కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో జగములేలేవాడవు జనార్దనుడవు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
22 జగము లేవాఁడవు జనార్దనుఁడవు
తగ నీవారమై (మే?) నేము ధర నెట్టుండినాను,
||పల్లవి||
గతి నీవు మతి నీవు కాణాచిచోటు నీవు
సతమై యన్నిటికిని సాక్షివి నీవు
చతురత వలసితే జరతుము కొలుతుము
తతి నేము సేసినతప్పులు లోఁగొనవే.
॥జగ||
తల్లియుఁ దండ్రివి నీవు దాత దైవమవు నీవు
యెల్లవారికిఁ బరము నిహము నీవు
మల్లడి నొక్కొకవేళ మఱతుము తలఁతుము
చల్లఁగా మానేరములు సైరించుకొనవే.
॥జగ||
దరి నీవు దాపు నీవు దయామూర్తివి నీవు
పరగ శ్రీవేంకటేశ పతివి నీవు
విరివిగా నేమైనా వేఁడుదుము నుతింతుము
శరణుచొచ్చితి మిఁక క్షమియించుకొనవే.
||జగ|| 229
అవతారిక:
జనుల ‘అర్ధన’ (వేడికోలు) వినేవాడు జనార్దనుడు. “దేవా! నీవు జనార్దనుడవై జగము లేలుతుంటే, మేము నీవారమై, నీదాసులమై ఈలోకంలో పూనికతో వుంటామయ్యా!” అని కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. మా తల్లియు దండ్రియును దాతయునూ నీవే ప్రభూ! “అన్యధా శరణం నాస్తి” అని నిన్ను ఆశ్రయించినాము. మాకు నీవే దిక్కు. అసలు సంగతి యేమిటంటే, అవతారికలో కనుపించినంత తేలిక కాదు, దీని భావము. అంతు చిక్కని, చిక్కుముళ్ళు చాలావున్నాయి, అంటే నన్ను నమ్మండి. “కాణాచి” అంటే యేమిటో? చదవండి. రెండేళ్ళ క్రితం ఇదే కీర్తన నేను చేయలేకపోయాను, నేడు చేయగలుగుతున్నాను. ఇదే స్వామి ‘దయ’ అంటే.
భావ వివరణ:
ఓ జనార్దనా! నీవు జగములు (పదినాలుగు భువనములను) పరిపాలించు బ్రహ్మాండనాయకుడవు. నేము (మేము) ఈ ధరన్ (భూమిపై) తగన్ (తగినట్లు) నీవారమై (నీ పరివార భృత్యులమై) నెట్టుండినాము (పూనికతోయున్నాము).
ప్రభూ! నీవే మాకు గతివి (దిక్కైన ఆధారానివి). నీవే మాకు మతివి (మంచీ చెడు విచక్షణ కలిగించే మేధస్సువి). నీవే మాకు కాణాచియైన చోటువు (చిరకాలవాసస్థానమైనవాడవు… అందుచేతనే మన ఆత్మలన్నింటికీ ఆ పరమాత్మ చిరంతనుడు). అన్నిటికీ నీవే సతమైన (శాశ్వతమైన) సాక్షివి (ఆయన నిష్పక్షపాతమైన సాక్షీభూతుడు). మాకు అప్పుడప్పుడు చతురత వలసితే (తెలివితేటలు అతి అయిపోయి) నిన్ను జరతుము (నిందించెదము). తరువాత నీవే దిక్కని కొలుతము (కాళ్ళు పట్టుకొంటుంటాం). తతి (అసాధారణంగా) మేము చేయుచున్న తప్పులను మన్నించుము తండ్రీ!
ఓ దేవా! నీవే మాకు తల్లివి, తండ్రివీ నీవే. మా ప్రాణదాతవు పరమాత్మవూ నీవే. నీవు ఆత్మరూపువవైననూ అందరికీ నివాసస్థానమైన వాడవు. మాకు ఇహమున కోర్కెలు దీర్చి, పరమున మోక్షమునిచ్చేవాడవు నీవే. మల్లడి (నీతో పోట్లాడి) ఒక్కొక్కవేళ నిన్ను మఱచిపోయి తలుచుకోను కూడా తలుచుకోము. మా నేరములను చల్లగా (నెమ్మదిగా) సైరించి కొనవే (క్షమించి మమ్మల్ని కాపాడవయ్యా!)
ఓ జగన్నాథా! నీవు మా దరిదాపువు (సమీపములోనే వున్న గమ్యానివి). అంతులేని దయాస్వరూపుడవు. నీవు విలసిల్లిన శ్రీవేంకటపతివి. ఏదియేమైనా మేము నిన్ను విరివిగా (విస్తృతముగా) వేడుకొని నుతించెదము. నిన్ను శరణుచొచ్చితిమి. ఇక క్షమించుకొనవే (మమ్మల్ని క్షమించి అనుగ్రహించుము తండ్రీ!
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను – అన్నమయ్య కీర్తనలు
నిచ్చలు కోరికలియ్య నీనామమే చాలు
తెచ్చి పునీతుచేయ నీతీర్ధమే చాలు
పచ్చిపాపాలణచ నీ ప్రసాదమేచాలు
యెచ్చు కొందు వుపాయాలు ఇకనేల వెదక ॥
॥కేశవ॥
ఘనుని చేయగను నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనిషి కావగ తిరుమణి లాంఛనమే చాలు
మెనసెను దిక్కుదెస ఇకనేల వెదక॥
॥కేశవ॥
నెలవైన సుఖమియ్య నీ ధ్యానమేచాలు
అల దాపుదండకు నీ యర్చనే చాలు
యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకు కలవు
యెలమి నితరములు యికనేల వెదక ॥
॥కేశవ॥
అవతారిక:
తనని తాను కేశవునికి ‘దాసి’ వలె భావించుకొని అన్నమాచార్యులవారు పాడుతున్న చక్కటి కీర్తననాస్వాదించండి. స్వామీ నేను నీవే దిక్కని నమ్మిన దాసిని. నాలో లోపాలు లేవని నేరాలు లేవని నేనను. కానీ అవన్నీ నేను ఈ మానవశరీరం ధరించటం చేత దేహానికి ప్రకృతి సిద్ధమైన నేరాలు. వాటిని ఈనాడు యెంచినందువలన వుపయోగమేమి వుంటుంది? నేను నీ నామ సంకీర్తనతో బ్రతుకుతున్నాను, నీ అర్చన, దాస్యము, కైంకర్యములతో వైష్ణవ దీక్షలో బ్రతుకుతున్నాను నాకు ఇతరములేవీ వద్దు, వద్దు, వద్దు. అంతే… అంటున్నారు.
భావ వివరణ:
ఓ కేశవా! నేను నీదాసినైతిని. అందుచేత అన్నిటా (ఇహపరములు రెంటినీ) గెలిచితి (సాధించగలిగాను). నేను, నాలో లోపాలు లేవని కాని నేరాలు చేయని వాడిని అనిగాని అనలేను. కాని అవి యీ శరీరపు నేరాలు నేను మానవ శరీరధారినైనందువలన దానికి సహజమైన నేరాలు. ఇక వాటిని వెదకనేల? అయినా వాటిని యెదుర్కొనటానికి నా ప్రయత్నాలు నేనూ చేస్తున్నాను.
నేను సదా నీ నామస్మరణతోనే బ్రతుకుతాను. నా కోరికలు తీర్చుటకు అది చాలదా? నీ తీర్థమైన చోటునే వుంటాను. నన్ను నిర్మలుని చేయటానికి అది చాలదా? నేను చేసే పచ్చిపాపాలు బాహాటంగా కనిపిస్తున్న పాపకర్మలు. అణగద్రొక్కుటకు నీ ప్రసాదము చాలదా? ఎచ్చుకొందు వుపాయాలు (ఎక్కువ తక్కువ కిటుకులు) అవసరమా? అక్కర్లేదు నిన్ను నమ్మితే చాలు.
