కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో నాలం వా తవ నయవచనం కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
జయదేవకవి స్ఫూర్తితో చాలామంది గీర్వాణలో శృంగార కీర్తనలు రచించారు. అన్నమాచార్యులవారు సాళ్వ నరసింహరాయలు కొలువులో వున్నప్పుడూ అసంఖ్యాకమైన సరసశృంగార కీర్తనలు చెప్పారు వేంకట మకుటంతో రాజుగారి ఆస్థానంలో విద్వత్ గోష్ఠులు జరిగే తరుణంలో పాండితీ ప్రదర్శనకు కవులు సంస్కృతంలో కవిత్వం చెప్పేవారేమో అనిపిస్తుంది. ఈ కీర్తనలో నిందాస్తుతిని ఇతివృత్తంగా యెన్నుకొన్నారు. నాయిక విర హెూత్కంఠితయై స్వామిని నిందిస్తున్నది. దెప్పి పొడుస్తున్నది. చివరికి రాజీకి రాక తప్పలేదు. నీవు నా ప్రియుడివైతే నేనూ శోభిస్తాను కదయ్యా! అంటున్నది.
భావ వివరణ:
నీయొక్క నయవంచనతో కూడిన మాటలు ఇక చాలించవయ్యా! ముందు నా పైట కొంగును విడిచిపెట్టు. నీదాసినౌదునులే. నన్ను వదలిపెట్టు.
ఓ కులిశహృదయా! (కఠినహృదయుడా! నీకు నాతో పొత్తు యెందులకు? చాలు చాలు. పో పొమ్ము. ఓ బహుగుణ విభవా! (అనేక గుణములు పుణికి పుచ్చుకున్నవాడా!) చాలు చాలు పో పో. నేను పులకించిన గాత్రము (శరీరం) వలన పొందిన వేదన యొక్క మాలిన్యమును ధరించియున్నాను. ఇక నా అహమును విడనాడి నీకు వశమైతిని.
నీవు యెల్లప్పుడూ నీ వలపుకత్తెనే స్మరిస్తుంటావు. నీవు గొప్పవాడివి కదా! గొప్పవాళ్ళకి స్త్రీ వ్యసనం సహజమేలే. పైగా నీవు బ్రహ్మానందానికి నిలయుడవట కదా! నీ భుజములపై రతికూటముల చిహ్నములు కొట్టవచ్చినట్లు కనబడుతూనే వున్నాయి కదా! పోనీలే. నీకు అంతా విజయమేలే. నా తిప్పలు నీకెందుకు పట్టాయి గనుకా!
నన్ను బుజ్జగించే విధానమును కూడా కాస్త నీవు తెలుసుకోకూడదటయ్యా! నీ ప్రియకాంతకే నీవలపులనందించుకో. మధ్యలో నిన్ను కాదన్న వాళ్ళెవరు? నాకేమి పట్టింది? భయహరుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు నా ప్రియుడవైనచో నేను కూడా శోభించెదను కదా! స్వామీ!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు సాయి బ్రతుకు బాటలుగురించి తెలుసుకుందాం…
Sai Bratuku Batalu Telugu
సాయి బ్రతుకు బాటలు
లక్ష్య సాధనతో విద్య లక్షితముగ
తలచిన గురిని సాధించ వలయు నెపుడు
లక్ష్య సిద్దియే లేకున్న లక్ష్య పెట్ట
రెవరు వారి బ్రతుకులనీ ఇలను సాయి
1
నింగి చూసి భ్రమించెడు నీలి తెరలు
కొండ తోను పందెము గాసి కుప్పగూలు
తల్లి ఒడిని మరచినట్టి తనయులెల్ల
ఎంత ఎదిగి పోయిన లాభమేమి సాయి
2
నీవు పెంచిన తోటకు నీరు లేక
కలుపు మొక్కలు పెరుగుచు కలత పెట్టె
ముళ్ళతో నిండె నీ వనములిట నేరి
వేయ దయతోడ నిలువుము ప్రేమ సాయి
3
తెల్లనగు కాగితాలపై నల్ల రాత
జీవితమ్మన రంగు పేజీలు గావు
నడుమ వచ్చిన అమృతంపు నాణ్యతయును
వ్యర్థమే కాద యోచింపవలయు సాయి
4
సాగ నది వోలె జీవిక సాగి పోవ
మధ్యలో దూరు మాయని మచ్చ ఝరులు
మాటి మాటికి మాయచే మరియు మారె
మాయ వల నుండి కాపాడు మమ్ము సాయి
5
నడిమి సంద్రము నందున్న నావ మేము
మధ్య తరగతి బ్రతుకులు మమ్ము గాంచు
కష్ట సుఖముల చుట్టాలు కనుల ముందు
అలల మాదిరి ఎదురుగ నయ్యె సాయి.
6
ఆపి ఏ రాగ మనెద నేను
ఆకలియను నీ రాగమునాలపించ
ఇప్పుడే పుట్టిన పసికందేని చూడ
కాటికేగెడు ముసలి రాగమిది సాయి
7
విర్ర వీగుట తప్ప వివేకి ఎవరు
తాను ముందనుచు జనుడు తలచునెపుడు
సకల జీవులన్ని తెలివి చాలవనెడు
మతులు చెడ్డ ఈ భ్రమలను మార్చు సాయి
8
కడుపు తిప్పలుతో జీవ కణిక లిచట
అలమటించు చుండెను దేవ ఆలకించు
ఆకలి కలి పిశాచమై అరయు చుండ
ఆపకుండ నీ కరుణను చూపు సాయి
9
చదువులమ్మకు యిష్టమౌ చంటి పాప
మట్టి నిండిన మెదడుకు మనసు గూర్చి
అక్షరముల తోడనె లోకమంత వెలుగు
చిలుకరించెడు గురువులు చేరు సాయి
10
కలమునే ఆయుధమ్ముగ కనుల జూచి
పదములన్నియు నొకటిగా పదిల పరచి
నీతి విలువ చాటుచు అవినీతినణచి
చదువులమ్మ బిడ్డ కవిని సాకు సాయి
11
ఉన్న ఊరి దొరతనమ్ము ఉచ్చుపన్ని
చేత గాని వారిని చేసి చిదిమివేయ
ఆలు బిడ్డల తలిదండ్రులాత్మ మరచి
వెడలు జనముల కరుణించు ప్రీతి సాయి
12
ఏమిటి మరి చిత్రమ్మేది ఎరుక రాక
అడుగు చుంటిని చెప్ప రావయ్య ఇప్పుడు
ముందు చూడు నీయాలయ మందు చూడు
వరుస గూర్చుండిరీ ముష్టి వారు సాయి
13
పనుకు బట్టెను ఫలములు పసరు లేక
పాహియనుచిల దరి చేరె పసరు కోరి
కనికరమ్మును పూనుచు గాంచవయ్య
ప్రేమ మూర్తివి నీవు మా ప్రీతి సాయి
14
ఎండమావి బ్రతుకు దూరమెంత యున్న
నీడ పట్టు కుదురుగ నిలిచి యుండు
మగని బ్రతుకును వలచిన మగువతీరు
ఇలకు ఈ జంటయే శోభ నిచ్చు సాయి
15
తెలివి యున్నను జనులకు తెల్ల మొహము
చదువులెన్ని యున్నను వీరి చవట బుద్ధి
విందు ముందరున్నను రుచి విధమెరుగదు
నీవు మార్చగ ఇటు రమ్ము నియతి సాయి
16
పల్లె పల్లె నీరాకకై పరితపించె
వానదేవుడ కరుణించి వరములిమ్ము
బ్రతుకులన్ని వాడక ముందు వాన నొసగి
మాకు దిక్కువై నిలిచిపో మాదు సాయి
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ హనుమాన్ బడబానలా స్తోత్రం గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
సీ॥ కైలాస పర్వత కందరంబది నీదు నిలయంబుగా గొన్న నీవె రక్ష గౌరీ, ఉమాదేవి, కౌమారి, శాంభవీ వేదార్ధగోచరంబొదవజేయి ఓంకారమే నీకు ఒప్పె బీజాక్షరం బుగను ఓ శర్వాణి! ఉన్నతముగ మోక్షద్వారము యొక్క ముందు కవాటముల్ తెరిపింతువోయమ్మ! దేవి! కృపతో.
తా॥ కైలాస పర్వతగుహలో నివసించు ఓ పార్వతీదేవీ నీవె మాకు రక్ష. ఓ గౌరీ, ఉమా, కౌమారీ శాంభవీ మాకు వేదార్ధము తెలియునట్లు జేయుము. ఓ శర్వాణీనీకు ఓంకారమే బీజాక్షరముగా ఒప్పి యున్నది. నీవు మోక్షద్వారకవాటములు తెరిపించగల దేవివి. కాశీ పట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా! మాకు జ్ఞాన భిక్షను ప్రసాదించుము. అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ అందించుము.
సీ॥ సర్వలోకంబుల జయమొసంగెడి తల్లి! సర్వజయేశ్వరి! జయము నీకు ఓదయాసంద్రమా! ఓసదాశుభకరీ! నారీ జనాప్రియ! హరుని రాణి! నీలివర్ణంబుతో నీకు శోభనొసంగు కురుల నొప్పెడి తల్లి కొలుతునమ్మ నిత్యాన్నదానమన్ నియమంపుటీశ్వరి! సాక్షాత్తు నీవల్ల మోక్షమగును.
తా॥ సమస్త లోకాలకు జయమొసగెడి ఓ తల్లీ సర్వజయేశ్వరీ నీకు మంగళమగు గాక. ఓదయాసాగరమా సదా శుభమొసంగు సదా శివుని రాణీ! స్త్రీజనప్రియా! నీలి కురులు నీ సౌందర్యమును ఇనుమడింపజేయు చున్నవి. నిత్యాన్నదానవ్రత పరాయణీ సాక్షాత్తు మోక్షప్రదాయనివి. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా మాకు జ్ఞానభిక్ష ప్రసాదించుము అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ మాకు అందించుము.
సీ॥ బంగారు గరిటెను బట్టి హస్తంబున అన్నంబు బెట్టెడి అమ్మనీవు మేలు సువర్ణ రత్నాల హారాల, వా మాదేవి! మ్రొక్కెద పాదములను దక్షయజ్ఞమునందు దీక్షాపరీ దేవి! సుందర స్తనయుగ సుందరీవు భక్తాళికోరెడి వరప్రదాయిని మాకు అభయ ప్రదాతవౌ అమ్మ వీవు.
తా॥ నీవు చేతిలో బంగారు గరిటను ధరించి, అన్నము పెట్టెడి అమ్మవి. మేలైన సువర్ణరత్న హారాలను ధరించిన ఓ వామాదేవీ! నీకు మ్రొక్కెదను. దక్షయజ్ఞమున దహింపబడిన ఓ తల్లీ సుందర స్తనయుగ సుందరివి. ఎనలేని భక్తుల కోర్కెలు దీర్చెడి అమ్మా! నీవు అభయ ప్రదాయనివి, ఓ కాశీ పట్టణాధీశ్వరీ మమ్ము కాపాడుము. ఓ తల్లీ అన్నపూర్ణా మాకు జ్ఞాన భిక్షనిమ్ము. దయగొని మాకు చేగర్రవలె సహాయమందించుము. మా అండవై యుండి కాపాడుము తల్లీ.
సీ॥ కోటి చంద్రాగ్నులు కోటి సూర్యులతోటి సమమైన తేజంబు జనని కుండె చంద్ర సూర్యాగ్నుల సమకుండలములతో బాల సూర్యుని వంటి వన్నెతల్లి అర్క చంద్రులు బోలు అధరంబులున్ గల దేవి ఈ ఈశ్వరి దివ్యచరిత పొత్తంబు, జపమాలబూని పాశంబును, అంకుశంబును దాల్చు అమ్మ ఈమె.
తా॥ ఆ తల్లికి కోటి సూర్య అగ్ని చంద్రుల కాంతి కలిగి యున్నది. చంద్రసూర్యఅగ్ని తేజమునకు ధీటైన కుండలములు ఈ తల్లి కర్ణాభరణములు. ఆ జనని శరీరపువన్నె బాల సూర్యునివంటిది. చంద్రసూర్య సమశోభగల అధరములు ఈ తల్లికి గలవు. ఓ అమ్మా! ఒకచేత పుస్తకము, ఒకచేత జపమాల, ఒకచేత పాశము, ఒకచేత అంకుశము ధరించి యుందువు. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా! మాకు జ్ఞానభిక్ష ప్రసాదించుము అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ మాకు అందించుము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గజ కచ్ఛవ సంగ్రామంనీతికథ.
గజ కచ్ఛవ సంగ్రామం
(ఆదిపర్వంలో ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన కథలున్నాయి. అందులో ఒకటి గరుత్మంతుడు తనతల్లి వినతకు దాసీత్వం తప్పించడానికి నాగుల కోరికమీద ” ‘అమృత కలశం’ తేవడానికి బయలుదేరుతాడు. దారిలో తన ఆకలితీరేదారి చెప్పమని తం. డి అయిన కశ్యప ప్రజాపతిని అడిగాడు. ఆయన చెపుతున్నారు.)
ఇక్కడకు సమీపంలోనే ఒకానొక దివ్యమైన సరోవరం ఉంది. అది కలువలతో, కమలాలతో, వివిధరకముల జల పక్షులతో నయనానందకరంగా ఉంటుంది. ఆ సరోవరంలో ఒక పెద్ద కచ్చపం (తాబేలు) ఉన్నది. కొలను ఒడ్డునే ఒక మత్తగజం ఉన్నది.
ఈ ఏనుగు తన పొడుగాటి తొండంతో ఆ ఆ తాబేలుమపట్టిలాగి హిం సిస్తుండేవి. తాబేలు ఏనుగుకాళ్ళు పట్టి లోపాలకు ఈడ్చి హింస పెడ్తూ ఉండేది.
అలా అవి ఎన్నో ఎళ్ళుగా కొట్టుకుంటున్నాయి. ఆ రెండు జంతు వులూ నీకు ఆహారంగా సరిపోతాయి అన్నాడు.
అదివిని గరుత్మంతుడు :
‘పితృపూజ్య వాటిమధ్య ద్వేషకారణం ఏమిటి?ఏనుగుతో తాబే లుకు పోరాటం ఎలా సంభవం’ అని ప్రశ్నించాడు.
కశ్యపుడు :
“నా కునా ! ఆ ప్రాణులు రెండూ పూర్వజన్మలో మానవులు. అ తమ్ములుగా పుట్టాయి. పెద్దవాడు విభాసుడు. రెండోవాడు సుబ్రతీకుడు.
ఇద్దరు నిత్యం ప్రాతః కాలంలోలేచి స్నానసంధ్యాదులు ముగించి, నియమ పరాయణులయి పరబ్రహ్మను ఆరాధించేవారు. అయితే వారికి కొంత ధనసంపద ఉంది. ఆ ధనంలో తనవంతు తనకు పంచిపెట్ట మున్నాడు సుప్రతీకుడు.
అన్న విభాసుడు!
‘తమ్ముడూ ! ప్రలోభం పుట్టినవారు సంపదలు పంచుకుంటారు. మనం అన్నదమ్ములం. మనకు లోభం పనికిరాదు. పైగా ధనవ్యామో హంవల్ల ద్వేషం పెరిగి కలహాలు వస్తాయి. అప్పుడు ఇరుగు పొరుగులు పరిష్కారం చెయ్యడానికివచ్చి ఈ భేదభావాలు రెచ్చగొడతారు: అందు వల్ల మనం సర్వనాశనం అవుతాం. కనక పంపకాలమాట ఎప్పుడూ మనస్సులోకి రానివ్వకు. ఇంటి పెద్దకొడుకు తండ్రితో సమానం. నువ్వు నా బిడ్డవంటివాడవు’ అని సముదాయించ బోయాడు.
సుప్రతీకుడు వినలేదు. ఏమయినాసరే పంపకాలు జరిగి తీరా అన్నాడు.
అంతలో విభాసుడికి ఆగ్రహం వచ్చి –
‘ అన్న గారి మాటమీద గౌరవంలేకుండా ఉన్న నువ్వు మహారణ్యంలో ఏనుగు గర్భానపడి, గజజన్మఎత్తు’ అని శపించాడు.
సుప్రతీకుడు మరింతకోపంతో – ‘అదే అరణ్యంలో చెరువులో కాబేలువై పుడతావు నువ్వు’ అని శపించాడు.
ఇద్దరూ పవిత్రమానవ శరీరాలు విడిచి జంతువు లయ్యారు. అది మొదలుగా ఆ ఏనుగు గట్టుమీదనిలిచి ఘీంకరిస్తుంది. తాబేలు నీటిమీద తేలి అలలు రేపుతుంది. యుద్ధం ఆరంభమవుతుంది.
అలా అవి నిర్విరామంగా పోరాడుకుంటున్నాయి ఆ చెరువులో.
ఆ ఏనుగు ఎత్తు ఆరు యోజనాలు, పొడవు వన్నెండు యోజనాలు .
తాబేలు చుట్టుకొలత పది యోజనాలు, మందం మూడు యోజనాలు,
ఈ రెండు జంతువుల సంగ్రామంలో ఆ సరోవరం, దాని పరిసర వనం గగ్గోలయి పోతున్నాయి.
ఆ చెరువులో నీరు తాగడానికి అవకాశం లేదు.
ఆ వనంలో ఏ మృగమూ హాయిగా ఆహారం తీసుకు తిరగడానికి అవకాశంలేదు.
ఆ రెండుజంతువులనూ నువ్వు ఆహారంగా తీసుకుంటే అప్పుడు ఆ చెరువూ, వనమూ, మరికొన్ని ప్రాణులకు ఆధారమవుతాయి. ఆ ప్రాంత ములో పక్షులూ, జంతువులూ స్వేచ్ఛగా తిని, తాగి, తిరుగుతాయి. వెళ్ళు, నీకు శుభం” అని తండ్రి ఆశీర్వదించాడు,
గరుత్మంతుడు తండ్రికి నమస్కారంచేసి సెలవు తీసుకున్నాడు. ఒకసారి ఆకాశానికి ఎగిరి, సరాసరి ఆ సరోవర ప్రాంతానికి వచ్చి చూశాడు.
తొండం ఎత్తి ఏనుగు ఘీంకరిస్తున్నది. తాబేలు అలలు రేపుతున్నది. ఒక్కపూపులో క్రిందికిదిగి గరుత్మంతుడు ఒక కాలిగోళ్ళకు తాబేలును తగిలించి, రెండవ కాలిగోళ్ళతో ఏనుగును అందుకుని విశాలమైన పర్వత శిఖరానికి పోయి హాయిగా ఆరగించాడు.
ఈ విధంగా ఆ అన్నదమ్ములపోరు ముగిసింది.
ఈ కథను విన్నవారే దీర్ఘకాలంసాగే పోటీలనూ, పోరావాలనూ గజకచ్ఛవసం గ్రామంతో పోలుస్తూంటారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దీపకుని గురుసేవ నీతికథ.
దీపకుని గురుసేవ
పూర్వం దీపకుడనే నైష్ఠిక బ్రహ్మచారి ఉండేవాడు. అతడొకనాడు శాస్త్రాలలో చెప్పబడిన ఈ సుక్తిని చదివినాడు “పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవసమానులు. వీరిని మించిన దైవము లేదు. వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు. తరించుటకు ఇదియే అతిసులభ మార్గము” అని చదివినాడు. వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు. పవిత్ర గోదావరీ నదీ తీరమున వేదధర్య మహర్షి ఆశ్రమము ఉన్నదని ఆయన సకల వేద వేదాంగాలు తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందఱో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేసినాడు. వినయవంతుడైన దీపకుని శిష్యునిగా స్వీకరించినాడు వేదధర్యుడు. గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచిరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు. అనన్య గురుసేవా నిరతుడై ప్రకాశించాడు.
శిష్యుని విద్యాతేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు “కుమారా! నేను పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను. కానీ రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి. చేసిన కర్మ చెడని పదార్థముకదా. నేను అతిపురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రములో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలచినాను. పుణ్యక్షేత్రములో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు
కదా!
నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతుంటుంది. వికారరూపము అంధత్వము వస్తాయి. నాలో సహనం సాధుత్వం ఆది సద్గుణాలు నశిస్తాయి. కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనముగా ఎదురు చూస్తుంటాను. అట్టి దుస్థితిలో నీవు నాకు సేవ చేయగలవా”? అని అడిగినాడు వేదధర్యుడు.
గురుసేవయే పరమభాగ్యమని త్రికరణశుద్ధిగా నమ్మిన దీపకుడు “గురూత్తమా! నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాపఫలితాన్ని అనుభవిస్తాను. నాకా అవకాశాన్ని ప్రసాదించండి” అని అన్నాడు. “దీపకా! నీ వంశాన్నంతా దీపింపచేయగల వాడవు అలా అనక ఏమంటావు? కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా! పుణ్యమైనా పాపమైనా ఫలితమును అనుభవించక తప్పదు కదా! నా పాపాలను కడుక్కుంటే గాని ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేను” అని వేదధర్యుడు చెప్పినాడు. గురు ఆజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు. ఇద్దరు మణికర్ణికా ఘాట్ కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు.
కశీ విశ్వనాథునికి అన్నపూర్ణాభవానికి పూజలు చేసి పాపాల ఆవాహన చేశాడు వేదధర్యుడు. గురువుగారు చెప్పినట్టే జరిగింది. గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాడు దీపకుడు. చీము నెత్తురు తుడిచి కట్టు కట్టి మలమూత్రాదులను కడిగి అతని శుభ్రపఱచే వాడు దీపకుడు! ప్రతిపూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి “ఇంత కొంచెం తెచ్చావెందుకు” అని నిష్ఠూరాలాడేవాడు వేదధర్యుడు. అతడెంత కోపించినా గద్దించినా ధర్మనిష్ఠతో నిరంతర గురుసేవ చేసినాడు ఆనందపరశుడై దీపకుడు.
అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి “వత్సా! అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను. ఏమి వరము కావాలో కోరుకో” అని అన్నాడు. గుణనిధి అయిన దీపకుడు “స్వామి! నాకు ఈ లోకములో గురుసేవ తప్ప ఏదీ తెలియదు. వారి అభీష్టమేమో కనుక్కొని చెప్తాను” అని అన్నాడు దీపకుడు. గురువుగారికీ విషయం చెప్పి “గురుదేవా! మీకు స్వస్థత కోరుతాను” అని అన్నాడు. వేదధర్యుడు “నాయనా! ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి” అని చెప్పాడు.
మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు. భగవంతుడు ఆ దీపకుని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు. తరువాత నిర్వాణ మండపములో ఉన్న శ్రీమన్నారాయణునికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు. మహావిష్ణువు “పరమశివుని మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము. నీ మనోభీష్టమును కోరుకో” అని అన్నాడు. అందఱికీ సాష్టాంగ వందనము చేసి ఆనందాశ్రువులతో “స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు” అని అడిగినాడు. “తథాస్తు” అని దీవించి దీపకుని కృతార్థుని చేసినాడు మహావిష్ణువు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
గురువును సేవిస్తే సకల దేవతలనూ సేవించిన ఫలితం వస్తుంది. దీపకుడు తన గురునేవానిరతితో త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందినాడు.
కర్మ పాశం తెగనిది. పాపకర్మలకు ప్రాయశ్చిత్తము ఎంత ఘోరముగా ఉన్నదో మనము ఈ కథలో చూచినాము. కావున పాపకర్మలెన్నడు చేయరాదు.
పెదతిరుమలాచార్యులవారు చెప్పిన ఈ కీర్తనలో రాక్షస స్వభావం కలిగినవారిని హెచ్చరిస్తున్నారు. ఒరే రాకాసుల్లారా! మీకు మాతో వైరము వద్దురా. మేము ఈ ఏడుకొండలవాడిని శరణని హాయిగా వున్నవాళ్ళం. మీరూ అదేపని చేయండి. ఆ నాడు త్రేతాయుగంలో మీ రావణాసురుని చంపటానికి ఆ విష్ణువు తన పరివారంతో సహా భూమ్మీద అవతరించి మిమ్మల్నందరినీ మట్టికరిపించాడు. దుష్ట శిక్షణాకార్యక్రమం పూర్తిచేసికొని నేడు తన శరణాగతులకు అంతులేని వరములనిస్తున్నాడు. మీరంతా మీ ప్రవర్తన మార్చుకోండిరా! అంటున్నారు.
భావ వివరణ:
ఓరోరీ! రాక్షసులారా! సన్మార్గులతో వైరము (శతృత్వం) వద్దు సుండీ (సుమా!) ఈ శ్రీవేంకటేశ్వరుడే దేవుడు (భగవంతుడు). ఈ సంగతి తెలుసుకోండిరా! ఈ దేవదేవుని శరణు అనండిరా!
(ఈయనే ఆదిదేవుడైన శ్రీమహావిష్ణువు. రావణుడు నరులను వానరులను తన కాలిగోటికి సరిరారని భావించి, బ్రహ్మను వరములడిగేటప్పుడు దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన వారితో తనకు మృత్యువు రాకూడదన్నాడు. వాడిని చంపటానికి విష్ణువు తన పరివారంతో సహా భూమిపై నర వానరులుగా తల్లి కడుపులద్వారా పుట్టి వాడిని నిర్జించాడు. వాళ్ళంతా యెవరెవరు యెలా పుట్టారో తెలుసుకొని ఆనందించండి.)
ఆ శ్రీమహావిష్ణువు భూమిపై రామునిగా జన్మించాడు. అగపడి (తానూ సిద్ధమై) లక్ష్మీదేవి సీతయై పుట్టింది. ఆయన పరివారమైన ఆదిశేషుడు, సుదర్శన చక్రము, పాంచజన్య శంఖమూ ఆ రాముని సోదరులు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులవలె జన్మించారు.
ఆ శ్రీహరి పరివారమంతా రాముని పరివారంగా యెలా వానరజన్మలెత్తారో తెలిసి ఆనందించండి. సూర్యుడే సుగ్రీవునిగా అవతరించాడు. రుద్రుడు (శంకరుడు) మహా బుద్ధిమంతుడైన హనుమతుడయ్యాడు. బ్రహ్మదేవుడు భల్లూకపతియైన జాంబవంతునివలె అవతరించాడు. వారధిని నిర్మించిన నలుడే దేవశిల్పి విశ్వకర్మ సుమా!
ఆ తరువాత కథ మీ అందరికీ తెలిసిందే కదా! వారంతా రావణ వధ కోసం ఘనులై అప్పుడే సేతువును కట్టి, దాటి, లంకానగరమును ముట్టిరి (ముట్టడించిరి). ఆ తిరుమల శ్రీవేంకటేశ్వరుడె ఈనాడు, ఇక్కడ శ్రీరామచంద్ర మూర్తిగా వెలసి ఒనర (ఒప్పునట్లుగా) తనదాసులకు ఒట్టుచు (శపధముతో) అనేక వరములిస్తున్నాడు. రాండర్రా! మీరు వచ్చి ఈయనను ఆశ్రయించండి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రంగురించి తెలుసుకుందాం…
పై విధముగ అశ్వత్థ వృక్షమూలమునఁ గూర్చిని పై స్తోత్రమునెవడు పఠించునో వెంటనే వాని సమస్త శత్రువులు నశించుననియు హనుమత్ప్రసాదమువలన సంతోషముతో నుండుననియు తాత్పర్యము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు బిల్వాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… చ్యవన మహర్షి – జాలరులు నీతికథ.
చ్యవన మహర్షి – జాలరులు
భృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చ్యవనుడు దివ్య తేజోసంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు. ఆ చ్యవనుడి అర్థాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి. వారి సంతానము దధీచి మహర్షి ప్రమతి ఆప్రవానుడు. ఒకసారి గంగాయమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా ౧౨ యేండ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతోబాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కినాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు.
“ఓ జాలరులారా! భయపడకండి. మీరేతప్పూ చేయలేదు. మీ విధినిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి” అని అన్నాడు. చ్యవనుడి ఉదార స్వభావానికి అశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపఱచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు.
జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి “మహానుభావా! ఈ బెస్తలు తెలియక తప్పుచేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయ్యండి” అని అన్నాడు. దయామయుడైన చ్యవనుడు “రాజా! ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడు” అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కానీ చ్యవనుడు అది తనకు సరైన వెలకాదన్నాడు. రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తానన్నా అది తనకు సరైన ధరకాదన్నాడు చ్యవనుడు. నహుషుడు “అయితే అర్ధరాజ్యమిస్తాను” అని అన్నాడు. “నీ మంత్రులతో సంప్రదించి చూడు” అన్నాడు చ్యవనుడు. “ఆలోచించడానికేమున్నది? నా రాజ్యసర్వస్వమూ ఇస్తాను” అని అన్నాడు నహుషుడు! చ్యవనుడు అయినా అది సరిపోదన్నాడు.
ఏమి చేయాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని “గోవు త్రిలోక పూజ్యమైనది. సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెల కట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవునివ్వు”. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని అన్నాడు.
ఆ జాలరులు కూడా సామాన్యులా? ఇలా అనుకున్నారు “ధనధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఒక మంచి పని చేశే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. ఇలా అనుకుని మహర్షి కడకేగి “అయ్యా! బ్రహ్మ తుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి” అని అన్నారు. వాళ్ళ మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకీ మీకూ సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరం కోరుకో మన్నారు. వినయముతో నహుషుడు “స్వామీ! మీరు తృప్తిపొందితే అదే చాలు. నాకింకేదీ అక్కరలేదు” అన్నాడు. అతని వినయవిధేయతలకు ఆనందించి ఇంద్రపదవిని అనుగ్ర హించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచముకూడా కోపించకుండా చ్యవనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు.
జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి. చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్ళారు జాలరులు.
సత్కర్మలు చేశే అవకాశం అరుదుగా వస్తుందని. వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులు.
గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి..
ధర్మపాలనకై తన సర్వస్వమునూ త్యాగం చేయటానికి సిద్ధపడ్డ నహుషుడు మనకు ఆదర్శము కావాలి.