Bhudana Mahima In Telugu – భూదాన మహిమ

Bhudana Mahima

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

భరద్వాజ సంహిత లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భూదాన మహిమ నీతికథ.

భూదాన మహిమ

ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు:

మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కలకలరవాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.

ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది. ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరి పైరు తయాఱయింది!

ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది. తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు.

అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్పుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

సస్యసంపూర్ణము ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పాత్రునకు సమర్పించిన వాడికి బ్రహ్మలోకం కరతలామలకం. అజ్ఞానతః తన భూమిలోని పైరు ఇతరులకి ఉపయోగ పడినందుకే తామ్రతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకముగా ఫలవృక్షములున్న భూమిని అర్హునికి దానముచేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Dasohamanu Buddhi Dalacaru Danavulu In Telugu – దాసోహమనుబుద్ధిదలచరు దానవులు

దాసోహమనుబుద్ధిదలచరు దానవులు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో దాసోహమనుబుద్ధిదలచరు దానవులు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

దాసోహమనుబుద్ధిదలచరు దానవులు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: దాసోహమనుబుద్ధిదలచరు దానవులు
సంఖ్య : 5
పుట: 4
రాగం: నాట

నాట

74 దాసోహ మనుబుద్ధిఁ దలఁచరు దానవులు
యీసులకే పెనఁగేరు యిప్పుడూఁ గొందరు.

||పల్లవి||

హరిచక్రముదూషించేయట్టివారే యసురలు
అరయఁ దామేదైవమన్న వారు నసురలే
ధర నరకాసురుఁడు తానే దైవమని చెడె
యిరవై యిది మానరు యిప్పుడూఁ గొందరు.

||దాసో||

పురుషోత్తమునిపూజపొంతఁ బోరు అసురలు
సరవి విష్ణుని జపించనివారు నసురలే
హిరణ్యకశిపుఁడును యీతని నొల్లక చెడె
ఇరవై యీతని నొల్ల రిప్పుడూఁ గొందరు

||దాసో||

సురలును మునులును శుకాదియోగులును
పరమము శ్రీవేంకటపతి యనుచు
శరణని బ్రదికేరు సరి నేఁడు వైష్ణవులు
యెరపరికానఁ బొయ్యే రిప్పుడూఁ గొందరు.

||దాసో||

అవతారిక:

దానవులు దేవతలు అక్కచెల్లెళ్ళ పిల్లలే కాని వారి మధ్య ఎంత అంతరం వున్నదంటే ఒకరు చెడుకు వుదాహరణైతే, ఇంకొకరు మంచికి మారుపేరు. హరికి సురులు శరణాగతులైతే, అసురులు హరి విరసులు. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు దానవులకు హరికి దాసోహమనే బుద్ధివుండదని, వారు అసూయకే అలవాటుపడ్డవారని, అందుకనే చెడిపోయారని అంటున్నారు. తన వాదనని సోదాహరణంగా నిరూపిస్తున్నారు కూడా. అసురులు అట్లావుంటే, సురులు మునులు హరి శరణాగతులు.

భావ వివరణ:

దానవులు (రాక్షసలు) దాసోహమనుబుద్ధి (శరణాగతిని) దలచరు (ఒప్పుకోరు. ఇప్పుడు (ఈ కలియుగంలో) కొందరు మానవులు, ఈసులకే (అసూయతో) పెనగేరు (ఒకరితో నొకరు కొట్లాడుచున్నారు).

అసురులంటే వేరేవరో కాదు. విష్ణుదేవుని చక్రాన్ని దూషించేవారంతా అసురులే. అ (పరిశీలించి చూచిన) తామే దైవమని అహంకరించినవారెవరైనా అసురులే. విష్ణువు భూకాంతలపుత్రుడు నరకుడు. వాడు అసురుడై లోక కంటకుడైనాడు. హరి వానిని సంహరిస్తాడు కావున భూదేవి హరిని వాడినంతము చేయవద్దని వేడుకొంది. “నేను చంపను వీడిని నీవు చావు అని తిట్టే దాకా వాడు చావడు” అని వరమిచ్చాడు విష్ణువు. నరకాసురుడు తానే దైవమని లోకకంటకుడయ్యాడు. వాడికోసం భూదేవి అంశతో పుట్టిన సత్యభామతో కృష్ణుడైన హరి తమపుత్రునే చంపించాడు. ఈరోజుల్లో నరుల్లో కూడా నరకాసురులు కోకొల్లలు.