నీకైంకర్యము (శరణాగతి) చాలు నేను ఘనుడను అనిపించుకొంటాను. నీ ముద్రలు (రెండు భుజములపైన ధరించే శంఖ చక్రముద్రలు) చాలును. మొనసి (పూని) అవే నీ ఆయుధాలవలెనే నన్ను రక్షిస్తాయి. మనిషి కావగ (రక్షించి కాపాడుటకు) నేను నానొసట ధరించే నీ తిరుమని లాంఛనము (పంగనామాలు) చాలును వాటితోనే నా మార్గము వెలుగులీనుతున్నది.
ఓ ప్రభూ! నీ దాస్యము నెలవైన (సుప్రతిష్టమైన) సుఖమునిస్తుంది. అలదాపుదండకు (ఆపైన తోడు నీడై కాపాడుటకు) నేను చేసే నీ అర్చనయే చాలును. ఓ శ్రీవేంకటేశ్వరా! ఇన్నిటా (ఇన్ని విధములైన) నీసేవలు మాకు వున్నవి కదా!) ఎలమి (మా వికాసమునకు) ఇలపై అన్యములైన వుపాయముల వెదకుటెందులకు? నీవు మాకు చాలును తండ్రీ!
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చక్కని సరసపు శిశువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
చక్కని సరసపు శిశువు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 6
కీర్తన : చక్కని సరసపు శిశువు
సంఖ్య : 151
పుట : 109
రాగం : కన్నడగౌళ
పెక్కు మాయల పెను శిశువు అని శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తున్నారు. అన్నమాచార్యులవారు. పల్లవి తేలికగా వుంటే చరణాలు మరణాలే అన్నమయ్య కీర్తనలలో. స్వామి మున్నిటి శిశువుట అంటే అనాదియైన శిశువు. బొమ్మర పోవడు అంటే దిమ్మతిరిగేట్లు చేయడమన్నమాట. “పుట్టడు వొడమడు బూమెలే చేసీ” అంటే ఏమిటి? తేలికగా కనిపించే అతి క్లిష్టమైన కీర్తన ఇది. సాధ్యమైనంత పొందికగా దీని భావవివరణ కూర్చాను.
భావ వివరణ:
ఓ ప్రజలారా! శిశువు (పొత్తిళ్ళ బాలుని) వలె వున్న ఇతడు చక్కని, సరసమైన (లలితమైన) వాడు. చాలా మాయలు నేర్చిన గొప్ప శిశువు ఈతడు. ఈయన లీలలు వినండి.
ఒకనాడు పూతకి అనే రాక్షసి అందమైన యువతి వలెవచ్చి విషములు చిమ్మెడి రొమ్ములలో పాలు చేపిన (చేపినవని) కొమ్మని (త్రాగునాయనా!) అని ఇచ్చిన వెనువెంటనే, కుడిచేని (పీల్చినాడు). బొమ్మరపోవడు (దిమ్మదిరిగిన ఆ రాక్షసి పారిగొనినది (నశించినది). అమ్మరో! (అయ్యబాబోయ్) వీడు గయ్యాళి శిశువు (రండగొండి పిల్లవాడు).
ఒకనాడు తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో చుట్టపు చూపుగా అనుకోకుండా వున్నట్లుండి వచ్చాడు. వచ్చి, బెట్టుగ కౌగిట బిగించేని (అతిశయించి కౌగిటిలో బిగించినట్లు చుట్టేశాడు). అప్పుడు వీడు మాత్రం తక్కువవాడా? బూమెలే చేసీ (మోసాన్ని మోసంతోనే వంచాడు). పైగా వాడు పుట్టడు వొడమడు (పుట్టుకే లేని మగాడు). (పసిబాల శిశువుగా) వున్నంతమాత్రాన పట్టరే! (వీనిని పట్టుట సాధ్యమా?)
ఒకనాడు శకటాసురుడు అనే రాక్షసుడు ‘బండి’ రూపంలో వీడిని చంపాలని వచ్చాడు. అప్పుడు, ఆదిగొని (వాడిపై కన్నువేసి) తాను (ఆ శిశువు) అటు పాదము చాచి, జాతురకు నలరీని (మిక్కిలి చాతుర్యంతో అతిశయించి) బండిని ఒక్క తన్ను తన్ని ముక్కలు ముక్కలు చేసి శకటాసురుని చంపేశాడు. ఎందుకంటే ఆ శిశువు యెవ్వరనుకొన్నారు? వేదవేద్యుడు (వేదముల చేతనే తెలియశక్యమైన) దేవదేవుడు. శ్రీవేంకటాద్రి మీద సంతోషంగా వున్న శ్రీవేంకటేశ్వరుడే ఈ మున్నిటి (అనాదియైన మఱియాకు శిశువు).
ప్రభూ! పరమసుఖమిచ్చేది ఈ ప్రపంచంలో యేదన్నా వున్నదంటే అది నీపై కలిగిన భక్తి మాత్రమే. అయితే ప్రాపంచిక సుఖాలు మాత్రమే అవసరం అనుకొన్నంత కాలమూ భక్తి రుచి మనిషి గ్రహించలేడు. యుక్తాయుక్త విచక్షణ వున్న వారికి నిజమైన సుఖము ఒక్క భక్తియేనని తెలుస్తుంది. శ్రీవేంకటేశ్వరుని కొలిచిన ఆనందము పెరగటమే కాదు ఆపైన ఇక బెళకులుండవుట. కులము, ధనము, పేరు ప్రతిష్ఠలు, విద్యావైశిష్ట్యమూ… యేవీ శ్రీహరి భక్తికి సాటిరావంటున్నారు.
భావ వివరణ:
ఓ దేవదేవా! మాకు నీపై భక్తియొక్కటే పరమ సుఖము (దైవికమైన సౌఖ్యమును) ప్రసాదించును. యుక్తి జూచిన (విచక్షణతో పరికించిన) ఆ పరమసుఖము ఒక్కటే నిజమైనది. మరియేదియును లేదు.
ఎవ్వరి“కులమై”నా యెంతగొప్పదైనా ప్రయోజనమేమిటి? దానివల్ల గర్వం పెరుగుతుంది, అంతేకద! జగడమెందుకువస్తుంది? యెంత ‘చలము’ (ద్వేషము) వుంటే, అది అంత వస్తుంది. ‘తలపు’ అధికమయిందంటే కోరిక తగులుకొంటుంది. అవన్నీ పీడిస్తున్నవాడికి యెలమి (అతిశయించిన విజ్ఞానము (భగవత్సంబంధమైన జ్ఞానము)
యెలాకలుగుతుంది?
ఇంకొక వింత యేమిటంటే ధనమెంత పెరుగుతుంటే లోభత్వం అంత యెక్కువవుతుంది. స్త్రీ పురుషులలో సౌందర్యమెక్కువైతే మోహము వారిపై పెరుగుతుంది. పోనీ విద్య వలన కూడా మంచి జరుగదు. భక్తిలేనివాడికి యెంత విద్యవున్నా అది మదమును పెంచటానికి తప్పించి ఇంకెందుకు ఉపయోగిస్తుంది? ఎనయగ (అవన్నీ వృద్ధిచెందివున్నచోట) పరమపదము ఇంచుకయినా సాధ్యంకాదు.
తరుణులు (స్త్రీలు) యెంతమందివున్నా పురుషులకు మదనతాపము కలుగుతూనే వుంటుంది. ఏమాత్రం తగ్గదు. సిరిసంపదలెన్నివున్నా చింతలు (దిగులు) పెరుగుతుందేకాని తరుగదు. స్థిరమైన శ్రీవేంకటేశ్వరా! నిన్ను కొలిచినయెడల ఆనందము పెరుగుతూనే వుంటుంది. వారికి బెళకులు (చలించిపోవుటలు) లేవు (వుండవు).
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అప్పడైన హరియెక్కె నదివో తేరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అప్పడైన హరియెక్కె నదివో తేరు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 4
కీర్తన : అప్పడైన హరియెక్కె నదివో తేరు
సంఖ్య : 35
పుట : 24
రాగం : పాడి
శ్రీవేంకటేశ్వరుని తేరు (రథము) తిరుమల తిరువీధులగుండా వూరేగిపోతున్నది. పరవశించిన అన్నమాచార్యులవారు ఆ హరి యేయే సందర్భాలలో నాలుగు అశ్వముల పూన్చి తను తోలే రథమునేకాక పరులు తోలే రథములను కూడా యెప్పుడెక్కాడో పునశ్చరణ చేసికొంటున్నారు ఈ కీర్తన ద్వారా. పురాణవాఙ్మయము బాగాపరిచయంవుంటేకాని ఈ ప్రయత్నం సిద్ధించదు. సృగాలుడు అనేవాడు నక్క రూపంలోవుండే రాక్షసుడు (నరకాసురుడేమో!!) ఇవన్నీ అటువంచి “హంసడిచికుల మీదన్ తోలినట్టితేరు” అన్న చరణంలో నాకేమీ పాలుపోలేదు. స్వామి తనశత్రువుపై యుద్ధానికి రథం పై వెళ్ళాడని తెలుస్తూనే వున్నది. హంస అంటే శివుడు లేక విష్ణుడు. ఆయనపై ఆయనే యుద్ధానికి వెళ్ళడు కదా! కాబట్టి ఆ మాటకు అర్థం శివభక్తుడైన బాణాసురుడని భావించాను. ఇక చదవండి. నేనూ బ్రహ్మెత్సవాలలోనే దీన్ని వివరిస్తున్నాను.
భావ వివరణ:
అదిగో ఈ విశ్వమునకంతటికీ అప్పడు (తండ్రి) అయిన శ్రీహరి, తేరు యెక్కెను (రథము) పైయెక్కినాడు. ఇప్పుడు ఈ తిరుమల తిరువీధులలో ఈ రథము పోతున్నది. కనుల పండువుగా చూచి తరించండి.
ఒకప్పుడు ఈ సర్వేశ్వరుడు తన తేరును సముద్రాలమీద తోలినాడు. (అర్జునునికి తన ఆదినారాయణుని రూపం చూపాలని తన రథముపై శ్రీకృష్ణుడు వైకుంఠం తీసికొని వెళ్ళాడు). జరాసంధుడు భ్రమించి మతిపోగొట్టుకునేట్లు రథం తోలాడీయన. (వాడి అక్షౌహిణీ సైన్యమూ నశించేది). తిమురుచు (ఉద్రేకముతో) రుక్మకుపై (రుక్మిపై తిరగబడితోలిన రథము ఇదే (రుక్మిణీ స్వయంవరంలో). ప్రమదాన (సంతోషముతో) సృగాలునిపై (నక్కరూపంలో వున్నరాక్షసునిపై) తోలిన రథము ఇదే (బహుశా నరకాసురుడు అయివుండవచ్చు).
అక్రూరుడు తీసికొనిరాగా కమ్మి (విజృంభించి) కంసునిపై దండెత్తిన తేరు ఇదే, (ఈ రథముపైననే అక్రూరునికి శ్రీకృష్ణుడు భగవంతుడని అర్థమైంది). దంతవక్త్రుడు భ్రమచెంది నిస్తేజుడగునట్లు శ్రీకృష్ణుడు తోలిన రథము ఇదే, (శ్రీహరిద్వారపాలకుడైన విజయుడే వీడై పుట్టాడు). ఈ రథముపైననే శ్రీకృష్ణుడు దుమ్మురేగునట్లు సాల్వునితో యుద్ధం చేశాడు. (అంబను కాదన్నదీ సాల్వుడే). రుక్మిణీ కళ్యాణము సందర్భంగా రుక్మిణితోలిన రథం ఇదే, (శ్రీకృష్ణుడు శిశుపాలుని చిత్తుచేశాడీ రథంపైనుండే)
మీఱి (విజృంభించి) శివుడు రక్షణగా వచ్చిన బాణుని శ్రీకృష్ణుడు ఓడించినదీ రథముపైననే (ఉషాపరిణయం దీని తరువాతనే జరిగింది). సంధిమాటలు తూఱి (విఫలమై) భారతయుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణపరమాత్మ, పార్ధసారధియైనదీ రథముపైననే (భగవద్గీతకు వేదిక ఈ రథమే). నేడు శ్రీవేంకటేశ్వరుడు, అలమేల్మంగను ఆరడిన్ (మించి) కూడ, చూఱలుగొని (ఆదరణపొంది) ఎక్కిన శోభనపు తేరు (కళ్యాణప్రదమైన రథము) ఇదే. (చూచి తరించండి).
కొంకులేని పొలయాట కూరిములలో తేట
అంకెల బాలులతోడి యాట పాట
పొంకపు తుత్తురు కొమ్ము పొలుపైన నీ సొమ్ము
వేంకటనగము చాయ విట్టలరాయ.
||పసులు||
అవతారిక:
విఠల దేవుని విట్టలరాయా అని సంభోదిస్తూ గొప్ప జానపదకీర్తన చెబుతున్నారు అన్నమయ్య. ఇటువంటి కీర్తన నాస్వాదించినప్పటికీ దీని ప్రత్యేకత యేమంటే చాలా మాటలు యధాతధంగా నిఘంటువులలో దొరకవు. “పసపు జేల” అంటే ఏమిటి? పసుపురంగు చేలము అని అర్థం చేసికోవాలి, అంటే పీతాంబరుడైన కృష్ణుడు, దూడలను కాచే ఈ విట్టలరాయుడు వింతకూతవేసి ఆ దూడల్ని తన దగ్గరకు పిలుస్తాడట. ఎంతని చెప్పను? గొప్ప వర్ణన. మీరే రుచి చూడండి.
భావ వివరణ:
ఈ విట్టలరాయడు (విఠలుడు) యెలావున్నాడంటే ఈతడు పసుపుజేల (పీతాంబరము) కట్టిన శ్రీకృష్ణుడు ఇతని చేతిలో పసులుగాచే కోల (ముల్లుకఱ్ఱ) వుంటుంది. స్వామీ! పొసగ (అతిశయించుటకు) నీకింత బుద్ధుల గోల యెందుకయ్యా!
ఇతడు తన బుత్తి (భోజనము) చిక్కములో (చిన్న వుట్టిలో) కట్టి తెచ్చుకొన్నాడు. గచ్చకాయలు తిత్తి (గచ్చకాయరంగులో వుండె తన వుంగరాల జుట్టును కుచ్చులుగా కట్టుకొన్నాడు. చుట్టిన తలపాగలో నెమలిపింఛము గుచ్చి అలంకరించుకొన్నాడు. ఇటువంటి సింగారము నీకు ఇంత ప్రియమా విట్టలరాయా! నీచేతలు యెంతవెట్టి (పనికిమాలిన) వో చెబుతాను, వినవయ్యా!
ఈ విట్టలరాయుడు తన ఆవు పేయలను (దూడలను) ఒక వింతయైన ‘కూత’తో పిలిచి ఒకచోట చేరుస్తాడు. అతని పిల్లఁగోవి (మురళి) బలు మోత (పెద్ద ధ్వని చేస్తుంది). అతడు గొల్లెతలతో చేయరాని సిగ్గుల చేతలు చేస్తాడు. ఆపైన యమునాతటిలో అతని లీలలు తలపోతలు వేయరాని మోపులు (ఆరోపణలకు) దారితీశాయి.
కొంకులేని (ఏమాత్రమూ జంకులేని) అతని పొలయాట (రాసలీల) కూరిములలో తేట (ప్రణయమాధుర్యపు తేట). అంకెల బాలులతోటి (తన ఈడు గొల్ల బాలురతో) నిత్యమూ ఆటపాటలతో కాలక్షేపం చేస్తాడు. ఈ వేంకటాద్రి నీడలోని విట్టలరాయా! నీ పొలుపైన సొమ్ము (ఒప్పయిన ఆభరణం) యేమిటో తెలుసునా స్వామీ? నీ పొంకపు తుత్తురుకొమ్ము (నీ అందమైన తూతూ ధ్వనిచేసే శృంగనాదము). దానినే కొందరు “కొమ్ముబూర” అంటారు.
బగ్గుల్ నగ్గుల్ బావుల్ సొరె (ర?) గా
దగ్గర వెరపగు తపసుల తా
సిగ్గుల్ వాపెడి శ్రీ వేంకటపతి-
నగ్గపు సొమ్ములయాతని తా
||శిన్నెక||
అవతారిక:
జానపదుల బాణీలో కొనసాగే అన్నమాచార్యులవారి కీర్తననాస్వాదించండి. ఒక గోపిక ఇంకొక గోపికను శిన్నెక అనిపిలిచి తన చెలికాడైన ‘కిష్టుని’ (కృష్ణుని) తీసికొని రమ్మని వేడుకొంటున్నది. వాడు వెన్నల నారగించేవెన్నుడట. ఆతనిని తెమ్మంటున్నది. ఈ కీర్తనలో తా అని ప్రతిచరణం ముగిసినందువలన ‘తా’ అనునది తాళము కోసం తాలద్యోతకమని తోచుచున్నది. చరణములలో కొన్ని మాటలు ధ్వని ప్రధానమైనవి. కావున చిందేసే ఆటకు ప్రత్యేకించినవే. కీర్తన ప్రతిపదార్థం అసంభవమని నా భావన.
భావ వివరణ:
ఓ శిన్నెకా! (చిన్నక్కా!) శెలువుని (చెలికాడైన ఈ శ్రీకృష్ణుని) తేవే (నాయెదుటకు తీసికొనిరావే). ఈతడెవరో తెలియునా? చిన్నప్పుడు ఇంటింటా వెన్నదొంగతనం చేసి, చవిగొన్న (రుచి మరిగిన) వెన్నడు (శ్రీకృష్ణుడు).
ఈ అల్లరి పిడుగుకు ఆనాడు, మాటలు మూటలుగా వుండేవి. అవి బారులు, మూరలు (బారెడు మూరెడు మాటలు… అంటే… పెద్దగా ఆరిందలా మాట్లాడేవాడు.) బాటలు సదివే బాపలు తా (వేదపండితులమని విఱ్ఱవీగే బ్రాహ్మణులకు హితోపదేశము చేశాడు.) వేలుపు కుడుపులు (దేవతల కివ్వవలసిన నైవేద్యము) ఇవ్వలేదని అలిగిన దేవేంద్రుడి దేవతల వీపులు సాపుచేసి వేటాడినాడట. ఎందుకంటే ఈయన తేటలు మరిగిన దేవుని తా (ప్రసన్నత అతిశయించిన దేవదేవుడట).
ఈ చరణానికి అన్నమయ్య భావన సులభగ్రాహ్యము కాదు. నా భావన నా స్ఫురణయే..)
కరి మొరలిడనాడు త్వరగను నేగి మకరినుంచికరిగావవే
పరమపావన రామ చెరసాలనున్న భూసురునేలరక్షింతివో
||అనియిట్లు||
అతిపాపియైన యజామిశునేలి వతడేమి నీ చుట్టమా
పతితపావన రామ భద్రాద్రినిలయ నన్ పాలింపవిది దిట్టమా
||అనియిట్లు||
భద్రగిరీశుడ భక్తులపాలిట పారిజాతంబనుచు
భద్రాత్ముడై యున్న వాడు రామదాసు పాలించెదవనుచు
||అనియిట్లు||
28. ధన్యాసి చాపు తాళం
పల్లవి : అబ్బబ్బా రామ నామమది
సారము లేని సంసారసార మిదే రామనామం
పారద్రోలు మున్నూట ఇరువది భవరోగములన్ని
చేరి పంచేంద్రియములన్ని చేరక పారదోలు నామం
ఘోరమైన యమదూత కొట్టెడి నామం
||అబ్బబ్బా||
దినదినము జిహ్వకింపై దీయగనుండు నామం
ధనకనక వస్తువులు దయచేయు నామం
అసలు కొసలు నొక్క సమాభివృద్ధి చేయునామం
తనువును రెండనుచు తుదిని తారక నామం
ఓ రామయ్య వర్షములో జిక్కి వసుమతిమీదనే వర్తించు చుంటిగద కొన్నాళ్ళు
వరుసశేషసస్యగతమైన ధాన్యమును వదలి వర్తించితిగదకొన్నాళ్ళు
వరశరుని తేజస్సువల్ల నారీతనువల్ల నోరీగర్భనరకమునబడి యుంటిగ ఓ రామ
||అయ్యయ్యో||
త్రిప్పుడు తిత్తిలోబడి దినము ప్రవర్తిల్లు చుంటిగద కొన్నాళ్ళు
అప్పుడు మాతల్లి యుప్పుపులుపు దిననంగలార్చుచుండ కొన్నాళ్ళు
ఎప్పుడు నిందుండి బదులు వెళుదునని ఎదురుచూచుచుంటిగ కొన్నాళ్ళు
చెప్పరానియట్టి ద్వారములోనుండి జననమునొందితి ఓరామ
||అయ్యయ్యో!|
పొరలుచు దురగాధపొత్తిలో నలిగిరనుచుచు పోనుంటిగద కొన్నాళ్ళు
పెరుగుచు బాల్యావస్థల దినముల పరుగులాడుచుంటి గదకొన్నాళ్ళు
తరుణంతోగూడి మదమత్సరముల కన్నెరుగనైతిగద కొన్నాళ్ళు
తరువాత దారాపుత్రాది మోహములదవిలి వర్తించిగద ఓ రామా
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
భూభారాన్ని తగ్గించడానికి భువిపై అవతరించిన ఆదివిష్ణువే ఈ కృష్ణుడు అని ఆ అవతార విశిష్టతను కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు.
సవరేతిరి అంటే అర్ధరాత్రి అని అర్థం. సిసువు అంటే శిశువు అని అర్థం. కన్నతల్లిదండ్రుల కర్మబంధాలను పటాపంచలు చేశాడట ఆయన. రాకాసి మూకలు అంటే రాక్షసులగుంపు అని అర్థం. ఈ కృష్ణయ్యే కలియుగంలో శ్రీవేంకటాద్రిపై అలమేల్మంగమ్మతో వెలసి నిత్యకళ్యాణాల చక్రవర్తియై శోభలీనుతున్నాడు అంటున్నారు. ‘ఆదికొనుట’ అంటే కన్నువేయటం అని అర్థం.
భావ వివరణ:
ఓ అమ్మలారా! ఈతడే ఆదివిష్ణువట. ఈ మహానుభావుడు, ఆదిగొని (కన్నువేసి… అంటే… నిశ్చయించుకొని) భూభారము నణచినాడమ్మా!
చందురునుదయవేళ (చంద్రుడు వుదయించుచున్న సమయమున) సవరేతిరి కాడ (అర్థరాత్రి తరుణమున) దేవకీదేవి, కందువ బిడ్డ గనెనమ్మా! (సామర్థ్యముగల శిశువునకు జన్మనిచ్చింది. బ్రహ్మాది దేవతలు అప్పుడు పొందుగా (ఉద్ధతితో) ఆ పురిటింటి గుమ్మంలో నిలబడి ఆ బాలుని స్తోత్రించినారోయమ్మా!
అనంతరం వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు వసుదేవుని యెదుట సిసువుగ (శిశువుగా) అవతరించి చెలగీనమ్మా (కనువిందుజేయు చున్నాడమ్మా!) అప్పుడు ఆ యిసుమంత శిశువు ముసిముసినవ్వులు విరజిమ్ముతూ తనను చూడవచ్చిన మునీశ్వరులకు ఇకపై భయమువలదు అని వారికి అభయమునొసగినాడు ఓయమా! ఏమి ఆశ్చర్యము!!
అప్పుడా శిశువు తన కన్నతల్లిదండ్రులకు వారి గతజన్మల పుణ్య విశేషమును వివరించి తను వారి గర్భమున జన్మించిననూ వారి కర్మఫలము వలన తన బాల్యమును జూచు అదృష్టము వారికి లేదనీ, తిరిగి తను పెద్దవాడయ్యాక జీవితాంతము తనతోనే గడుపుదురని వివరించి వారికి కర్మపాశము నుండి విముక్తి కలిగించెను. ఆ బాలుడే అన్ని విధములైన రాకాసి మూకలను చీల్చి చెండాడినాడు. నేడు ఆతడే శ్రీవేంకటాద్రిపై లక్ష్మీదేవితో నుండి, వున్నతముగా పూని నిత్యకళ్యాణములు జరుపుకొంటూ, పరగీనమ్మా! (వెలయుచున్నాడమ్మా!).