Anna Maataki Kattubadina Arjunudu In Telugu – అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు

anna mataku kattubadina arjunudu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు నీతికథ.

అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు

పరమేశ్వరుని వరప్రభావముతో సక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణము. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపదీ పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసారజీవములో వారుపాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు “ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్క యేడాది క్రమముగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి”. పాండవులందఱూ నారదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరసావహిస్తామని నిశ్చయించుకున్నారు.

ఇట్లా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హెూమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్పుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించి నారదుడు వారికి విధించిన నియమభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తరక్షకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులైన ఆ దొంగలను శిక్షించి విపుని హెూమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.

తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడిలా అన్నాడు “సోదరా! క్రూరకర్ములై ఆ విపుని హెూమధేనువును అపహరించిన ఆ దొంగల ను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశాపు కనక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం”?

అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు “అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో (వంకతో) నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి”. తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేక పోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని సకల తీర్థాలూ సేవించి పావనుడైనాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. తనంతట తాను వేళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశమీయ మని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Shiva Stotram In Telugu – శ్రీ శివస్తోత్రమ్

శ్రీ శివస్తోత్రమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివస్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Stotram Lyrics Telugu

శ్రీ శివస్తోత్రమ్

నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే।
రక్త పింగళ నేత్రాయ జటామకుట ధారిణే॥

1

భూత భేతాళ జుష్టాయ మహా భోగోపతీ (వీ)తినే।
భీమాట్టహాస వక్రాయ కపర్ది స్థాణవే నమః॥

2

పూష దంత వినాశాయ భగనేత్ర భిదే నమః।
భవిష్య ద్వృషభచిహ్నాయ మహా భూత పతే నమః॥

3

భవిష్య త్రిపురాంతాయ తథాంధక వినాశినే।
కైలాస వరవాసాయ కరిభిత్ కృత్తినివాసినే ॥

4

వికరాళోర్ధ్య కేశాయ భైరవాయ నమో నమః।
అగ్నిజ్వాలా కరాళాయ శశి మౌళిభృ(కృ)తే నమః॥

5

భవిష్య త్కృత కాపాలి వ్రతాయ పరమేష్ఠినే।
తథా దారువనధ్వంసకారిణే తిగ్మశూలినే॥

6

కృత కంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే।
ప్రచండ దండ హస్తాయ బడబాగ్ని ముఖాయ చ॥

7

వేదాంతవేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః।
దక్షయజ్ఞ వినాశాయ జగద్భయకరాయ చ॥

8

విశ్వేశ్వరాయ దేవాయ శివ శ్శంభో భవాయ చ।
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః॥

9

ఏవం దేవై సుృతశ్శంభు రుగ్రధన్వా సనాతనః।
ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే॥

10

ఇతి శ్రీవరాహపుణాంతర్గత దేవకృతశివస్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

Sri Ramadasu Keerthanalu 21-30 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు - Sri Ramadasu Keerthanalu కీర్తన: 21-30

Sri Ramadasu Keerthanalu 21-30 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

21. అసావేరి చాపుతాళం

పల్లవి : రామచంద్రులు నాపైచలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మ
కటకటవినడేమి సేయుదు కఠినచిత్తుని మనసు కరుగదు
కర్మములు నెటులుండునోగద ధర్మమే నీకుండునమ్మ

||రామచంద్రుడు||

దినదినము మీచుట్టు దీనతతో దిరుగ దిక్కెవ్వరిక నోయమ్మ
దీనపోషకుడనుచు వేడితి దిక్కులన్నియు ప్రకటమాయెను
ఒక్కమాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మ

॥ రామచంద్రుడు||

కౌసల్యతనయుడు కపటము చేసినాడు కారణమిటుండెను
కన్నడచేసెదవా నీ కన్నుల వైభవంబు విన్నవింపగదమ్మ
నీ కన్న దిక్కెవ్వరోయమ్మ

||రామచంద్రుడు||

దశరథాత్మజుడెంతో దయాశాలియనుకొంటి ధర్మహీనుడేయమ్మ
దాసజనులకు దాతయతడట వాసిగ భద్రగిరీశుడట రామదాసుని
ఏలరాడట రవికులాంబుధి సోముడితడట

॥రామచంద్రుడు||

22. బిళహరి చాపుతాళం

పల్లవి : రావయ్యా భద్రాచలరామ శ్రీరామ
రార రమణీయ జగదభిరామ లలామా
కేవలభక్తి విలసిలు భావముదెలిసి దేవుడవైతే

॥రావయ్యా||

ప్రొద్దు ప్రొద్దున నిన్ను పొగడుచు నెల్లిపుడు
ప్రొద్దు మీరగాను భజన చేసెదను
గద్దరితనమున ప్రొద్దులు పుచ్చుము
ముద్దులు గులుకుచు మునుపటివలె నిటు

||రావయ్యా||

నన్ను గన్న తండ్రి నా మదిలోన
నీకన్న నితరముల గొలిచెదనా
శ్రీకరదివ్య ప్రభాకర కులరత్నా
శరత్పూర్ణ సుధాకర తేజా

॥రావయ్యా॥

అంజలి జేసెద నరమరలేక
అమిత కటాక్షము నాపైని పూని
ముజ్జగములకు ముదమిడు పదముల
గజ్జెలు గలగల ఘల్లుఘల్లు మన

॥రావయ్యా॥

దోషము నెంచని దొరవని నీకు
దోసిలియొగ్గితి తొలుత పరాకు
దాసుని తప్పులు దండముతో తీరె
మోసము గలిగిన దాసపోషకుడవై

॥రావయ్యా॥

23. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : వినరయ్య తానీషాగారు మా మనవి చేకొనరయ్య మహారాజ మీరు

||వినరయ్య||

దినదినమును వారియింట విప్రవరుల సంతర్పణం
విందులవంట చేసేది సర్కారులంట
ఋజువు చేస్తాము సర్కారులను బంపువెంట

||వినరయ్య||

దండికాపులు బలిసిరందుచేసి చేసెడు తంటాలు నేమనుకొందు
ఆరులక్షల పైకమందునిలచి సర్కారునకు రాకపోయెనందు

॥వినరయ్య॥

బొక్కసములు పాడాయె దేవాలయములు బహుచక్కనాయె
తక్తాధికారులు మీరు తహసీలు చేసెడి గోపన్నగారు

॥వినరయ్య||

చాలతంటాలు జేసినారు తానీషాపైకమంత కొల్లగొట్టుచున్నారు
రామచంద్రుని నమ్మినారు శ్రీ భద్రాద్రిపురమందు దాగియున్నారు

||వినరయ్య||

జాగుసేయక యిక మీరె వారిని రప్పింప దెలియనతని కార్బారు

||వినరయ్య||

24. గౌళీపంతు ఆదితాళం

పల్లవి : శ్రీరామ నీ నామమెంత రుచిరా
ఓరామా నీ నామ మేమి రుచిరా
కరిరాజా ప్రహ్లాద ధరణి విభీషణుల
గాచిన నీనామ మేమి రుచిరా

||శ్రీరామ||

గోవిందు నేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం

||శ్రీరామ||

విష్ణుకథలు చెవుల విందాం విందాం
వేరే కథలు చెవుల మందాం మందాం

||శ్రీరామ||

రామదాసులు మాకు సారాం సారాం
కామదాసులు మాకు దూరం దూరం

||శ్రీరామ||

నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులనింక మేము నమ్మాం నమ్మాం

||శ్రీరామ||

మాధవ నామము మరువాం మరువాం
మరి యమబాధకు వెరువాం వెరువాం

||శ్రీరామ||

అవనిజపతి సేవ మానాం మానాం
మరియొకజోలంటే మౌనాం మౌనాం
భద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మన ముందాం ముందాం

||శ్రీరామ||

25. సావేరి ఆదితాళం

పల్లవి : సీతారామస్వామీ నేజేసిన నేరమేమి
ఖ్యాతిగ నీపదకంజ యుగళమునే
ప్రీతిగ దలపగ భేదమెంచితినా

॥సీతా॥

రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
సరిగ బంగారు శాలువ పాగాలుంగీల్ నడికట్లడిగితినా
చెంగట భూసురపుంగవు లెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
మువ్వలు గొలుసులు ముత్యపుసరములు అంగనలకు నిన్నడిగితినా

॥సీతా॥

ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటంబడిగితినా
కోమలమగు మెడలో పుష్పదామములిమ్మని యడిగితినా
మోమాటము పడకుండగ నీదగు మురుగులు గొలుసుల నడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని

||సీతా॥

తరచున నీ పదముల నమరిన సరిగజ్జెల నిను నేనడిగితినా
కరుణారస ముప్పొంగ గజతురగము లిమ్మని నేనడిగితినా
పరమాత్మ నీ బంగారుశాలువ పై గొప్పగ నేనడిగితినా
స్మరసుందరవర సంరక్షణ ధనమిమ్మని నిన్నడిగితినా

||సీతా॥

ప్రశస్త భద్రాధీశుడవని ప్రభుత్వమిమ్మని యడిగితినా
దశరథ సుతనీచేత ధరించిన దానకంకణం బడిగితినా
విశదముగా నీమేలిమి మొలనూల్ వేడుకతో నిన్నడిగితినా
ఏలుము భూమిని కుచ్చల నేలకు నెక్కువగా నిన్నడిగితినా

||సీతా॥

26. వరాళి రూపతాళం

పల్లవి : అడుగుదాటి కదలనియ్యను
నాకభయమియ్యక నిన్నువిడువను
గడియ గడియ తిరిగి తిరిగి యడిగితిని వేసరగ వచ్చెను
గడువు దప్పినను నిక బహుదుడుకుతనములు చేయుదునిను

||అడుగు||

కుదురుగ గూర్చుండనియ్యను నీకు కోపమొచ్చిన భయపడను
మరల నెరిగియునింక నీ మొగమాటమేమియు లేదుగద నా
హృదయకమలమునందు నీ మృదుపదములను బంధించి వేయుదు
రేపు మాపని జరిపితే నే నాపుపెసెడి వాడగాను
ప్రాపు నీవనినమ్మి గొలిచిన పావముల నెడబాపి దయతో
తేవతేవక నీదుమోమిటు చూపకుండిన నోర్వసుమ్మి

॥అడుగు||

పతితపావన బిరుదు లేదా నన్ను పరిపాలన చేయరాదా
ప్రతిదినంబును దేవనిను భూపతినటంచును వేడినను నీ
హితజనంబులు వచ్చి నన్ను వేడుకొనినను విడువ నిన్ను

||అడుగు||

రాక్షసాంతక సీతారమణాసారసాక్ష సద్గుణ భక్తాభరణ
యీక్షణంబున దీనజనుడని మోక్షమియ్యక యుంటివెనను
సాక్షిబెట్టియు నేడు నేనొక దీక్షచే సాధింతునిన్ను

॥అడుగు||

భూరిభద్రాచల నివాసరామ భుజగశయన భక్తపోషా
కూరిమిగ నినువిడిచిపెట్టిన ధరణిలో భద్రాద్రిరాఘవ
రామదాసుండనెడి నామము మారుపేరున బిలువు నన్ను

||అడుగు||

27. బేగడ ఆదితాళం

పల్లవి : అని యిట్లురామదాసు డనుకొనుచు సీతారాములకడ కేగెను
పనిబూనిభక్తవత్సల రామచంద్ర నా మనవి చేకొమ్మనెను

||అనియిట్లు||

వినవయ్య నీకు నేవిన్న వింతనొక్క ఘనకార్య మీవేళను
అనువొందనెల్ల రాజ్యము గొనియాడ పాపసముగ వేనోళ్ళను

||అనియిట్లు||

దానపోషణ బిరుదాంక సజ్జనులను గాసి నొందగ జేతురా
ఏసీమనైన దినేశవంశజలిట్లు మోసము చేయుదురా

||అనియిట్లు||

కరి మొరలిడనాడు త్వరగను నేగి మకరినుంచికరిగావవే
పరమపావన రామ చెరసాలనున్న భూసురునేలరక్షింతివో

||అనియిట్లు||

అతిపాపియైన యజామిశునేలి వతడేమి నీ చుట్టమా
పతితపావన రామ భద్రాద్రినిలయ నన్ పాలింపవిది దిట్టమా

||అనియిట్లు||

భద్రగిరీశుడ భక్తులపాలిట పారిజాతంబనుచు
భద్రాత్ముడై యున్న వాడు రామదాసు పాలించెదవనుచు

||అనియిట్లు||

28. ధన్యాసి చాపు తాళం

పల్లవి : అబ్బబ్బా రామ నామమది
సారము లేని సంసారసార మిదే రామనామం
పారద్రోలు మున్నూట ఇరువది భవరోగములన్ని
చేరి పంచేంద్రియములన్ని చేరక పారదోలు నామం
ఘోరమైన యమదూత కొట్టెడి నామం

||అబ్బబ్బా||

దినదినము జిహ్వకింపై దీయగనుండు నామం
ధనకనక వస్తువులు దయచేయు నామం
అసలు కొసలు నొక్క సమాభివృద్ధి చేయునామం
తనువును రెండనుచు తుదిని తారక నామం

||అబ్బబ్బా||

ముక్కంటిసతికి శాశ్వత కీర్తినిచ్చె రామనామం
ఎక్కువైన వాల్మీకి ఋషికి యెప్పుడనుష్ఠానం
ఒక్కసారి రామాయన్న ఓం భూస్వాహా పాపములన్ని
మ్రొక్కి రెండుమారులన్న మోక్షమునకు

||అబ్బబ్బా||

దగ్గర రాముడు మన్మథుడు దవ్వులనుండు
దుష్కర్మలు గొబ్బున మోహపాశముల తెగగోయు నామం
మబ్బుదూరి కొండవంటి మొయిలు ముట్టిన పాపములనే
మినుగురువలె గాల్చును రామనామం

||అబ్బబ్బా||

కామక్రోధలోభమోహ గర్వమడచు రామనామం
స్వామి భద్రాధీశుని నద్దతి నామం
నీమముతో బిలిచిన నితగ మోక్షపదవి నామం
రామదాసు నేలిన శ్రీరామ నామం

||అబ్బబ్బా||

29. వరాళి రూపకతాళం

పల్లవి : అయ్యయ్యూచెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడలేదుగదా
రామయ్య జన్మాలు ఎన్నెన్నో గలవయ్య
చయ్యన రఘుకుల సార్వభౌమ చందాన బ్రోచేవో రామయ్య

వనజనాభుని మాయతెలియకనే వెట్టివగల బొందుచు నుంటిగా కొన్నాళ్ళు
మునుపుజేసిన పుణ్యపాప సంఘములచే మునిగితేలుచుంటిగా కొన్నాళ్ళు
యెనుబడినాలుగులక్ష యోనులందెల్ల వేసరక పుట్టితిని కొన్నాళ్ళు
అనయమున నరకమనుభవించి స్వర్గమంతట జొచ్చితిగ ఓరామ

||అయ్యయ్యో||

ఆలంబనము లేక నాకాశమందున నలసటనొందితిరా కొన్నాళ్ళు
మేలు తెలియగ మిన్నులోపల జిక్కుమినుగక నుంటిగద కొన్నాళ్ళు
ఈలాగుతావచ్చి మేఘమధ్యమునందు నిడుమలపడుచుంటిగా కొన్నాళ్ళు
జాలినొంది సూర్యకిరణములలో జొచ్చి చలనము నొందితిగ కొన్నాళ్ళు

||అయ్యయ్యో ॥

ఓ రామయ్య వర్షములో జిక్కి వసుమతిమీదనే వర్తించు చుంటిగద కొన్నాళ్ళు
వరుసశేషసస్యగతమైన ధాన్యమును వదలి వర్తించితిగదకొన్నాళ్ళు
వరశరుని తేజస్సువల్ల నారీతనువల్ల నోరీగర్భనరకమునబడి యుంటిగ ఓ రామ

||అయ్యయ్యో||

త్రిప్పుడు తిత్తిలోబడి దినము ప్రవర్తిల్లు చుంటిగద కొన్నాళ్ళు
అప్పుడు మాతల్లి యుప్పుపులుపు దిననంగలార్చుచుండ కొన్నాళ్ళు
ఎప్పుడు నిందుండి బదులు వెళుదునని ఎదురుచూచుచుంటిగ కొన్నాళ్ళు
చెప్పరానియట్టి ద్వారములోనుండి జననమునొందితి ఓరామ

||అయ్యయ్యో!|

పొరలుచు దురగాధపొత్తిలో నలిగిరనుచుచు పోనుంటిగద కొన్నాళ్ళు
పెరుగుచు బాల్యావస్థల దినముల పరుగులాడుచుంటి గదకొన్నాళ్ళు
తరుణంతోగూడి మదమత్సరముల కన్నెరుగనైతిగద కొన్నాళ్ళు
తరువాత దారాపుత్రాది మోహములదవిలి వర్తించిగద ఓ రామా

||అయ్యయ్యో||

తలయుతెల్లనై దంతములూడి వణకుచు అడిబడుచుంటిగద కొన్నాళ్ళు
తలుపుదగ్గరచేరి బనిబిక్షుకులనైతి తగిలి దిట్టుచునుంటిగద కొన్నాళ్ళు
పిలిచినదాని పెండ్లాము బిడ్డలచేత నిడుమలబడుచుంటిగద కొన్నాళ్ళు
బలముదీరి కండ్లు పొరలుగప్పి పరుల బ్రతిమాలు చుంటిగద ఓ రామా

||అయ్యయ్యో||

ఆచట మృతినొందియలయుచు యమునిచే నానాబాధ లొంగద కొన్నాళ్ళు
వింతగా నీరీతిపుట్టుచుగిట్టుచు బాధలుపడుచుంటిగద కొన్నాళ్ళు
కంజనయన భద్రాచలపతివగు నిన్ను గనరకతిరిగితిని గదకొన్నాళ్ళు
వింతగనే రామదాసుడనైతి నికనెట్లు బ్రోచెదవో ఓ రామా

||అయ్యయ్యో||

30. అసావేరి ఆదితాళం

పల్లవి : అయ్యయ్యో నే నేరనైతిని
అదినారాయణడని దెలియనైతిని
వెయ్యారుజన్మాల వెతలజెందితిగాని
చయ్యన సద్గతి సాధింపలేనైతిని

॥అయ్యయ్యో॥

మోసమే మదితలచి యుందు
ఆశపాశముల తగిలి నే యుందు
ఆశాపాశములన నరసి బ్రోచి ముందు
వాసిగ వైరాగ్య వాసన గననైతి

|॥అయ్యయ్యో॥

మూడు మేలని నమ్మి యుంటి
నిరుమూఢ శత్రులగూడి యుంటి
మూటి రెంటి మార్చి మూటికెక్కువయైన
కూటస్థు పొడగని కూడలేనైతి

||అయ్యయ్యో||

బంధకములు ద్రుంచి నేను
భద్రగిరి రాఘవుతోను గలిసి నే
సదయుడయి నెలకొన్న శ్రీరామదాసుని
స్థిరముగ చేపట్టి పోషించుమననైతి

॥అయ్యయ్యో॥

మరిన్ని కీర్తనలు:

  1. అసావేరి రూపకతాళం
  2. నాదనామక్రియ ఆదితాళం
  3. కాంభోజి చాపుతాళం
  4. ఆనందభైరవి ఏకతాళం
  5. వరాళి రూపకతాళం
  6. కల్యాణి చాపుతాళం
  7. వరాళి రూపకతాళం
  8. ఆనందభైరవి చాపుతాళం
  9. వరాళి చాపుతాళం
  10. బిలహరి ఆదితాళం

Sai Baba Mantra Pushpam In Telugu – సాయి మంత్రపుష్పం

Sai Baba Mantra Pushpam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో మంత్ర పుష్పం  అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంత్ర పుష్పం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

సాయి మంత్రపుష్పం

ధాతా పురస్తాద్య ముదాజహార, శక్రః ప్ర విద్వాన్ ప్ర దిశ శ్చతస్రః,
తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే.
సహస్ర శీర్షం దేవం – విశ్వాక్షం విశ్వశంభువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్.
విశ్వమే వేదం పురుష – స్తద్విశ్వ ముపజీవతి,
పతిం విశ్వ స్యాత్మే శ్వరగ్ం శాశ్వతగ్ం శివ మచ్యుతం,
నారాయణః పరో జ్యోతి – రాత్మా నారాయణః పరః,
నారాయణః పరం బ్రహ్మ – తత్త్వం నారాయణః పరః,
నారాయణః పరో ధ్యాతా – ధ్యానం నారాయణః పరః,
యచ్చ కించి జ్జగ త్సర్వం దృశ్యతేశ్రయతే 2 పివా,
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః,
అనంత మవ్యయం కవిగ్ం – సముద్రేతం విశ్వశంభువం,
పద్మకోశప్రతీకాశగ్ం – హృదయం చాప్యధోముఖం,
అధో నిష్ట్యాం వితస్త్యాంతే – నాభ్యా ముపరి తిష్ఠతి,
జ్వాలామాలాకులంభాతి – విశ్వ స్యాయతనం మహత్,
సంతతగ్ం శిలాభిస్తు – లంబత్యాకోశసన్నిభం,
త స్యాంతే సుషిరగ్ం సూక్ష్మం – తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితం,
తస్య మధ్యే మహానగ్ని – ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః,
సో గ్రభు గ్వభజ న్తిష్ఠ – న్నాహార మజరః కవిః,
తిర్య గూర్ధ్వ మధ శ్శాయీ రశ్మయ స్తస్య సన్తతా,
సంతాపయతి స్వం దేహ – మాపాదతలమస్తకః,
తస్య మధ్యే వహ్ని శిఖా -అణాయోర్ధ్వా వ్యవస్థితః,
నీలతో యదమధ్యస్థా – విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవారశూకవ తన్వీ – పీతా భాస్వత్యణూపమా,
తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః.
స బ్రహ్మ స శివ స్సహరి స్సేంద్ర – స్సోక్షరః పరమ స్స్వరాట్.
అపాం పుష్పమ్
యోపాం పుష్పం వేద
పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి
చంద్రమా వా అపాం పుష్పం
పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి
య ఏవం వేద
యో పా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అగ్ని ర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి
యో గ్నే రాయతనంవేద, ఆయతనవాన్ భవతి
ఆపో వా అగ్నే రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యే పా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
వాయుర్వా అపా మాయాతనం, ఆయతనవాన్ భవతి
యో వాయో రాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై వాయో రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యో పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అసౌ వై తప న్నపామాయతనం, ఆయతనవాన్ భవతి
యో ముష్య తపత ఆయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వా అముష్య తపత ఆయతనం, ఆయతనవాన్ భవతి

య ఏవం వేద
యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
పర్జన్యో వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి
యః పర్జన్య స్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై పర్జన్య స్యాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యోప్సు నావం ప్రతిష్ఠితం వేద, ప్రత్యేవ తిష్ఠతి,
ఇమే లోకా అప్సు ప్రతిష్ఠితాః త దేషాం భ్యుక్తా,
కిం త ద్విష్ణో ర్బల మాహుః కా దీప్తిః కిం పరాయణం,
ఏ కో యద్ధార య దేవః రేజతీ రోదసీ ఉభే,
వాతా ద్విష్ణో ర్బల మాహుః అక్షర దీప్తి రుచ్యతే,
ప్రతిపదా ధారయ దేవః – య ద్విష్ణో రేక ముత్తమమ్.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,
నమో వయం వైశ్రవణాయ కుర్మహే,
సమే కామాన్ కామకామయ మహ్యం,
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ – మహారాజాయ నమః.
ఓం తద్భహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా,
ఓం త్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః,
అంత శ్చరతి భూతేషు – గుహాయాం విశ్వమూర్తిషు,
త్వం యజ్ఞస్త్వం వషట్కార – స్వ మింద్ర స్వగ్ం రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః, త్వం త దాప అపో జ్యోతీ
రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువ రోమ్.
ఈశాన స్సర్వవిద్యానా – మీశ్వర స్సర్వభూతానాం. – బ్రహ్మాధిపతి
రహ్మణో2 ధిపతి – రహ్మా శివో మే అస్తు సదాశివోమ్.
తద్విష్ణోః పరమం పదగ్ధం – సదా పశ్యంతి సూరయః,
దివీవ చక్షు రాతతం – త ద్విప్రాసో విపన్యవో,
జాగృవాంస స్సమింధతే – విష్ణో ర్య త్పరమం పదమ్.
ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ – పురుషం కృష్ణపింగళం
ఊర్ధ్వ రేతం విరూపాక్షం – విశ్వరూపాయ వై నమోనమః,
నారాయణాయ విద్మహే – వాసుదేవాయ ధీమహి,
తన్నో విష్ణుః ప్రచోదయాత్.
ఆకాశా త్పతితం తోయం – యథా గచ్ఛతి సాగరం,
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి. ఇతి మంత్రపుష్పమ్
పరివార సహిత శ్రీసాయినాధ పరబ్రహ్మణే నమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే’
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమామ్ కృపయాదేవ శరణాగతవత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన.
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఏతత్ఫలం శ్రీ సాయినాధ సమర్పణమస్తు
(చేతిలో ఉదకము వదలవలయును)
శ్రీ సాయినాధ దేవతా ప్రసాదం శిరసాగృష్ణమి.

మరిన్ని:

Sri Mahalakshmi Ashtottara Sathanamavali In Telugu | శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి

Sri Mahalakshmi Ashtottara Sathanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…

Sri Mahalakshmi Ashtottara Sathanamavali In Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి

 

  • ఓం ప్రకృత్యై నమః |
  • ఓం వికృత్యై నమః |
  • ఓం విద్యాయై నమః |
  • ఓం సర్వభూతహితప్రదాయై నమః |
  • ఓం శ్రద్ధాయై నమః |
  • ఓం విభూత్యై నమః |
  • ఓం సురభ్యై నమః |
  • ఓం పరమాత్మికాయై నమః |
  • ఓం వాచే నమః |
  • ఓం పద్మాలయాయై నమః |
  • ఓం పద్మాయై నమః |
  • ఓం శుచయే నమః |
  • ఓం స్వాహాయై నమః |
  • ఓం స్వధాయై నమః |
  • ఓం సుధాయై నమః |
  • ఓం ధన్యాయై నమః |
  • ఓం హిరణ్మయ్యె నమః |
  • ఓం లక్ష్మ్యై నమః |
  • ఓం నిత్యపుష్టాయై నమః |
  • ఓం విభావర్యై నమః |
  • ఓం అదిత్యై నమః |
  • ఓం దిత్యై నమః |
  • ఓం దీప్తాయై నమః |
  • ఓం వసుధాయై నమః |
  • ఓం వసుధారిణ్యై నమః |
  • ఓం కమలాయై నమః |
  • ఓం కాంతాయై నమః |
  • ఓం క్షమాయై నమః | [కామాక్ష్యై]
  • ఓం క్షీరోదసంభవాయై నమః | [క్రోధసంభవాయై]
  • ఓం అనుగ్రహపరాయై నమః |
  • ఓం బుద్ధయే నమః |
  • ఓం అనఘాయై నమః |
  • ఓం హరివల్లభాయై నమః |
  • ఓం అశోకాయై నమః |
  • ఓం అమృతాయై నమః |
  • ఓం దీప్తాయై నమః |
  • ఓం లోకశోకవినాశిన్యై నమః |
  • ఓం ధర్మనిలయాయై నమః |
  • ఓం కరుణాయై నమః |
  • ఓం లోకమాత్రే నమః |
  • ఓం పద్మప్రియాయై నమః |
  • ఓం పద్మహస్తాయై నమః |
  • ఓం పద్మాక్ష్యై నమః |
  • ఓం పద్మసుందర్యై నమః |
  • ఓం పద్మోద్భవాయై నమః |
  • ఓం పద్మముఖ్యై నమః |
  • ఓం పద్మనాభప్రియాయై నమః |
  • ఓం రమాయై నమః |
  • ఓం పద్మమాలాధరాయై నమః |
  • ఓం దేవ్యె నమః |
  • ఓం పద్మిన్యై నమః |
  • ఓం పద్మగంధిన్యై నమః |
  • ఓం పుణ్యగంధాయై నమః |
  • ఓం సుప్రసన్నాయై నమః |
  • ఓం ప్రసాదాభిముఖ్యై నమః |
  • ఓం ప్రభాయై నమః |
  • ఓం చంద్రవదనాయై నమః |
  • ఓం చంద్రాయై నమః |
  • ఓం చంద్రసహోదర్యై నమః |
  • ఓం చతుర్భుజాయై నమః |
  • ఓం చంద్రరూపాయై నమః |
  • ఓం ఇందిరాయై నమః |
  • ఓం ఇందుశీతలాయై నమః |
  • ఓం ఆహ్లాదజనన్యై నమః |
  • ఓం పుస్ట్యై నమః |
  • ఓం శివాయై నమః |
  • ఓం శివకర్యై నమః |
  • ఓం సత్యై నమః |
  • ఓం విమలాయై నమః |
  • ఓం విశ్వజనన్యె నమః |
  • ఓం తుస్ట్యై నమః |
  • ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
  • ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |
  • ఓం శాంతాయై నమః |
  • ఓం శుక్లమాల్యాంబరాయై నమః |
  • ఓం శ్రియై నమః |
  • ఓం భాస్కర్యై నమః |
  • ఓం బిల్వనిలయాయై నమః |
  • ఓం వరారోహాయై నమః |
  • ఓం యశస్విన్యై నమః |
  • ఓం వసుంధరాయై నమః |
  • ఓం ఉదారాంగాయై నమః |
  • ఓం హరిణ్యై నమః |
  • ఓం హేమమాలిన్యై నమః |
  • ఓం ధనధాన్యకర్యై నమః |
  • ఓం సిద్ధయే నమః |
  • ఓం స్త్రైణసౌమ్యాయై నమః |
  • ఓం శుభప్రదాయై నమః |
  • ఓం నృపవేశ్మగతానందాయై నమః |
  • ఓం వరలక్ష్మ్యై నమః |
  • ఓం వసుప్రదాయై నమః |
  • ఓం శుభాయై నమః |
  • ఓం హిరణ్యప్రాకారాయై నమః |
  • ఓం సముద్రతనయాయై నమః |
  • ఓం జయాయై నమః |
  • ఓం మంగళా దేవ్యె నమః |
  • ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః |
  • ఓం విష్ణుపత్న్యై నమః |
  • ఓం ప్రసన్నాక్ష్యై నమః |
  • ఓం నారాయణసమాశ్రితాయై నమః |
  • ఓం దారిద్య్రధ్వంసిన్యై నమః |
  • ఓం దేవ్యె నమః |
  • ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
  • ఓం నవదుర్గాయై నమః |
  • ఓం మహాకాల్యె నమః |
  • ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః |
  • ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
  • ఓం భువనేశ్వర్యై నమః |

మరిన్ని అష్టోత్తరలు:

Krishna Ashtakam In Telugu – కృష్ణాష్టకమ్

Krishna Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు కృష్ణాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Krishna Ashtakam Lyrics Telugu

కృష్ణాష్టకమ్

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్,
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్.

1

అతసీపుష్పసంకాశం, హారనూపురశోభితమ్,
రత్నకంకణకేయూరం, కృష్ణం వందే జగద్గురుమ్.

2

కుటిలాలకసంయుక్తం, పూర్ణచంద్రనిభాననమ్,
విలసత్కుండలధరం, కృష్ణం వందే జగద్గురుమ్.

3

మందారగంధసంయుక్తం, చారుహాసం చతుర్భుజమ్
బర్హిపింఛావచూడాంగం, కృష్ణం వందే జగద్గురుమ్.

4

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం, నీలజీమూతసన్నిభమ్,
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుమ్.

5

రుక్మిణీకేళిసంయుక్తం, పీతాంబరసుశోభితమ్,
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్.

6

గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసమ్,
శ్రీనికేతం మహేష్వాసం, కృష్ణం వందే జగద్గురుమ్.

7

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్,
శంఖచక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురుమ్.

8

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్,
కోటిజన్మకృతం పాపం, స్మరణేన వినశ్యతి.

ఇతి శ్రీకృష్ణాష్టకం సంపూర్ణమ్

మరిన్ని అష్టకములు

Adivishnu Vitande Yataramma In Telugu – ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా

ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
సంఖ్య : 193
పుట : 130
రాగం : లలిత

లలిత

21 ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
ఆదిగొని భూభార మణఁచీనోయమ్మా.

||పల్లవి||

చందురునుదయవేళ సవరేతిరి కాడ
కందువ దేవకి బిడ్డఁ గనెనమ్మా
పొందుగ బ్రహ్మాదులు పురుఁటింటి వాకిటను
చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా.

|| ఆది ||

వసుదేవునియెదుట వైకుంఠనాథుఁడు
సిసువై యవతరించి చెలఁగీ నమ్మా
ముసిముసినవ్వులతో మునులకు ఋషులకు
యిసుమంతవాఁ డభయమిచ్చీనమ్మా.

|| ఆది ||

కన్నతల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
అన్నిటా రాకాసిమూఁక అణఁచీనమ్మా
వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితొడ
పన్ని నిచ్చకల్యాణాలఁ బరిగీనమ్మా.

|| ఆది || 193

అవతారిక:

భూభారాన్ని తగ్గించడానికి భువిపై అవతరించిన ఆదివిష్ణువే ఈ కృష్ణుడు అని ఆ అవతార విశిష్టతను కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు.

సవరేతిరి అంటే అర్ధరాత్రి అని అర్థం. సిసువు అంటే శిశువు అని అర్థం. కన్నతల్లిదండ్రుల కర్మబంధాలను పటాపంచలు చేశాడట ఆయన. రాకాసి మూకలు అంటే రాక్షసులగుంపు అని అర్థం. ఈ కృష్ణయ్యే కలియుగంలో శ్రీవేంకటాద్రిపై అలమేల్మంగమ్మతో వెలసి నిత్యకళ్యాణాల చక్రవర్తియై శోభలీనుతున్నాడు అంటున్నారు. ‘ఆదికొనుట’ అంటే కన్నువేయటం అని అర్థం.

భావ వివరణ:

ఓ అమ్మలారా! ఈతడే ఆదివిష్ణువట. ఈ మహానుభావుడు, ఆదిగొని (కన్నువేసి… అంటే… నిశ్చయించుకొని) భూభారము నణచినాడమ్మా!

చందురునుదయవేళ (చంద్రుడు వుదయించుచున్న సమయమున) సవరేతిరి కాడ (అర్థరాత్రి తరుణమున) దేవకీదేవి, కందువ బిడ్డ గనెనమ్మా! (సామర్థ్యముగల శిశువునకు జన్మనిచ్చింది. బ్రహ్మాది దేవతలు అప్పుడు పొందుగా (ఉద్ధతితో) ఆ పురిటింటి గుమ్మంలో నిలబడి ఆ బాలుని స్తోత్రించినారోయమ్మా!

అనంతరం వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు వసుదేవుని యెదుట సిసువుగ (శిశువుగా) అవతరించి చెలగీనమ్మా (కనువిందుజేయు చున్నాడమ్మా!) అప్పుడు ఆ యిసుమంత శిశువు ముసిముసినవ్వులు విరజిమ్ముతూ తనను చూడవచ్చిన మునీశ్వరులకు ఇకపై భయమువలదు అని వారికి అభయమునొసగినాడు ఓయమా! ఏమి ఆశ్చర్యము!!

అప్పుడా శిశువు తన కన్నతల్లిదండ్రులకు వారి గతజన్మల పుణ్య విశేషమును వివరించి తను వారి గర్భమున జన్మించిననూ వారి కర్మఫలము వలన తన బాల్యమును జూచు అదృష్టము వారికి లేదనీ, తిరిగి తను పెద్దవాడయ్యాక జీవితాంతము తనతోనే గడుపుదురని వివరించి వారికి కర్మపాశము నుండి విముక్తి కలిగించెను. ఆ బాలుడే అన్ని విధములైన రాకాసి మూకలను చీల్చి చెండాడినాడు. నేడు ఆతడే శ్రీవేంకటాద్రిపై లక్ష్మీదేవితో నుండి, వున్నతముగా పూని నిత్యకళ్యాణములు జరుపుకొంటూ, పరగీనమ్మా! (వెలయుచున్నాడమ్మా!).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Ahankaram Vivasa Hetuvu In Telugu – అహంకారం వివాశహేతువు

Ahankaram Vivasa Hetuvu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అహంకారం వివాశహేతువు నీతికథ.

అహంకారం వివాశహేతువు

(ఉద్యోగపర్వంలో కథ యిది. కృష్ణుడు రాయబారానికివచ్చి తను చెప్పవలసిన హితవు చెప్పాడు. అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధ)

నాయనా! దుర్యోధనా !
నీకూ, నీ వారికి సర్వప్రపంచానికి మేలుకలిగే విషయం చెపు తున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను.

చాలారోజుల క్రితంమాట.

దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతనూ పాలించేవాడు. భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటివచ్చేవారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధు

ఆయనరోజూ ఉదయంలేచి, కాలకృత్యాలు పూర్తికాగానే బాగా అలంకరించుకొని రత్న కిరీటం ధరించి, కోడెత్రాచువంటి కరవాలంచేత బట్టి సభాభవనానికి వచ్చి బంగారుసింహాసనం అధివసించేవాడు.

వంది మాగధులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తూంటే, కోరమీసం మెలి త్రిప్పుతూ ఆనందించేవాడు.

అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ:

ఈ భూలోకంలో ఎవడయినా నాతో యుద్ధం చేయగల మహావీరు డున్నాడా ! గదా, ఖడ్గ ప్రాసాది ఆయుధాలతోకాని, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతోకాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు మల్లయుద్ధం చేయగల వీరుడు ఉన్న వాడిని క్షణంలో కడ తేరుస్తాను.

అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు.
ఆయన బలపరాక్రమాలెరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కారు.

అంతతో ఆయన అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంతవాడు లేడనే గర్వంతో అయిన విర్రవీగుతూ తిరుగు తున్నారు.

అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులుకూడా అటువంటి దొరుకుతారుకదా!

వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు.

అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు –
మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలవరా తమ సంపన్నులే.
అయితే
గంధమాదనపర్వతంమీద వర నారాయణులని ఇద్దరు తీవ్రనిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడులోకాలలో లేరని విన్నాము. తమకు కోరికఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు.

ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జళిపించి నేలమీద పాదంతో తొక్కి

ఎంతకావరం ! నన్నుమించిన యోధులా వారు, అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు. గంధమాడన పర్వతం చేరాడు.

ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం త్రిప్పాడు.

నర నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరుపబోగా :

ఇవన్నీ అనవసరం, యుద్ధం, యుద్ధం అని అట్టహాసం చేశాడు.
అప్పుడు వారు:

ఎవరితోనూ సంబంధంలేకుండా కళ్ళుమూసుకుని యీ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే ముములం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు, అన్నారు.

వినలేదు మహారాజు.
యుద్ధం చెయ్యకతప్పదు, అన్నాడు.
అంటూనే బాణం తొడుగుతూంటే చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి

ఇదిగో ఈ గడ్డిపరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు.

ఆరాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది.

ఈలోగా సేనలోని వారందరూ ముక్కులూ, చెవులూ ఊడిపోయి రోదనం ఆరంభించారు.

రాజుకి తల తిరిగింది.
సేవలు పలాయనం చేస్తున్నాయి
చూసిన రాజుకి గుండె జారింది.
ఆయుధాలన్నీ క్రింద పెట్టి, తలవంచి నర నారాయణుల పాదాల మీద వ్రాలి:

ఆర్యా ! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయ శ్చిత్తం అయింది, అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ ! మహారాజా

సిరి సంపదలు కలవారు పేద సాదలకు దాన ధర్మాలు చేసి గొప్ప వారు కావాలి.
అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారినుండి పజ్జను లను రక్షించడానికి తమశక్తిని వినియోగించాలి. అంతేకాని, అహం కారంతో తిరగరాదు.

ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మవ్యర్థం- అన్నారు.

మహారాజు వారి బోధవిని, ఆనాటినుంచీ అహంకారం విడిచి, అందరి శ్రేయస్సూ దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జనసేవచేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు.

కనక, దుర్యోధనా !
అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి, అన్నాడు పరశురాముడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Uma Maheshwara Ashtakam In Telugu – ఉమామహేశ్వరాష్టకమ్

ఉమామహేశ్వరాష్టకమ్ (Umamaheswarashtakam)

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమామహేశ్వరాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Uma Maheshwara Ashtakam Lyrics

ఉమామహేశ్వరాష్టకమ్

పితామహ శిరచ్ఛేద ప్రవీణ కరపల్లవ,
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః

1

నిశుంభశుంభప్రముఖదైత్య శిక్షణదక్షిణే,
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

2

శైలరాజస్య జామాత శ్శశిరేఖావతంసక
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

3

శైలరాజాత్మజే మాత శ్శాతకుంభనిభ ప్రభే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

4

భూతనాథ పురారాతే భుజంగామృతభూషణ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

5

పాదప్రణతభక్తానాం పారిజాతగుణాధికే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

6

హాలాస్యేశ దయామూర్తే హాలాహల లసద్గళ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

7

నితంబినీ మహేశస్య కదంబవననాయికే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

8

మరిన్ని అష్టకములు

Gayatri Nitya Pooja Vidhanam In Telugu – గాయత్రీ నిత్య పూజా విధానము

Gayatri Nitya Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గాయత్రీ నిత్య పూజా విధానము గురించి తెలుసుకుందాం.

గాయత్రీ నిత్య పూజా విధానము

ఓం గణేశాయ నమః

గాయత్రీ నిత్య పూజా విధానము (శ్రీ సూక్త ప్రకారము)
ముందుగా మడిబట్టలు కట్టుకుని, తూర్పుముఖంగా చిత్రాసనముపై ఉపవిష్ణులై – బాహ్యాభ్యంతరాల శుచి నిమిత్తముగా కాసిని నీళ్లు కుడిచేతిలో పోసుకుని –

మార్జనం

శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
యఃస్మరే త్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః |
అని చెప్పుకుంటూ – ఆ నీళ్లను శిరస్సుపై ప్రోక్షించు కోవలెను.

ఆచమనం

అటుపిమ్మట ఆచమించవలెను. కుడి చేతిని గోకర్ణమువలె మడిచి, ఎడమ చేతితో ఉద్ధరిణెడు నీళ్లు అందులో పోసుకుని

  1.  “ఓం కేశవాయస్వాహా” అనుకుని లోనికి తీసుకొనవలెను. ఆ నీళ్లు బొడ్డు వరకు చేరిన పిదప మరియొక ఉద్ధరిణెడు జలము తీసుకుని
  2. “ఓం నారాయణాయ స్వాహా” అని లోనికి పుచ్చుకొనవలెను. తదుపరి యింకొక ఉద్ధరిణెడు నీళ్లను తీసుకుని
  3. “ఓం మాధవాయ స్వాహా” అని లోనికి స్వీకరించవలెను పిదప
  4. “ఓం గోవిందాయ నమః”
  5. “విష్ణవే నమః” అని చెప్పుకొనుచూ ఎడమ అరచేతితో కుడి అరచేతిని, కుడి అరచేతితో ఎడమ అరచేతిని తుడుచుకొనవలెను. అటుపైన
  6. “ఓం మధుసూదనాయ నమః”
  7. “ఓం త్రివిక్రమాయ నమః” అని చెప్పుకొనుచు కుడి బొటన వ్రేలితో ముందుగా పై పెదవినీ, పిదప క్రింద పెదవిని తుడుచుకొనవలెను.
  8. “ఓం వామనాయ నమః”
  9. “ఓం శ్రీధరాయ నమః” అను రెండు నామముల నుచ్చరించుచు తలపై జలమును ప్రోక్షించుకొనవలెను. తరువాత
  10. “ఓం హృషీకేశాయ నమః” అని ఎడమ అరచేతిలోనూ
  11. “ఓం పద్మనాభాయ నమః” అని రెండు పాదముల పైనను
  12. ” ఓం దామోదరాయ నమః” అని తలపైననూ కొంచెము ఉదక ప్రోక్షణము కావించుకొనవలెను. అనంతరము
  13. “ఓం సంకర్షణాయ నమః” అని వ్రేళ్లు ముడిచి గడ్డమును
  14. “ఓం వాసుదేవాయ నమః” అని కుడిచేతి నడిమి వ్రేలితో ఎడమ ముక్కును
  15. “ఓం ప్రద్యుమ్నాయ నమః” అని బొటన వ్రేలితో కుడి నాసికను తాక వలెను. పిమ్మట
  16. “ఓం అనిరుద్ధాయ నమః” అని యెడమ కన్నును
  17. “ఓం పురుషోత్తమాయ నమః” అని కుడి కన్నును నీటితడితో తుడుచుకొనవలెను.
  18. “ఓం అధోక్షజాయ నమః” అని ఎడమ చెవినీ
  19. “ఓం నారసింహాయ నమః” అని కుడి చెవినీ, తాకవలెను.
  20. “ఓం అచ్యుతాయ నమః” అనుకొని చిటికెన వ్రేలితో నాభిని స్పృశించవలెను.
  21. “ఓం జనార్దనాయ నమః” అని కుడి అరచేతితో వక్షస్థలము నదుముకొనవలెను.
  22. “ఓం ఉపేంద్రాయ నమః” అని వ్రేళ్ల కొసలతో శిరమును స్పృశించుకొనవలెను.
  23. “ఓం హరయే నమః” అని కుడి చేతి వ్రేళ్లు చుంచువువలె ముడిచిగాని, విప్పారగా గాని – ఎడమ కుడి భుజములను తాకవలెను. (కొందరు ఎడ మ చేత కుడి మూపును, కుడిచేత ఎడమ మూపును ‘ ఆకారముగా తాకుటయు ప్రచారమున గలదు) పిదప
  24. “శ్రీకృష్ణాయ నమః” అని కొంచెము నీరు ఒక చిన్న పళ్లెరములో విడిచి నమస్కరించుకొనవలెను.

భూశుద్ధి

తదుపరి కాసిని అక్షింతలు చేతబట్టుకుని
శ్లో॥ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
అని చెప్పుకుని, ఆ అక్షతలు వాసనచూసి వెనుక వైపునకు వేసుకొన వలెను.

ప్రాణాయామం

పిదప ముక్కుపట్టుకుని “ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః – ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్।

ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం”

అను మంత్రమును శ్వాస బంధించి ముమ్మారు పఠించవలెను. దీనినే ప్రాణాయామ మందురు. యధాశక్తి నిట్లొనరించిన తరువాత సంకల్ప ము చెప్పుకొనవలెను.

Gayatri Nitya Pooja

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ సవితా దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వ తమన్వంతరే కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే, మేరో ర్ధక్షిణదిగ్భాగే, గంగాగోదావర్యోర్మద్యదేశే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ్, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన… నామసంవత్సరే… అయనే… ఋతౌ… మాసే… పక్షే…. తిధౌ…. వాసరే, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీ… గోత్రోత్పన్నోహం…. నామథే యోహం మమ సమస్తారిష్ట నిరసన పూర్వకం, అధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక త్రివిధ తాప పాపోపశమనార్థం, సకల కామనా సిద్ధ్యర్థం శ్రీ సవితా దేవతా ప్రీత్యర్థం శ్రీ గాయత్రీ పూజనం కరిష్యే.

గణాధిపతి పూజ

ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతిం స్మరామి –

శ్లో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే |
సుముఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ।
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబోస్కందపూర్వజః |
షోడశైతాని నామాని యఃపఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకుని కాసిన్ని అక్షింతలు నీటితో
ఏదైనా ఒక పళ్లెములో విడువవలెను.

శాంతిపాఠం

“ఓం సహనా వవతు సహనౌ భునక్తు

అంగన్యాసం

1. ఓం తత్ సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః – చేతిని హృదయ స్థానమందుంచుకొనవలెను.
2. ఓం వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా తల మాడుపట్టును స్పృశించుకొనవలెను.
3. ఓం భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయైవషట్ – జుట్టుముడి (ప్రస్తుతము ముడి ఆచారములో లేదు గావున జుట్టు)ని తాకవలెను.
4. ఓం ధీమహి సత్యాత్మనే కవచాయహుం – రెండు భుజములను తాకవలెను.
5. ఓం ధియోయో నః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ – బొటన వ్రేలితో కుడికన్ను, ఉంగరం వ్రేలితో ఎడమకన్ను, నడిమి వ్రేలితో భృకుటి స్థాన మును ఏకకాలమున తాకవలెను.
6. ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయఫట్ కుడి చేతిని తలచుట్టూ త్రిప్పి ఎడమ చేతిలో చప్పుడగునట్లు (చప్పట్టు) కొట్టవలెను. పిదప “భూర్భువస్సువరోమితి దిగ్బంధః” అనుకొనవలెను.

ధ్యానం

శ్లో। యోదేవ స్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః
ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే |

శ్లో। భక్తలోభం భాస్కరాభం బ్రహ్మాండరాజ్యప్రదాం
సృష్టిస్థితి లయాధారాం ధ్యాయామి మమ మాతరం !

ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీగాయత్రీదేవ్యై నమః, ధ్యానం సమర్పయామి.

ఆవాహనం

మంత్రం :
ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిర ణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ |

శ్లో। సవితృమండలావాసం పవిత్రీకృతృపంచకం
ఇహాగచ్ఛ మహాదేవీ గాయత్రీ కరుణాయుతాం |

సాంగం – సాయుధం సవాహనం సశక్తిం ససర్వకళాం – భర్తృ పుత్రాశ్రిత పరివార సమేతం శ్రీ గాయత్రీ మహామాతా మావాహయామి. ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః ఆవాహనం సమర్పయామి.

ఆసన సమర్పణం

మంత్రం :
ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం |

శ్లో॥ సూర్యకోటి నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
సింహాసన మిదం దేవీ స్వీయతాం సురసేవితే |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి. (రత్న సింహాసన మీయ లేనివారు, లేదా, అదీ లభ్యం కాని పక్షంలో “తతాభావేన అక్షతాన్ సమర్పయామి” అని చెప్పుకుని – అక్షతలను అమ్మవారి ముందు వుంచవలెను).

అర్ఘ్యం

మంత్రం :
ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియందేవీ ముప హ్వయే శ్రీర్మాదేవీ జుషతాం |

శ్లో॥ గంధపుష్ప సమాయుక్తం సర్వేషాం ప్రీతిదాయకం
అర్ఘ్యం గృహాణత్వం దేవీ సిద్ధచారణ సేవితాం |
ఓం భూర్భువస్స్వః శ్రీగాయత్రీ దేవ్యై నమః హస్తయో రర్ఘ్యం సమర్పయామి (అని కొంచెము నీరు సమర్పించవలెను)

పాద్యం

మంత్రం :
ఓం కాంసోస్మితాం హిరణ్యప్రాకారా మార్ధం
జ్వలంతీన్ తృప్తాం తర్పయంతీం !
పద్మేస్థితాం పద్మవర్ణాన్ తా
మిహోపహ్వయే శ్రియం |

శ్లో॥ సర్వతీర్థ సమానీతం జలం రమ్యం సువాసితం
పాద్యం గృహాణ దేవేశి బ్రహ్మాది ర్యభివందితే ||
ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః పాదయోః
పాద్యం సమర్పయామి (ఒక పువ్వుతోగాని, తమలపాకుతోగాని రవ్వంత జలం సమర్పించవలెను)

ఆచమనం

మంత్రం :
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం
శ్రియం లోకే దేవ జుష్టాముదారాం ॥
తాం పద్మినీమీం శరణ మహం ప్రపద్యే
అలక్ష్మీర్మే నశ్యతాన్ త్వాం వృణే !

శ్లో। సువర్ణ కలశానీతం చందనాగురు సంయుతం
గృహాణాచమనం దేవీ సర్వదేవ నమస్కృతే |

ఓం భూర్భువస్స్వః భగవత్వై శ్రీగాయత్రీ దేవ్యై నమః ఆచమనం సమర్ప యామి (ఉద్ధరిణెడు నీళ్లు సమర్పించవలెను)

మధుపర్కం

మంత్రం :
ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో
వనస్పతి స్తవవృక్షోధ బిల్వః
తస్యఫలాని తపసానుదంతు
మాయాంత రాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ।

శ్లో। స్వర్ణపాత్రే సమానీతం దధిఖండ మధుప్తుతం
మధుపర్కం గృహాణేదం మయాదత్తం సురేశ్వరీ |
ఓం భూర్భువస్స్వ ః – భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః మధు పర్కం సమర్పయామి.

పంచామృత స్నానం

మంత్రం :
ఓం ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ ప్రాదుర్భూతోస్మి రాస్ట్రేస్మిస్ కీర్తి మృద్ధిం దదాతుమే |

శ్లో। పంచామృతం మయానీతం పయోదధిఘృతం మధు
శర్కరా సహితం దేవీ స్నానార్థం ప్రతిగృహ్యతాం ।

ఓం భూర్భువస్స్వః – భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. (ఒక పువ్వును పంచామృతములలో ముంచి అమ్మ వారిపై చిలకరించవలెను).

శుద్ధోదక స్నానం

మంత్రం :
ఓం క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠా మలక్ష్మీర్నాశయామ్యహం
అభూతి మసమృద్ధించ సర్వాన్ నిరుదమే గృహాత్ |

శ్లో! గంగా గోదావరీ కృష్ణా పయోష్వాద్వాపగా స్తధా
ఆయాస్తుతాన్సదాదేవ్యా గాయత్రీ స్నానకర్మణి |

ఓం భూర్భువస్స్వః – భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః స్పపయామి. శుద్ధోదకస్నానం సమర్పయామి. (అని కొంచెము నీరు చిలికి) ‘స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి’ అని అనుకుని మరల కొంచెము నీరు పళ్లె ములో విడువలెను.

గంధ – వస్త్ర – కంచుక – ఆభరణములు

మంత్రం :
ఓం గంధద్వారాం ధురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం |
మనసః కామమాకుతిం – వాచస్పత్యమశీమహే
పశూనాగ్ం రూపమన్నస్య మయిశ్రీ శ్ర్మయతాం యశః |
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం ।

శ్లో॥ శ్రీగంధం చందనోన్మిశ్రం కుంకుమాగరు సంయుతం
కర్పూరేణచ సంయుక్తం – విలేపనం సురేశ్వరి |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః చందనం సమర్ప యామి – అని, కుడిచేతి మధ్య మాంగుళితో రవ్వంత గంధం అమ్మవారిపై చిలకరించాలి.

శ్లో॥ దుకూలం స్వీకురుష్వేదం స్వర్ణబిందు సమాయుతం
ఉత్తరీయం కంచుకంచ తదావిధ మతంద్రితే |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః కంచుక సహిత వస్త్రం సమర్పయామి – అని చీర రవికెలగుడ్డ సమర్పించవలెను. అలా సమ ర్పించుకొనలేని పక్షంలో – ‘త దభావేన అక్షతాన్ సమర్పయామి’ అని చెప్పు కుని, కాసిన్ని అక్షతలు భక్తితో అమ్మవారి పాదముల వద్ద వుంచవలెను.

శ్లో। కేయూరైః కంకణై ర్దివ్యై హారనూపురమేఖలా
విభూషణా న్యమూల్యాని గృహాణ పరమేశ్వరి |
ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః సంభవితాన్ సర్వాభరణాని (అవి లభించని యెడల – త దభావేన అక్షతాన్) సమర్ప యామి (అక్షతలు, నీళ్లు విడువవలెను)

Gayatri Nitya Pooja pdf

యజ్ఞోపవీతం

మంత్రం :
ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే |

శ్లో॥ తప్త హేమకృతం సూత్రం గృహాణత్వం శుభప్రదే
ఉపవీతమిదం దేవీ – ముక్తాదామ సుభూషితం ।

అథాంగపూజా

(పసుపు కుంకుమ పువ్వులు అక్షతలతో పూజించవలెను)
ఓం నటనాట్యైక నిరతాయై నమః – పాదౌ పూజయామి
ఓం బ్రహ్మణ్యమూర్యై నమః – గుల్ఫౌ పూజయామి
ఓం జగదాధారిణ్యై నమః – జంఘా పూజయామి
ఓం రేవాతీరనివాసిన్యై – జానునీ పూజయామి
ఓం తరుణాదిత్య సంకాశాయై నమః – ఊరూ పూజయామి
ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః – కటిం పూజయామి
ఓం భవాతీతాయై నమః – జఘనం పూజయామి
ఓం గంభీరనాభ్యై నమః – నాభిం పూజయామి
ఓం తురీయపదగామిన్యై నమః – ఉదరం పూజయామి
ఓం లోకమాత్రే నమః – స్తనౌ పూజయామి
ఓం విశాలవక్షస్థలాయై నమః – వక్షస్థలం పూజయామి
ఓం విచిత్రమాల్యాభరణాయై నమః – కంఠం పూజయామి
ఓం స్కందజనన్యై నమః – స్కంధౌ పూజయామి
ఓం మహాబాహవే నమః – బాహూన్ పూజయామి
ఓం వరదాభయహస్తాభ్యాయై నమః – హస్తా పూజయామి
ఓం శ్రోత్రియబంధూయై నమః – శ్రోత్రే పూజయామి
ఓం వేదమాతాయై నమః – వక్త్రం పూజయామి
ఓం నాసాంచితమౌక్తికాయై నమః – నాసికాం పూజయామి
ఓం అరుణబింబోష్ఠాయై నమః – ఓషౌ పూజయామి
ఓం త్రినేత్రధారిణ్యై నమః – ఫాలం పూజయామి
ఓం చంద్రమండలమధ్యస్థాయై నమః – చికురం పూజయామి
ఓం సర్వోత్క ృష్టాయై నమః – శిరః పూజయామి
ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి.

శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి

ధూపం – దీపం

మంత్రం :
ఓం ఆర్ధాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ||

శ్లో॥ వనస్పతి రసైర్దివ్యైర్గంధాడ్యైః సుమనోహరైః
కపిలాఘృత సంయుక్తో ధూపోయం ప్రతిగృహ్యతాం |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః ధూపమాఘ్రాప యామి. సాంబ్రాణి – సాంబ్రాణి కడ్డీలు / అగరొత్తులు / ఊదొత్తులు – గాని వెలిగించి అమ్మవారికి చూపవలెను.

శ్లో॥ గణచ్చక్షు స్వరూపంచ ప్రాణరక్షణకారకం
ప్రదీప్తం శుద్ధరూపంచ – గృహ్యతాం పరమేశ్వరీ |

ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః దీపం దర్శయామి.

నైవేద్యం

మంత్రం :
ఓం తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాహిరణ్యం ప్రభూతం గావోదా స్యోశ్వాన్విన్దేయం పురుషానహం |

శ్లో। నానోపహార రూపంచ నానా రస సమన్వితం
నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతాం |

మంత్రం :
‘ఓం భూర్భువస్స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్
అనుకొనుచూ – పువ్వుతోగాని, తమలపాకుతోగాని – నివేదింపబడే పదార్థము లపై జలమును ప్రోక్షించి ‘సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు | అమృతోపస్తరణమసి’ అంటూ –

నీరు చిలికి –
ఆ పదార్ధములచుట్టూ ఔపోసనవిధిగా
1. ఓం ప్రాణాయస్వాహా,
2. ఓం అపానాయస్వాహా
3. ఓం వ్యానాయ స్వాహా
4. ఓం ఉదానాయ స్వాహా
5. ఓం సమానాయ స్వాహా అని చెప్పు చూ
5 పర్యాయములు నివేదనమును గాయత్రీ దేవికి కైవోలు చేయవలెను. పిదప –
“మధ్యే మధ్యే పానీయం సమర్పయామి” అని – ఒకటి, రెండు చుక్క ల నీరును పదార్థములపై ప్రోక్షించవలెను.

తదనంతరం –
“ఉత్తరాపోశనం సమర్పయామి” అని ఒకమారు
“హస్తా ప్రక్షాళయామి” అని యొకమారు
“పాదౌ ప్రక్షాళయామి” అని యొకమారు
“శుద్ధాచమనీయం సమర్పయామి” అని యింకొక మారునూ వెరసి నా లుగు పర్యాయాలు నీరు సమర్పించాలి.

తాంబూలం

మంత్రం :
ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణందధాతి
మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతే |
ఏకదైవయజమాన ఆయుస్తేజో దదాతి
సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యగం
రాజ్యం మహారాజామాధిపత్యం |

శ్లో। తాంబూలం వరం రమ్యం కర్పూరాది సమన్వితం జిహ్వజాడ్య భేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం ! ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి. అమ్మవారి పాదములచెంత తమల పాకులూ వక్కలూ వుంచవలెను.

నీరాజనం

మంత్రం :
ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే |
సర్వాణి రూపాణి విచిత్ర ధారః
నామాభి కృత్వాభి వదనం యదాస్తే |

శ్లో। నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహందేవీ – గృహ్యతాం దివ్యరూపిణీ |
ఓం భూర్భువస్స్వః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః కర్పూర నీరాజ నం సమర్పయామి అని కర్పూరం వెలిగించి అమ్మవారికి ప్రదక్షిణ పూర్వ కముగా చూపుచూ గంట వాయించవలెను.

“కర్పూర నీరాజనానంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి” అనుచూ – పువ్వుతో ఒక బొట్టు నీరును అమ్మవారి వద్ద ఉంచాలి. అనంతరం కొన్ని అక్షతలూ, పువ్వులూ, చిల్లర డబ్బులూ చేతితో పట్టు కుని సువర్ణ మంత్ర పుష్పమును పఠించవలెను.

సువర్ణ మంత్ర పుష్పము

ఓం హిరణ్య గర్భ గర్భస్థం హేమబీజం విభావసో
అనంతం పుణ్యఫలదం అతశ్శాంతిం ప్రయచ్ఛమే |

జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతివేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం, గాయత్రీం దేవీగ్ం శరణ మహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నేత్వం పారయా నవ్యో అస్మానథ్స్వస్తి భిరతి దుర్గాణి విశ్వాపూశ్చ పృథివీ బహులాస ఉర్వీ భవాతో కాయ తనయాయ శంయోః విశ్వానినో గాయత్ర్యా జాత వేదస్సింధుం ననావాదురి తాతి పర్షి అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బోధ్య వితాతనూనామ్ పృతనాజితగ్ం సహ మాసముగ్రమ గ్నిగ్రాంహువేమ పరమాత్సధస్థాత్ సనఃపర్షదతిగాయత్ర్యా విశ్వాక్షామద్దేవో అతి దురితాత్యగ్నిః ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతానవ్యశ్చ స్సత్సి స్సాం చాగ్నే తనువంపిప్రయస్వాస్మభ్యఞ్చ సౌభగమాయజస్వ। గౌభిర్జుష్ట మయుజో నిషఙక్తం తవేంద్ర విష్ణో రను సంచసఞ్చరేమ ! నాకస్య పృష్ఠ మభిసంవసానో వైష్ణవీంలోక ఇహమాదయంతామ్ |

శ్లో॥ కాత్యాయనాయ విద్మహే
కన్యకుమారి ధీమహి
తన్నో దేవీః ప్రచోదయాత్ |

శ్రీ గాయత్రీదేవ్యై నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.

సాష్టాంగ నమస్కారము

శ్లో॥ ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తధా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే |
శ్రీ గాయత్రీ దేవ్యై నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి.

ఆత్మప్రదక్షిణ నమస్కారం

శ్లో। యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
శ్రీ గాయత్రీ దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సర్వోపచారాః

ఛత్రం ధారయామి | చామరం విజయామి | గీతం శ్రావ్యయామి |
ఇత్యాదిః సమస్త దేవ్యోపచార పూజాం సమర్పయామి.

శ్లో। యద్యద్రవ్యమపూర్వంచ పృధివ్యా మతిదుర్గభమ్
దేవభూపార్హ, భోగ్యంచ తద్రవ్యం త్వం సంగృహ్యతామ్ శ
్రీ గాయత్రీ దేవ్యై నమః సర్వోపచారాన్ సమర్పయామి.

క్షమా ప్రార్ధన

శ్లో। అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా |
దాసో హమితిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి |

శ్లో। ఆవాహనం నజానామి నజానామి విసర్జనం |
పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి |

శ్లో। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పఠేశ్వరి
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే॥

అనయా మయాకృత పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ సుప్రీతా సుప్రసన్నా వరదాభవన్తు
(అని అక్షతలు నీళ్లు పళ్లెరములో విడువవలెను)

శ్రీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ నిత్యపూజా విధానము సమాప్తం.
ఏతత్సర్వం శ్రీ గాయత్రీ దేవతార్పణమస్తు.

మరిన్ని పూజా విధానాలు: