Aevvarum Ganani Vamdu Yashoda Gane Natte In Telugu – ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 2
కీర్తన : ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
సంఖ్య : 316
పుట : 213
రాగం : శంకరాభరణం

శంకరాభరణం

36 ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
పవ్వళించే బ్రహ్మతండ్రి బాలుఁడయ్యె నట్టె

||పల్లవి||

ఘనయోగీంద్రులమతిఁ గట్టువడనట్టివాఁడు
పనిలేక రోలఁ గట్టువడినాఁడట్టె
తనియ సురలకు పాదము చూపనట్టివాఁడు
మొనసి బండిమీఁద మోపినాఁ డట్టె.

||ఎవ్వ||

అమృతము చేతఁ దచ్చి అందరికిచ్చినవాఁడు
తమితో వెన్న దొంగిలెఁ దానె యట్టె
గుమురై దేవదానవకోటికిఁ జిక్కనివాఁడు
భ్రమసి గోపికలపాలఁ జిక్కినాఁ డట్టె.

॥ఎవ్వ||

యిందుఁ గలఁ డిందులేఁడనెంచి చూపరానివాఁడు
అందమై రేపల్లెవాడ నాడీనట్టే
అంది కృష్ణావతారముయినట్టిదేవుఁడే
యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచె నట్టె.

||ఎవ్వ|| 316

అవతారిక:

ఒకరోజు యశోదకు కృష్ణయ్య అల్లరి వినిపించడం లేదేమిటబ్బా! అని కొడుకును రహస్యంగా చూద్దామని మెల్లిగా నక్కి చూసిందట. అక్కడ పడుకొన్నది ఆవిడ కొడుకా? ఆయన, పరమేష్ఠితండ్రి, ఆదినారాయణుడు. కొంచెం తెరుచుకొనియున్న ఆస్వామినోట్లోంచి లోకాలన్నీ కనిపిస్తున్నాయట. దిమ్మతిరిగి పోయిందావిడకి. ఆయన ఎవ్వరూచూడలేని శ్రీమన్నారాయణుడు. భయంతో చేతులు జోడించిందా గొల్లది. చటుక్కున లేచి “అమ్మా”! అన్నాడు. అంతా కలలాగా మరచిపోయింది ఆ వెట్టితల్లి. అన్నమాచార్యులవారి ఈ అద్వితీయ కీర్తనకి ఈ పిట్టకధే మూలభూతి. దీనిని భావించి తరించండి.

భావ వివరణ:

ఆహా! ఏమి ఈ యశోద భాగ్యము! ఎవ్వరూ గాననివాడు (అగోచరుడై యెవ్వరికీ కనుపించని పరమాత్మ) ఈమె పొత్తిళ్ళలో పవ్వళించినాడే!! ఈ దేవదేవుడే, పితామహుడైన బ్రహ్మకే కన్నతండ్రియా? అట్టె (అతిసులువుగా) బాలుడయ్యెను. ఏమి ఆశ్చర్యము.

ఘనులైన యోగీశ్వరుల మదిలోకూడా కట్టుబడనివాడు, ఓహెూ! ఈనాడు రేపల్లెలో ఒక పనిలేని రోటికి కట్టబడినాడే!! సుకుమారమైన ఆయన పాదములెలావుంటాయో చూడాలని తహతహలాడే దేవతలకు తన అరిపాదములను చూపనట్టిదేవుడు ఈరోజు రేపల్లెలో ఒక కొయ్య బండికి చూపించి సూటిగా తన్నాడే!! ఏమి ఆ శకటాసురుని అదృష్టము!!

అమృతము కొరకై క్షీరసాగరమును చిలికించి, నిస్వార్ధంగా దేవతలందరికీ పంచిపెట్టించిన పురుషోత్తముడు, తానే తమితో (ఆసక్తితో) గోపికల ఇండ్లలో వెన్నదొంగిలించుచున్నాడే!! గుమురై (గుమిగూడిన) దేవదానవ కోట్లకు కూడా చిక్కని శ్రీమన్నారాయణుడు, నేడు బృందావనమున గొల్లభామలకు భ్రమకలిగినవానిలా చిక్కినాడే!! ఏమివింత!

ఇందుగలడు, ఇందులేడు అని ఇదమిద్ధంగా యెంచి చూపశక్యముకాని సర్వాతర్యామి ఈ రేపల్లెవాడలలో యెంత అందముగా ఆడుచున్నాడో చూడండి. ఆనాడు (ద్వాపరయుగమున) కృష్ణావతారమునంది పైలీలలన్నీ చేసినట్లే నేటి కలియుగంలో, యిందున (ఈ తిరుమలలో) శ్రీవేంకటాద్రి నెక్కి శ్రీవేంకటేశ్వరుడై నిలిచియున్నాడే!! ధన్యోస్మి తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Uma Maheshwara Sthotram In Telugu | ఉమా మహేశ్వర స్తోత్రం

Uma Maheshwara Sthotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమా మహేశ్వర స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Uma Maheshwara Sthotram In Telugu Lyrics

ఉమా మహేశ్వర స్తోత్రం

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

1

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

2

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ట్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

3

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

4

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

5

నమః శివాభ్యామతిసుందరాభ్యా
మత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

6

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాలకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

7

నమః శివాభ్యామశుభాపహాభ్యా
మశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

8

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

9

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాభోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

