకారముగ ప్రతిదినము మూడు వేళల ప్రార్థనను చేయుచున్న వాడు ఈలోకమునను, పరలోక మునను సమస్త మనోరథములను సిద్ధించుకొనినవాడై ఆనందించు చున్నాడు. ఈ విషయమున సం దేహము లేదు.
ఈ రాఘ వేంద్ర స్తోత్రమును బఠించు భక్తులకీ స్తోత్ర మహిమవలన రాజులవలన గాని, చోరులవలనగాని, వ్యాఘ్రముల వలనగాని సర్పములవలన గాని మొసళ్లు మొదలుగాగల వాని వలనగాని బాధ కలుగదు. సందేహ మేమాత్రము లేదు.
ఓ వామనమూర్తి! గోవిందుడా! విష్ణుదేవా! వాసుదేవా! శ్రీహరీ! శ్రీకృష్ణా! దామోదరా! (ఉదరమునకు తల్లి యశోదచే దామముతో కట్టబడినవాడా!) అచ్యుతా! మాధవా! శ్రీధరా! (లక్ష్మీవల్లభా!) నీమహిమను | గాలేము (తెలుసుకొనలేము). నిన్ను ఇటువంటివాడని అంచనావేయలేము. మరి ఇక యేమి చేయగలం? నాలుకకు అతి సులభమైన పని నీ నామమును జపించుట. అది చాలునాకు.
ఓ అనిరుద్ధా! (పరులచేత అడ్డగింపలేనివాడు) పురుషోత్తమా! అధోక్షజా! (ఇంద్రియములను జయించిన వారికి మాత్రమే కనబడువాడు) ఉపేంద్రా! జనార్ధనా! కేశవా! సంకర్షణా! (ప్రళయకాలమందు అందరినీ అంతముజేయువాడు) నిన్ను దలచలేము (నీగురించి ఆలోచించలేము). ఇక నిన్ను యెట్లు తెలియగలము? నునుపైన (పట్టుకోవటానికి తేలికైన) నీ నామము నోటితో సులభముగా పలికెదను ప్రభూ!
ఓ నారాయణుడా! పద్మనాభుడా!, హృషీకేశా! (ఇంద్రియములకు అధిపతి) నారసింహ! మధుసూదనా! త్రివిక్రమా! నీరూపము విశ్వరూపమైనందువలన యెట్లుండునో వూహింపజాలము. కానీ నేడు మాకన్నులయెదుట నిజముగా కనుపించుచున్న నిక్కపు వేంకటేశ్వరుడవు నీవే తండ్రీ! దర్శించి జపించుటకు అతి సులభమైన నీనామజపమును అన్నిటా స్వీకరింతును. ఎందుకంటే సులభమైన తరుణోపాయము ఓం నమో వేంకటేశాయ! అనడమే సుమా!
అన్నమాచార్యులవారు చెప్పిన ఈ కీర్తనలో సాటివారిని తమ మనస్సులలోని అజ్ఞానపు తెరలను తొలగించి శ్రీహరిని దర్శించమని వేడుకొంటున్నారు. ఇది కూడా తేలికగా కనుపించే క్లిష్టమైన కీర్తన. భావ వివరణ చదివినవారికి ఈ సంగతి వెంటనే అర్థమవుతుంది. గోవిందునికి మీమనస్సులో నెలవుగా వుంచితే బ్రహ్మానందము దానంతట అదే సిద్ధిస్తుంది. శ్రీ వేంకటేశ్వరుని నామసంకీర్తనము నాలికపై నుంటే, యే పొద్దునైనా ఆయననే తలుస్తుంటే… తప్పక ఒకనాటికి ఆ స్వామి దయకలుగుతుంది.
భావ వివరణ:
పరమవివేకులాల (విశిష్ఠమైన వివేకము గల జ్ఞానులారా!) బంధువులారా! మాకు తెరదీసి (వివేకము చూపి) ఇది (ఈసంగతిని) తెలియజేయండయ్యా!
ఏడు’జానలు’ పొడుగున్న ఈ శరీరంలో ఇందిరానాధుడైన శ్రీహరివున్నాడు. కాని ప్రయత్నించి వెదకకపోతే మాత్రం కనబడడు. వైకుంఠము అనేది వేరేయెక్కడో లేదు. మనస్సులో శ్రీహరి వున్నట్లే, వైకుంఠము కూడా మన మెదడులోనే పూడ్చివున్నది, దాగివున్నది). అది వూరకనే కనబడదు. ధ్యానముచేసి, పరిశోధించి వెతికి చూస్తేకాని కనుపించదు. అయ్యలారా! అట్లే సోధించరో!
నెలవు (వుండేచోటు) నిజంగా యెక్కడవున్నది? కొడు బయలులోనట (పుడిసిలిలో ఇమిడిన ఆకాశములో వున్నాడట. చిడిముడితో (తొట్రుబాటుతో కూడిన జాగ్రత్తతో) ఆయనను ఇట్టే పట్టరో (మీ వశము చేసికొనండి). అందే (ఆయనను వశపరచుకొనుటలోనే) బ్రహ్మానందము, అణచిదాచివున్నది (అణిగి దాగివున్నది). ఈ ముడియ (మాట)లో దాగి వున్న బ్రహ్మానందము విడువరో (బయట పెట్టండి). వెలయజేపట్టరో (బయటపడంగానే) మీలో భద్రపరచుకొనండి.
“మేడెగుడిదిన్న” అనే గ్రామములో వెలసిన హనుమంతుని సేవిస్తూ అన్నమాచార్యులవారు చెప్పిన అద్భుతమైన కీర్తననాస్వాదిద్దాము. నీ చేతలు నీకే చెల్లినవి స్వామీ! అని కీర్తిస్తున్నారు. ఇటువంటి కీర్తనలు కోకొల్లలున్నాయి! జానకి క్షేమసమాచారము రాముని కెరిగించిన ధీశాలియైన బంటు అని, శ్రీవేంకటేశ్వరునికి కూడా ఈయన మేటి బంటేనట. ఆయన వునికే అరుదాయెనట.
భావ వివరణ:
అల్లదె (అదిగో) ‘మేడెగుడిదిన్న’లో చేరి వెలసిన హనుమంతరాయా! నిన్ను కంటిమి (నీ వైభవమును చూచితిమి). నీచేతలు నీకె చెల్లె (నీసాహసములు ఇతరులకు అసాధ్యము. అవినీకే చెల్లినవి ప్రభూ!)
జంగ చినట్టి నీ సంగడిపాదములు (బారగా పంగజాచినటువంటి నీ పాదముల జంట) కనువిందు చేయుచున్నవి. చెంగలించి (అతిశయముగా) యెత్తిన నీ శ్రీహస్తము (మంగళకరమైన చేయి ముంగలి బిడికిలించితివి (మీదికెత్తి పిడికిలి బిగించియుంటివి). ఇంకొక చేయి నీ మొలజేర్చితివి (నడుముపై వుంచుకొంటివి). ఓ హనుమంతరాయా! ఈ విధముగా నీసొబగు (శోభ) అంగమాయస్వామీ! (చాలవైభవయుతముగా నున్నది).
పొడవుగా పెంచిన నీ వాలము (తోక) నీ పెద్దవైన పిరుదులమధ్య వ్రేలాడుచున్నది. తిరిగి (వెళ్ళి) నూరుయోజనముల జలధిని (సముద్రమును దాటే నీయాయితము (నిడపు… అంటే… దూకగల సామర్థ్యము…) ను యేమని పొగడగలము! బంగార రంగు కాసే (వస్త్రము) వైభవోపేతముగానున్నది. ఆభరణములతో నీ సింగారము చెలగినది (కన్నుల పండువగా వున్నది). ఓ హనుమంతరాయా! నీ వునికి (వున్నవిధానము) అరుదాయ (బహు అరుదుగా చూడగలుగుతాము) స్వామీ!
జానకి క్షేమసమాచారము యెంత త్వరగా శ్రీరామచంద్రునికి అందించగలనా అన్నదే నీ ఆశయము. అదే నీ చింత (ఆలోచన). దీమసాన మగుడియేతెంచిన చేత (లంకలో రాక్షసులను చితకబాది, లంకా దహనము చేసి, రావణునికే హితబోధ చేసి సీతాదేవి చూడామణితో తిరిగివచ్చిన… నీ సాహసము…) అసాధ్యము. రామనామ జపముతో, రతికెక్కితివి (ప్రసిద్ధుడవైతివి). ఓ హనుమంతరాయా! శ్రీవేంకటపతియైన నీ రామునికే మేటి బంటువైతివి స్వామీ!
ఆ దేవదేవుడే మనందరి తండ్రి. రాక్షసులైన, దేవతలైన, మనబోటి నరులైనా, జంతుజాలములైనా, క్రిమికీటకములైన ఆయనబిడ్డలే. కాని వీరందరి బ్రతుకు ఒక్కలాగున లేవు. కొందరు సుఖిస్తుంటే కొందరు దు:ఖిస్తున్నారు. ఆయన కొందరికి మేలు చేస్తున్నట్లు కొందరిని శిక్షిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయనకు ‘సమమతి’ (సమానంగా చూచే బుద్ధి) లేదేమో అనిపిస్తుంది. అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో ‘నీవే సమమతినని చాటుకొంటావు. రమణ నేరుపులెవ్వరివి, నేరములెవ్వరివి? నీకు దేవతలు చేసిన మంచేమిటి, రాక్షసులు చేసిన చెడేమిటి? వాళ్ళనెందుకు రక్షించావు, వీళ్ళనెందుకు శిక్షించావు? అంతా నీ చిత్తము మా ప్రాప్తము అంటున్నారు.
భావ వివరణ:
ప్రభూ! నీవే సమమతివని (పక్షపాతములేక అందరినీ సమానముగా చూచే బుద్ధికలవాడినని) చాటుకొంటావు. అట్లయినచో, రమణ నేరుపులెవరివి (ఆ చక్కని నేర్పుగల పనులు యెవరికి దక్కుతున్నవి) మరియు నేరములెవ్వారివి (చెడ్డపనులు యెవరికి దక్కుతున్నవి?)
రావణుడు మొదలైన రాక్షసులలో ఆత్మరూపుడవై వున్నదెవరు? నీవేకదా! దేవతలలో వున్నదీ నీవే కాదా? మరి భావించుటకు నీకు, అసురులు పగవారెందుకయ్యారు? మరి ఇటు చూస్తే సురులు నీకు యెట్లు హితులు అయ్యారు, ఇంతా చేసి ఇద్దరూ నీ సంతానమే కదా! ఎందుకు దేవతల్ని రక్షిస్తున్నావు, రాక్షసులనెందుకు భక్షిస్తున్నావు?
జంతువులన్నింటిలోనూ వున్న చైతన్య పదార్థాం ఒక్కటే. దాన్నే ప్రాణము అంటారు కొందరు. అది నీవే కదా! అటువంటప్పుడు ఒకరు నీకు ఉపకారమొనరించిరా అకట (అయ్యో!) కొందరిని పాపాత్ములను చేసినావే? వెకలి (ఆసక్తితో) కొందరిని పుణ్యవిధులు చేసే వారిగ నొనరించితివే? ఎందుకీ బేధ భావము నీకు కలుగుతున్నది? | ఒకర్మించేమిటి, ఇంకొకరి చెడేమిటి?
దీనికి కొందరు విధి అని పేరుపెట్టి, కర్మ అనే ఒక సిద్ధాంతం తీసికొనివచ్చి, అందుకని ఇట్లా అయింది. ఇందుకని అట్లా అయింది అని యేవేవో కారణాలు చెబుతారు. అసలేమిటంటే అంతా నీ చిత్తము మా ప్రాప్తము అంతేకాక ఇంకేమిటి? అవునా? ఓ శ్రీవేంకటేశ్వరా! ఏది ఏమైనా నీ దాసులు మాత్రం నీ కృపవల్ల ఘనులయ్యారు తండ్రీ! నీవు గటియించినచో (తలచుకొంటే) మేము తప్పక ఘనులమవుతాము.
ఇంకా నీతలఁపులెన్ని గలిగిన
వేంకటాధిపు సేవించఁగదో
అంకెలకిన్నియునైన యీ (?)
మంకపు గాక నమ్మవో మనసా
||నారా||73
అవతారిక:
తనమనసును హెచ్చరిస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. నారాయణుని శుభప్రదమైన నామము పలికితే చాలును. కోరినవిచ్చీగోవో అంటే కోరుకున్నవన్నీ ఇస్తాడు, స్వీకరించు అని అర్థం. కొన్ని మాటలకి నిఘంటువులలో కూడా సులభగ్రాహ్యమైన అర్థం దొరకదు. అది అట్లా అయ్యుంటుందని భావించాలి. “అంకెలకిన్నియునైన యీమంకపుగాక నమ్మవో మనసా” అంటున్నారు. అంటే యేమిటి? నీవశమయ్యేట్లుగా అన్నీ నీకు శ్రీహరే ఇస్తాడు. నీ మంకుతనము మాని ఆయనను నమ్మవే అని అర్థం. ఆయన హృదయవాసినియైన లక్ష్మీదేవి ఆయన ఇమ్మంటే లక్షలు, కోట్లు ఇస్తుంది. కానీ ఒల్లవో మనసా! నీవు అసలొప్పుకోవద్దు అంటున్నారు. | ఒప్పుకుంటే డబ్బుపిచ్చివాళ్ళవుతారు, మరి.
భావ వివరణ:
ఓ మనసా! శ్రీమన్నారాయణుని శ్రీనామము (మంగళప్రదమైన నామం ఇదే). హరీ! అను. ఇది నీవు కోరిన విచ్చీ (కోరికలు తీరుస్తుంది) కోవో (తీసికో…) కానీ ఆ నామాన్ని మాత్రం వదిలిపెట్టకు.
శుకమహర్షిని భాగవత బోధకునిగా చేసి అనుగ్రహించి తరింపజేసినది | శ్రీహరినామమే. ఆయనను సొంపుగా ధ్యానిస్తే సకల భవబంధాలు తొలగిపోతాయి. వాటిపై విజయము సాధించగలవు. ఆ శ్రీహరినామము అకలంకము (ఏ దోషమూ లేనిది). గొప్ప భయమును నివారించునది. | ఓహెూ! మనసా! అది ఒకటినొకటి (ఒకే యొక్కటి. అట్టిది ఇంకొకటి లేదు అని అర్థం.)
ఆ శ్రీహరి అలవాట్లు యేమిటో ఒకసారి గమనించండి. ఆయన పక్షిగమనుడు. అత్యంత వేగంగా వెళ్ళే గరుత్మంతునిపై వెళ్ళేవాడు ఆయనే. క్షణాల మీద (తలచినదే తడవుగా) వచ్చి రక్షిస్తాడు. అభయప్రదాతయైన | శేషునిపై పవళిస్తాడు విహరిస్తాడు. ఆయన వక్షస్థలంపై సిరులరాణి శ్రీమహాలక్ష్మివుంటుంది. ఆయన సైగచేస్తే లక్షలు కోట్లు ఇస్తుందావిడ. కానీ ఓ వెళ్లి మనసా! వాటిని ఒల్లకే (ఆ లక్షలు కోట్లను అంగీకరించకే. చెడిపోతావు.
అవన్నీ అటుంచి ఈ మాట వినుము. నీకు ఈ ప్రాపంచిక తలపులు (కోర్కెలు) యెన్ని కలిగినా శ్రీవేంకటేశ్వరుని మాత్రము వదలిపెట్టకు. ఆయననే సేవించదో! అంకెలకిన్నియునైన యీ (నీ వశమయ్యేట్లుగా |ఆయన నీకెన్నియైనా ఈయగలడు. ఓ మనసా! మంకెపుగాక (మంకుతనమునకు పోక… అంటే… మొండిగా చెడిపోక) నమ్మవో (ఆయననే శరణు అని నమ్ముకో). తప్పక నీకు మేలు జరుగుతుంది.