మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు నీతికథ.
అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు
పరమేశ్వరుని వరప్రభావముతో సక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణము. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపదీ పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసారజీవములో వారుపాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు “ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్క యేడాది క్రమముగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి”. పాండవులందఱూ నారదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరసావహిస్తామని నిశ్చయించుకున్నారు.
ఇట్లా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హెూమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్పుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించి నారదుడు వారికి విధించిన నియమభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తరక్షకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులైన ఆ దొంగలను శిక్షించి విపుని హెూమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.
తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడిలా అన్నాడు “సోదరా! క్రూరకర్ములై ఆ విపుని హెూమధేనువును అపహరించిన ఆ దొంగల ను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశాపు కనక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం”?
అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు “అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో (వంకతో) నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి”. తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేక పోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని సకల తీర్థాలూ సేవించి పావనుడైనాడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. తనంతట తాను వేళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశమీయ మని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ శివస్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
Sri Shiva Stotram Lyrics Telugu
శ్రీ శివస్తోత్రమ్
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే।
రక్త పింగళ నేత్రాయ జటామకుట ధారిణే॥
కరి మొరలిడనాడు త్వరగను నేగి మకరినుంచికరిగావవే
పరమపావన రామ చెరసాలనున్న భూసురునేలరక్షింతివో
||అనియిట్లు||
అతిపాపియైన యజామిశునేలి వతడేమి నీ చుట్టమా
పతితపావన రామ భద్రాద్రినిలయ నన్ పాలింపవిది దిట్టమా
||అనియిట్లు||
భద్రగిరీశుడ భక్తులపాలిట పారిజాతంబనుచు
భద్రాత్ముడై యున్న వాడు రామదాసు పాలించెదవనుచు
||అనియిట్లు||
28. ధన్యాసి చాపు తాళం
పల్లవి : అబ్బబ్బా రామ నామమది
సారము లేని సంసారసార మిదే రామనామం
పారద్రోలు మున్నూట ఇరువది భవరోగములన్ని
చేరి పంచేంద్రియములన్ని చేరక పారదోలు నామం
ఘోరమైన యమదూత కొట్టెడి నామం
||అబ్బబ్బా||
దినదినము జిహ్వకింపై దీయగనుండు నామం
ధనకనక వస్తువులు దయచేయు నామం
అసలు కొసలు నొక్క సమాభివృద్ధి చేయునామం
తనువును రెండనుచు తుదిని తారక నామం
ఓ రామయ్య వర్షములో జిక్కి వసుమతిమీదనే వర్తించు చుంటిగద కొన్నాళ్ళు
వరుసశేషసస్యగతమైన ధాన్యమును వదలి వర్తించితిగదకొన్నాళ్ళు
వరశరుని తేజస్సువల్ల నారీతనువల్ల నోరీగర్భనరకమునబడి యుంటిగ ఓ రామ
||అయ్యయ్యో||
త్రిప్పుడు తిత్తిలోబడి దినము ప్రవర్తిల్లు చుంటిగద కొన్నాళ్ళు
అప్పుడు మాతల్లి యుప్పుపులుపు దిననంగలార్చుచుండ కొన్నాళ్ళు
ఎప్పుడు నిందుండి బదులు వెళుదునని ఎదురుచూచుచుంటిగ కొన్నాళ్ళు
చెప్పరానియట్టి ద్వారములోనుండి జననమునొందితి ఓరామ
||అయ్యయ్యో!|
పొరలుచు దురగాధపొత్తిలో నలిగిరనుచుచు పోనుంటిగద కొన్నాళ్ళు
పెరుగుచు బాల్యావస్థల దినముల పరుగులాడుచుంటి గదకొన్నాళ్ళు
తరుణంతోగూడి మదమత్సరముల కన్నెరుగనైతిగద కొన్నాళ్ళు
తరువాత దారాపుత్రాది మోహములదవిలి వర్తించిగద ఓ రామా
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో మంత్ర పుష్పం అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు మంత్ర పుష్పం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిగురించి తెలుసుకుందాం…
Sri Mahalakshmi Ashtottara Sathanamavali In Telugu
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు కృష్ణాష్టకమ్గురించి తెలుసుకుందాం…
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
భూభారాన్ని తగ్గించడానికి భువిపై అవతరించిన ఆదివిష్ణువే ఈ కృష్ణుడు అని ఆ అవతార విశిష్టతను కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు.
సవరేతిరి అంటే అర్ధరాత్రి అని అర్థం. సిసువు అంటే శిశువు అని అర్థం. కన్నతల్లిదండ్రుల కర్మబంధాలను పటాపంచలు చేశాడట ఆయన. రాకాసి మూకలు అంటే రాక్షసులగుంపు అని అర్థం. ఈ కృష్ణయ్యే కలియుగంలో శ్రీవేంకటాద్రిపై అలమేల్మంగమ్మతో వెలసి నిత్యకళ్యాణాల చక్రవర్తియై శోభలీనుతున్నాడు అంటున్నారు. ‘ఆదికొనుట’ అంటే కన్నువేయటం అని అర్థం.
భావ వివరణ:
ఓ అమ్మలారా! ఈతడే ఆదివిష్ణువట. ఈ మహానుభావుడు, ఆదిగొని (కన్నువేసి… అంటే… నిశ్చయించుకొని) భూభారము నణచినాడమ్మా!
చందురునుదయవేళ (చంద్రుడు వుదయించుచున్న సమయమున) సవరేతిరి కాడ (అర్థరాత్రి తరుణమున) దేవకీదేవి, కందువ బిడ్డ గనెనమ్మా! (సామర్థ్యముగల శిశువునకు జన్మనిచ్చింది. బ్రహ్మాది దేవతలు అప్పుడు పొందుగా (ఉద్ధతితో) ఆ పురిటింటి గుమ్మంలో నిలబడి ఆ బాలుని స్తోత్రించినారోయమ్మా!
అనంతరం వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు వసుదేవుని యెదుట సిసువుగ (శిశువుగా) అవతరించి చెలగీనమ్మా (కనువిందుజేయు చున్నాడమ్మా!) అప్పుడు ఆ యిసుమంత శిశువు ముసిముసినవ్వులు విరజిమ్ముతూ తనను చూడవచ్చిన మునీశ్వరులకు ఇకపై భయమువలదు అని వారికి అభయమునొసగినాడు ఓయమా! ఏమి ఆశ్చర్యము!!
అప్పుడా శిశువు తన కన్నతల్లిదండ్రులకు వారి గతజన్మల పుణ్య విశేషమును వివరించి తను వారి గర్భమున జన్మించిననూ వారి కర్మఫలము వలన తన బాల్యమును జూచు అదృష్టము వారికి లేదనీ, తిరిగి తను పెద్దవాడయ్యాక జీవితాంతము తనతోనే గడుపుదురని వివరించి వారికి కర్మపాశము నుండి విముక్తి కలిగించెను. ఆ బాలుడే అన్ని విధములైన రాకాసి మూకలను చీల్చి చెండాడినాడు. నేడు ఆతడే శ్రీవేంకటాద్రిపై లక్ష్మీదేవితో నుండి, వున్నతముగా పూని నిత్యకళ్యాణములు జరుపుకొంటూ, పరగీనమ్మా! (వెలయుచున్నాడమ్మా!).
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అహంకారం వివాశహేతువు నీతికథ.
అహంకారం వివాశహేతువు
(ఉద్యోగపర్వంలో కథ యిది. కృష్ణుడు రాయబారానికివచ్చి తను చెప్పవలసిన హితవు చెప్పాడు. అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధ)
నాయనా! దుర్యోధనా !
నీకూ, నీ వారికి సర్వప్రపంచానికి మేలుకలిగే విషయం చెపు తున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను.
చాలారోజుల క్రితంమాట.
దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతనూ పాలించేవాడు. భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటివచ్చేవారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధు
ఆయనరోజూ ఉదయంలేచి, కాలకృత్యాలు పూర్తికాగానే బాగా అలంకరించుకొని రత్న కిరీటం ధరించి, కోడెత్రాచువంటి కరవాలంచేత బట్టి సభాభవనానికి వచ్చి బంగారుసింహాసనం అధివసించేవాడు.
వంది మాగధులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తూంటే, కోరమీసం మెలి త్రిప్పుతూ ఆనందించేవాడు.
అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ:
ఈ భూలోకంలో ఎవడయినా నాతో యుద్ధం చేయగల మహావీరు డున్నాడా ! గదా, ఖడ్గ ప్రాసాది ఆయుధాలతోకాని, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతోకాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు మల్లయుద్ధం చేయగల వీరుడు ఉన్న వాడిని క్షణంలో కడ తేరుస్తాను.
అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు.
ఆయన బలపరాక్రమాలెరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కారు.
అంతతో ఆయన అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంతవాడు లేడనే గర్వంతో అయిన విర్రవీగుతూ తిరుగు తున్నారు.
అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులుకూడా అటువంటి దొరుకుతారుకదా!
వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు.
అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు –
మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలవరా తమ సంపన్నులే.
అయితే
గంధమాదనపర్వతంమీద వర నారాయణులని ఇద్దరు తీవ్రనిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడులోకాలలో లేరని విన్నాము. తమకు కోరికఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు.
ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జళిపించి నేలమీద పాదంతో తొక్కి
ఎంతకావరం ! నన్నుమించిన యోధులా వారు, అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు. గంధమాడన పర్వతం చేరాడు.
ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం త్రిప్పాడు.
నర నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరుపబోగా :
ఇవన్నీ అనవసరం, యుద్ధం, యుద్ధం అని అట్టహాసం చేశాడు.
అప్పుడు వారు:
ఎవరితోనూ సంబంధంలేకుండా కళ్ళుమూసుకుని యీ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే ముములం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు, అన్నారు.
వినలేదు మహారాజు.
యుద్ధం చెయ్యకతప్పదు, అన్నాడు.
అంటూనే బాణం తొడుగుతూంటే చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి
ఇదిగో ఈ గడ్డిపరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు.
ఆరాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది.
రాజుకి తల తిరిగింది.
సేవలు పలాయనం చేస్తున్నాయి
చూసిన రాజుకి గుండె జారింది.
ఆయుధాలన్నీ క్రింద పెట్టి, తలవంచి నర నారాయణుల పాదాల మీద వ్రాలి:
ఆర్యా ! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయ శ్చిత్తం అయింది, అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ ! మహారాజా
సిరి సంపదలు కలవారు పేద సాదలకు దాన ధర్మాలు చేసి గొప్ప వారు కావాలి.
అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారినుండి పజ్జను లను రక్షించడానికి తమశక్తిని వినియోగించాలి. అంతేకాని, అహం కారంతో తిరగరాదు.
ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మవ్యర్థం- అన్నారు.
మహారాజు వారి బోధవిని, ఆనాటినుంచీ అహంకారం విడిచి, అందరి శ్రేయస్సూ దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జనసేవచేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు.
కనక, దుర్యోధనా !
అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి, అన్నాడు పరశురాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు ఉమామహేశ్వరాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు గాయత్రీ నిత్య పూజా విధానము గురించి తెలుసుకుందాం.
“ఓం జనార్దనాయ నమః” అని కుడి అరచేతితో వక్షస్థలము నదుముకొనవలెను.
“ఓం ఉపేంద్రాయ నమః” అని వ్రేళ్ల కొసలతో శిరమును స్పృశించుకొనవలెను.
“ఓం హరయే నమః” అని కుడి చేతి వ్రేళ్లు చుంచువువలె ముడిచిగాని, విప్పారగా గాని – ఎడమ కుడి భుజములను తాకవలెను. (కొందరు ఎడ మ చేత కుడి మూపును, కుడిచేత ఎడమ మూపును ‘ ఆకారముగా తాకుటయు ప్రచారమున గలదు) పిదప
“శ్రీకృష్ణాయ నమః” అని కొంచెము నీరు ఒక చిన్న పళ్లెరములో విడిచి నమస్కరించుకొనవలెను.
భూశుద్ధి
తదుపరి కాసిని అక్షింతలు చేతబట్టుకుని
శ్లో॥ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
అని చెప్పుకుని, ఆ అక్షతలు వాసనచూసి వెనుక వైపునకు వేసుకొన వలెను.
నీరు చిలికి –
ఆ పదార్ధములచుట్టూ ఔపోసనవిధిగా
1. ఓం ప్రాణాయస్వాహా,
2. ఓం అపానాయస్వాహా
3. ఓం వ్యానాయ స్వాహా
4. ఓం ఉదానాయ స్వాహా
5. ఓం సమానాయ స్వాహా అని చెప్పు చూ
5 పర్యాయములు నివేదనమును గాయత్రీ దేవికి కైవోలు చేయవలెను. పిదప –
“మధ్యే మధ్యే పానీయం సమర్పయామి” అని – ఒకటి, రెండు చుక్క ల నీరును పదార్థములపై ప్రోక్షించవలెను.
తదనంతరం –
“ఉత్తరాపోశనం సమర్పయామి” అని ఒకమారు
“హస్తా ప్రక్షాళయామి” అని యొకమారు
“పాదౌ ప్రక్షాళయామి” అని యొకమారు
“శుద్ధాచమనీయం సమర్పయామి” అని యింకొక మారునూ వెరసి నా లుగు పర్యాయాలు నీరు సమర్పించాలి.
“కర్పూర నీరాజనానంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి” అనుచూ – పువ్వుతో ఒక బొట్టు నీరును అమ్మవారి వద్ద ఉంచాలి. అనంతరం కొన్ని అక్షతలూ, పువ్వులూ, చిల్లర డబ్బులూ చేతితో పట్టు కుని సువర్ణ మంత్ర పుష్పమును పఠించవలెను.