10

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

11

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

12

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే
శతాయురాంతే శివలోకమేతి ||

13

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణమ్ |

మరిన్ని స్తోత్రములు:

Ramakrishna Nivu Nande Rajyameluchundudhuvu In Telugu – రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు

రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 3
కీర్తన : రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
సంఖ్య : 432
పుట : 291
రాగం : లలిత

లలిత

20 రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు
యేమిసేసే విక్కడ నీ యిరవుకే పదవే

||పల్లవి||

లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు
అంకె సుగ్రీవుఁ గిష్కింధ కంపినయట్టు
వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు
వేంకటాద్రిపొంతనుండ వేగ మమ్ము నంపవే

||రామ||

ఘనకిరీటము దేను గరుడని నంపినట్టు
అనుఁగుఁగపుల నిండ్ల కంపినట్టు
వొనర గోపికలొద్ది కుద్ధవుని నంపినట్టు
నునుపు శేషాద్రినుండ నన్ను నంపవే.

||రామ||

పెండిలికిఁ బరుషలఁ బిలువఁగ నంపినట్టు
అండనే ముందరఁ గంత కంపినయట్టు
వెండియు శ్రీవేంకటేశ వేఁట వచ్చి మరలితి-
వుండ(డు?) చోటనుండి నన్ను వూడిగాన కంపవే.

॥రామ॥ 432

అవతారిక:

ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవూ నీవు అక్కడ క్షేమంగా ప్రజలనేలుకోండయ్యా! ఇక్కడ ఈ కలియుగంలో మీరేం చేస్తారు? మీ మీ చోట్లకి (అయోధ్య, ద్వారకకీ) పదవే… అని చమత్కరిస్తున్నారు అన్నమయ్య. మీరు అక్కడకు పోయి, నన్ను మాత్రం వేంకటాద్రికీ, శేషాద్రికీ శ్రీవేంకటేశ్వరుని వూడిగం చేయమని కాస్త అనుగ్రహంతో పంపండయ్యా! విభీషణుణ్ణి, సుగ్రీవునీ, హనుమంతుని, గరుత్మంతుని, ఉద్ధవుని, వానరసేనను యెక్కడికెక్కడికో పంపారు కదా! అట్లాగే నన్నూ తిరుమలలో వుండరా అని పంపించండి అంటున్నారు. “అండనే ముందర కంత కంపినయట్లు” – అంటే యేమిటి? చదవక తప్పదు… భావవివరణ.

భావ వివరణ:

ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవున్ అందే రాజ్యమేలుచుండుదువు (నీవూ నీవూ అక్కడే ప్రజారంకముగా రాజ్యమేలుచుందువు). ఇక్కడ యేమిసేసేవు? నీ ఇరవుకు (మీమీ స్థానాలకు) నీవు అయోధ్యకు నీవు ద్వారకకు, పదవే (వెడలుడయ్యా!)

లంకలో విభీషణుని వద్దకు లక్ష్మణుని పంపి పట్టాభిషిక్తుని చేయించినట్లున్నూ, సుగ్రీవునికి కిష్కింద నేలుటకు పంపినట్లున్నూ, వాయునందనుడైన హనుమంతుని సంజీవని తెచ్చుటకు పంపినట్లున్నూ, మమ్మల్ని కూడా వేంకటాద్రి పొంతనుండి (దాపున నుండుటకు) నియోగించరాదా ప్రభూ!

నీ కిరీటమును తెమ్మని ఆనాడు గరుత్మంతుని పంపినట్లున్నూ, పట్టాభిషేకానంతరము అయోధ్య నుండి వానరసేనను తిరిగి కిష్కింధకు పంపివేసినట్లున్నూ, వేదన చెందుచున్న గోపికలవద్దకు ఓదార్చి హితబోధ చేసిరమ్మని నందవ్రజమునకు ఉద్ధవుని పంపించినట్లున్నూ, అనుపు శేషాద్రి నుండి (శేషాద్రినుండమని ఆనతీయుచూ నన్ను కూడా పంపించరాదా తండ్రీ!

నీ పెండ్లి పద్మావతితో జరుగుతుంది చూచుటకు విచ్చేయుడని పరుషలను (నీ భక్తులను) పిలువనంపినట్లున్నూ, అండనే కంతకు అంపినట్లు ముందరే నన్ను కూడా పంపించు స్వామీ! (పెండ్లిలో ఉప్పు పప్పు బియ్యమూ ఒక పెట్టెలో పెట్టి తీసికొనిపోయి మగ పెండ్లివారికి అందిస్తారు. ఆ పనికి ఆంతరంగికులను నియోగిస్తారు. దాన్ని కంతకు పంపడం అంటారు.) వెండియు (మరియు) ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు వేటకు వెళ్తే తిరుమలను చూసుకోవటానికి నీవూడిగపువాడిగా నన్ను వుంచుకోరాదా తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Karena Kim Mam Gruhitum Te In Telugu – కరేణ కిం మాం గృహీతుం తే

కరేణ కిం మాం గృహీతుం తే - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో కరేణ కిం మాం గృహీతుం తే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కరేణ కిం మాం గృహీతుం తే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : కరేణ కిం మాం గృహీతుం తే
సంఖ్య : 171
పుట : 123
రాగం : ఆహిరి

ఆహిరి

24 కరేణ కిం మాం గృహీతుం తే
హరే ఫణిశయ్యా సంభోగ

||పల్లవి||

జలే తవ సంచరణ మిహాధస్
స్థలే భవనం తవ సంతతం
బలే రూప ప్రకటన మతులా
చలే స్థానం చల చల రమణా

||కరేణ||

పదే భువన ప్రామాణ్యం తవ
హ్రదే ప్రచురణవిహరణ మిదం
ముదేమునీనాం మోహనం తనుం
మదే తవ నర్మ చ మాం విసృజ.

||కరేణ||

స్మరే విజయ స్తవ విమలతురగ
ఖురే రతిసంకుల రచన
పురే తవ విస్ఫురణం వేంకట
గిరే:పతే తే ఖేలాఘటిత.

||కరేణ|| 171

అవతారిక:

సరస శృంగార కీర్తన గీర్వాణిలో వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. నా అదృష్టం కొద్దీ ఇది శ్రీమన్నారాయణుని దశావతార కీర్తన. అక్కడక్కడా ప్రతిపదార్థమునకు గాక భావార్ధమునకు ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. నేను తెలుగు దశావతార కీర్తన వివరిస్తే ప్రతిపదార్ధ వివరణకే ప్రాముఖ్యతనిస్తాను. కానీ సంస్కృతంలో ప్రతి పదార్ధ వివరణ నా శక్తికి మించినపని. ఎందుకంటే గీర్వాణిలో నా పాండిత్యం అమావాస్యనాటి చంద్రుడు. అదండీ సంగతి. “ఓ శ్రీహరీ! ఫణీంద్రశయ్యపై సంభోగానందమందుకొనే నీ కరములు నన్ను అనుగ్రహించకుండుట యెందులకు?” – ఇది పల్లవి మరిదింతే…

భావ వివరణ:

ఓ శ్రీహరీ! ఫణిశయ్యా సంభోగా! (ఫణీశుడైన ఆదిశేషుడు శయ్య (పడక) అయి వుండగా, ఆ శయ్యపై సంభోగించుటకు ఆయత్తమైనవాడా!) నీ కరములు నన్ను అనుగ్రహించకుండా యుండుటెందులకు ప్రభూ!

సముద్రమునందు నీయొక్క సంచలన మిట్టిది (మత్స్యావతారము); నీవు అడుగున నీపైన భువనములు వున్నవి (కూర్మావతారము); ఉన్నతమైన బలప్రకటన జరపురూపమొప్పినది (వరాహావతారము); కొండగుహలలో చరించు సింహముఖరూపివి (నరసింహావతరాము);

నీపదములతో భువన ప్రమాణములను కొలిచితివి (వామనావతరాము); గొప్ప మడుగులో (తీర్ధములలో) నీయొక్క ప్రసిద్ధమైన విహారములు (యాత్రలు) జేసితివి (పరుశురామావతారం); ఆనందమునిచ్చు మోహన రూపుడైతివి మునులకు సైతం (శ్రీరామావతారము); నీయొక్క ఔన్నత్యమునకు నన్ను విడనాడితివి (బుద్ధుని అవతారము).

నీయొక్క విజయ చిహ్నమైన తెల్లని గుఱ్ఱపు గిట్టల నడక రతి సల్లాప సంకేతములైనవి (కల్కి అవతారము); ఓ శ్రీవేంకటగిరినాథా! సృష్టిలో నీ ప్రకాశముతో నీయొక్క ఆట నాడించు నీ కరములతో నన్నేల పరిగ్రహించవు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Yamalarjuna Bhanjanam In Telugu – యమళార్జున భంజనమ్

srikrishna leelalu yamalarjuna bhanjanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీ కృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్ నీతికథ.

శ్రీ కృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్

అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోద “కన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురు బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది “ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు.

బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనే తెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి “అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిది” అనుకుని ఆ మాయలయ్యను బెత్తంతో జళిపించింది.

శ్రీకృష్ణుడు భయపడినట్టు నటించి ఱోలు మీద నుంచి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా అతివేగముగా పారిపోయాడు. ఆ తల్లి బాలకృష్ణుని వెనకాల పరుగులెట్టింది. తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ ఆమెకు దొరికిపోయాడు!

పరమయోగీశ్వరులకు సంయములకు మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే. కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆ తల్లికి. యశోదాదేవి శరీరము స్వభావముకూడా పువ్వువలె మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక త్రాటితో జోకటికి (ఉలూఖలమునకు కట్టివేయాలనుకొన్నది. ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుని గట్టిగా కట్టబోయింది. కాని ఆ త్రాడు రెండంగుళాలు తక్కువయ్యింది.

మరొక త్రాడు దానికి జతచేసినా మళ్ళీ రెండంగుళాలు తక్కువైనది. యశోద ఇంటిలోనున్న త్రాళ్ళన్నీ జతచేసినా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయింది. ముజ్జగాలు దాగివున్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరితరము? అలసిపోయిన తల్లిపై జాలిపడి నందకిశోరుడు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకు గానీ మౌనులకుగానీ దానపరులకుగానీ యోగీశ్వరులకుగానీ పట్టుబడడుగదా!

యశోదాదేవి శ్రీకృష్ణుని ఇలా జోటికి కట్టివేసి ఇంటిపనులలో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ జోలు ఈడ్చుకుంటూ పెరట్లో చాలాకాల ముగా శాపగ్రస్తులై మద్దిచెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవుల దగ్గరకు వెళ్ళి వారిని కరుణించదలచి ఆ రెండు చెట్ల మధ్యనుంచి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. దానితో ఆ యమళ అర్జున వృక్షాలు కూలిపోయినాయి. అందునుంచి దిఙ్మండలము ప్రకాశింపచేయు ఇద్దరు అగ్నితుల్యులగు దివ్య పురుషులు వచ్చి స్వామిని స్తుతించి అతని అనుజ్ఞతీసుకుని కర్తవ్యోన్ముఖులై వెళ్ళిపోయారు.

యమళార్జుమల వృత్తాంతము

నలకూబరమణిగ్రీవులు పరమశివుని ప్రియసఖుడైన కుబేరుని పుత్రులు. వారు చాలా ధనగర్వముతో ఉండేవారు. రుద్రానుచరులై కూడా ఒకసారి వారు అతి పవిత్రమైన కైలాసపర్వతములోని ఒక సుందర ఉద్యానవనములో స్త్రీలతో కూడి వహారము చెసినారు. మదోమత్తులై వారుణి అను మదిరను పానముచేసినారు. వారు పద్మవనములో ఉన్న గంగలో జలక్రీడలాడ సాగినారు. అప్పుడు పరమపూజ్యుడైన నారదమహర్షి వారి పురాకృత సుకృతమువలన అక్కడికి వచ్చాడు. నారదుని చూసి ఆ దేవతాస్త్రీలు లజ్జితులై వెంటనే వస్త్రములు ధరించారు. కానీ మదిర ప్రభావములో ఒళ్ళు మరచిపోయిన ఆ కుబేర పుత్రులు వస్త్రములను ధరించలేదు. ఆ దేవకుమారుల అజ్ఞానమును చూచి నారదుడు ఇలా
అన్నాడు.

“ధనగర్వము ఎంతటి గొప్పవారినైనా నాశనము చేస్తుంది. ధనగర్వితులైన వారు మద్యపానము జూదము స్త్రీ సంభోగము వంటి దుర్వ్యసనములకు లోబడి అనేక పాపకార్యాలు చేయుదురు. నిర్భయులై మనోవినోదముకై పశువులను వధించెదరు. నశ్వరమైన దేహనుము శాశ్వతమైనదని నమ్మి దేహసౌఖ్యమే పరమానందము అనుకొనెదరు.

మద్యపానమత్తులై నగ్నముగా ఉండి ఘోరాపరాధము చేసిన వీరు స్థావరత్వమును పొందుటకు తగియున్నారు. మరల వీరెన్నడూ ఇట్టి అకార్యములు చేయకుండుటకై నా అనుగ్రహమువలన వీరికి పూర్వజన్మ స్మృతి ఉండును. నూరుదివ్యవర్షములు చేసిన తప్పుకు పశ్చాత్తాపము నొంది పునీతులై నా అనుగ్రహముచే కృష్ణభక్తులై దైవత్వమును పొందగలరు”. ఆ కుబేర పుత్రులే యమళార్జునులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. వస్త్రధారణము యొక్క ప్రాముఖ్యత మనకు ఈ కథ ద్వారా తెలిసినది. ఎప్పూడూ సరిగా వస్త్రములేకుండా ఉండరాదని నారదమహర్షి మనకు చెప్పాడు.
  2. వారుణి అనే మదిర ప్రభావములో ఉండి తప్పని తెలిసికూడా నలకూబరమణిగ్రీవులు వస్త్రధారణము చేయలేదు. మదిరాపానం వలన మానవుడు తెలియకనే అనేక పాపాలు చేస్తాడు. పంచమహాపాతకాలలో మొదటిది ఈ మదిరాపానమే. అందుకని మనమిట్టి దుర్వ్యసనములకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.
  3. ధనగర్వము ఉండరాదని నారదమహర్షి మనకు ఉపదేసించాడు. శివానుచరులై ఉండికూడా కేవలము ధనగర్వము వలన కుబేర పుత్రులు వారి దైవత్వాన్ని కోల్పోయారు.
  4. తీర్థాలు పుణ్యక్షేత్రాలు సిద్ధప్రదేశాలు ఎప్పుడు విహార దృష్టితో వెళ్ళరాదని మనకు ఈ కథ ద్వారా తెలిసినది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Shiva Raksha Stotram In Telugu – శ్రీ శివరక్షాస్తోత్రము

Sri Shiva Raksha Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివరక్షాస్తోత్రము గురించి తెలుసుకుందాం…

Sri Shiva Raksha Stotram Lyrics Telugu

శ్రీ శివరక్షాస్తోత్రము

ఓం అస్యశ్రీ శివరక్షాస్తోత్ర మహామంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః, శ్రీ సదాశివో దేవతా, అనుష్టుప్ ఛందః, శ్రీసదాశివప్రీత్యర్థే శ్రీ శివరక్షాస్తోత్ర జపేవినియోగః ॥

చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ |
అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ ||

1

గౌరీవినాయకోపేతం పంచవక్త్రమ్ త్రినేత్రకమ్ |
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః ||

2

గంగాధరశ్శిరః పాతు ఫాల మర్ధేందు శేఖరః |
నయనే మదనధ్వంసీ కరౌ సర్పవిభూషణః ||

3

ఘ్రాణం పాతు పురారాతి ర్ముఖం పాతు జగత్పతిః |
జిహ్వాం నాగేశ్వరః పాతు కంధరాం శశికంధరః ||

4

శ్రీకంఠః పాతు మే కంఠ స్కంధై విశ్వధురంధరః |
భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృత్ ||

5

హృదయం శంకరః పాతుజఠరం గిరిజాపతిః |
నాభిం మృత్యుంజయః పాతు కటే వ్యాఘ్రాజినాంబరః ||

6

సకినీ పాతు దీనార్త శరణాగతవత్సలః |
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః ||

7

జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః |
చరణా కరుణాసింధు స్సర్వాంగాని సదాశివః ||

8

ఏతాం శివబలోపేతాం రక్షాం యస్సుకృతీ పఠేత్ |
స భుక్త్యా సకలాన్కామాన్ శివసాయుజ్య మాప్నుయాత్ ||

9

గ్రహభూతపిశాచాద్యా త్రైలోక్యే విచరంతి యే |
దూరా దాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ ||

10

అభయంకరనామేదం కవచం పార్వతీపతేః |
భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్రయమ్ ||

11

ఇమాం నారాయణ స్స్వప్నేశివరక్షాం యథాదిశత్ |
ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యస్త థాలిఖేత్ ||

12

ఇతి యాజ్ఞవల్క్యప్రోక్తం శ్రీశివరక్షాస్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

Sri Shiva Aparadha Kshamapana Stotram In Telugu – శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్

Sri Shiva Aparadha Kshamapana Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Aparadha Kshamapana Stotram Telugu

శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్

ఆదౌ కర్మప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రా మేధ్యమధ్యే క్వథయతినితరాం జాఠరో జాతవేదాః,
యద్యద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరాం శక్యతే కేన వక్తుం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

బాల్యే దుఃఖాతిరేకాన్మలలు ళితవపుః స్తన్యపానే పిపాసా
నోశక్య శ్చేంద్రియేభ్యో భవగుణజనితా జంతవో మాం తుదంతి,
నానారోగాతి దుఃఖా ద్దురిత పరవశ శ్శంకరం న స్మరామి
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

ప్రౌఢా హం యౌవనస్థో విషయవిషధరై: పంచభిర్మర్మసంధౌః
దష్టో నష్టో వివేక స్సుత ధనయువతి స్వాదుసౌఖ్యే నిషణ్ణః,
శైవీచింతావిహీనో మమ హృదయమహామానగర్వాధిరూఢం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

వార్ధక్యే చేంద్రియాణాం విగత గతిమతి శ్చాధి దైవాది తాపైః
పాపైరోగైర్వియోగైస్వన వసివపుః ప్రౌఢి హీనం చ దీనమ్,
మిథ్యామోహాభిలాషై ర్థమతి మమ మనో ధూర్జటే ర్ధ్వాన శూన్యం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనప్రత్యవాయాకులాఖ్యం
శ్రాతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గే సుసారే,
నాస్థాధర్మే విచారః శ్రవణమను నయోః కిం నిదిధ్యాసితవ్యం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం
పూజార్థం వా కదాచిద్భహుతరగహనాత్ ఖండబిల్వీదళాని,
నానీతా పద్మమాలా సరసివి కసితా గందపుప్పే త్వదర్థం
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

దుగైర్మధ్వాజ్యయుక్తేర్థధిసిత సహితైః స్నాపితం నైవ లింగం
నోలిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః.
ధూపైః కర్పూర దీపైర్వివిధరసయుతైరైవ భక్ష్యోపహారై:
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యై ధృతవహవదనే నార్పితం బీజమంత్రైః
నోతప్తం గాంగతీరే వ్రతజప నియమై రుద్రజాప్యైర్ష వేదైః
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుండలే సూక్ష్మమార్గే
శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే జ్యోతిరూపే సరాఖ్యే,
లింగజ్ఞే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

నగ్నో నిస్సంగ శుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రే న్యస్తదృష్టిర్విదిత భవగుణో నైవ దృష్టః కదాచిత్,
ఉన్మత్తావస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి
క్షంతవ్యో మే పరాధ శ్శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే
సరైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థవైశ్వానరే,
దంతత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్తవృత్తి మఖిలామన్వైస్తు కిం కర్మభిః.

కిం వానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకళత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్,
జ్ఞా త్వైతత్ క్షణభంగురం సపది రేత్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభమ్.

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః,
లక్ష్మీ స్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం శరణద త్వం రక్షరక్షాధునా.

ఇతి శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రం సంపూర్ణమ్

మరిన్ని స్తోత్రములు

Sri Mahalakshmi Vaibhavam In Telugu – శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము

Sri Mahalakshmi Vaibhavam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం… ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి భారతీయ హిందూ సామ్రాజ్యాలులో పూజించబడును ఉన్న ప్రధాన దేవి. ఆమె ధన, సమృద్ధి, ఆరోగ్య, ధర్మ, కీర్తి, ప్రేమ, ఆశీర్వాద మరియు సౌందర్యమును సూచించేవారు. మహాలక్ష్మీదేవి విష్ణువుని పత్ని మరియు ఐశ్వర్యము, ధనము, లక్ష్మీ రూపముగా ఉన్నారు. ఆమెను పరమేశ్వరుడు మరియు విష్ణువు చేత ప్రేమపూర్వకముగా పూజించబడుతారు.

శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము

శ్లో ॥ లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం||

శ్లో ॥ జయతు జయతు లక్ష్మీర్దేవ సంఘాభిపూజ్యా
జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా
జయతు జయతు నిత్యానిర్మల జ్ఞానవేద్యా
జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా |

చరాచర సృష్టిలోని సకల జీవావళికి తల్లి ఆ జగన్మాత లక్ష్మీదేవి. కంటికి రెప్పలా ఆ తల్లి మనలంనదరినీ రక్షిస్తూ వుండటం వల్లనే మనం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఈ భువిలో జీవించ గలుగుతున్నాము. సకల శుభాలూ, సంపదలూ, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ అలౌకిక ఆనందదాయిని, పరతత్వ సంధాయిని, మోక్షప్రదాయిని కూడా అయిన ఆ తల్లిని సమస్త దేవతాగణం సదా సేవిస్తూ వుంటారు. ఆ తల్లి నిత్య సత్యస్వరూపిణి. శాశ్వతమైన, నిజమైన ఆనందం ఆ మాతఅనుగ్రహంవల్లనే లభిస్తుంది. నిజానికి మనమందరం ఆ తల్లి ప్రతిరూపాలమే. అందరి హృదయాలలోను ఆమెనివాసమై వుంటుంది. ఆ విషయం తెలుసు కోవడమే నిజమైనజ్ఞానం. ఆజ్ఞానం కూడా ఆతల్లిని సేవించటంవల్లనే లభిస్తుంది.

యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

జీవులందరిలోనూ చైతన్యశక్తి రూపంగా ఆ విశ్వమాత నెలకొని వుంటుంది. అన్ని రకాల శక్తులూ ఆ తల్లి కరుణ వల్లనే లభిస్తాయి. బ్రహ్మరుద్ర ఇంద్రాదులచే సేవించబడే ఆ మాత స్థితికారకుడైన శ్రీమహావిష్ణువుకు ఇల్లాలు. మహాలక్ష్మైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్” అన్నారు. స్థితికారకుడైన విష్ణుమూర్తి సాత్వికమూర్తి. స్థితి నిర్వాహణ బాధ్యతలో ఆ శ్రీమన్నారాయణమూర్తికి చేదోడు వాదోడుగా తన వంతు పాత్రని ఎంతో సమర్థవంతంగా పోషిస్తుంది విష్ణుపత్ని అయిన శ్రీమహాలక్ష్మీదేవి. దుష్టశిక్షణ చేసి సజ్జనులను రక్షించి ధర్మసంస్థాపన చేయటం కోసం, ఆ జగత్పిత శ్రీమహావిష్ణువు ఏకంగా వివిధ రూప విశేషాలతో అవతారాలను దాల్చటం జరిగిందో, అదే విధంగా జగన్మాత లక్ష్మీదేవి కూడా లోక కళ్యాణానికై అష్టలక్ష్మీ రూప ధారణ చేసింది. ఆ తల్లి ఆ అవతారాలన్నీ తన పిల్లలమైన మన అభ్యున్నతి కోసమే దాల్చింది.

శ్రీ అనే పదం ద్వారా లక్ష్మీదేవి వేదాలలో సంపద, ఐశ్వర్యము, శక్తి, శుభం అనే అర్థాలలో గుర్తించబడింది. విష్ణుపురాణం ద్వారా లక్ష్మీదేవి పుట్టు పూర్వోత్తరాలు, బ్రహ్మవైవర్త, మార్కండేయ పురాణాల ద్వారా లక్ష్మీదేవి ప్రశస్తి, ఆమె నివాస స్థానాలు గురించి వివరంగా తెలుస్తోంది. వేదాంగాలలో ముఖ్యమైనది అయిన శతపథ బ్రాహ్మణంలో లక్ష్మి అందానికి అధిష్ఠానదేవతగా చెప్పటం జరిగింది.

శ్లో ॥ యాసా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయసాక్షి
గంభీరావర్త నాభిః స్తనభరనిమితా శుభ్రవస్త్రోత్తరీయా
లక్ష్మీర్తివైర్గజేంద్రః మణిగణఖచితై స్నాపితా హేమకుంభై:
నిత్యం సాపద్మహస్తామమవసతుగృహేసర్వమాంగళ్యయుక్తా!॥

నిత్యం ఆ లక్ష్మీదేవి ఆరాధన జరిగే వారి గృహంలో సమస్త శుభాలూ నెలకొని వుంటాయి. ఋగ్వేదంలోని శ్రీసూక్తంలో లక్ష్మీదేవి దివ్యమైన గజేంద్రాలు (ఏనుగులు) యిరువైపులా సేవిస్తూ వుండగా మహా పద్మంలో పద్మాసన భంగిమలో కూర్చుని వుంటుంది అని వర్ణించబడింది. ఆ గజేంద్రాలు బంగారు కలశాలతో ఆ తల్లిపై అమృతవర్షం కురిపిస్తూ వుంటాయి. లోక వ్యవహారాలలో “లక్ష్మి” అనే పదం మన నిత్య జీవితంతో పెనవేసుకు పోయిన ఒక మహత్తరమైన ప్రజ్ఞావిశేషం. గృహానికి శోభనిచ్చే ఇల్లాలుని గృహలక్ష్మిగా సంభావిస్తూ వుంటాం. అదృష్టవంతుడైన ఒక వ్యక్తిని గూర్చి చెప్పాలంటే వాడికేమిరా లక్ష్మీ పుత్రుడు అంటాం. అలాగే ఒక అందమైన ఆడపిల్లని చూసినప్పుడు ఆహా ఈ పిల్ల మొహంలో లక్ష్మీకళ తాండవిస్తోంది అని అనుకుంటాం. విరిసిన ముద్ద మందారం, తామరపూవులను చూసినపుడు మనసు దైవీకమైన భావనతో నిండిపోయి ఆ తల్లి లక్ష్మీదేవే గుర్తుకు వస్తుంది.

మరిన్ని:

Uttama Sansari Ila Undali In Telugu – ఉత్తమ సంసారి ఇలా ఉండాలి

Uttama Sansari Ila Undali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఉత్తమ సంసారి ఇలా ఉండాలి నీతికథ.

ఉత్తమ సంసారి ఇలా ఉండాలి.

(ఈ కథ ఆదిపర్వంలో ఉంది.)

” మహామునులారా !

జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు”. అని సూతుడు కథ మొదలు పెట్టాడు.
జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడువకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మపదం చేరడానికి ప్రయత్నిస్తున్నాడు.
అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు.
క్రింద పెద్ద గొయ్యి. దాని ప్రక్కగా ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు.
దానిమీద తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేసే ఋషులు. ఆశ్చర్యంతో వారిని సమీపించి :
‘అయ్యా ! మీరింత తీవ్ర తపస్సు ఎలా చేస్తున్నారు. నాకు కూడా దీని విధానం బోధించండి అన్నాడు.
నాయనా! మేము వరమ విషాదంతో యిలా ఉన్నాం. మా వంశంలో జరత్కారుడనే వాడు పుట్టాడు. వాడు వివాహం చేసుకుని వంశ వృద్ధి చేయకుండా ఉండటం వల్ల ఈ దీన దశలో ఉన్నాం.
ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరత్కారుని మరణంతో తెగి పోతుంది. మేము ఈ నరకకూపంలో పడతాం. వాడు వివాహం చేసు కుని సంతానవంతుడై తే మాకు దివ్యలోకాలు దొరుకుతాయి’ అన్నారు. అప్పుడా ముని :
‘ఆర్యా, నేనే ఆ జరత్కారుడను. మీ శ్రేయస్సు కోసం నేను వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను’ అని తనకు తగిన భార్యకోసం అన్వేషణ ఆరంభించాడు.
తనకు కాబోయే భార్య కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతున్నాడు.
ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడు వాసుకి.
తన చెల్లెలు జరత్కారువును తీసుకొని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి
‘మహామునీ ఈమె నా సోదరి. దీని పేరు జరత్కారువు. మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలూ ఉద్ధరించండి’ అని ప్రార్థించాడు.
అందుకు అంగీకరించాడు జరత్కారుడు.
ఒకానొక సుముహూర్తంలో వివాహం జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యతో
‘ధర్మచారిణి ఈ రోజు మొదలు నా మనస్సుకి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ నియమాన్ని మరువకు ! ” అన్నాడు.
జరత్కారువు ఆ నియమానికి అంగీకరించి, నిరంతరం పతిసేవతో గున్నది.
అలా ఆయన మనసుకి అనుగుణంగా మెంగుతూ, ఆయన అను రాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ, గర్భవతి అయింది.
రోజులు గడుస్తున్నాయి.
ఒకనాడాయన తిరిగి తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన, తన భార్య తొడమీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు.

సూర్యుడు పడమటి కొండకు చేరాడు.
మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తున్నాడు.
అప్పుడామె ఆలోచనలో పడింది.
సంధ్యాసమయంలో జరపవలసిన వేదవిహిత కర్మలకు లోపం రాకూడదు కదా ! ఇప్పుడీయనను లేపితే కోపం వస్తుందేమో! లేవకపోతే ధర్మలోపం జరుగుతుంది. ఆయనకు కోపంవస్తే అది నేను భరించాలి. కాని ధర్మలోపం జరగరాదు కదా అని నిశ్చయించి నిద్ర లేపింది.
సుఖనిద్రకు భంగం కలిగించినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది.
‘ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు?’ అని తీవ్రంగా అడిగాడు.
‘స్వామి | సంధ్యాసమయం అయింది. మీరు విధ్యుక్తకర్మలు జరపాలి కదా !’ అంది.
‘ఎంత వెర్రిదానివి. నేను నిద్రపోతూండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి? ఈ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు. కనుక వా నియమ ప్రకారం నిన్ను విడిచి పెడుతు న్నాను. అయితే యింత కాలం నువ్వు చేసిన పరిచర్య నాకెంతో సంతో షము కలిగించింది.
ఇప్పుడు నువ్వు గర్భవతివి. సూర్య సమ ప్రభావుడైన కుమారుడు నీకు కలుగుతాడు. వాడు ఉభయవంశాలనూ ఉద్ధరిస్తాడు. మవ్వు నిర్వి చారంగా మీ అన్నగారి దగ్గరకు వెళ్ళు’ అని తన కమండలుపు తీసు కుని ఆయన వెళ్ళిపోయాడు.
విచారంతో జరత్కారువు తన అన్న గారి దగ్గరకు వచ్చింది.
జరిగిన విషయం విన్నాడు వాసుకి. సోదరిని ఓదార్చి, ఆదరంతో చూసుకుంటున్నాడు.
నెలలు నిండిన అనంతరం జరత్కారువు మగబిడ్డను కన్నది. వాసుకి పరమానందంతో వారుభయులకూ ఉచిత సేవలు చేయించాడు.
పెరిగిన కుమారునికి ఆ స్తీకుడని పేరు పెట్టారు.
ఆ బాలుడు పెరిగి పెద్దవాడై, పర్వ విద్యలూ నేర్పి పలువురి ప్రశంసలు పొందాడు.
‘ఈ ఆస్తీకుడే జనమేజయ మహారాజు ఆరంభించిన సర్ప యాగాన్ని ఆపి తన తల్లి చుట్టాఅయిన నాగజాతిని మహ వివత్సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతి పొందాడు.” జ్ఞానులయినవారు సంసార కూపంలో మునిగిపోక తమ కర్తవ్యం పూర్తిచేసి విరాగు లవాలి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Hariyavataramitadu Annamayya In Telugu – హరియవతారమితడు అన్నమయ్య

హరియవతారమితడు అన్నమయ్య – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో హరియవతారమితడు అన్నమయ్య కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరియవతారమితడు అన్నమయ్య – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: హరియవతారమితడు అన్నమయ్య
సంఖ్య : 100
పుట:67
రాగం: శ్రీరాగం

శ్రీరాగం

80 హరియవతార మీతఁడు అన్నమయ్య
అరయ మాగురుఁ డీతఁ డన్నమయ్య

||పల్లవి||

వైకుంఠనాథునివద్ద వడిఁ బాడుచున్న వాఁడు
ఆకరమై తాళ్లపాక అన్నమయ్య
ఆకశపు విష్ణుపాదమందు నిత్యమై వున్నవాఁడు
ఆకడీకడఁ దాళ్లపాక అన్నమయ్య

||హరి||

క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచు నున్నవాఁడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుఁడై సూర్యమండలతేజమువద్ద నున్నవాఁడు
ఆ రీతులఁ దాళ్లపాక అన్నమయ్య

||హరి||

యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాఁడు
ఆవటించి తాళ్లపాక అన్నమయ్య
భావింప శ్రీవేంకటేశుపాదములందె వున్నవాఁడు
ఆ (హా)వ భావమై తాళ్లపాక అన్నమయ్య

||హరి||100

అవతారిక:

తాళ్లపాక పెదతిరుమలాచార్యులవారు తన తండ్రి అన్నమాచార్యులవారిని కీర్తిస్తూ చెప్పిన కర్ణపేయమైన కీర్తననాస్వాదించండి. అన్నమయ్య శ్రీహరి అవతారమని చెబుతున్నారు. తన గురువు కూడా అన్నమయ్యయేనంటున్నారు. వైకుంఠవాసమునొందిన తనతండ్రి నిత్యమూ క్షీరాబ్ధిశయనుని సేవించుటలో ఆరితేరియున్నాడట. శ్రీవేంకటేశ్వరుని పాదముల చెంత తన హావభావములను ప్రకటిస్తూ అన్నమయ్య నేటికీ వున్నాడట.

భావ వివరణ:

ఈ అన్నమయ్య స్వయముగా శ్రీహరి అవతారమే. ఈయనే మాకు జన్మనిచ్చి శ్రీహరి భక్తియు నొసగిన గురుపుంగవులు.

వైకుంఠనాథునివద్ద ఆకరమై (స్థానమును పొందిన వాడై) ఈ తాళ్ళపాక అన్నమాచార్యులవారు వడి (వేగముగా) హరిని కీర్తించుచు పాడుచున్నారు. ఆకాశవీధిలో విష్ణుని పాదపద్మముల చెంత ఈయన నిత్యమై (శాశ్వతుడై) వున్నాడు. ఈ తాళ్ళపాక అన్నమయ్య ఆకడ (ఆ వైకుంఠసీమలోను) ఈ కడ (తిరుమల శిఖరాలచెంతను) హరి సేవలోనే గడుపుతున్నారు.

ఆరితేరిన (నిష్ణాతులైన) ఈ తాళ్ళపాక అన్నమయ్య, క్షీరసాగరశయనుడైన శ్రీహరిని ఇట్టే సేవింపుచూ వున్నవాడు. అదే ఆయనకు నిత్యకృత్యమైనది. సూర్యమండలపు దివ్యతేజస్సుతో వెలుగులు జిమ్మే చోట అన్నమయ్య ధీరుడై తేజో మూర్తియైయున్నాడు.

ఈవల (ఈ కలియుగంలో) సంసారలీల ప్రకారం ఇందిరానాథునితో ఈ తాళ్ళపాక అన్నమయ్య ఆవటించి (పొందికతో) యున్నవాడు. భావించిచూడగా శ్రీవేంకటేశ్వరుని పాదపద్మముల చెంతనే తన హావభావములను ప్రకటించుచు తేజోరూపుడై ఈ అన్నమాచార్యులవారు హరిసేవలో వున్నారు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు: