Uma Maheshwara Stotram In Telugu – ఉమామహేశ్వర స్తోత్రమ్

Uma Maheshwara Stotram Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమామహేశ్వర స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Uma Maheshwara Stotram Lyrics Telugu

ఉమామహేశ్వర స్తోత్రమ్ 

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్రిష్ట వపుర్ధ రాభ్యాం |
నగేంద్రకన్యా వృషే కేతనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం ||

1

నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం |
నారాయణే నార్చిత పాదుకాభ్యాం

॥నమోనమః|| 2

నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించి విష్ణ్వాంద్ర సుపూజితాభ్యాం |
విభూతి పాటీర విలేపనాభ్యాం

॥నమోనమః|| 3

నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం |
జంభారి ముఖ్యై రభివందితాభ్యాం

॥నమోనమః|| 4

నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీ పంజర రంజితాభ్యాం |
ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం

॥నమోనమః|| 5

నమశ్శివాభ్యా మతిసుందరాభ్యా
మత్యంత మాసక్త హృదయాంబుజాభ్యామ్ |
అశేష లోకైక హితం కరాభ్యాం

॥నమోనమః|| 6

నమశ్శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకళ్యాణ వపుర్థరాభ్యామ్ |
కైలాసశైల స్థిత దేవతాభ్యాం

॥నమోనమః|| 7

నమశ్శివాభ్యా మశుభాపహాభ్యా
మశేషలోకైక విశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతి సంభృతాభ్యాం

॥నమోనమః|| 8

నమశ్శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానర లోచనాభ్యామ్ |
రాకా శశాంకాభ ముఖాంబుజాభ్యాం

॥నమోనమః|| 9

నమశ్శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జి తాభ్యాం |
జనార్థ నాభోద్భవ పూజితాభ్యాం

॥నమోనమః|| 10

నమశ్శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వాచ్ఛదా మల్లిక దామభృద్భ్యామ్ |
శోభావతీ శాన్తవతీశ్వరాభ్యామ్

॥నమోనమః|| 11

నమశ్శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీ రక్షణ బద్ధహృద్భ్యామ్ ।
సమస్త దేవాసుర పూజితాభ్యాం

॥నమోనమః|| 12

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్వా పఠన్ ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్య ఫలాని భుంక్త్వే
శతాయు రంతే శివలోక మేతి ॥

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
ఉమామహేశ్వర స్తోత్రమ్.

మరిన్ని స్తోత్రములు

Yenni Marulu Yitte Nee Panulu In Telugu – యెన్ని మారులు యిట్టె నీపనులు

యెన్ని మారులు యిట్టె నీపనులు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో యెన్ని మారులు యిట్టె నీపనులు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

యెన్ని మారులు యిట్టె నీపనులు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : యెన్ని మారులు యిట్టె నీపనులు
సంఖ్య : 58
పుట : 43
రాగం : సామంతం

సామంతం

30 యెన్ని మారులు యిట్టె నీపనులు
ఇన్ని మాయలు నన్ను నేఁచనేఁటికిరా.

||పల్లవి||

నీళ్లే నమలేవు నీలోనె సన్నల
వేళ్లే చూపేవు వెలుపలికి
పేళ్లె తప్పేవు బిరుసుగ, నింతేసి
గోళ్ల రాచేవు కోపమేఁటికిరా.

॥యెన్ని॥

మేనె దాఁచేవు మెస్తిర గొడ్డలి
నానం బెట్టేవు నయముననే
పోని తెరువుల పోకులఁ బోయేవు
కానిరా యేటివంకలు తిద్దవశమా.

॥యెన్ని॥

చేరి కపటాలె చేసేవు యిఁకనైనా
సారెం బరువులు చాలించరా
ధీరుండవుగాన తిరువేంకటపతి
కూరి మెఱిఁగి నన్నుఁ గూడితి విపుడూ.

॥యెన్ని॥ 58

అవతారిక:

ఇదికూడా జానపదుల శైలిలో కొనసాగే దశావతార కీర్తన. నా అభిప్రాయంలో ఇది బహుక్లిష్టమైనది. ఎందుకంటే కొన్ని మాటలకు యే నిఘంటువులోనూ అర్ధ వివరణ సూచన ప్రాయంగా కూడా లభించలేదు. అది ఏ అవతార వివరణో వూహించగలుగుట వలన భావసమన్వయం ఆవశ్యకమైనది. అంటే. ఉదాహరణకి “పెళ్లె తప్పేవు బిరుసుగ” అంటే వరాహవతారంతో సమన్వయపరచుటెట్లు సాధ్యం. యేటివంకలు తిద్దవశమా? అంటే కృష్ణావతారంతో యెట్లా ముడిపెట్టాలి? దీని అర్థం ఏమిటో ఎలా తెలుస్తుంది? ఓ దేవదేవా! అన్నమయ్య ఈ కీర్తన పల్లవిలో అన్నమాట నిజం చేస్తున్నావు కదటయ్యా! “ఇన్ని మాయల నన్ను నేచనేటికిరా”. అంటే ఏమిటో తెలియాలంటే ఏమిటి చేయాలి? మీకు తెలుసునని నాకు తెలుసు.

భావ వివరణ:

నీ పనులు (నీవు చేసే లీలలు యెన్ని మారులు? (ఎన్ని విధములో) చెప్పుట యెట్లు సాధ్యము? నన్ను ఇన్ని మాయలతోన్ చేయనేటికిరా? (అతిశయించుట యెందులకయ్యా? )

ఒకసారి నీలోనే నీళ్ళు నములుతుంటావు (మత్స్యావతారము); ఇంకొకసారి వెలుపలికి వచ్చి సన్నల (సైగలతో) వేళ్ళను చూపింతువు (కూర్మావతారము); ఇంకొకసారి, బిరుసుగ పేళ్లె తప్పేవు (కాఠిన్యంతో వేగిపోతూ తపించిపోయేవు)… అనగా (వరాహావతారం). ఇంకొకసారి, ఇంతేసి గోళ్ళ రాచేవు (ఇంతింత పొడుగువున్న గోళ్ళతో చీరివేసెదవు. కోపమేటికిరా? కోపమెందులకయ్యా? (నరసింహావతారం).

ఒకసారి, మేనెదాచేవు (చూడటానికి పొట్టి పిల్లవాడిలావున్నా, భూనభాంతరములు నిండిపోగల శరీరాన్ని దాచివుంచినావు)… అనగా (వామనావతారం).; మెస్తిర గొడ్డలి నయముననే నానం బెట్టేవు (బాగా పదునైన పరశువును బాగా రక్తంలో నానబెట్టినావు)… అనగా (పరశురామావతారము); పోని తెరువుల పోకల బోయేవు (చొరరాని కీకారణ్యములబట్టి పోయేవు)… అనగా (శ్రీరామవతారం); కానిరా, యేటివంకలు తిన్దవశమా (కానీయవయ్యా! వంకరటింకరగా పోయే ఏరుయొక్క మార్గాన్ని కట్టడి చెయ్యగలమా? … అనగా (శ్రీకృష్ణావతారపు గోపీలోలత్వం).

ఒకసారి, చేరి కపటాలే చేసేవు (పురసతులను మోసగించినావు)… అనగా (బుద్ధావతారము). ఇకనైనా సారెం పరువులు చాలించరా (ఇప్పటికైనా, మాటిమాటికీ పరుగులు తీసే అలవాటు మానుకోవయ్యా!)… అనగా (కల్కి అవతారము); ధీరోదాత్తుడవు కావున ఓ తిరువేంకటేశ్వరా! కూరిమి యెరిగి నన్ను కూడితివి. ఇప్పుడు నీమాయలను మెచ్చక యెలా వుండగలను ప్రభూ!.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Krishna Ashtakam In Telugu – శ్రీ కృష్ణాష్టకమ్

Sri Krishna Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Krishna Ashtakam Telugu

శ్రీ కృష్ణాష్టకమ్

భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవనందనందనమ్,
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరమ్.

1

మనోజగర్వమోచనం విశాలలోలలోచనం
విధూతగోపశోచనం విశాలలోలలోచనం
విధూతగోపశోచనం నమామి పద్మలోచనమ్,
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణమ్.

2

కదంబసూనకుండలం సుచారుగండమండలం
ప్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభమ్,
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకమ్.

3

సదైవ పాదపంకజం మదీయమానసే నిజం
దధానముక్తమాలకం నమామి నందబాలకమ్,
సమస్తదోషశోషణం సమస్తలోక పోషణం
సమస్తగోపమానసం నమామి నందలాలసమ్.

4

భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకమ్,
దృగంతకాంతభంగినం సదా సదాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవమ్.

5

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం
సురద్విషన్నికందనం నమామి గోపనందనమ్,
నవీనగోపనాగరం నవీనకేళితత్పరం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటమ్.

6

సమస్తగోపనందనం హృదంబుజైకమోహనం
నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనమ్,
నికామకామదాయకం దృగంతచారుసాయకం
రసాలవేణుగాయకం నమామి కుంజనాయకమ్.

7

విదగ్దగోపికామనోమనోజ్ఞతల్పశాయినం
నమామి కుంజకాననే ప్రవృద్ధవహ్నిపాయినమ్,
కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితమ్
గజేంద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణమ్.

8

యదా తదా యథా తథా తథైవ కృష్ణ సత్కథా
మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతామ్,
ప్రమాణికాష్టకద్వయం జపత్యధీత్య యః పుమాన్
భవేత్ స నందనందనే భవే భవే సుభక్తిమాన్.

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీకృష్ణాష్టకం సంపూర్ణమ్.

కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతమ్,
వటస్య పత్రస్య పుటే శయానం
బాలం ముకుందం మనసా స్మరామి.

మరిన్ని అష్టకములు

Ashta Lakshmi Murthulu In Telugu – అష్టలక్ష్మీ మూర్తులు అందించే శక్తులు

Ashtalakshmi Murthulu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం… అష్టలక్ష్మీ స్తోత్రం ఒక ప్రముఖమైన హిందూ ప్రార్థనా సంస్కృతిలో ఒక పవిత్ర స్తోత్రము. ఈ స్తోత్రం మహాలక్ష్మిని స్తుతిస్తుంది, అష్టలక్ష్మీలు మహాలక్ష్మి దేవికి అంగములగా అనిపిస్తాయి. ఈ స్తోత్రంలో లక్ష్మీదేవికి అనుగ్రహించే స్వర్ణదాత మహాలక్ష్మీకి అర్పించిన స్తుతులు ఉన్నాయి. ఈ స్తోత్రంలో ఆధ్యాత్మికత, ఐశ్వర్యం, ప్రేమ, క్షమా, శాంతి, సౌందర్యము, శక్తి, ధర్మము, కీర్తి, ధన సంపాదన, ఆరోగ్య లభ్యం లక్ష్మీ అనుగ్రహాన్ని చెందడంలో అందరికీ ఆశీస్సులు లభించడం వంటి విషయాలు చెప్పబడినవి.

అష్టలక్ష్మీ మూర్తులు అందించే శక్తులు

అష్టలక్ష్మి అనగా ఎనిమిది లక్ష్ములు అను అర్దం వచ్చును. అష్టలక్ష్మి మూర్తుల శక్తులు అనగా, అష్ట దేవతా మూర్తులు మనకి ప్రసాదించే అష్ట శక్తులు. ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఏ, ఏ లక్ష్ములు ఏమేమి శక్తులని ప్రసాదిస్తారో, క్రింద ఇచ్చిన విదముగా తెలుసుకుందాము.

1. శ్రీ ఆదిలక్ష్మిదేవి

ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.

Adilakshmi devi

2. శ్రీ ధాన్యలక్ష్మీ మాత

సకల సస్యసంపదలకి, పాడి పంటలకి అధిష్టాన దేవత, శారీరక ధారుఢ్యాన్న  ప్రసాదించే తల్లి.

dhanya lakshmi

3. శ్రీ దైర్యలక్ష్మీమాత

ధైర్య సాహసాలు, మనోబలం ప్రసాదించే తల్లి.

Dhairya Lakshmi

4. శ్రీ గజలక్ష్మీమాత

సమస్త శుభాలకీ అధిష్టాన దేవత.

Gaja Lakshmi

5. శ్రీ సంతాన లక్ష్మీ మాత

సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.

Santhana Lakshmi

6. శ్రీ విజయలక్ష్మీ మాత

సకల కార్యసిద్ధికీ, సర్వత్రా విజయసాధనకి అధిష్టాన దేవత.

Vijaya Lakshmi

7. శ్రీ విద్యాలక్ష్మి మాత

విద్యావివేకాలకి, మన అర్హతలకి తగిన గుర్తింపు రాణింపు కలిగేలా చేసే చల్లని తల్లి దేవత.

Vidya Lakshmi

8. శ్రీ ధనలక్ష్మీ మాత

సకలైశ్వర్య ప్రదాయిని. అన్ని సంపదలకి అధిష్టాన.

Dhana Lakshmi

ఈ శ్రీఅష్టలక్ష్మీ ఆరాధన వైభవం పుస్తకం ద్వారా శ్రీమన్మహలక్ష్మీదేవి ప్రాదుర్భావం, వైభవ కటాక్షాలతో మొదలు పెట్టి వరుసగా ఎనిమిది మంది అష్టలక్ష్మీ మాతల స్వరూప, వైభవ, ఆగ్రహానుగ్రహ ప్రభావాలు, ఆరాధన పద్ధతులు, వీటి వల్ల కలిగే ఫలితాల గురించి వివరించటం జరిగింది. శ్రద్ధా భక్తులతో ఈ పుస్తకాన్ని చదివి ఆ జగన్మాత అనుగ్రహం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని మా ఆకాంక్ష.

మన అపోహలు – సందేహాలు

సకల జీవావళికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించే నిమిత్తం శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలను ధరించింది. తన పిల్లలమైన మన అభ్యున్నతికోసం అహరహం ఆరాటపడుతుంది జగన్మాత. అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం గురించి, స్వభావం గురించి మనలో ఎన్నో అపోహలు వున్నాయి. పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం బాగా వంటబట్టిన మన నేటితరం వారికి మన సనాతన సాంప్రదాయం, పూజా పునస్కారాల గురించి ఎన్నో సందేహాలు అవి ఏమిటో చూద్దాం.

  1. లక్ష్మీదేవి అనగానే మనకి స్ఫురణకి వచ్చేది. తన చేతుల నుంచి బంగారు కాసులను అనుగ్రహించే శ్రీ ధనలక్ష్మీదేవి రూపమే అందువల్లనే లక్ష్మీపూజ అనగానే ధనాన్ని కోరి చేసే పూజ మాత్రమే అనే అపోహ జనబాహుళ్యంలో వుంది.
  2. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమైనదని, ఆ తల్లి అనుగ్రహం ఎంత కాలం మనవద్ద వుంటుందో తెలియదని, ఎప్పుడు వదలి వెళ్ళిపోతుందో తెలియదనే తప్పు అభిప్రాయం కూడా జనానీకంలో నెలకొని వుంది.
  3. అదే విధంగా లక్ష్మీ సరస్వతులు అత్తాకోడళ్ళు అనీ, లక్ష్మి వున్న చోట విద్య వుండదు అనీ, విద్య వున్నచోట లక్ష్మి వుండదు. అని అంటూ వుంటారు. ఇదీ అపోహే.
  4. ఇక అష్టలక్ష్మీ ఆరాధన విషయానికి వస్తే, ఇలా ఎనిమిది రకాల లక్ష్మీ రూపాలను ఎందుకు పూజించాలి? ఒక మహాలక్ష్మీ రూపాన్ని పూజిస్తే చాలదా? అనేది కూడా ఒక ప్రశ్న.
  5. లోకంలో అందరూ వారి వారి పద్ధతులలో భగవదారాధన చేసుకుంటూ తమ తమ కోరికలను, అవసరాలని నెరవేర్చుకుంటూ వుండగా ప్రత్యేకంగా అష్టలక్ష్మీ ఆరాధన, పూజ, వైభవాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఏమిటి?
  6. తార్కిక దృష్టితో మాత్రమే ఆలోచించే నేటి ఆధునికులు లోకంలో ఏ పని అయినా సరే మనం కష్టపడి శ్రద్ధగా చేయటం వల్లనే పరిపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతాం అంటారు. అంతే కాని ఆ పని సఫలం కావటానికి లక్ష్మీదేవో, మరే దేవతో అనుగ్రహం కావాలనటం మూర్ఖత్వం అని కూడా అంటూ వుంటారు.
  7. అదే విధంగా చేసే పనిని శ్రద్ధగా చేస్తే చాలు, అదే అసలైన పూజ అనే వారూవున్నారు. ఇవి ఎంత వరకు నిజం?
  8. అయినా ఈ యిరవై ఒకటవ శతాబ్దంలో సైన్సు విపరీతంగా అభివృద్ధి చెంది పోయి సృష్టికి ప్రతిసృష్టి చేయాలని ఉవ్విళ్లూరుతున్న మానవ సమాజంలో, యీ విధంగా పూజల వల్ల బీజాక్షర జపాల వల్ల ఫలితాలు కలుగుతాయంటే నమ్మేవారు ఎందరు?
  9. ఆధునిక యుగంలో ప్రతినిత్యం తమ తమ దైనందిన కార్యక్రమాలలో తలమునకలై ప్రతిక్షణం హడావుడి పడిపోతూ జీవించే నేటి తరం వారికి ఈ విధమైన భగవదారాధనకి సమయం ఎక్కడిది?
  10. భక్తిశ్రద్ధలతో కూడిన పూజా పురస్కారాలు వగైరా వయస్సు మళ్ళి, ఓపిక తగ్గిన వృద్ధులకే గాని భుక్తికోసం కోటి విద్యలు నేర్చుకుని అహరహం ధనార్జనలో సతమతమయ్యే యువతకి ఈ ఆరాధనల అవసరం ఏమిటి?

ఇలా అనేక సందేహాలు వస్తూ వుంటాయి. ఇవన్నీ చాలా సహజమైన సందేహాలే. ఏ విషయాన్నైనా సశాస్త్రీయంగా విశ్లేషిస్తే గాని నేటితరం అంగీకరించదు. అలాంటివారి కోసమే ఈ పుస్తకం. ఈ పుస్తకం శ్రద్ధగా చదివితే పైన చెప్పిన అన్ని సందేహాలకి సమాధానాలు దొరికి మనకి ఏం కావాలో కూడా మనకి తెలుస్తుంది.

మరిన్ని:

Garuda Garvabhangam In Telugu – గరుడ గర్వభంగం

Garuda Garvabhangam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గరుడ గర్వభంగం నీతికథ.

గరుడ గర్వభంగం

(ఉద్యోగ పర్వంలో చేయబార సమయంలో కణ్వమహర్షి చెప్పిన కథ)

” నాయనా దుర్యోధనా !

దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా! ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి.

ఇంద్రుని మనసు గ్రహించి రథం నడిపించే మాతలికి ముల్లోకాల లోనూ సాటిరాగల సారథులు లేరు. అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో, సద్గుణ సంపదతో అందరిచేతనూ ప్రశంసలు పొందినవాడు.

ఆయనకు గుణకేశి అని ఒక కూతురు. గుణకేశి ఎంత అందగత్తెయో అంతకంటే గుణవతి, శీలసంపన్న, విద్యావతి. తల్లి దండ్రుల శిక్షణలో ఆమె వంశ సంప్రదాయాన్ని, ఆచార మర్యాదలనూ చక్కగా అలవరచుకొని పదినుందిలో వినయగుణవతిగా పేరు పొందింది.
బాల్యదశ దాటి పదహారేడుల యవ్వనవతి అయింది. అంటే వివాహ యోగ్యమైన వయసులో అడుగుపెట్టింది. వరాన్వేషణ ఆరంభిం చాడు మాతలి.
ఉన్నత వంశంలో పుట్టి, చక్కని అంద చందాలతో గుణవంతు రాలు, విద్యావతి అయిన ఆడబిడ్డకు యోగ్యుడైన వరుడు దొరకడం చాలాకష్టం.
విద్యఉంటే వినయం ఉండదు. విద్యావినయాలుంటే రూపం ఉండదు. ఈ మూడూ ఉంటే సంపద ఉండదు.
విద్యా వినయ గుణరూపాలున్ని వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం అంతా తిరిగాడు. భూలోకం కూడా గాలించాడు.
ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రయత్నం విరమించ కుండా తిరుగుతూనే ఉండగా, ఒకనాడు నారదముని కనిపించి, మాతలి బాధ విని ఆయనకూడా తోడుగా బయలుదేరాడు.
ఇరువురూ కలిసి పాతాళంలో వరుణలోకం చేరారు. ఆలోకం లోని వింతలు, విశేషాలూ వివరంగా చెప్పాడు నారదుడు. అన్నీ విని మాతలి!
దేవమునీ :
నేను దేవతల ప్రభువైన ఇంద్రుని సారథిని కదా ! ఈ లోకం రాక్షసులకు నిలయం. వీరితో బాంధవ్యం నాకు కుదరదు, అన్నాడు.
గరుడ లోకం తిరిగారు. ఇక్కడ కూడా యోగ్యుడైన వరుడు దొరకలేదు. రసాతలానికి వెళ్ళారు.
ఆ లోకం ప్రజలందరూ భోగమయ విలాస జీవితం గడుపు తున్నారు. అది మాతలికి రుచించలేదు.
అప్పుడు నాగలోకానికి చేరారు. ఆలోకానికి రాజధాని భోగవతి. ఆ రాజధానీ నగరంలో అన్వేషణ ఆరంభించారు.
నాగ వంశ ప్రముఖులందరి గుణగణాలనూ నారదుడు వివరిస్తూ వారిని చూపిస్తున్నాడు.
వింటూ వింటూన్న మాతలి కనులు ఒక నవసుందరాంగుని మీద నిలిచాయి.
అది గ్రహించి నారదుడు మాతలీ

నాగలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమయింది. అందులో పెద్ద ఆర్యకుడు. ఆయన కుమారుడు చికురుడు.
నువ్వు చూపే యువకుడు సుముఖుడు. ఈ సుందర గుణ సంపన్నుడయిన సుముఖుడు చికురుని ప్రియ పుత్రుడు, అని చెప్పాడు. తరువాత ‘ కుల పెద్ద ‘ అయిన ఆర్యకునితో:
‘నాయనా! ఈయన ఇంద్రసారథి మాతలి. ఈయన కుమార్తె గుణకేశి. ఆమె రూపంలోనే కాక గుణసంపదలో కూడా ఎందరికో పాఠాలు నేర్పగలది. ఆ బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపాలని మా సంకల్పం అన్నాడు.
ఆర్యకుడు దేవయినీ: వినతానందనుడైన గరుత్మంతుడు మా నాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీ రెరుగుదురు. మొన్ననే మా చికురుడు ఆయనకు ఆహారం అయాడు. అప్పుడే చెప్పాడాయన.
తరువాయి వంతు సుముఖునిది, అని. ఈ విషయం తెలిసి ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖసముద్రంలో వడల మంటారా ? ‘ అన్నాడు.
అప్పుడు మాతలిని వెంటబెట్టుకొని నారదుడు శ్రీమన్నారాయణుని సమీపించి, చేతులు జోడించి, విషయం వివరించగా ఆయన సుముఖునికి పూర్ణాయుర్దాయం అనుగ్రహించాడు.
తిరిగి వచ్చి మాతలి తన బిడ్డను నాగలోకం కొని వచ్చి సుముఖు నితో వివాహం జరిపించాడు.
వా రుభయులా అనురాగంతో ఆనందమయ దాంపత్యం సాగి స్తున్నారు.
ఈ వార్త గరుత్మంతుని చెప్పిని పడింది.
తీవ్ర క్రోధంతో నాగలోకం చేరి
‘చతుర్దశ భువనాలకూ అధిపతి అయిన మహా విష్ణువు భారాన్ని నేను తప్ప ఇతరుడు భరించ లేడని తెలియదామీకు? అంతటి శక్తికల నన్ను మీరు అవమానించారు, నామాట వినకుండా ఈ వివాహం జరిపించి’ అని అహంకార గర్వంతో తన శక్తి ప్రదర్శనకు ఉపక్రమించ బోతుండగా గ్రహించిన మహావిష్ణువు అక్కడకు వచ్చి మందహాసంతో:
‘నాయనా! వినతానందనా ! నా భారం అంతా మోయగల శక్తిమంతుడివి కదా ఏది, నా చెయ్యి ఒక్కటి నీ వీపుమీద ఉంచు తాను, చూడు,’ అని గరుత్మంతుని మీద తన చెయ్యి ఉంచాడు.
అంతే! ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని వాహనంగా ఉన్న గరుత్మంతునికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగి, కాళ్ళు పట్టుతప్పి, రెక్కలు గజగజలాడి, నోరు ఎండి నాలుక పిడచకట్టింది.
అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్ను దువ్వి ఆశ్వాసించి? ‘నాయనా గర్వం, అహంకారం, ఎప్పుడూ కొరగానివి. విన యంతో, పరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమ గతులు ప్రాప్తి స్తాయి’ అన్నాడు.
అనంతరం గరుడవాహనం మీదనే ఆయన వైకుంఠం వెళ్ళాడు.

‘చూశావా, దుర్యోధనాః గర్వం ఎటువంటి ఆపదలు తెచ్చి పెడు తుందో ! కనక అది విడిచి పెట్టాలి’ అన్నాడు కణ్వమహర్షి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sai Samaja Tambulamu In Telugu – సాయి సమాజ తాంబూలము

Sai Samaja Tambulamu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి సమాజ తాంబూలము గురించి తెలుసుకుందాం…

Sai Samaja Tambulamu Telugu

సాయి సమాజ తాంబూలము

దృష్టి లోపమో నరునిది దుష్ట పథమొ
బురదలో భ్రమించగ వీరి బుద్ధి యంత
చేయుచుండిరి స్వార్థపు చేతలెల్ల
నీవు రక్షింప మాయెద నిలువు సాయి

1

నీతి ఎరుగని వారలు నీతులరసి
అనుసరించుట మరచి బోధనల పడిరి
నీతి మరచిన జనులకు నీతి దెలిపి
నీదు మహిమలు చాటగ నిలువు సాయి

2

మురియు సంపదలను గని మూర్ఖులిచట
ఉన్న దంతయు తనదని ఉరిమి పడుచు
లేని దానికై వీరంత లేచి పడగ
ఆశకంతము ఏముండునయ్య సాయి

3

లీలలను చేసి నువ్వు నిలిపితి వయ్య
మమ్ము నీ సుందర జగతి మాటునందు
వ్యాప్తి చెందెను కాలుష్య వాయు గణము
నీదు మహిమతో వారింప నిలువు సాయి

4

అందమగు రూప లావణ్య మవని యందు .
సాంప్రదాయపు గౌరవ సంపదలును
మోడలింగులో ముత్యాల ముసుగు లోన
విలువ మరచెను చూడుము వినతి సాయి

5

మాట చెల్లిన వారికే మంతనాలు
మాటున జరుగునట్టిదే మదియు గాంచె
చిత్రమగు చేష్టలకులోన చింత పెరిగె
నీవు రావయ్య నియతిని నిలుప సాయి

6

పైకి మెరిపించు వారలు పైకములను
దోచుకుని పోవుచుండిరి దొరల తీరు
వేషములు ఎన్నొ గట్టిన వీరి వింత
నీవు మార్చగ రావయ్య నిత్య సాయి

7

మానవత్వమును మనిషి మరచి పోయి
సాటి మనుజుల చంపుచు సాకుచెపుచు
జీవకోటి నెత్తురు ముద్ద జేసియాడు
నీ మనుషులను మార్చుము ఇలను సాయి

8

నీరు లేనట్టి పంటలో నిండి గరక
పంటయే తానని భ్రమించి పరుగు లెత్తు
కోత రోజు తెలియు దాని కొసరు బ్రతుకు
మూర్ఖులిటుల భ్రమింతురు ముందు సాయి

9

కాల రాత్రిలో కలి కండ్లుకమ్మి వేయ
లోకమంత విధిని విడచి వెడల
పిచ్చి చేష్టల బ్రతుకులు పెరిగిపోవ
మమ్ము కాపాడ రావయ్య మహిత సాయి

10

రేయి పగలు మరచి నల్ల రేయి
ఒకటి లోకమంతట తిరిగెను లోకనాథ
ఎంచి చూడగ ఈ భూతమెదలు పిండి
ఏలుకొను నిన్ను బాపగ నెదిగె సాయి

11

ఆగలేని కాలానికి అవధి మరచి
అడుగు వేయక ముందు ఈ అవని లోన
అంత తనదేననుచు జీవుడరయు చుండ
అసలు సొంతమైనది యేమిటయ్య సాయి

12

నాది నీదను పోరులు నరుని యందు
తెగని రీతిగ ఎదిగెను తెలియకుండ
కుల మతాల గోడలు పెట్టి గూలు నట్టి
ఈ జనుల పోరును అణచు మిచట సాయి

13

మతము పేరిట పాపుచు మానవతను
ఉగ్రవాదము లోకాన ఉరుము చుండె
అణచి వేయు మా నాధుడవంటు మేము
నిన్ను జేరితిమిక తోడు నిలువు సాయి

14

అవనిలోన అలజడులు అధికమయ్యె
మానవత్వమును మరచి మనుజులంత
జరుపు చుండిరి మతముల జాతి పోరు
నీవు పారద్రోల నియతి నిలుపు సాయి

15

ప్రేమ చిత్రాలపై నేడు పెరిగె మోజు
మత్తులోన మునింగి మైమరచి పోయి
చదువులశ్రద్ధ చేయుచు సాగు యువత
కాలపు విలువ మరచిరి కనుము సాయి

16

దేశమన్నను ఎవరికి దెలిసి యుండు
చెప్పడానికి మాటలు చెల్లినట్లు
చెప్పినది చేయు సరికెల్ల చెదిరి పోవు
చిత్రమగు దేశ భక్తియే చింత సాయి

17

మా మతము గొప్ప చూడ మామతమె మిన్న
సాటిరాదు ఏ మతమైన సాహసించ
యనెడు మతవాదులు సిరుల అంచులందు
మరియు చుండిరి చూడుమా ముదము సాయి

18

వలదు మీకు మా భారత వనితలార
కాటిలోనికి పంపెడు కట్న కాన్క
లెల్ల, కొరివి దెయ్యములగు ఎల్లరకును
ఊర కుండని బిగించు ఉరిని సాయి

19

మేలు కొలుపుము జనులను మేళ వించి
యుద్ధమును కోరు మూర్ఖుల బుద్ధి మార్చి
ధైర్యమున వారి నణచుము తాల్మి తోడ
మమ్ము చేరెడు మా తండ్రి మహిత సాయి

20

నీతి తప్పదు తండ్రి ఈ నేల తల్లి
నీటి బొట్టు దొరకక కన్నీరు బెట్టి
నీ శరణుగోరె నొక మారు నిక్కి చూసి
ఆపదల బాపి రక్షింపుమయ్య సాయి

21

అన్న పానీయములనిచ్చు అవని ఇపుడు
అన్నమో రామచంద్రాయ టంచు అడలె
ఏమిటి మరి ఈ వింత నీ ఎదుట నింక
ఆలకించి జనుల బ్రోవు మయ్య సాయి

22

వాయిదాలకు జనులెల్ల వారసులయి
వాంఛ యున్నను వీరికి వలపు లేదు
కాంత చెంతనున్న కనులు కాన రాక
మూర్ఖ బుద్ధులవనిలోన మురియు సాయి

23

పదవి యున్నపుడు పరులు పంచజేరి
పదవి పోయిన నెవ్వరు పిదప రారు
సిరియు సైతము ఆ వేళ చిందు లేయు
పదవి జారిన సిరి కనపడదు సాయి

24

చేయ చేత కాకున్నను చిందు లేయు
చెమట విలువ తెలియ కుండు సోమరులకు
కాయకష్టమదేమిటో కాస్త దెల్పి
బద్ధకపు బుద్ధులను నీవు బాపు సాయి

25

జారిన తిరిగి రానిది జనుని మాట
కలత పెంచి కత్తులు దూయు కసిది మాట
మనసు నింపగ నుండును మంచి మాట
మాటలన్నింట నిలుపు నీ మహిమ సాయి

26

తల్లి ఋణము తీర్చుకొనగ తనను మరచి
కాన రానంతగ జవాను కదిలి పోయి
బాధలు భరించి తల్లిని భద్రపరచు
వీర పుత్రులలో మేటి వీడె సాయి

27

మాటు వేసిరి చోరులు మూట గట్ట
రాత్రి వేళలో వీరంత రాటుదేలి
పగటి వేళనే చోరీకి పాలుపడుచు
నిన్ను ముంచగ నున్నారు నిజము సాయి

28

అడుగు వేయ అలజడులు అవని యందు
వికట హాసము చేయగ వెళ్లి గూడె
ఏ క్షణమునేమి చేయునో వెక్కిరించి
ఈవు కాపాడ రావయ్య ఇలను సాయి

29

మాయ చేయ తలచి కలి మహిని ముంచ
ఆగనంతటి అహముతో అరసి చూడ
అంధులను జేసి అందినదంత దోచి
అవనికే గొప్పనౌ భారమయ్యె సాయి

30

తెల్లదొర లెల్ల ధనముల కొల్లగొట్ట
రాట్నములు మొద్దు బారెను రాతి శిలగ
ఇనుప యంత్రాలు చేనేత నిడెను చితిని
చేతి పని వారినొక మారు చేరు సాయి

31

కట్టు బొట్టు కున్న విలువ కాలరాసి
అంద చందాల పోటీలు అనుచు ఇలను
దొరికినది యంత కొందరు దోచ దలచి
కొత్త విధమున యోచింప గొనిరి సాయి

32

శిలను శిల్పముగా శిల్పి చెమట తోడ
తనను తీర్చిన దేవుని తనువు గూర్చె
శిథిలమై తాను జీవము శిలకు నింపి
నిరతము నిను కొలుచు చుండు నిజము సాయి

33

రెప్ప పాటైన రే రాజు రేయి పూట
నవ్వనంత ఆ రేయికి నగవు యేది
యింత ఈ వెన్నెలను గాంచు యింపు ఏది
నీదు మహిమల నిచ్చట నిలుపు సాయి

34

తపము చేసిన తీరని తాప మాయె
ఏమిటో ఎల్ల కాలము ఎదుగు చుండె
గాలిలో మేడ లెన్నెన్నొ గట్టి మురిసి
ఇపుడు గగనమ్ము నేదింప నెంచె సాయి

35

మంటలో గల్ప నేర్చిరి మనుజులంత
మానవీయ విలువలన్ని మతులు చెడగ
ఏమి చేయుదువో నీవు ఏలుకొనగ
తోలు బొమ్మలౌ జనులు నీ తోడు సాయి

36

మరిన్ని భక్తి గీతాలు

Alavandar Stotram In Telugu – ఆళవందార్ స్తోత్రమ్

Alavandar Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఆళవందార్ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Alavandar Stotram Lyrics Telugu

ఆళవందార్ స్తోత్రమ్

స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం
స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయమ్,
నమో నమో యామునాయ యామునాయ నమో నమః
నమో నమో యామునాయ యామునాయ నమో నమః

నమో యామున పాదాబ్జరేణుభిః పావితాత్మనే
విదితాఖిల వేద్యాయ గురవే విదితాత్మనే,
నమో చింత్యాద్భుతాక్లిష్టజ్ఞానవైరాగ్యరాశయే
నాథాయ మునయే గాధభగవద్భక్తిసింధవే.

1

తస్మై నమో మధుజిదంఫ్రిసరోజతత్త్వ
జ్ఞానానురాగ మహిమాతిశయంత సీమ్నే,
నాథాయ నాథమునయే త్ర పరత్రచాపి
నిత్యం యదీయ చరణా శరణం మదీయమ్.

2

భూయో నమో పరిమితాచ్యుతభక్తితత్త్వ
జ్ఞానామృతాబ్ధిపరివాహశుభైర్వచోభిః,
లోకే వతీర్ణ పరమార్థసమగ్రభక్తి –
యోగాయ నాథమునయే యమినాం వరాయ.

3

తత్త్యేనయశ్చిదచిదీశ్వర తత్స్వభావ –
భోగాపవర్గతదుపాయగతీ రుదారః,
సందర్శయన్నిరమిమీత పురాణరత్నం
తస్మై నమో మునివరాయ పరాశరాయ.

4

మాతా పితా యువతయస్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్,
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం
శ్రీమత్తదంఫ్రియుగళం ప్రణమామి మూర్ఖ.

5

యన్మూర్క్ట్ని మే శ్రుతిశిరస్సు చ భాతి యస్మిన్
అస్మన్మనోరథపథః సకలస్సమేతి,
స్తోష్యామి నః కులధనం కులదైవతం తత్
పాదారవిందమరవిందవిలోచనస్య.

6

తత్త్వేన యస్య మహిమార్ణవ శీకరాణుః
శక్యో న మాతుమపి శర్వపితామహాద్యైః,
కర్తుం తదీయమహిమస్తుతి ముద్యతాయ
మహ్యం నమో స్తు కవయే నిరపత్రపాయ.

7

యద్వాశ్రమావధి యథామతి వా ప్యశక్తః
స్తామ్యేవమేవ ఖలు తే పి సదా స్తువంతః,
వేదాశ్చతుర్ముఖ ముఖాశ్చ మహార్ణవాన్తః
కో మజ్జతోరణుకులాచలయోర్విశేషః.

8

కించైష శక్త్యతిశయేన న తే నుకమ్ప్యః
స్తోతా పితుస్తుృతికృతేన పరిశ్రమేణ,
తత్ర శ్రమస్తు సులభో మమ మందబుద్ధేః
ఇత్యుద్యమో యముచితో మమ చాబ్జనేత్ర !

9

నావేక్షసే యది తతో భువనాన్యమూని
నాలం ప్రభో ! భవితుమేవ కుతః ప్రవృత్తిః,
ఏవం నిసర్గసుహృది త్వయి సర్వజంతోః
స్వామిన్ ! న చిత్రమిదమాశ్రితవత్సలత్వమ్.

10

స్వాభావికానవధికాతిశయేశితృత్వం
నారాయణ ! త్వయి న మృష్యతి వైదికః కః,
బ్రహ్మా శివశ్శతమఖః పరమస్స్వరాడి
త్యేతే పి యస్య మహిమార్ణవవిప్రుషస్తే.

11

కశ్రీశ్రియః పరమసత్త్వసమాశ్రయః కః
కః పుండరీకనయనః పురుషోత్తమః కః,
కస్యాయుతాయుత శతైకకలాంశకాంశే
విశ్వం విచిత్ర చిదచిత్ప్ర విభాగ వృత్తమ్.

12

వేదాపహార గురుపాతక దైత్యపీడా –
ద్యాపద్విమోచన మహిష్మఫలప్రదానైః,
కో న్యః ప్రజాపశుపతీ పరిపాతి కస్య
పాదోదకేన సశివస్స్వశిరోద్ధృతేన.

13

కస్యోదరే హరివిరించిముఖఃప్రపంచః
కో రక్షతీమమజనిష్ట చ కస్య నాభేః,
క్రాన్తా నిగీర్వ పునరుద్గిరతి త్వదన్యః
కః కేన చైష పరవానితిశక్యశంకః.

14

త్వాం శీలరూపచరితైః పరమప్రకృష్ట –
సత్యేన సాత్త్విక తయా ప్రబలైశ్చ శాస్త్రిః,
ప్రఖ్యాతదైవపరమార్థవిదాం మతైశ్చ
నైవాసుర ప్రకృతయః ప్రభవన్తి బోద్ధుమ్.

15

ఉల్లంఘితత్రివిధసీమసమాతిశాయి
సంభావనం తవ పరిద్రఢిమస్వభావమ్,
మాయాబలేన భవతా పి నిగూహ్య మానం
పశ్యంతి కేచిదనిశం త్వదనన్యభావాః.

16

యదణ్డమణ్ణాంతర గోచరం చ యత్
దశోత్త రాణ్యావరణాని యాని చ,
గుణాః ప్రధానం పురుషః పరం పదం
పరాత్పరం బ్రహ్మ చ తే విభూతయః.

17

వశీ వదాన్యో గుణవాన్ ఋజుశ్శుచిః
మృదుర్ధయాళుర్మధురస్థిరస్సమః,
కృతీ, కృతజ్ఞస్త్వమసి స్వభావతః
సమస్తకల్యాణ గుణామృతోదధిః.

18

ఉపర్యుపర్యబ్జభువో పి పూరుషాన్
ప్రకల్ప్యతే యే శతమిత్యనుక్రమాత్,
గిరస్త్వదేకైకగుణావధీప్సయా
సదా స్థితా నోద్యమతో తిశేరతే.

19

త్వదాశ్రితానాం జగదుద్భవస్థితి –
ప్రణాశ సంసారవిమోచనాదయః,
భవన్తి లీలావిధయశ్చ వైదికాః
త్వదీయగంభీరమనోనుసారిణః.

20

నమో నమో వాఙ్మనసాతి భూమయే
నమో నమో వాఙ్మనసైక భూమయే,
నమో నమో నంత మహావిభూతయే
నమో నమో నంత దయైక సింధవే.

21

న ధర్మనిష్లో స్మిన చాత్మవేదీ
న భక్తి మాంస్త్వచ్చరణారవిందే,
అకించనో నన్యగతి శ్శరణ్యం
త్వత్పాదమూలం శరణం ప్రపద్యే.

22

న నిందితం కర్మ తదస్తి లోకే
సహస్రశో యన్నమయా వ్యధాయి,
సో హం విపాకావసరే ముకుంద !
క్రందామి సంప్రత్యగతిస్తవాగ్రే.

23

నిమజ్జతో నంత భవార్ణవాంతః
చరాయ మే కూలమివాసి లబ్ధః,
త్వయా పి లబ్ధం భగవన్ ! ఇదానీం
అనుత్తమం పాత్రమిదం దయాయాః.

24

అభూతపూర్వం మమ భావి కింవా
సర్వం స హే మే సహజం హి దుఃఖమ్,
కింతు త్వదగ్రే శరణాగతానాం
పరాభవో నాథ ! న తే నురూపః.

25

నిరాసకస్యాపి న తావ దుత్సహే
మహేశ హాతుం తవ పాదపంకజమ్,
రుషా నిరస్తో పి శిశుః స్తనంధయః
న జాతు మాతుశ్చరణా జిహాసతి.

26

తవామృతస్యందిని పాదపంకజే
నివేశితాత్మా కథమన్యదిచ్ఛతి,
స్థితే రవిందే మకరంద నిర్భరే
మధువ్రతో నేక్షురకం హి వీక్షతే.

27

త్వదంఫ్రి ముద్దిశ్య కదా పి కేనచిత్
యథా తథా వా పి సకృత్ కృతో జలిః,
తథైవ ముష్ణాత్యశుభాన్యశేషతః
శుభాని పుష్ణాతి న జాతు హీయతే.

28

ఉదీర్ణసంసారదవాశుశుక్షణిం
క్షణేన నిర్వాపపరాం చ నిర్వృతిమ్,
ప్రయచ్ఛతి త్వచ్ఛరణారుణాంబుజ
ద్వయానురాగామృత సింధుశీకరః.

29

విలాసవిక్రాంతపరావరాలయం
నమస్యదార్తిక్షపణే కృతక్షణమ్,
ధనం మదీయం తవ పాదపంకజం
కదాను సాక్షాత్కరవాణి చక్షుషా.

30

కదా పునశ్శంఖరథాంగకల్పక –
ధ్వజారవిందాంకుశవజ్రలాంఛనమ్,
త్రివిక్రమ ! త్వచ్చరణాంబుజద్వయం
మదీయమూర్ధాన మలంకరిష్యతి.

31

విరాజమానోజ్జ్వలపీతవాససం
స్మితాతసీసూన సమామలచ్ఛవిమ్,
నిమగ్ననాభిం తనుమధ్యమున్నతం
విశాలవక్షఃస్థలశోభిలక్షణమ్.

32

చకాస తం జ్యాకిణకర్క శైశ్శుభైః
చతుర్భి రాజానువిలంబిభిర్భుజైః,
ప్రియావతంసోత్పలకర్ణభూషణ
శ్లథాలకాబంధవిమర్ధశంసిభిః.

33

ఉదగ్రపీనాంసవిలంబికుండలా
లకావలీబంధురకంబుకంధరమ్,
ముఖశ్రియాన్యక్కృతపూర్ణనిర్మలా
మృతాంశుబింబాంబురుహోజ్జ్వలశ్రియమ్.

34

ప్రబుద్ధముగ్ధాంబుజ చారులోచనం
సవిభ్రమభ్రూలతముజ్జ్వలాధరమ్,
శుచిస్మితం కోమలగండమున్నసం
లలాటపర్యంతవిలంబితాలకమ్.

35

స్ఫురత్కిరీటాంగదహారకంఠికా
మణీంద్రకాంచీగుణనూపురాదిభిః,
రథాంగశంఖాసిగదాధనుర్వరైః
లసత్తులస్యావనమాలయోజ్జ్వలమ్.

36

చకర్ధయస్యా భవనం భుజాంతరం
తవ ప్రియం ధామ యదీయజన్మభూః,
జగత్సమస్తం యదపాంగ సంశ్రయం
యదర్థ మంభోధి రమంథ్యబంధి చ.

37

స్వవైశ్వరూ ప్యేణ సదానుభూతయా
ప్యపూర్వవద్విస్మయమాదధానయా,
గుణేన రూపేణ విలాసచేష్టితైః
సదా తవైవోచితయా తవ శ్రియా.

38

తయా సహాసీనమనంత భోగిని
ప్రకృష్టవిజ్ఞాన బలైకధామని,
ఫణామణివ్రాత మయూఖమండల –
ప్రకాశమానోదరదివ్యధామని.

39

నివాసశయ్యాసనపాదుకాంశుకో –
పధాన వర్షాతపవారణాదిభిః,
శరీర భేదైస్తవ శేషతాంగతైః
యథోచితం శేష ఇతీర్యతే జనైః.

40

దాసస్సఖా వాహనమాసనం ధ్వజో
యస్తేవితానం వ్యజనం త్రయీమయః,
ఉపస్థితం తేన పురో గరుత్మతా
త్వదంఫ్రిసమ్మర్దకిణాంకశోభినా.

41

త్వదీయభుక్తోజ్ఞితశేషభోజినా
త్వయానిసృష్టాత్మభరేణ యద్యథా,
ప్రియేణ సేనాపతినా న్యవేదితత్
తథానుజానంత ముదారవీక్షణైః.

42

హతాఖిలక్లేశమలైః స్వభావతః
త్వదా నుకూల్యైకర సైస్తవోచితైః,
గృహీతతత్తత్పరిచారసాధనైః
నిషేవ్యమాణం సచివైర్యథోచితమ్.

43

అపూర్వనానారసభావనిర్భర –
ప్రబుద్ధయా ముగ్ధవిదగ్ధలీలయా,
క్షణాణువక్షిప్త పరాది కాలయా
ప్రహర్షయంతం మహిషీం మహాభుజమ్.

44

అచింత్య దివ్యాద్భుతనిత్యయౌవన –
స్వభావలావణ్యమయామృతోదధిమ్,
శ్రియః శ్రియం భక్తజనైక జీవితం
సమర్థమాపత్సఖమర్థికల్పకమ్

45

భవన్తమేవానుచరన్నిరంతరం
ప్రశాంత నిశ్శేషమనోరథాంతరః,
కదాహమైకాన్తిక నిత్యకింకరః
ప్రహర్ష యిష్యామి సనాథజీవితః.

46

ధిగశుచి మవినీతం నిర్దయం మామలజ్జం
పరమపురుష! యో హం యోగివర్యాగ్రగణ్యైః,
విధిశివసనకాద్యైః ధ్యాతుమత్యంతదూరం
తవ పరిజన భావం కామయే కామవృత్తః.

47

అపరాధ సహస్రభాజనం, పతితం భీమభవార్ణవోదరే,
అగతిం శరణాగతం హరే ! కృపయాకేవల మాత్మసాత్కురు.

48

అవివేకఘనాంధదిఙ్మఖే బహుధా సంతత దుఃఖవర్షిణి,
భగవన్ ! భవదుర్దినేపథః, స్థలితం మామవలోకయాచ్యుత !

49

న మృషి పరమార్థమేవ మే, శృణు విజ్ఞాపనమేకమగ్రతః,
యది మే న దయిష్యసే, తతో, దయనీయస్తవ నాథ! దుర్లభః.

50

తదహం త్వ దృతే న నాథవాన్, మదృతే త్వం దయనీయవాన్ న చ,
విధినిర్మిత మేత దన్వయం, భగవన్ ! పాలయ మాస్మ జీహపః.

51

వపురాదిషు యో పికో పి వా, గుణతో సానియథాతథావిధః,
తదయం తవ పాదపద్మయోః, అహమద్యైవ మయా సమర్పితః.

52

మమ నాథ ! యదస్తి యో స్మ్యహం
సకలం తద్ది తవైవ మాధవ !
నియత స్వమితి ప్రబుద్ధధీః
అథవా కింను సమర్పయామి తే.

53

అవబోధిత వానిమాం యథా
మయి నిత్యాం భవదీయతాం స్వయమ్,
కృపయైవమనన్య భోగ్యతాం
భగవన్ ! భక్తిమపి ప్రయచ్ఛ మే.

54

తవ దాస్య సుఖైక సంగినాం
భవనైష్వస్త్యపి కీటజన్మ మే,
ఇతరావసథేషు మాస్మభూత్
అపి మే జన్మ చతుర్ముఖాత్మనా.

55

సకృత్యదాకారవిలోకనాశయా
తృణీకృతానుత్తమభుక్తిముక్తిభిః,
మహాత్మభిర్మామవలోక్య తాం నయ
క్షణే పి తే యద్విరహో తిదుస్సహః.

56

న దేహం నప్రాణాన్ న చ సుఖమశేషాభిలషితం
నచాత్మానం నాన్యత్ కిమపి తవ శేషత్వవిభవాత్,
బహిర్భూతం నాథ ! క్షణమపి సహే యాతు శతధా
వినాశం తత్సత్యం మథుమథన ! విజ్ఞాపనమిదమ్.

57

దురంతస్యానాదేరపరిహరణీయస్య మహతః
విహీనాచారో హం నృపశురశుభస్యాస్పదమపి,
దయాసింధో ! బంధో ! నిరవధిక వాత్సల్యజలధే !
తవ స్మారంస్మారం గుణగణమితీచ్ఛామి గతభీః.

58

అనిచ్ఛన్న ప్యేవం యదిపునరితీచ్ఛన్నివ రజ
స్తమశ్చన్నచ్ఛద్మ స్తుతివచనభంగీమరచయమ్,
తథా పీతం రూపం వచనమవలంబ్యాపి కృపయా
త్వమేవైవం భూతం ధరణిధర ! మే శిక్షయ మనః.

59

పితా త్వం మాతా త్వం దయితతనయస్త్వం ప్రియసుహృత్
త్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చాసి జగతామ్,
త్వదీయస్త్వద్భ ృత్యస్తవ పరిజనస్త్యద్గతిరహం
ప్రపన్నశ్చైవం సత్యహమపి తవైవాస్మి హి భరః.

60

జనిత్వా హం వంశే మహతి జగతి ఖ్యాతయశసాం
శుచీనాం యుక్తానాం గుణపురుషతత్త్వస్థితి విదామ్,
నిసర్గాదేవ త్వచ్ఛరణకమలైకాంత మనసాం
అథోథః పాపాత్మా శరణద! నిమజ్జామి తమసి

61

అమర్యాదః క్షుద్రశ్చలమతి రసూయాప్రసవభూః
కృతఘ్నా దుర్మానీ స్మరపరవశో వంచనపరః,
నృశంసః పాపిష్ఠః కథమహమితో దుఃఖజలధేః
అపారాదుత్తీర్ణస్తవ పరిచరేయం చరణయోః.

62

రఘువర ! యదభూస్వం తాదృశో వాయసస్య
ప్రణత ఇతి దయాళుర్యచ్చ వైద్యస్య కృష్ణ !
ప్రతిభవమపరాద్ధుర్ముగ్ధ ! సాయుజ్యదో భూః
వద కిమపద మగస్తస్య తే స్తి క్షమాయాః.

63

నను ప్రసన్నః సకృదేవ నాథ !
తవా హమస్మీతి చ యాచమానః,
తవా ను కంప్యః స్మరతః ప్రతిజ్ఞాం
మదేకవర్ణం కిమిదం వ్రతం తే.

64

అకృత్రిమత్వచ్చరణారవింద –
ప్రేమప్రకర్షావధిమాత్మవంతమ్,
పితామహం నాథమునిం విలోక్య
ప్రసీద మద్వ ృత్తమచింతయిత్వా.

65

యత్పదాంభోరుహధ్యాన, విధ్వస్తాశేషకల్మషః,
వస్తుతాముపయాతో హం, యామునేయం నమామి తమ్.

ఇతి శ్రీ ఆళవందార్ స్తోత్రం సంపూర్ణమ్

మరిన్ని స్తోత్రములు

Vimdivo Lakshmipati Vimdivo Sarvesumdu In Telugu – వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు

వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
సంఖ్య : 402
పుట : 271
రాగం : రామక్రియ

రామక్రియ

23 వీఁడివో లక్ష్మీపతి వీఁడివో సర్వేశుఁడు
వీఁడివో కోనేటిదండవిహరించేదేవుఁడు.

||పల్లవి||

కొండ గొడగుగ నెత్తి గోవులఁ గాచె నాఁడు
కొండవంటిదానవునిఁ గోరి చించెను
కొండ శ్రీవేంకట మెక్కి కొలు వున్నాఁ డప్పటిని
కొండవంటి దేవుఁ డిదే కోనేటికఱుతను.

||వీఁడ||

మాఁకులమద్దులు దొబ్బి మరి కల్పభూజమనే-
మాఁకు వెరికి తెచ్చెను మహిమీఁదికి
మాఁకుమీఁద నెక్కి గొల్లమగువలచీర లిచ్చి
మాఁకులకోనేటిదండ మరిగినాఁ డిదివో.

||వీఁడ||

శేషునిపడగెనీడఁ జేరి యశోదయింటికి
శేషజాతి కాళింగుఁ జిక్కించి కాచె
శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై
శేషమై కోనేటిదండఁ జెలఁగీని దేవుఁడు.

||వీఁడ|| 402

అవతారిక:

తాళ్ళపాకలో వెలసిన ‘కోనేటిరాయనిపై’ చక్కటి కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. వీడివో (వీడే) లక్ష్మీపతి, వీడే సర్వేశ్వరుడు అని కీర్తిస్తున్నారు. భావ వివరణనంతా చదివాక మీకు అంతులేని ఆనందం కలుగుతుందని నాకు ప్రగాఢ విశ్వాసము. శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై శేషమై కోనేటిదండ చెలగీని దేవుడు అంటే యెన్నైనా అర్థములు చెప్పవచ్చును. ఈ స్వామి తీయటి నీటి బావి. తోడుకున్న వారికి తోడుకొన్నన్ని నీళ్ళు. అవునా?

భావ వివరణ:

ఓ ప్రజలారా! వీడివో (ఈతడే లక్ష్మీపతి, వీడివో సర్వేశుడు (సర్వమునకు ప్రభువు), ఈతడే ఈ కోనేటి ఒడ్డున విహరించే దేవదేవుడు. ఈయన ఘన కార్యములనాకర్ణించండి.

పూర్వం ఈయన కొండను గొడుగుగనెత్తి (నంద వ్రజమున గోవర్ధన పర్వతమును తన చిటికిన వ్రేలి పై గొడుగువలె యెత్తి గోకులమును రక్షించినాడు). కోరి, కొండవంటి దానవుని (శకటాసురుని) చించెను (ముక్కలు ముక్కలు చేశాడు). అప్పటిని (మరల ఈ కలియుగంలో శ్రీవేంకటగిరి అనే కొండనెక్కి కొలువు దీరియున్నాడు. నిజముగా ఈ స్వామి ఇదే ఈ కోనేటి కఱుతను (ఒడ్డున… అని… భావిస్తున్నాను) కొండవంటి అండయైయున్నాడు.

పూర్వం ఈయన మద్దిమాకులను (రేపల్లెలో నందుని ప్రాంగణమున వున్న రెండు మద్ది చెట్లను) దొబ్బి (త్రోసివేసి) కూల్చినాడు (మద్దిచెట్లవలెనున్న గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడు). ఈ శ్రీకృష్ణుడే స్వర్గలోకంనుండి కల్పవృక్షము అను మాకును (దేవవృక్షమును) వారికి (పెకలించి) మహిమీదకు (భూలోకానికి) తెచ్చెను. ఈయనే గొల్లమగువల చీరెలెత్తుకొనిపోయి మాకుమీదనెక్కి (యమునానది ఒడ్డునవున్న చెట్టునెక్కి వారు శరణన్న తరువాత తిరిగి ఇచ్చినాడు. ఇదిగో నేడు ఈ కోనేటి ఒడ్డున మాకుల మధ్య మరిగినాడు (పరిచితమవుచున్నాడు).

వసుదేవుడు బాలకృష్ణుని యమునానది దాటిస్తుంటే కుండపోతగా వానవచ్చింది. అప్పుడు శేషుడు తన పడిగెలను గొడుగులాకప్పినాడు. స్వామి ఆ పడిగెల నీడలో యశోద ఇంటికి చేరినాడు. శేషజాతి సర్పమైన కాళింగు శిరసుల ద్రొక్కి రక్తం కక్కించి అతను శరణన్నాక కరుణించి విడిచిపెట్టాడు. ఇదే దేవుడు శేషాచలము అనే శ్రీవేంకటాద్రిపైనున్న కోనేటిదండ (కోనేటి ఒడ్డున) చెలగీనీ దేవుడు (శ్రీవేంకటేశ్వరుడై శోభిల్లుతున్నాడు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Shiva Naamavali Ashtakam In Telugu – శివనామావళ్యాష్టకమ్

Shivanamavalya Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివనామావళ్యాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Shiva Namavali Ashtakam Lyrics In Telugu

శివనామావళ్యాష్టకమ్

హేచంద్రచూడ మదనాంతక శూలాపాణే
స్థాణో గిరీశ మహేశ శంభో
భూతేశ భీతభయసూదన మా మనాథం
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

1

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

2

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

3

హే విశ్వనాథ శివ శంకర దేవదేవ
గంగాధర ప్రమథనాయక నందికేశ
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

4

వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖ కాల విభో గణేశ
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

5

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో
హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ
భస్మాంగ రాగ నృకపాలకలాపమాల
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

6

కైలాసశైలవినివాస వృషాకపేహే
మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస
నారాయణ ప్రియమదాపహ శక్తినాథ
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

7

విశ్వేశ విశ్వ భవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ
హే విశ్వబంధు కరుణామయ దీనబంధో
సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష॥

8

మరిన్ని అష్టకములు

Chekoni Koluvaro Sri Narasinhamu In Telugu – చేకొని కొలువరో శ్రీనరసింహము

చేకొని కొలువరో శ్రీనరసింహము - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో చేకొని కొలువరో శ్రీనరసింహము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చేకొని కొలువరో శ్రీనరసింహము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : చేకొని కొలువరో శ్రీనరసింహము
సంఖ్య : 567
పుట : 381
రాగం : సాళంగనాట

సాళంగనాట

19 చేకొని కొలువరో శ్రీనరసింహము
శ్రీకరమగు నిదె శ్రీనరసింహము

||పల్లవి||

వెడలేటివూర్పుల వేఁడిమి చల్లీ
చిడుముడికోపపు శ్రీనరసింహము
గడగడవడఁకేటిగండస్థలములు
జెడలు గదలిచీ శ్రీనరసింహము

||చేకొ||

వంకరగోళ్లవైపులు వెదకీ
చింకచూపులను శ్రీనరసింహము
హుంకారంబుల నుదధులు గలఁచీ-
నంకెల శ్రీపతియగు నరసింహము

||చేకొ||

వదనము దిప్పుచు వడి నసురమేను
చిద్రుపలు చేసెను శ్రీనరసింహము
అదివో శ్రీవేంకటాద్రి యెక్కి యిటు
చెదరక నిలిచెను శ్రీనరసింహము,

||చేకొ|| 567

అవతారిక:

అన్నమాచార్యులవారికి భజన అంటే ప్రత్యేకమైన ప్రీతి అని నా నమ్మకం. ఉగ్రనరసింహునిపై వారు చెప్పిన ఈ భజన మీ మనస్సులను ప్రక్షాళన చేస్తుంది. నిశితమైన వర్ణన అంటే (మైన్యూట్ డిస్క్రిప్షన్) అది యెలావుంటుందో ఇది వింటే తెలుస్తుంది. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని చిత్రహింసలు పెట్టి ఈ స్తంభములో వాడిని (శ్రీహరిని) చూపించకపోతే స్వయంగా, తనే ప్రహ్లాదుని చంపేస్తానన్నాడు హిరణ్యకశిపుడు. ఆవేశం కట్టలు తెంచుకొని, పగిలిన స్తంభంలోంచి వెడలివచ్చిన శ్రీనరసింహుడు యెలావున్నాడయ్యా! అంటే… “శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు) శ్రీసతివల్లభా”! అని ప్రార్థించండి.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఇదే శ్రీనరసింహము. ఈ దేవదేవుని చేకొని (పూనుకొని) కొలువరే (మ్రొక్కి సేవించండి). ఈ నరసింహము మనకు శ్రీకరుడు (శు భములనొసగు మహానుభావుడు).

ఈ శ్రీనరసింహము చిడుముడి కోపమువాడు (తొట్రుపాటు కలుగజేసే కోపధారి). చూడండి తన కోపము చేత వెడలేటివూర్పులు (బయల్వెడలు ఉచ్ఛ్వాస నిస్వాసములతో) వేడిసెగల నెట్లా వెదజల్లుతున్నాడో గమనించండి. ఆయన గండస్థలము (రెండు చెక్కిళ్ళూ) ఉద్రేకంతో గడగడమని వణుకుతున్నాయి. అందుచేత ఈ శ్రీనరసింహము యొక్క జడలు (జూలు) పైకి క్రిందికి కదలుచున్నది.

ఈ శ్రీనరసింహము వంకరలు తిరిగిన పంజాగోళ్ళతో వాటివైపు చూసుకొంటూ (రక్తం అంటినదోలేదోనని) చింక చూపులు (భీతహరిణేక్షణములతో) చూస్తున్నాడు. ఈ శ్రీనరసింహము యొక్క హూంకారమునకు, వుదధులు (సాగరములు అన్నియును కలచీ (కల్లోలమైపోతున్నాయి.) ఈ స్వామి అంకెల శ్రీపతి (తన ప్రియసతి శ్రీలక్ష్మిని తన తొడపైననే కూర్చుండబెట్టిన శ్రీనాథుడు.

ఈస్వామి తనతొడపైనున్న హిరణ్యకశిపుని మేను (శరీరాన్ని) తన వదనము వడి తిప్పుచూ (తన మొగమును వేగంగా అటూ ఇటూ కదలించుచూ) చిద్రుపలు చేసెను. (చిన్న చిన్న ఖండములుగా చేసినాడు). ఇంత ఘోర భీభత్సం చేసిన ఈ శ్రీనరసింహము చెదరక (ఏమాత్రమూ చలించక) అదివో శ్రీవేంకటాద్రినెక్కి యిటు (ఈవిధముగా) శ్రీవేంకటేశ్వరుడై నిలిచియుండి, మనబోంట్లను అనుగ్రహిస్తున్నాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: