మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
స్వాతంత్ర్య సమరయోధులనాటి నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… నిజాయితీ కథ.
నిజాయితీ
భారతదేశపు వైద్య విధానం ఆయుర్వేదం. బ్రిటిషర్లు మనదేశాన్ని ఆక్రమించి వారి వైద్యవిధానమైన అల్లోపతి ని ప్రవేశపెట్టకముందు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంలో ఉండేది. కాని బ్రిటిషర్ల పాలనవలనో మనలో అలవాటైన బానిస భావన వలనో మెల్లిమెల్లిగా ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. చాలామంది ఆయుర్వేదం పనికిరాదని తోసివేశారు. అట్టి కాలంలో బెంగాలుకు చెందిన ఓ ప్రముఖ విద్యావేత్త ఆయుర్వేదాన్ని కాపాడుకోవటానికి నడుంకట్టాడు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారుచేసే ఒక సంస్థను స్థాపించాడు.
అలా ఎంతో కష్టపడి ప్రతికూలమైన పరిస్థితులలో సంస్థని నడుపుతుండగా ఒకనాడు ఆ విద్యావేత్తకు ఒక భీషణమైన సమస్య ఎదురయ్యింది. ఆ సంస్థ తయారు చేసిన ఎన్నో మందులు ఏదో కారణముగా పాడైపోయాయి. ఆ విద్యావేత్త ఎంతో దుఃఖించాడు. అతని విచారం చూసి అక్కడే ఉన్న ఓ ఉద్యోగి ఇలా పలికాడు “అయ్యా! మీరు విచారించకండి. ఇంకా ఈ మందులు పూర్తిగా పాడు అవ్వలేదు. ఇంకొన్నాళ్ళు సునాయాసంగా మనం వీటిని అమ్మవచ్చు. అట్లు చేయకున్న మనకు చాలా నష్టం వస్తుంది. ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలన్న మీ ఆశయం కూడా అప్పుడు నెరవేరక పోవచ్చు”.
ఇటువంటి అవినీతి భరితమైన మాటలు విని ఆ విద్యావేత్త మండిపడుతూ ఇలా జవాబిచ్చాడు “నష్టమొస్తుందని పాడైపోతున్న మందుల్ని అమ్ముతామా? అట్టి నీచమైన కార్యాన్ని నేనెన్నడూ చేయలేను. ఆయుర్వేదం ధర్మం ఉన్నచోటే ఔషధాలు పనిచేస్తాయని చెప్పింది. కనుక నా ఆశయం ధర్మస్థాపనే”. అలా హితబోధ చేసి ఆ మందులన్నిటిని బయటపడ వేయించి తన ఆదర్శాన్ని కాపాడుకొన్నాడు. తరువాత ఆ విద్యావేత్త లోని నిజాయితీని అందరూ కొనియాడారు.
ఆ ప్రసిద్ధ విద్యావేత్త ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్. భారతీయుల యొక్క విజ్ఞానము గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఈయన ఎన్నో వ్యాసాలు వ్రాసినారు. “Chemical Knowledge of the Hindus” అనే వ్యాసం మనమందరం చూడదగినది. ఈ వ్యాసంలో ప్రఫుల్ల చంద్ర గారు మన భారతదేశం ఆధ్యాత్మికత బోధించడంలోనే కాదు విజ్ఞాన పరంగా కూడా ఎంతో ముందున్నదని చెబుతారు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
నిజాయితీ యొక్క ప్రాముఖ్యత మనమీ కథలో తెలుసుకొన్నాము. ఎంత నష్టమైనా రాని ఏమైనా కానీ ఎన్నడు అవినీతికి పాల్పడరాదని శ్రీ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ గారు మనకు చూపించారు.
మన స్వదేశీ విజ్ఞానం యొక్క గొప్పతనం చంద్ర గారి వ్యాసాల ద్వారా తెలుసుకొన్నాము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ మల్లికార్జున స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
తా. లోకమంగళప్రదుఁడును, సర్వసుఖంకరుఁడును, సుందరేశ, నటేశ, గణేశ, గిరీశ, మహేశాది నామములు ధరించిన వాఁడును, సూర్యచంద్రులఁ గన్నులుగాఁగలవాఁడును, మంచి దేహముతోఁగూడి పార్వతీప్రియుఁడైయున్న మల్లికార్జున స్వామిని నా మనసులోఁదలఁచుకొందును.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ వినాయక వ్రత కథ గురించి తెలుసుకుందాం…
Vinayaka Vrata Katha In Telugu
శ్రీ వినాయక వ్రత కథ
(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.)
కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశార ణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనము లను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగి పోయి,సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.
“ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ని దర్శించి తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటు వంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధి ప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి, స్నానంచేసి, నిత్య కర్మలు నెరవేర్చుకుని తమశక్తి మేరకు బంగారంతోగాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మనుచేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కుల్లో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్యపురాణ, పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదు లను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజచేయాలి. విప్రులకు దక్షిణతాంబూ లాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదంవలన సకల కార్యములూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకీ అత్యుత్తమ మైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.
కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతంచేయడం వల్లనే శ్యమంతకమణితోపాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.
పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ నీవు నాయుదర మందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియం దుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దుమేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని, వారిని పిలిపించి తనభవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగునాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై “ఏమి కావాలో కోరుకోండి.. ఇస్తాను” అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది. శివుడ్ని అప్పగించు” అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకు డగు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి, నా చర్మము నీవు ధరించు” అని ప్రార్థించాడు. తన గర్భంలో వున్న శివుడ్ని తీసుకోవ చ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. ‘దుష్టాత్ములకు ఇటువంటి వర మును ఇవ్వరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.
64 ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
దవ్వు చేరువకు తానే గురుతు
||పల్లవి||
పరమమంగళము భగవన్నామము
సురులకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిగిన యెదుటనె ఉన్నది
వరుసల మఱచిన వారికి మాయ
||ఎవ్వరి||
వేదాంత సారము విష్ణుభక్తియిది
ఆదిమునులమత మయినది
సాధించువారికి సర్వసాధనము
కాదని తొలగినకడుశూన్యంబు
||ఎవ్వరి||
చేతి నిధానము శ్రీ వేంకటపతి
యేతల జూచిన నిందరికి
నీతియు నిదియే నిజసేవకులకు
పాతకులకు నది భవసాగరము
||ఎవ్వరి||
అవతారిక:
ఎవరి అదృష్టం యెలావుంటుందో యెవరు చెప్పగలరు? అని పాడుతున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. “దవ్వు చేరువకు తానే గురుతు” అంటే, యెవ్వడు ఆయనకు దూరమైనవాడో, యెవరు దగ్గరవాడో తానే తెలిసినవాడు. ఇంకెవరికీ తెలియదు అని అర్థం. ఆనాడు శిశుపాలుడి తల నరికాడు కాని వాడు ఆయన నమ్మిన ద్వారపాలకుడు. “బావా! యెప్పుడు వచ్చితీవు” అని ధుర్యోధనుణ్ణి ఆప్యాయంగా పలుకరిస్తాడు. కాని తొడలు విరగకొట్టించి చంపించాడు. మరి మనబోటి వారేం చేయాలి? సత్ప్రవర్తనతో, శరణాగతితో, స్థిరభక్తితో, ఆ ఏడుకొండలవాడిని సేవించడం. అట్లా చేయనివారి గతి యేమిటి? భవసాగరంలో కొట్టుమిట్టాడటమే.
భావ వివరణ:
ఓ ప్రజలారా! ఎవ్వరి భాగ్యం (అదృష్టము) యెట్లా వుంటుందో, యెవ్వరు చెప్పగలరు? “దవ్వు చేరువకు తానే గురుతు” (ఆ సర్వేశ్వరునకు ఎవ్వరు దూరమో? ఎవ్వరు దగ్గరవారో? ఎవరు చెప్పగలరు?)
భగవన్నామసంకీర్తనము పరమమంగళకరమైనది. అది నరులకే కాదు సురులకు (దేవతలకు) కూడా శుభప్రదమైనది. ఇరవుతో నెరిగిన (సమూలంగా తెలిసికొంటే), అది యెదుటనే వున్నది. అంటే దాని ఫలితం ప్రత్యక్షంగా కనబడుతుంటుంది. వరుసల మరచిన (దేవుడెవరు జీవుడెవరు అనే క్రమము మరచినచో) వారికి మాయ (వారు మాయకు లోనై తామే అధికులమని హిరణ్యకశిపునివంటి భ్రష్ఠులైపోతారు).
వేదము విష్ణువును కీర్తిస్తుంటే… వేదాంతము యొక్క సారము విష్ణు భక్తిని ప్రతిపాదిస్తున్నది. ఆదికాలమునాటి మునులయొక్క మతము కూడా విష్ణుభక్తియే. సాధనతో విష్ణుభక్తిని పెంపొందించుకొంటే వారికి సర్వమూ సాధ్యమవుతాయి. విష్ణుని కాదని తొలగిన (దుర్యోధనుడు తనకి కృష్ణుడు వద్దు, కాని కృష్ణుని యాదవ సేన కావాలని కోరుకున్నాడు) కడు శూన్యము (ఏదీ దక్కదు) మిగులుతుంది.
శ్రీవేంకటేశ్వరుడు చేతిలోవున్న నిధానము (నిధివంటివాడు.) ఏతలజూచిన (ఏవిధంగా చూచినా) ఇందరికి (ఈ జీవకోటికి) నీతియు (ధర్మవంతమైనది) ఆ దేవదేవుని శరణాగతియే. నిజసేవకులకు (అసలైన హరిదాసులకు) ఇదియే దిక్కు మరి పాతకులకు (పాపాత్ములకు) అది భవసాగరమున (సంసార సాగరంలో) మునక. ఇంతవరకు అందులో మునిగినవాడు తేలలేదు. తేలడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శీలసంపద కథ.
శీలసంపద
ఖాండవవన దహనమప్పుడు లోకైకవీరుడైన అర్జునుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా మయాసురుడు మయసభను నిర్మించి ధర్మరాజుకివ్వాలని సంకల్పించుకున్నాడు. మయాసురుడు ఆ భవ్య మయసభను పవిత్ర హిమాలయాలలో నిర్మించి తన మాయశక్తితో ఇంద్రప్రస్థానికి తెచ్చాడు. మయసభలోని అద్భుతాలను పొగడటానికి మాటలుచాలవు. మయసభ అంతా కనక రత్న మణిమయము. మయసభలోని స్తంభాలు ద్వారాలు తోరణాలు వనాలు తటాకాలు అన్నీ మణిమయాలే. రాజసూయ యాగానికి వచ్చిన ఎందఱికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించి నభూతో నభవిష్యతి అని పొగడబడినది ఆ మయసభ. మయసభ విభవం పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుని అసూయామాత్సర్యాలు మరింత చెలరేగాయి. పాండవుల కీర్తి సంపదలను తలచుకొని తీవ్రంగా దుఃఖిస్తూ తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు దుర్యోధనుడు. మత్సరమనే ఘోరసర్పముచే కాటువేయబడ్డ తన కొడుకుకి ఇలా హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు
“కుమారా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యమున్నదా? ఈ లోకంలో సంతృప్తి ఉన్నవాడే ధనవంతుడు. సంతృప్తి లేకుండా కుబేర సంపద ఉన్నా వాడు సంతోషముగా ఉండలేడు. నాయనా! శీలవంతుడైన ధర్మనందనుని శ్రీలక్ష్మి ఎన్నడూ విడువదు. శీలవంతుని ఆశ్రయించే సకల సంపదలు సుగుణములు ఉంటాయి. కాబట్టి నీవు కూడా ధర్మాత్ములైన పాండవులవలె శీలవంతుడవు కమ్ము. తానుతో సిరిసంపదలు వాటంతట అవే వస్తాయి”. కుమారునికి ఒక ఇతిహాసం చెప్పాడు
“ప్రహ్లాదుడు సర్వగుణ సంపన్నుడు విద్యా పారంగతుడు పరమ విష్ణుభక్తుడు. ధర్మం తప్పకుండా తన ప్రజలను పాలించేవాడు. తన సౌశీల్య ప్రభావం చేత త్రిలోకాధిపత్యం ఇంద్రత్వం ప్రాప్తించింది ప్రహ్లాదునికి. చతుర్భువనాలను జనరంజకముగా పాలించసాగాడు ఆ ప్రహ్లాదుడు. ఇలా ప్రహ్లాదుని వలన పదవీ భ్రష్టుడైన శచీపతి గురువైన బృస్పతులవారిని తనకు మళ్ళీ ఇంద్రపదవి సిద్ధించే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బృహస్పతి విష్ణు అవతారుడైన పరశురాముని ఆశ్రయించమని చెప్పాడు. గురు ఆజ్ఞపాటించి ఇంద్రుడు భార్గవరాముని శరణుజొచ్చి ఉపాయం బోధించమని ప్రార్థించాడు. “అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతనినే అడుగు. ఆ శక్తిని అతనివద్దనుండే పుచ్చుకో” అని చెప్పాడు భార్గవుడు.
విద్యార్జన గురుసుశ్రూష వలనే సాధ్యం అని తెలిసిన దేవేంద్రుడు విప్రవేషం ధరించి ప్రహ్లాదునికి శిష్యుడై అతనిని భక్తితో సేవించటం మొదలుపెట్టాడు. అలా ఎంతో కాలం ప్రహ్లాదుని సేవించినాడు వజ్రి. ప్రసన్నుడైన ప్రహ్లాదుడు “నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?” అని విప్రవేషంలో ఉన్న ఇంద్రుని అడిగాడు. శచీపతి తన అభీష్టం వ్యక్త పఱచినాడు. అప్పుడు ప్రహ్లాదుడు
“కుమారా! నేనెప్పుడూ రాజునని గర్వించను. ఎవఱినీ నొప్పించను. వారికి హితమేచేస్తాను. ఈర్ష అసూయ ద్వేషం పగ మొదలైనవి నా దరి చేరనివ్వను. అడిగినవాడికి లేదనకుండా సంతోషపెడతాను. నా పురాకృత పుణ్యం వలన నాకీ సౌశీల్యం అబ్బినది” అని చెప్పాడు. “ఓ దయామయా! దానశీలా! నీ శీలం నాకు ప్రసాదించు” అని అడిగాడు ఇంద్రుడు. “అయ్యో పాపం!” అని ప్రహ్లాదుడు తన శీలాన్ని దేవేంద్రునికి దానం ఇచ్చి పంపివేశాడు.
ఇంద్రుడు వెళ్ళాడో లేదో ప్రహ్లాదునిలోనుండి ఒక దివ్య తేజఃపుంజము పురుషాకృతిదాల్చి బయటికి వచ్చింది. “నీవెవరు?” అని ఆశ్చర్యాముగా అడిగాడు ప్రహ్లాదుడు.
“నేను నీ శీలాన్ని. ఆ విప్రునికి నన్ను దానం ఇచ్చావు కదా. వెళుతున్నాను” అని చెప్పి వెళిపోయింది శీలము. ఒకతేజస్సు తరువాత ఒకటి ప్రహ్లాదుని వీడిపోయినాయి. ఒక తేజస్సు అన్నది “నేను సత్యమ్. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. శీలంతో పాటూ నేను నిన్ను విడుస్తున్నాను”. మరొక తేజస్సు అన్నది “రాజా! నేను ఋజుప్రవర్తనమ్. సత్యము లేని చోట నేనుండలేను”. “నేను బలమ్. సత్ప్రవర్తన లేనివాడి వద్ద నేనుండను” అని వెళ్ళిపోయింది బలమ్. చివరికి ఆదిలక్ష్మి బయటికి వచ్చి “నేను శ్రీలక్ష్మిని. బలం ఉన్నచోటే నేనుంటాను. వెళుతున్నాను” అని అన్నది. అప్పుడు ప్రహ్లాదుడు “అమ్మా! లోకమాతా! నీవూ నన్ను విడిచిపోతున్నావా? ఈ అభాగ్యునిపై దయ చూపవా? వెళ్ళద్దు తల్లీ! ఆ విప్రుడు ఎవఱు తల్లీ?” అని ప్రార్థించాడు. “అతడు దేవేంద్రుడు. పోగొట్టుకున్న రాజ్యమును సంపాదించడనికి నీవద్దకు వచ్చాడు. అన్ని సంపదలకూ మూలమైన శీలమును నీవు అతనికి దానమిచ్చావు కావున శీలాన్ని అనుసరించి మేమందఱమూ వెళుతున్నాము” అని సర్వాణి చెప్పింది. నిజమైన శ్రీహరి భక్తులకు సాధ్యం కానిదేమున్నది? ప్రహ్లాదుడు మళ్ళీ తన సద్గుణాలను సంపదలను అచిరకాలంలోనే సంపాదించుకున్నాడు. కనుక నీవెల్లప్పుడూ సౌశీల్యుడవై వర్ధిల్లు నాయనా!” అని కుమారునికి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
సౌశీల్యం యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. శీలమున్న వాడి వద్దనే సకల సంపదలుంటాయి. కాబట్టి మొదట శీలవంతులము కావడం ముఖ్యము.
“వేదవట్టు” అంటే వేద ప్రవచనము చేయటం. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు వేదము తెలిసిన పండితులతో అంటున్నారు ‘ఇంకా యేమి వేదప్రవచనాలు చేస్తారు? యేమి వెదుకుతారు? యేమేమి చదువుతారయ్యా! మీకీ మాత్రం తెలియదా? వేదాంత వేద్యుడు విష్ణువుగాక వేరెవరున్నారు?’. ఈ కీర్తనలో జలధమ్ము అంటే ‘జలధియమ్ము’ అని భావించాలి. పెనువేలు అంటే బొటనవ్రేలని అర్థం. అనంతకోటి బ్రహ్మాండాలను తన బొటన వేలికింద నొక్కివేయగలడట ఈ విశ్వరూపుడు మరేమనుకొన్నారు?
భావ వివరణ:
ఓ అయ్యలారా! యిక వేదవట్టి (వేద ప్రవచనములు చేసి) యేమి వెదకెదరయ్యా! యేమి చదివేరు? వేదాంతము వేదాంతము ద్వారా, వేద్యుడు (తెలియదగినవాడు) యెవరు? విష్ణువే కదా! ఈ సంగతినెరుగరా? ఏమి వింత!!
మీరు ఆయన కృష్ణావతారం గురించి వినలేదా? ఆ శ్రీకృష్ణుడు అదె గరుత్మంతునిపైనెక్కి తోలె (వెడలినాడు). బాణాసురనెదుర్కొని చిత్తుచేశాడు. వడి (వేగముగా) కంసునిపై నెగసి (దండెత్తి) వాలెను (మీదపడ్డాడు). కేలుచాచి (చేయిచాచి) చక్రాయుధాన్ని అందుకొని శిశుపాలుని కెడపె (పడవేసెను). అట్టి లీలలు చేసిన వేలుపులరాయుడు (దైవశిఖామణి) యైన విష్ణువునెరుగరా? ఏమి ఆశ్చర్యము!
ఈయన తొల్లి (కృతయుగంలో) బలీంద్రుని (బలి అను దానవేంద్రుని) పాతాళమునకు క్రుంగునట్లు తలపై కాలుంచి త్రొక్కెను. ఈయన త్రేతాయుగములో మొక్కలా (శౌర్యముతో) జలధిని (సాగరమును) అమ్ముమొనకు దెచ్చే (బాణముయొక్క మొనకు తెచ్చి శరణాగతుని చేసెను. పక్కన భవిష్యత్తులో ఈయన తన పెనువేల (బ్రొటనవేలితో) బ్రహ్మాండమునే పగులించె బ్రద్దలు కొడతాడు. ఓ అయ్యలారా! వెక్కసపు దైవమైన (సర్వాధికుడైన దేవుడు) విష్ణువునెరుగరా?
ఈయనే శ్రీరాముడై రావణుడు మొదలైన భయంకర దైత్యులను సంహరించాడు. తన పాంచజన్యశంఖమును వున్నతముగ పూరించి జయధ్వానములు చేసెను. యుగయుగాలలో ఇవన్నీ చేసి అలసిన శ్రీమహావిష్ణువు ఈ కలియుగంలో సేదతీరుటకు (విశ్రాతికి) శ్రీవేంకటాద్రిమీద శ్రీ వేంకటేశ్వరుడై నిలిచినాడు. అదిగో తిరు వీధులలో మెరసేటి (కాంతులు వెదజల్లుతున్న) ఈ విష్ణుదేవుని ఎరుగరా? ఏమి విచిత్రం!!
ఆ గొల్లెత మొలనులు (స్త్రీలు ప్రత్యేకముగా ధరించు మొలత్రాడు) ధరించినదై మురిపెముతోనున్నదట. ద్విగుణీకృతమైన అందంతో ఆమె వాడవాడలా విరహవేదనతో తిరుగుతున్నదట. ఆమె సంపెంగపూలు కొప్పులో తురిమింది. నొసటిమీద కస్తూరీ తిలకం ధరించింది. ఉంగరాల చేతిని విలాసంగా వూపిందట. తరువాత వేంకటపతి సందిట నర్తించి అలసినదట. ఇది సరస శృంగార కీర్తన. అన్నమాచార్యులవారి శృంగార భక్తి నభూతో నభవిష్యతి.
భావ వివరణ:
మొలనూలు (స్త్రీలు ధరించునట్టి మొలత్రాడు) ధరించిన ఆ గొల్లెత (గొల్లభామ) మురియుచును (సంతోషంతో మురిసిపోతూ) వాడవాడలా (పల్లెలోని తన పేటంతా) వలవంత దిరిగీని (మదనవేదనతో తిరుగుచున్నది).
ఆ గొల్లెతవంపు మోము గొల్లెత (గుండ్రని ముఖముగల గొల్ల భామ). ఆమె చల్లలమ్ముతుంది. ఆమె తలలో సంపెంగపూలు ధరించినది. ఆమె ఇందిరాపతియైన శ్రీకృష్ణుని వలచినది. మధురమైన కోరికలతో రగులుచున్న ఆమె కదలాడుచున్న ‘చెంపసరాలు’ ధరించి కలివిడిగా ఆ గొల్లవాడంతా తిరుగుచున్నది.
ఆమె తన నొసట (నుదురుపై) కస్తూరి తిలకమును ధరించినది. తన కన్నులతోనే ఆమె మనోహరంగా నవ్వుతున్నది. వాడ అంతా కలియతిరుగటచే వసివాడిన (అలసిన). ఆమె ముఖము నీరసముగానున్నది. హరిమీద (కృష్ణునిపై కసరుచు (విసుగుకొనుచు) కాకకోపముతో (మండించే క్రోధముతో) ఆ గొల్లెత, యెసరుజెమట (వేడిచెమటను) చిమ్ముచున్నది.
వలపులను చిందిచుచున్న ఆ గొల్లెత వాడ అంతా కలయతిరుగుచున్నది. చెలువంపుటుంగరములను (సొగసైన అంగుళీయకములను) వేళ్ళకు ధరించిన ఆమె తన చేయి (చేతిని) ఇదిగో ఎలా వీచుచున్నదో చూడండి. ఆమె కలికియై (అందాలరాసియై) శ్రీవేంకటేశ్వరుని కౌగిట కరిగి నర్తించుచు అటూఇటూ యేగుచు (నడచుచు) మిక్కిలి అలసినది.
సిరుల మేన మరఁది శిశుపాలు నీ విట్టే
పొరిగొంటివి సుమ్మీ పోయితే నీవు
తిరువేంకటేశ నిన్నుఁ దివిరి కూడి (డే?) వని
కరుణఁ బెట్టితి నీకుఁ గపటాన నాన
||సుతుని||
అవతారిక:
పరంధాముని నిందాస్తుతితో ప్రార్థించిన భక్తాగ్రేసరులు కోకొల్లలు. బాధతాళలేక నిందించినా అది స్తుతితోనే ముగుస్తుంది. ఈ కీర్తన ప్రత్యేకత యేమంటే అన్నమయ్య. వ్యావహారిక దృష్టిలో ‘కొడుకు’ను చంపిన క్రూరుడు, ‘అన్నను’ చంపిన అతి జిత్తులమారి, మేనమరిదిని చంపిన కఠినుడు నన్ను కాపాడతాడో లేదోనని యేవేవో ఒట్లు పెట్టి నన్ను కాపాడమని వేడుతున్నాను ఇవన్నీ ‘కపటపు ఆనలే’ ప్రభూ! ఎలాగైనా నీదయ పొందాలనే నా ‘ప్రయత్నం’ అంటున్నారు పరమాత్మతో. ఇటువంటి కీర్తన మనసును కరిగిస్తుంది.
భావ వివరణ:
ఓ దేవదేవా! నీవు కఠినాత్ముడవు. నీసుతుడైన నరకుని (వాడు శ్రీహరికీ భూదేవికి, హిరణ్యాసుర వధానంతరం పుట్టిన కొడుకు) చంపజూచి, వాడిచావు వాడి తల్లి అంశతో జన్మించిన సత్యభామ చేతితో జరిపించావు). నన్ను దయతలచక మానితే నీకు ‘ఆన’ (ఒట్టే సుమా!)
నీవు నరసింహుడవై హిరణ్యకశిపుని చీల్చి చంపి వాడినెత్తురు నేలరాలరాదని వాడి నెత్తురు త్రాగినావు. ఇంతాజేసి వాడు నీతోడబుట్టిన అన్నయే కదా! వాడు చెల్లెలుదితి కొడుకైతే, నీవు అక్క అదితి కొడుకువి. ఉత్తలాన (తొందరపాటుతో) యెక్కడైనా నాకోసం పొంచివున్నావేమోనని భీతిచే బిత్తరజెంది పెట్టరాని ‘ఆన’ బెట్టితినయ్యా! నన్ను క్షమించు. నీవు నన్ను చంపితే అంతకంటే నేకోరునదేమున్నది తండ్రీ!
నీవు మేనమామను చంపిన గొప్ప మేనల్లుడవని అందరూ యెరిగినదే కదా! మామూలుగా చంపవచ్చును కదా! వాడిని (కంసుని) ఆకాశవాణిద్వారా హెచ్చరికపంపి మేనల్లుళ్ళని చంపిన క్రూరుడన్న పాపం అంటగట్టి, వాడిని ప్రాణానకు తప్పినవాడవు (ప్రాణాలు తీసినవాడవు). ఈరసార (కొద్దిగా ఈర్ష్యతో) ప్రియములు చెప్పలేక, తొందరపడి ఇప్పుడు నేను యేవేవో ‘ఆన’లు (ఒట్లు) పెట్టేను. అంతే స్వామీ! వాటిని లెక్కజేయకు.
స్వయముగ నీ మేనమరిది శిశుపాలుని సుదర్శన చక్రంతో పొరిగొంటివి (తలనరికేవు). సభలో తరిమితరిమి చంపినావు. అందుకు నూరుతిట్లు నిన్ను తిట్టినపాపము వాడి చేత చేయించావు. పోయితే నీవు (ఇకపోతే నీవు) తిరువేంకటేశ్వరుడవై తివిరి (ప్రయత్నముతో నన్ను కూడేవని (అనుగ్రహింతువని) నీకు కపటపు ఆనలు పెట్టాను స్వామీ! నన్ను కరుణతో చూస్తే చాలు తండ్రీ! నీకు ఆనలు పెట్టే ధైర్యం నాకెక్కడిది ప్రభూ!
శ్రీహరి పరమాత్మ, ఆదిదేవుడు. కొందరు అల్పమతులు. ఈ సత్యమును నమ్మలేక చెడిపోతున్నారు. సర్వలోకపతి శ్రీపతియేనని తెలియకున్నారు. అందరి దిక్కూ ఆ దివిజవంద్యుడేనని అరయలెకున్నారు. వేదాంగములచే నేర్చి భావించవలసిన శ్రీవేంకటేశ్వరుని శరణని ఇహపరములను సాధించలేకున్నారు. కనుక మొదటి మెట్టు నమ్మం, చివరిమెట్టు శరణాగతి మధ్యలో అన్నీ నమ్మకాన్ని సడలించే జారుడుమెట్లే. కానీ భయపడకండి… కరివరదుని శరణని పరమునెరిగే దారి నరయండి.
అన్ని దిక్కులయందును మొక్కుటకు ఆదిక్పాలకులుంటారు. ఆ దివిజులందరికీ వంద్యుడు (పూజింపదగినవాడు) శ్రీహరియే. ఇవల (ఇటువైపున) ఇంకా అన్యులైన సురలేరీ? ఆక్రమించిన అంతర్యామి యెల్లరకు హరియే. ఆయన కరుణాకరుడట. మనలోనేవుండు వానిని, వివిధ భంగులను (రకరకములైన మార్గములలో) వెదకగనేలా (వెదుకుటెందులకు?)
శ్రీవేంకటేశ్వరుడు వేదాంగుడు (వేదములే అంగములుగా గలవాడు). ఆయన శరణాగతితో నేను ఆయన నాశ్రయించితిని (విశిష్టాద్వైతినైతిని). అటువంటప్పుడు “ఆది మతములికనరసేదా? (తొల్లిటి మతములను గురించి ఆలోచించుటెందులకు?) ఏదెస నెవ్వరి కెవ్వడుగలడు? (ఏ దిక్కుయైనా ఈ లోకంలో యెవ్వరికెవరున్నారు? అందరూ మధ్యలోవచ్చి మధ్యలో పోయేవారే కదా!) మనకు ఇహము, పరమునొసగెడివాడు ఈ దేవుడే. ఇంకెవ్వరూ లేరు, వుండరు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ వినాయక పూజా విధానం గురించి తెలుసుకుందాం. శ్రీ వినాయక పూజ అనేది భక్తులు వినాయకుడు దేవుడిని ఆరాధించడానికి విధానము. ఈ పూజలో వినాయకుడిని ఆవాహన, ప్రణామం, ఆరతి, నైవేద్యం, మంత్రార్చన మరియు ఆయుధాల అర్పణ ఉంటుంది.
Sri Ganapathi Pooja Vidhanam
శ్రీ వినాయక పూజా విధానము
ముందుగా బొట్టుపెట్టుకుని, నమస్కరించుకుని ఈ విధంగా ప్రార్థించుకోవాలి.
శుక్లాంబరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అనే శ్లోకం చదువుతూ పూవులూ, అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాలచెంత వుంచాలి. పూజను దేవుని పాదాలవద్ద మాత్రమే చేయాలి. శిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు.)
ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి (అని చెబుతూ ఉద్దరిణతో నీటిని పసుపు గణపతికి చూపించి ఆ నీటిని పళ్లెం లేదా పాత్రలో వేయాలి.
పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరువత్తులు వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యంపెట్టి షోడశోప చారపూజచేయాలి. యధాభాగం గుడం నివేదయామి || శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో సుప్రీతో, వరదోభవతు॥ గణాధిపతి ప్రసాదం శిరసాగృష్ణమి అంటూ పూజచేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి. మరలా ఆచమనంచేసి పైన సూచించిన విధంగా సంకల్పం చెప్పుకోవాలి. అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే అంటూ కుడిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.