అసురులు పురుషోత్తముని పూజదగ్గరకే పోరు. విష్ణుని జపించనివారంతా అసురులే. కృతయుగమున హిరణ్యకశిపుడు కూడా హరి నొల్లక అంతమైనాడు. ఈ కలియుగంలో కూడా కొందరు యీతని (ఈ దేవదేవుని వొల్లరు (అంగీకరించరు).

దేవతలు, మునులు, శుకుడు మొదలైన యోగులు పరమము మోక్షప్రదాత శ్రీవేంకటేశ్వరుడే అని శరణాగతితో బ్రతుకుచున్నారు. సరి (అదట్టుండగా) నేడు వైష్ణవులు కూడా కొందరు “యెరపరికాన” (రోత కలిగి) పొయ్యేరు (ద్వేషముతో జీవించుచున్నారు).

గమనిక : ఆచార్యులవారి భావన ఇదేనేమోనని నా ఊహ. నా ఆశ.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Varalakshmi Ashtottara Shatanamavali In Telugu | శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

Sri Varalakshmi Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…

Sri Varalakshmi Ashtottara Shatanamavali In Telugu Lyrics

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

  • ఓం ప్రకృత్యై నమః
  • ఓం వికృత్యై నమః
  • ఓం విద్యా నమః
  • ఓం సర్వభూతహితప్రదాయై నమః
  • ఓం శ్రద్ధాయై నమః
  • ఓం విభూత్యై నమః
  • ఓం పరమాత్మికాయై నమః
  • ఓం వాచే నమః
  • ఓం పద్మాలయాయై నమః
  • ఓం పద్మాయై నమః
  • ఓం శుచైయై నమః
  • ఓం స్వాహాయై నమః
  • ఓం స్వధాయై నమః
  • ఓం సుధాయై నమః
  • ఓం ధన్యాయై నమః
  • ఓం హిరణ్మయ్యై నమః
  • ఓం లక్ష్మ్యై నమః
  • ఓం నిత్యపుష్టాయై నమః
  • ఓం విభావర్యై నమః
  • ఓం ఆదిత్య నమః
  • ఓం డిత్యై నమః
  • ఓం దీప్తాయై నమః
  • ఓం వసుధాయై నమః
  • ఓం వసుధారిణ్యై నమః
  • ఓం కమలాయై నమః
  • ఓం కాంతాయై నమః
  • ఓం క్షమా నమః
  • ఓం క్షీరోదార్ణవ సంభవాయై నమః
  • ఓం అనుగ్రహప్రదాయై నమః
  • ఓం బుద్ధయై నమః
  • ఓం అనఘాయై నమః
  • ఓం హరివల్లభాయై నమః
  • ఓం అశోకాయై నమః
  • ఓం అమృతాయై నమః
  • ఓం దీప్తాయై నమః
  • ఓం లోక శోక వినాశిన్యై నమః
  • ఓం ధర్మ నిలయాయై నమః
  • ఓం కరుణాయై నమః
  • ఓం లోకమాత్రే నమః
  • ఓం పద్మ ప్రియాయై నమః
  • ఓం పద్మ హస్తాయై నమః
  • ఓం పద్మాక్షకై నమః
  • ఓం పద్మ సుందర్యై నమః
  • ఓం పద్మోద్భవాయై నమః
  • ఓం పద్మముఖీ నమః
  • ఓం పద్మనాభ ప్రియాయై నమః
  • ఓం రమాయై నమః
  • ఓం పద్మమాలాధరాయై నమః
  • ఓం దేవ్యయ్ నమః
  • ఓం పద్మిన్యై నమః
  • ఓం పద్మగంధిన్యై నమః
  • ఓం పుణ్యగంధాయై నమః
  • ఓం సుప్రసన్నాయై నమః
  • ఓం ప్రసాదాభిముఖీయై నమః
  • ఓం ప్రభాయై నమః
  • ఓం చంద్రవదనాయై నమః
  • ఓం చంద్రాయై నమః
  • ఓం చంద్ర సహోదర్యై నమః
  • ఓం చతుర్భుజాయై నమః
  • ఓం చంద్రరూపాయై నమః
  • ఓం ఇందిరాయై నమః
  • ఓం ఇందుశీతలాయై నమః
  • ఓం ఆహ్లాదజనన్యై నమః
  • ఓం పుష్టేయాయ్ నమః
  • ఓం శివాయై నమః
  • ఓం శివకర్యై నమః
  • ఓం సత్యై నమః
  • ఓం విమలాయై నమః
  • ఓం విశ్వజనన్యై నమః
  • ఓం తుష్టయే నమః
  • ఓం దారిద్ర్యనాశిన్యై నమః
  • ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః
  • ఓం శాంతాయై నమః
  • ఓం శుక్లమాల్యాంబరాయై నమః
  • ఓం శ్రీయై నమః
  • ఓం భాస్కర్యై నమః
  • ఓం బిల్వనిలయాయై నమః
  • ఓం వరారోహాయై
  • ఓం యశస్విన్యై
  • ఓం వసుంధరాయై
  • ఓం ఉదారాంగాయై
  • ఓం హరిణ్యై
  • ఓం హేమమాలిన్యై
  • ఓం ధనధాన్యకర్యై
  • ఓం సిద్ధయే
  • ఓం స్త్రైణసౌమ్యాయై
  • ఓం శుభప్రదాయై
  • ఓం నృపవేశ్మగతానందాయై
  • ఓం వరలక్ష్మ్యై
  • ఓం వసుప్రదాయై
  • ఓం శుభాయై
  • ఓం హిరణ్య ప్రాకారాయై
  • ఓం సముద్ర తనయాయై
  • ఓం జయాయై
  • ఓం మంగళాయై
  • ఓం విష్ణువక్ష స్థల స్థితాయై
  • ఓం విష్ణుపత్న్యై
  • ఓం ప్రసన్నాక్ష్యై
  • ఓం నారాయణ సమాశ్రితాయై
  • ఓం దారిద్య్ర్య ధ్వంసిన్యై
  • ఓం దేవ్వైయ్
  • ఓం సర్వోపద్రవ వారిణ్యై
  • ఓం నవదుర్గాయై
  • ఓం మహాకాళ్యై
  • ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై
  • ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై
  • ఓం భువనేశ్వ ర్యై
  • ఓం శ్రీ దేవ్యై

లక్ష్మ్యష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ఇతి శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామావళి: సమాప్తా

మరిన్ని అష్టోత్తరములు:

Sri Shiva Pratah Smarana Stotram In Telugu – శ్రీ శివ ప్రాతఃస్మరణమ్

Sri Shiva Pratah Smaranam Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ ప్రాతఃస్మరణమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Pratah Smarana Stotram Telugu

శ్రీ శివ ప్రాతఃస్మరణమ్

ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం
గంగాధరం వృషభవాహన మంబికేశం |
ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

1

ప్రాత ర్నమామి గిరిశం గిరిజార్థదేహం
సర్గ స్థితి ప్రళయకారణ మాదిదేవం |
విశ్వేశ్వరం విజిత విశ్వమనోభిరామం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

2

ప్రాతర్భజామి శివమేక మనంతమాద్యం
వేదాన్తవేద్య మనఘం పురుషం మహాన్తం |
నామాది భేదరహితం షడ్భావశూన్యం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

3

ప్రాతః సముత్థాయ శివం విచింత్య
శ్లోకత్రయం యే నుదినం పఠంతి |
తే దుఃఖజాతం బహుజన్మసంచితం
హిత్వా పదం యాంతి తదేవ శంభో ||

4

ఇతి శ్రీ శివ ప్రాతఃస్మరణమ్

మరిన్ని స్తోత్రములు

Aevvarum Ganani Vamdu Yashoda Gane Natte In Telugu – ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
సంఖ్య : 316
పుట : 213
రాగం : శంకరాభరణం

శంకరాభరణం

36 ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
పవ్వళించే బ్రహ్మతండ్రి బాలుఁడయ్యె నట్టె

||పల్లవి||

ఘనయోగీంద్రులమతిఁ గట్టువడనట్టివాఁడు
పనిలేక రోలఁ గట్టువడినాఁడట్టె
తనియ సురలకు పాదము చూపనట్టివాఁడు
మొనసి బండిమీఁద మోపినాఁ డట్టె.

||ఎవ్వ||

అమృతము చేతఁ దచ్చి అందరికిచ్చినవాఁడు
తమితో వెన్న దొంగిలెఁ దానె యట్టె
గుమురై దేవదానవకోటికిఁ జిక్కనివాఁడు
భ్రమసి గోపికలపాలఁ జిక్కినాఁ డట్టె.

॥ఎవ్వ||

యిందుఁ గలఁ డిందులేఁడనెంచి చూపరానివాఁడు
అందమై రేపల్లెవాడ నాడీనట్టే
అంది కృష్ణావతారముయినట్టిదేవుఁడే
యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచె నట్టె.

||ఎవ్వ|| 316

అవతారిక:

ఒకరోజు యశోదకు కృష్ణయ్య అల్లరి వినిపించడం లేదేమిటబ్బా! అని కొడుకును రహస్యంగా చూద్దామని మెల్లిగా నక్కి చూసిందట. అక్కడ పడుకొన్నది ఆవిడ కొడుకా? ఆయన, పరమేష్ఠితండ్రి, ఆదినారాయణుడు. కొంచెం తెరుచుకొనియున్న ఆస్వామినోట్లోంచి లోకాలన్నీ కనిపిస్తున్నాయట. దిమ్మతిరిగి పోయిందావిడకి. ఆయన ఎవ్వరూచూడలేని శ్రీమన్నారాయణుడు. భయంతో చేతులు జోడించిందా గొల్లది. చటుక్కున లేచి “అమ్మా”! అన్నాడు. అంతా కలలాగా మరచిపోయింది ఆ వెట్టితల్లి. అన్నమాచార్యులవారి ఈ అద్వితీయ కీర్తనకి ఈ పిట్టకధే మూలభూతి. దీనిని భావించి తరించండి.

భావ వివరణ:

ఆహా! ఏమి ఈ యశోద భాగ్యము! ఎవ్వరూ గాననివాడు (అగోచరుడై యెవ్వరికీ కనుపించని పరమాత్మ) ఈమె పొత్తిళ్ళలో పవ్వళించినాడే!! ఈ దేవదేవుడే, పితామహుడైన బ్రహ్మకే కన్నతండ్రియా? అట్టె (అతిసులువుగా) బాలుడయ్యెను. ఏమి ఆశ్చర్యము.

ఘనులైన యోగీశ్వరుల మదిలోకూడా కట్టుబడనివాడు, ఓహెూ! ఈనాడు రేపల్లెలో ఒక పనిలేని రోటికి కట్టబడినాడే!! సుకుమారమైన ఆయన పాదములెలావుంటాయో చూడాలని తహతహలాడే దేవతలకు తన అరిపాదములను చూపనట్టిదేవుడు ఈరోజు రేపల్లెలో ఒక కొయ్య బండికి చూపించి సూటిగా తన్నాడే!! ఏమి ఆ శకటాసురుని అదృష్టము!!

అమృతము కొరకై క్షీరసాగరమును చిలికించి, నిస్వార్ధంగా దేవతలందరికీ పంచిపెట్టించిన పురుషోత్తముడు, తానే తమితో (ఆసక్తితో) గోపికల ఇండ్లలో వెన్నదొంగిలించుచున్నాడే!! గుమురై (గుమిగూడిన) దేవదానవ కోట్లకు కూడా చిక్కని శ్రీమన్నారాయణుడు, నేడు బృందావనమున గొల్లభామలకు భ్రమకలిగినవానిలా చిక్కినాడే!! ఏమివింత!

ఇందుగలడు, ఇందులేడు అని ఇదమిద్ధంగా యెంచి చూపశక్యముకాని సర్వాతర్యామి ఈ రేపల్లెవాడలలో యెంత అందముగా ఆడుచున్నాడో చూడండి. ఆనాడు (ద్వాపరయుగమున) కృష్ణావతారమునంది పైలీలలన్నీ చేసినట్లే నేటి కలియుగంలో, యిందున (ఈ తిరుమలలో) శ్రీవేంకటాద్రి నెక్కి శ్రీవేంకటేశ్వరుడై నిలిచియున్నాడే!! ధన్యోస్మి తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Uma Maheshwara Sthotram In Telugu | ఉమా మహేశ్వర స్తోత్రం

Uma Maheshwara Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమా మహేశ్వర స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Uma Maheshwara Sthotram In Telugu Lyrics

ఉమా మహేశ్వర స్తోత్రం

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

1

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

2

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ట్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

3

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

4

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

5

నమః శివాభ్యామతిసుందరాభ్యా
మత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

6

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాలకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

7

నమః శివాభ్యామశుభాపహాభ్యా
మశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

8

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

9

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాభోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

10

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

11

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

12

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే
శతాయురాంతే శివలోకమేతి ||

13

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణమ్ |

మరిన్ని స్తోత్రములు:

Ramakrishna Nivu Nande Rajyameluchundudhuvu In Telugu – రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు

రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
సంఖ్య : 432
పుట : 291
రాగం : లలిత

లలిత

20 రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు
యేమిసేసే విక్కడ నీ యిరవుకే పదవే

||పల్లవి||

లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు
అంకె సుగ్రీవుఁ గిష్కింధ కంపినయట్టు
వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు
వేంకటాద్రిపొంతనుండ వేగ మమ్ము నంపవే

||రామ||

ఘనకిరీటము దేను గరుడని నంపినట్టు
అనుఁగుఁగపుల నిండ్ల కంపినట్టు
వొనర గోపికలొద్ది కుద్ధవుని నంపినట్టు
నునుపు శేషాద్రినుండ నన్ను నంపవే.

||రామ||

పెండిలికిఁ బరుషలఁ బిలువఁగ నంపినట్టు
అండనే ముందరఁ గంత కంపినయట్టు
వెండియు శ్రీవేంకటేశ వేఁట వచ్చి మరలితి-
వుండ(డు?) చోటనుండి నన్ను వూడిగాన కంపవే.

॥రామ॥ 432

అవతారిక:

ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవూ నీవు అక్కడ క్షేమంగా ప్రజలనేలుకోండయ్యా! ఇక్కడ ఈ కలియుగంలో మీరేం చేస్తారు? మీ మీ చోట్లకి (అయోధ్య, ద్వారకకీ) పదవే… అని చమత్కరిస్తున్నారు అన్నమయ్య. మీరు అక్కడకు పోయి, నన్ను మాత్రం వేంకటాద్రికీ, శేషాద్రికీ శ్రీవేంకటేశ్వరుని వూడిగం చేయమని కాస్త అనుగ్రహంతో పంపండయ్యా! విభీషణుణ్ణి, సుగ్రీవునీ, హనుమంతుని, గరుత్మంతుని, ఉద్ధవుని, వానరసేనను యెక్కడికెక్కడికో పంపారు కదా! అట్లాగే నన్నూ తిరుమలలో వుండరా అని పంపించండి అంటున్నారు. “అండనే ముందర కంత కంపినయట్లు” – అంటే యేమిటి? చదవక తప్పదు… భావవివరణ.

భావ వివరణ:

ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవున్ అందే రాజ్యమేలుచుండుదువు (నీవూ నీవూ అక్కడే ప్రజారంకముగా రాజ్యమేలుచుందువు). ఇక్కడ యేమిసేసేవు? నీ ఇరవుకు (మీమీ స్థానాలకు) నీవు అయోధ్యకు నీవు ద్వారకకు, పదవే (వెడలుడయ్యా!)

లంకలో విభీషణుని వద్దకు లక్ష్మణుని పంపి పట్టాభిషిక్తుని చేయించినట్లున్నూ, సుగ్రీవునికి కిష్కింద నేలుటకు పంపినట్లున్నూ, వాయునందనుడైన హనుమంతుని సంజీవని తెచ్చుటకు పంపినట్లున్నూ, మమ్మల్ని కూడా వేంకటాద్రి పొంతనుండి (దాపున నుండుటకు) నియోగించరాదా ప్రభూ!

నీ కిరీటమును తెమ్మని ఆనాడు గరుత్మంతుని పంపినట్లున్నూ, పట్టాభిషేకానంతరము అయోధ్య నుండి వానరసేనను తిరిగి కిష్కింధకు పంపివేసినట్లున్నూ, వేదన చెందుచున్న గోపికలవద్దకు ఓదార్చి హితబోధ చేసిరమ్మని నందవ్రజమునకు ఉద్ధవుని పంపించినట్లున్నూ, అనుపు శేషాద్రి నుండి (శేషాద్రినుండమని ఆనతీయుచూ నన్ను కూడా పంపించరాదా తండ్రీ!

నీ పెండ్లి పద్మావతితో జరుగుతుంది చూచుటకు విచ్చేయుడని పరుషలను (నీ భక్తులను) పిలువనంపినట్లున్నూ, అండనే కంతకు అంపినట్లు ముందరే నన్ను కూడా పంపించు స్వామీ! (పెండ్లిలో ఉప్పు పప్పు బియ్యమూ ఒక పెట్టెలో పెట్టి తీసికొనిపోయి మగ పెండ్లివారికి అందిస్తారు. ఆ పనికి ఆంతరంగికులను నియోగిస్తారు. దాన్ని కంతకు పంపడం అంటారు.) వెండియు (మరియు) ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు వేటకు వెళ్తే తిరుమలను చూసుకోవటానికి నీవూడిగపువాడిగా నన్ను వుంచుకోరాదా తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Karena Kim Mam Gruhitum Te In Telugu – కరేణ కిం మాం గృహీతుం తే

కరేణ కిం మాం గృహీతుం తే - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో కరేణ కిం మాం గృహీతుం తే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కరేణ కిం మాం గృహీతుం తే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : కరేణ కిం మాం గృహీతుం తే
సంఖ్య : 171
పుట : 123
రాగం : ఆహిరి

ఆహిరి

24 కరేణ కిం మాం గృహీతుం తే
హరే ఫణిశయ్యా సంభోగ

||పల్లవి||

జలే తవ సంచరణ మిహాధస్
స్థలే భవనం తవ సంతతం
బలే రూప ప్రకటన మతులా
చలే స్థానం చల చల రమణా

||కరేణ||

పదే భువన ప్రామాణ్యం తవ
హ్రదే ప్రచురణవిహరణ మిదం
ముదేమునీనాం మోహనం తనుం
మదే తవ నర్మ చ మాం విసృజ.

||కరేణ||

స్మరే విజయ స్తవ విమలతురగ
ఖురే రతిసంకుల రచన
పురే తవ విస్ఫురణం వేంకట
గిరే:పతే తే ఖేలాఘటిత.

||కరేణ|| 171

అవతారిక:

సరస శృంగార కీర్తన గీర్వాణిలో వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. నా అదృష్టం కొద్దీ ఇది శ్రీమన్నారాయణుని దశావతార కీర్తన. అక్కడక్కడా ప్రతిపదార్థమునకు గాక భావార్ధమునకు ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. నేను తెలుగు దశావతార కీర్తన వివరిస్తే ప్రతిపదార్ధ వివరణకే ప్రాముఖ్యతనిస్తాను. కానీ సంస్కృతంలో ప్రతి పదార్ధ వివరణ నా శక్తికి మించినపని. ఎందుకంటే గీర్వాణిలో నా పాండిత్యం అమావాస్యనాటి చంద్రుడు. అదండీ సంగతి. “ఓ శ్రీహరీ! ఫణీంద్రశయ్యపై సంభోగానందమందుకొనే నీ కరములు నన్ను అనుగ్రహించకుండుట యెందులకు?” – ఇది పల్లవి మరిదింతే…

భావ వివరణ:

ఓ శ్రీహరీ! ఫణిశయ్యా సంభోగా! (ఫణీశుడైన ఆదిశేషుడు శయ్య (పడక) అయి వుండగా, ఆ శయ్యపై సంభోగించుటకు ఆయత్తమైనవాడా!) నీ కరములు నన్ను అనుగ్రహించకుండా యుండుటెందులకు ప్రభూ!

సముద్రమునందు నీయొక్క సంచలన మిట్టిది (మత్స్యావతారము); నీవు అడుగున నీపైన భువనములు వున్నవి (కూర్మావతారము); ఉన్నతమైన బలప్రకటన జరపురూపమొప్పినది (వరాహావతారము); కొండగుహలలో చరించు సింహముఖరూపివి (నరసింహావతరాము);

నీపదములతో భువన ప్రమాణములను కొలిచితివి (వామనావతరాము); గొప్ప మడుగులో (తీర్ధములలో) నీయొక్క ప్రసిద్ధమైన విహారములు (యాత్రలు) జేసితివి (పరుశురామావతారం); ఆనందమునిచ్చు మోహన రూపుడైతివి మునులకు సైతం (శ్రీరామావతారము); నీయొక్క ఔన్నత్యమునకు నన్ను విడనాడితివి (బుద్ధుని అవతారము).

నీయొక్క విజయ చిహ్నమైన తెల్లని గుఱ్ఱపు గిట్టల నడక రతి సల్లాప సంకేతములైనవి (కల్కి అవతారము); ఓ శ్రీవేంకటగిరినాథా! సృష్టిలో నీ ప్రకాశముతో నీయొక్క ఆట నాడించు నీ కరములతో నన్నేల పరిగ్రహించవు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Yamalarjuna Bhanjanam In Telugu – యమళార్జున భంజనమ్

srikrishna leelalu yamalarjuna bhanjanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీ కృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్ నీతికథ.

శ్రీ కృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్

అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోద “కన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురు బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది “ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు.

బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనే తెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి “అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిది” అనుకుని ఆ మాయలయ్యను బెత్తంతో జళిపించింది.

శ్రీకృష్ణుడు భయపడినట్టు నటించి ఱోలు మీద నుంచి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా అతివేగముగా పారిపోయాడు. ఆ తల్లి బాలకృష్ణుని వెనకాల పరుగులెట్టింది. తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ ఆమెకు దొరికిపోయాడు!

పరమయోగీశ్వరులకు సంయములకు మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే. కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆ తల్లికి. యశోదాదేవి శరీరము స్వభావముకూడా పువ్వువలె మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక త్రాటితో జోకటికి (ఉలూఖలమునకు కట్టివేయాలనుకొన్నది. ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుని గట్టిగా కట్టబోయింది. కాని ఆ త్రాడు రెండంగుళాలు తక్కువయ్యింది.

మరొక త్రాడు దానికి జతచేసినా మళ్ళీ రెండంగుళాలు తక్కువైనది. యశోద ఇంటిలోనున్న త్రాళ్ళన్నీ జతచేసినా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయింది. ముజ్జగాలు దాగివున్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరితరము? అలసిపోయిన తల్లిపై జాలిపడి నందకిశోరుడు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకు గానీ మౌనులకుగానీ దానపరులకుగానీ యోగీశ్వరులకుగానీ పట్టుబడడుగదా!

యశోదాదేవి శ్రీకృష్ణుని ఇలా జోటికి కట్టివేసి ఇంటిపనులలో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ జోలు ఈడ్చుకుంటూ పెరట్లో చాలాకాల ముగా శాపగ్రస్తులై మద్దిచెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవుల దగ్గరకు వెళ్ళి వారిని కరుణించదలచి ఆ రెండు చెట్ల మధ్యనుంచి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. దానితో ఆ యమళ అర్జున వృక్షాలు కూలిపోయినాయి. అందునుంచి దిఙ్మండలము ప్రకాశింపచేయు ఇద్దరు అగ్నితుల్యులగు దివ్య పురుషులు వచ్చి స్వామిని స్తుతించి అతని అనుజ్ఞతీసుకుని కర్తవ్యోన్ముఖులై వెళ్ళిపోయారు.

యమళార్జుమల వృత్తాంతము

నలకూబరమణిగ్రీవులు పరమశివుని ప్రియసఖుడైన కుబేరుని పుత్రులు. వారు చాలా ధనగర్వముతో ఉండేవారు. రుద్రానుచరులై కూడా ఒకసారి వారు అతి పవిత్రమైన కైలాసపర్వతములోని ఒక సుందర ఉద్యానవనములో స్త్రీలతో కూడి వహారము చెసినారు. మదోమత్తులై వారుణి అను మదిరను పానముచేసినారు. వారు పద్మవనములో ఉన్న గంగలో జలక్రీడలాడ సాగినారు. అప్పుడు పరమపూజ్యుడైన నారదమహర్షి వారి పురాకృత సుకృతమువలన అక్కడికి వచ్చాడు. నారదుని చూసి ఆ దేవతాస్త్రీలు లజ్జితులై వెంటనే వస్త్రములు ధరించారు. కానీ మదిర ప్రభావములో ఒళ్ళు మరచిపోయిన ఆ కుబేర పుత్రులు వస్త్రములను ధరించలేదు. ఆ దేవకుమారుల అజ్ఞానమును చూచి నారదుడు ఇలా
అన్నాడు.

“ధనగర్వము ఎంతటి గొప్పవారినైనా నాశనము చేస్తుంది. ధనగర్వితులైన వారు మద్యపానము జూదము స్త్రీ సంభోగము వంటి దుర్వ్యసనములకు లోబడి అనేక పాపకార్యాలు చేయుదురు. నిర్భయులై మనోవినోదముకై పశువులను వధించెదరు. నశ్వరమైన దేహనుము శాశ్వతమైనదని నమ్మి దేహసౌఖ్యమే పరమానందము అనుకొనెదరు.

మద్యపానమత్తులై నగ్నముగా ఉండి ఘోరాపరాధము చేసిన వీరు స్థావరత్వమును పొందుటకు తగియున్నారు. మరల వీరెన్నడూ ఇట్టి అకార్యములు చేయకుండుటకై నా అనుగ్రహమువలన వీరికి పూర్వజన్మ స్మృతి ఉండును. నూరుదివ్యవర్షములు చేసిన తప్పుకు పశ్చాత్తాపము నొంది పునీతులై నా అనుగ్రహముచే కృష్ణభక్తులై దైవత్వమును పొందగలరు”. ఆ కుబేర పుత్రులే యమళార్జునులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. వస్త్రధారణము యొక్క ప్రాముఖ్యత మనకు ఈ కథ ద్వారా తెలిసినది. ఎప్పూడూ సరిగా వస్త్రములేకుండా ఉండరాదని నారదమహర్షి మనకు చెప్పాడు.
  2. వారుణి అనే మదిర ప్రభావములో ఉండి తప్పని తెలిసికూడా నలకూబరమణిగ్రీవులు వస్త్రధారణము చేయలేదు. మదిరాపానం వలన మానవుడు తెలియకనే అనేక పాపాలు చేస్తాడు. పంచమహాపాతకాలలో మొదటిది ఈ మదిరాపానమే. అందుకని మనమిట్టి దుర్వ్యసనములకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.
  3. ధనగర్వము ఉండరాదని నారదమహర్షి మనకు ఉపదేసించాడు. శివానుచరులై ఉండికూడా కేవలము ధనగర్వము వలన కుబేర పుత్రులు వారి దైవత్వాన్ని కోల్పోయారు.
  4. తీర్థాలు పుణ్యక్షేత్రాలు సిద్ధప్రదేశాలు ఎప్పుడు విహార దృష్టితో వెళ్ళరాదని మనకు ఈ కథ ద్వారా తెలిసినది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Shiva Raksha Stotram In Telugu – శ్రీ శివరక్షాస్తోత్రము

Sri Shiva Raksha Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివరక్షాస్తోత్రము గురించి తెలుసుకుందాం…

Sri Shiva Raksha Stotram Lyrics Telugu

శ్రీ శివరక్షాస్తోత్రము

ఓం అస్యశ్రీ శివరక్షాస్తోత్ర మహామంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః, శ్రీ సదాశివో దేవతా, అనుష్టుప్ ఛందః, శ్రీసదాశివప్రీత్యర్థే శ్రీ శివరక్షాస్తోత్ర జపేవినియోగః ॥

చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ |
అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ ||

1

గౌరీవినాయకోపేతం పంచవక్త్రమ్ త్రినేత్రకమ్ |
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః ||

2

గంగాధరశ్శిరః పాతు ఫాల మర్ధేందు శేఖరః |
నయనే మదనధ్వంసీ కరౌ సర్పవిభూషణః ||

3

ఘ్రాణం పాతు పురారాతి ర్ముఖం పాతు జగత్పతిః |
జిహ్వాం నాగేశ్వరః పాతు కంధరాం శశికంధరః ||

4

శ్రీకంఠః పాతు మే కంఠ స్కంధై విశ్వధురంధరః |
భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృత్ ||

5

హృదయం శంకరః పాతుజఠరం గిరిజాపతిః |
నాభిం మృత్యుంజయః పాతు కటే వ్యాఘ్రాజినాంబరః ||

6

సకినీ పాతు దీనార్త శరణాగతవత్సలః |
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః ||

7

జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః |
చరణా కరుణాసింధు స్సర్వాంగాని సదాశివః ||

8

ఏతాం శివబలోపేతాం రక్షాం యస్సుకృతీ పఠేత్ |
స భుక్త్యా సకలాన్కామాన్ శివసాయుజ్య మాప్నుయాత్ ||

9

గ్రహభూతపిశాచాద్యా త్రైలోక్యే విచరంతి యే |
దూరా దాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ ||

10

అభయంకరనామేదం కవచం పార్వతీపతేః |
భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్రయమ్ ||

11

ఇమాం నారాయణ స్స్వప్నేశివరక్షాం యథాదిశత్ |
ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యస్త థాలిఖేత్ ||

12

ఇతి యాజ్ఞవల్క్యప్రోక్తం శ్రీశివరక్షాస్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు