Kalige Makide Kaivalyasaramu In Telugu – కలిగె మాకిదె కైవల్యసారము

కలిగె మాకిదె కైవల్యసారము - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కలిగె మాకిదె కైవల్యసారము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కలిగె మాకిదె కైవల్యసారము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : కలిగె మాకిదె కైవల్యసారము
సంఖ్య : 419
పుట: 281
రాగం: బౌళిరామక్రియ

బౌళిరామక్రియ

98 కలిగె మాకిదె కైవల్యసారము
ఫలించె నాడెదఁ బాడెద నేను

||పల్లవి|||

నీపాదతీర్థము నీరజభవుని
పైపై కమండలపానీయము
చేపట్టి శంభుని చిరుజడలలో
దీపించుగంగాతీర్థరాజము

||కలిగె||

ఘన నీ నామమె గౌరినాలిక పై
పనిగొన్న మంత్రపాఠము
అనుఁగువాణికి నాదిచదువులం
బెనఁచే మొదలి బీజాక్షరము

||కలిగె||

శ్రీవేంకటేశ్వర చేరి నీదాసుల
సేవ నాపాలిఁటి జీవనము
ఆవిటించి శరణాగతులకును
త్రోవయైన దిదె దోషహరము

||కలిగె|| 419

అవతారిక:

తనకు కైవల్యసారం సిద్ధించినదని ఆనందంతో ఉత్తుంగ తరంగమై కీర్తన నాలాపిస్తున్న అన్నమాచార్యులవారిని వినండి. తన ఆశయం ఫలించింది కావున ఆడెదను, పాడెదను అని నృత్యం చేస్తూ ఈ కీర్తన నాలాపిస్తున్నారు. త్రివిక్రముడైన శ్రీమన్నారాయణుని పాదాలను కడుగవలెనని బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీళ్ళను పోస్తే అది ఆకాశగంగయై ప్రవహించి భగీరథుని కోసం భూమిమీదకు చేరటానికి శివుని తలపై చేరి అక్కడనుండి భూమిపై దూకి ప్రవహించి యావత్ ప్రజానీకాన్ని పునీతుల్ని చేస్తున్నదట. గౌరీదేవి శ్రీహరి నామమంత్రం జపిస్తుందట. వాణికి మొదటి బీజాక్షరాలను ఆదేవ దేవుడే ఇచ్చాడట ప్రభూ! అట్టి నీదాసులను సేవించే భాగ్యం కలిగింది. అదే మాకు కైవల్యసారము అంటున్నారు.

భావ వివరణ:

ఓ దేవదేవా! ఇదే మాకు కైవల్యము యొక్క సారము కలిగినది. మా కల ఫలించినది. ఇక నేను ఆడెద (నాట్యం చేస్తాను) పాడెద (కీర్తనలాలాపిస్తాను). ఇంతకీ నాకు సిద్ధించినదేమిటో వినవయ్యా!

ఓ ప్రభూ! నీరజభవుని (బ్రహ్మదేవుని) కమండలంలోని పానీయము (త్రాగేనీరు) శ్రీహరి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయుటకు త్రివిక్రముడైనాడు. అప్పుడు వున్నపళంగా ఆయన కాళ్ళు కడగాలని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళు పోసినాడట. ఆ శ్రీహరి పాదజలము ఆకాశగంగయై దివిలో ప్రవహించి భగీరథునికోసం భూమి చేరుటకు శంభుని శిరసుపై దూకి అచ్చటనుండి ఒక పాయ భూమిపై దూకి కోట్లాది ప్రజలు గంగా తీర్థమని సేవించు, గంగానదియై తీర్థరాజమైనది.

ఓ దేవా! నీ ఘననామము గౌరీదేవి నాలుకపై పనిగొన్న (పూనుకొనిన) మంత్రపఠనమైనది. ఆమె నిత్యమూ చేసే నీ నామసంకీర్తన మాకూ దిక్కైనది. నీ అనుగు కోడలైన వాణికి (సరస్వతీదేవికి) ఆనాడు | సోమకాసురుని జంపి తిరిగి తెచ్చిన ఆది చదువులను (వేదములను) | మొదటి బీజాక్షరములుగా నేడు మాకు విద్యనందించి ఆమెను చదువుల రాణిని చేసినది.

ఓ శ్రీవేంకటేశ్వరా! చేరి నేడు నీదాసులను సేవించుటే నా పాలిట జీవనమైనది. ఆవిటించి (వ్యాపించి) నీ శరణాగతులమైన మాబోటి వారికి | అది దోష రహితమై కైవల్యమునకు త్రోవ యైనది. తండ్రీ! నాబోటి అల్పుడు కూడా నిన్ను చేరే ఆధారమైనది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Harihari Yindariki Nabburamugani Yidi In Telugu – హరిహరి యిందరికి నబ్బురముగాని యిది

హరిహరి యిందరికి నబ్బురముగాని యిది - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో హరిహరి యిందరికి నబ్బురముగాని యిది కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరిహరి యిందరికి నబ్బురముగాని యిది – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన: హరిహరి యిందరికి నబ్బురముగాని యిది
సంఖ్య : 363
పుట: 244
రాగం: లలిత

లలిత

99 హరిహరి యిందరికి నబ్బురముగాని
యిది పరగ నీదాసుఁడే పరతత్వవేది

||పల్లవి||

పొలసి మశకమండుఁ బొడమేటి జీవుని
తలఁపు బ్రహ్మాండాలు దాఁటిపోయీనీ
నిలవెంత నీఁటెంత నీమాయ లివి భువి
బలిమిఁ దెలియువాఁడె పరతత్వవేది

||హరి||

తగిలి చూచిన నాత్మఁ దనుఁ గానరాదుగాని
జగమెల్ల దానైతే సరి గనీని
చిగురెంత చేగెంత శ్రీపతి యిందులో నీ-
పగటు దెలియువాఁడే పరతత్వవేది

||హరి||

యేవంకఁ దనబుద్ధి యెక్కడనుండునోకాని
శ్రీవేంకటేశ నిన్నుఁ జింతించీని
పూవెంత ఫలమెంత పురుషోత్తముఁడ నీ –
భావమెరుఁగువాఁడె పరతత్వవేది

||హరి||363

అవతారిక:

ఓ శ్రీహరీ! నీదాసుడొక్కడే పరతత్వవేది. (నీయొక్క పరా ప్రకృతిని తెలిసినవాడు). మిగిలినవారందరికీ నీ పరతత్వం అబ్బురముగానే వుంటుంది. ఒక మశకము (దోమ) ఎగురుతున్నదంటే జీవాత్మ రూపంలో నీవు దాంట్లో వుండబట్టే. ఆ ఆత్మ నాలోనూ వున్నది. కానీ కానరాదు. ఈ ఆత్మలన్నీ నీవే అవటంచేత జీవాత్మ పరమాత్మయై అద్వైత సిద్ధాంత ప్రతిపాదన సరైనదే అనిపిస్తున్నది. ఓ పురుషోత్తమా! నీ ఈ భావము తెలిసినవాడే నిజమైన పరతత్వవేది అంటున్నారు అన్నమాచార్యులవారు.

భావ వివరణ:

ఓశ్రీహరీ! ఇందరికి (ఇంతమందికి అబ్బురముగానిది (ఆశ్చర్యకరము కానిది ఇదే. అదేమిటంటే… నీదాసుడే ఈ జగతియందు భగవంతుని | పరతత్వము తెలిసినవాడగుచున్నాడు.

మశకమున (దోమయందు) పొలసి పొడమేటి (సంచరించుచు నెలకొన్న) జీవుడితలపులు చూడబోతే బ్రహ్మాండములను దాటిపోతున్నాయి. ఏమిటీ అద్భుతమాయ!! ఇది యెంతవున్నతమైనది! ఎంత నీటైనది (ఎంత మురిపెము కలిగించునది!) ఈ భువిలో దీనిని తెలియగలవాడెవడు? ఒకవేళ ఎవడన్నావుంటే… వాడేనయ్యా! | పరతంత్రుడంటే

తగిలి (పూని) వెదకినా ఆత్మ తాను కనబడదు. కాని సరిగా చూడగలిగితే జగమంతా అది నిండివుంటుంది. ఇదెట్లా సాధ్యమని ఆశ్చర్యపడుతున్నారా? అక్కరలేదండీ… చెట్టు చిగురిస్తున్నప్పుడు ఆ చిగురు యెంత అల్పమైనది!!. కాని దాని చేగు (చేవ లేక బలం) యెంత వుంటుంది. (అది మాను అయితే ఇంటి దూలమై కప్పునే మోస్తుంది కదా!) ఇది నీ దివ్యశక్తి. ఓ శ్రీపతీ! ఇందులో నీ పగలు (ప్రకాశము) తెలియగలమొనగాడెవడు? ఎవడన్నావుంటే వాడేనయ్యా! పరతంత్రుడంటే.

నరుడు తన బుద్ధి యేవంకనున్నా యెక్కడున్నా, ఓ శ్రీవేంకటేశా! నిన్ను జింతించీని (దానించునా?) నీకృప కలిగితే అట్లా చేయగలడు. వాడెలావుంటాడో యెవరికి తెలుసు? పూవు ఎంత సున్నితము, | కోమలముగా వుంటుంది. పండుయెంత పెద్దగా రాయిలా వుంటుంది. రుచిగా కూడా వుంటుందే!! ఓ పురుషోత్తమా! నీ ఈ భావము (లీల) యెరుగగలిగినవాడేనయ్యా! పరతంత్రుడంటే.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Prapattulu | ప్రపత్తులు

Prapattulu

ప్రపత్తులు హిందూ ధర్మంలో ముఖ్యమైన అనుష్ఠానాల లో ఒకటి. ఈ అనుష్ఠానంలో భక్తులు తమ దోషాలను త్యజించి, దేవుని పాదపద్మాలను తమ జీవితంలో స్థానం ఇచ్చడం ఉంది. ప్రపత్తులను నిర్వహించే విధానం కేవలం దేవుడు తో సంబంధమైనది కాదు, అలాగే అవి ఆత్మాన్ని దేవుడి కార్యాన్ని పూర్తి చేయటానికి ఉపయోగపడే విధానంగా కూడా ఉంటాయి.

Prapattulu | ప్రపత్తులు

ఈ అనుష్ఠానం అనేది నిత్య, నైమిత్తిక, కామ్య ప్రపత్తులను విభజించే గురుత్వాకర్షణ శక్తిని ప్రకటించేది. ప్రపత్తులు ధర్మాన్ని, ధర్మ మరియు సమాజాన్ని అభివృద్ధి చేసేది కాదు, అవి తమ వ్యక్తిత్వంను కూడా తరలించడం అనే ఒక ఆదర్శ జీవన సాధనగా భావిస్తారు. ఈ క్రింది లింకుల ఆధారంగా ప్రపత్తుల గురించి తెలుసుకుందాం…

 

 

Veduka Kaditadu Vittalesudu In Telugu – వేడుక కాడితడు విట్టలేశుడు

వేడుక కాడితడు విట్టలేశుడు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వేడుక కాడితడు విట్టలేశుడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : వేడుక కాడితడు విట్టలేశుడు
సంఖ్య ; 590
పుట : 340
రాగం: రామక్రియ

రామక్రియ

9 వేడుకకాఁ డితఁడు విట్టలేశుఁడు
వీడని పొందులు సేసీ విట్టలేశుఁడు

||పల్లవి||

వెన్నదిన్న మదమున వెలఁదులుఁ దానును
వెన్నెలలో నాడీ నిదె విట్టలేశుఁడు
పన్ని రతుల కింతులఁ బాంచజన్యరవమున
సన్న సేసి పిలిచీని సారె విట్టలేశుఁడు

॥వేడు॥

ఆసపడి కొలువులో నాడువారి మీఁదట
వేసీ విరులఁ గొని విట్టలేశుఁడు
వేసరక పదారువేలు సతులయిండ్ల
సేసవెట్టి పెండ్లాడీఁ జేరి విట్టలేశుఁడు

॥వేడు॥

మెల్లనె గందమిచ్చేటి మెలుతను గాఁగిలించి
వెల్లవిరిగాఁ గూడె విట్టలేశుఁడు
యిల్లిదె శ్రీవేంకటేశుఁ డితఁడె తానై వుండి
యెల్లగాఁ గోనేట వరాలిచ్చె విట్టలేశుఁడు

॥వేడు॥590

అవతారిక:

వేడు కాడంటే నేటి పరిభాషలో ‘జల్సారాయుడు’ అన్నమాట. అట్లాంటి ఈ విట్టలేశుడు వీడని పొందులు సేసీ నంటున్నారు. అన్నమాచార్యులవారు. మెలత యొకతె మెల్లగా గంధమియ్యబోయిందట. ఈ విట్టలేశుడు వూరకుంటాడా? వెల్లవిరిగా ఆమెను కౌగలించి కూడినాడట. ఆ సంతోషంలో కోనేటి ఒడ్డున యెల్లగా వరాలిచ్చేస్తున్నాడట. అంతే కాదండీ ఈ విట్టలేశుడే ఆ శ్రీవేంకటేశ్వరుడూనూ అంటున్నారు. పండరంగి విట్టలునిపై చక్కటి సరస శృంగార కీర్తన ఇది. ఇదే బ్రహ్మానందం. అవునా?

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈ విట్టలేశుడు గొప్ప వేడుకకాడు (విలాసపురుషుడు). ఈయన వీడని పొందులు సేసి (విడుపులేని రతి కూటములు గల శృంగార పురుషుడు).

ఈ విట్టలేశుడు వెన్నలనారగించి. అటు పిమ్మట సంతోషముతో పండువెన్నెలలో వెలదులతో (రమణులతో) ఆడిని రాసక్రీడల దేలినాడు. రతుల కొరకు ఈయన ఇంతులను, పన్ని (పన్నుగడతో) పాంచజన్య శంఖానాదము సంకేతముగా, సారెకు (ప్రతిసారీ) సన్నసేసి (సైగజేసి) పిలిచీని (పిలుస్తాడు). ఎంత టక్కరివాడో చూడండి.

ఈ విట్టలేశుడు ఆసపడి (వ్యామోహము కలవాడై) అంతమంది స్త్రీల గుంపులోనున్న ఆడువారిపై కూడా విరులవేసి (పూవులను జల్లి) తన వశము చేసికొంటాడు. వేసరక (విసుగు అనే మాటలేక) పదియారువేలమంది సతుల ఇండ్లలో, సేసవెట్టి (అక్షతలు జల్లి) మరీ వారిని పెండ్లాడినాడు. (ఇందులో పెండ్లాడాలనే కోర్కె ఇంతులదే సుమా!) స్వామికి యేనాడు, యెవరిపైనా, యే కోరికా వుండదు. ఎందుకంటే ఆ దేవదేవుడు నిరంజనుడు, అవునా?

ఈ కొంటె కోణంగి ఇంకా యేమిచేస్తాడో తెలుసా? తనకు గంధము పూస్తున్న పడతులను మెల్లగా సందిటజేర్చి వెల్లవిరిగా (విజృంభించి) కూడి ముచ్చట దీరుస్తాడు. ఇల్లిదే (ఇదే) శ్రీవేంకటాద్రిపై శ్రీ వేంకటేశుడైన ఇతడే నేడు ఈ కోనేటి ఒడ్డున విటలేశుడై యెల్లగా వరాలచ్చీ (అంతులేని వరములనను గ్రహించుచున్నాడు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Ataditada Vennalantata Dongilinadu In Telugu – అతడితడా వెన్నలంతట దొంగిలినాడు

అతడితడా వెన్నలంతట దొంగిలినాడు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అతడితడా వెన్నలంతట దొంగిలినాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : అతడితడా వెన్నలంతట దొంగిలినాడు
సంఖ్య: 6
పుట 4
రాగం: లలిత

లలిత

5 అతఁడితఁడా వెన్న లంతట దొంగిలినాఁడు
యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు

||పల్లవి||

యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము
పూతకిచన్ను దాగి పొదలినాఁడు
యీతఁడా వసుదేవుని యింటలో నిధానము
చేతనే కంసునిఁ బుట్టచెండు సేసినాఁడు

||అత||

మేటియైనగొంతిదేవిమేనల్లుఁ డీతఁడా
కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
పాటించి పెంచే యశోదపాలి భాగ్య మీతఁడా
వాటమై గొల్లెతలను వలపించినాఁడు.

||అత||

ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా
జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను
మిగుల శ్రీవేంకటాద్రిమీఁదిదైవ మితఁడా
తగి రామకృష్ణావతార మందె నిప్పుడు

||అత||

అవతారిక:

ఈ వెన్నలు దొంగిలించే గొల్లపిల్లవాడు ఆ తిరుమలేశుడా!! రెండు మద్ది చెట్లను ఇతడు వుద్ధతితో తోసినాడు అంటున్నారు అన్నమయ్య. ఈ కీర్తనలో వాడిన భాష తెలుగునుడికారములతో బహు పసందుగా వుంది. ఈయన కంసుని పుట్టచెండుసేసినాడు అంటున్నారు. అంటే బంతిలా ఆడుకొన్నాడన్నమాట. అదేవిధంగా “కోటికి బడెగె గాను కొండయెత్తెను” అంటే జగత్ప్రసిద్ధుడై గోవర్ధనము అనే కొండను యెత్తినాడు అని అర్థం చెప్పుకోవాలి. ముగురు వేల్పులకు మూలభూతి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలకారణమైన పరమపురుషుడు ఈ బాలుడు అని | కీర్తిస్తున్నారు. ఇప్పుడాయన యెత్తినది రామకృష్ణావతారమట. అంటే?

భావ వివరణ:

ఆహా! యేమిటీవింత!! అతడు (ఆదిదేవుడైన పరమాత్మ) ఇతడా (ఈ బాలుడా). వీడు వెన్నలనన్నింటినీ రేపల్లెలో దొంగిలించినాడు. ఏతులకు (ఉద్ధతితో) తమ పెరటిలో బహుకాలమునుంచివున్న రెండు మద్ది చెట్లను ఇల తోసినాడు (నేలపై పడతోసినాడు).

ఈతడు ఆ దేవకీదేవి గర్భవాసము నుండి జన్మించిన ఇంద్రనీల మాణిక్యము. మానవకాంతగా వచ్చిన పూతన అనే రాక్షసి చనుబ్రాలు తాగి పొదలినాడు (వర్ధిల్లినాడు). ఈతడు ఆ వసుదేవుని ఇంట వెలసిన నిధానము (పాతర వంటి నిధి). తన మేనమామయైన కంసుని చేతనే (ప్రాణాలతో) పుట్టచెండుసేసినాడు (బంతి ఆట ఆడుకొన్నాడు).

ఈ బాలుడే పెరిగి పెద్దవాడై పాండవుల తల్లి గొంతిదేవికి (కుంతీదేవికి) మేనల్లుడై అత్తా అనిపిలిచి ఆమెకు అభయమొసగినాడు. ఇతడే “కోటికిన్ |పడెగెగాను కొండయెత్తెను” (జగత్ ప్రసిద్ధమైన గోవర్ధనపర్వతమును యెత్తి | తన చిటికిన వ్రేలిపై నిలబెట్టాడు). పాటించి (ఆదరించి) పెంచిన తల్లి యశోదాదేవికి ఇతడు భాగ్యమై, మరు జన్మలో కూడా వకుళాదేవియైన ఆమెకు బిడ్డ శ్రీనివాసుడై అమ్మా అని పిలిచాడు. గోపికలను వాటమై (మరిగి) వలపించుకొనినాడు.

ఈతడు, ఆ ముగ్గురు వేలుపులకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, | మహేశ్వరులకు) మూలభూతి మాలకారణమైన పరమపురుషుడు. అయినా జిగి (వెలుగులు జిమ్మి) ఆవులను పెయ్యలను కాచినాడు. మిగుల (అధికుడై మిగిలిపోయి) శ్రీవేంకటాద్రిపైని వేంకటేశ్వరుడు కూడా ఇతడేనా? అవునయ్యా! నిజము. ఇప్పుడు బలరామకృష్ణుల అవతారమెత్తిన ఈ బాలుడే ఆ పరమాత్మ.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

వత్సాసుర భంజనమ్ – Vatsasura Bhanjanam | శ్రీ గర్గభాగవతము లోని కథ

Srikrishna Leelalu Vatsasura Bhanjanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – వత్సాసుర భంజనమ్ కథ. 

శ్రీకృష్ణ లీలలు – వత్సాసుర భంజనమ్

బలరామకృష్ణులకు గోవులనుగాచే వయస్సు వచ్చినది. నీలాంబరధారి అయిన బలరాముడు పీతాంబరధారి అయిన శ్రీకృష్ణుడు గోవులను చక్కగా అలంకరించి గోపాలురతో కలిసి పచ్చిక బయళ్ళలో విహరించుచుండేవారు. కాళిందీనదీ తీరము వారికి ప్రియమైన విహారస్థలమయ్యెను. తన మధుర వేణుగానముతో పరమాత్మ జీవులకు సామవేద సారాన్ని బోధించేవాడు. బ్రహ్మానందముతో గోవులు గోపబాలురు పశుపక్షాదులు ఆ వేదవేద్యుని వేణుగానం వినుచుండెడివి. శ్రీకృష్ణుడు గోపాలురు ఎన్నో ఆటాలాడేవారు. వారు పక్షులనీడలలో పఱుగులెట్టేవారు. నెమళ్ళ లేళ్ళ గుంపుల వెంటబడేవారు. కోతికొమ్మంచులు బిళ్ళంగోళ్ళు ఆడేవారు. యమునా నదిలో జలకాలాడేవారు.

ఒకసారి వారు వివిధ జంతువులను అనుకరిస్తూ ఆడుచుండగా కంసప్రేరితుడైన వత్సాసురుడు వచ్చి శ్రీకృష్ణుని ఆలమందలో కలిసి పోయాడు. సర్వజ్ఞుడైన స్వామి అదిగమనించాడు. మెల్లమెల్లగా వచ్చి ఆ వత్సాసురుడు పరమాత్మను తన్నాడు. నందకిశోరుడు వాడి కాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి వెలగచెట్టుకేసి కొట్టాటు. మృతినొందిన ఆ వత్సాసురుడి నుంచి తేజము బయటికి వచ్చి పరమాత్మలో కలిసిపోయింది.

Vatsasura Bhanjanam Story In English

వత్సాసురుని వృత్తాంతము:

మురాసురుడనే రాక్షసుని కుమారుడు ప్రమీలుడు. వాడు దురాశకులోనై కపటవిప్రవేషం ధరించి సర్వాభీష్టఫలదాయిని అయిన నందినీధేనువును తనకు దానమిమ్మని వసిష్ఠుని కోరినాడు. నందినీధేనువు వాడి కుటిలత్వం గ్రహించి అసురస్వభావము గల లేగదూడవు కమ్మని శపించింది. పశ్చాత్తాపముతో శరణువేడిన ప్రమీలుని కరుణించి ఆ నందిని “చేసిన పాపమునకు ఫలమనుభవించక తప్పదు. పాపము తీరిన తరువాత నా అనుగ్రహము వలన నీవు పరమాత్మ చేతిలో మరణిస్తావు. అలా ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించింది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

కుటిలత్వము ఉండరాదని మనకీ కథ ద్వారా తెలిసినది. కపటవేషము వేసి మోసగించబోయిన ప్రమీలుని శపించినది నందినీధేనువు. కావున ఇతరుల నెన్నడూ మోసం చేయరాదు.

మరిన్ని నీతికథలు మీకోసం:

తృణావర్త భంజనమ్ – Trunawarta Bhanjanam | శ్రీ గర్గభాగవతము లోని కథ

Srikrishna Leelalu - Trunawarta Bhanjanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – తృణావర్త భంజనమ్ కథ. 

శ్రీకృష్ణ లీలలు – తృణావర్త భంజనమ్

ముద్దుకృష్ణుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆడించుచున్నది మహాభాగ్యశాలి అయిన యశోదాదేవి. అప్పుడు తృణావర్తుడనే రక్కసుడు పెద్ద సుడిగాలి రూపములో అక్కడికి వచ్చెను. కొండంత బరువెక్కిన తయుని భారము భరించలేక యశోద శ్రీకృష్ణుని నేలపైకి దించెను. జంతువులు ప్రజలు ఇంటిపైకప్పులు సైతం ఆ పెనుగాలికి ఎగురదొడగెను. ధూళి రేగగా శ్రీకృష్ణుడు యశోదకు గోపికలకు కనబడలేదు. ఆందోళనతో వారు ఆ పరమాత్ముని వెదుకసాగిరి.

చిన్నికృష్ణుడు తృణావర్తుని వెంట మింటికెగసి ఆతని వీపుపైకి ఎక్కెను. అండపిండవేదోండ సహతులను గుప్తగతి బొజ్జలో ఉంచుకొన్న స్వామి భారము మోయలేక ఆతని క్రిందికి వసరికొట్టబోయెను తృణావర్తుడు. పాపం పండిన దానవుని గొంతునులిమి శ్రీకాంతుడు భూభారము దించెను.

నేలగూలి ప్రాణములువిడిచిన అసురుని శరీరముపై ఏమీ ఎఱగనట్టు ఆడుకుంటున్న బాలకృష్ణుని చూసి బాలకుడు క్షేమముగా ఉన్నాడని సంతోషించి యశోద శ్రీకృష్ణుని ముద్దాడి దిష్టి తీసి వేదాశీర్వచనము చేయించెను. ఎన్నో గో భూదానములు పండిత మండలికి ఇప్పించెను.

తృణావర్తుని వృత్తాంతము

పూర్వం పాండుదేశమును సహస్రాక్షుడను మహారాజు పరిపాలించుచుండెడివాడు. ఆతుడు మిక్కిలి భగవద్భక్తుడే కాని స్త్రీలోలుడు. సీతమ్మ చెప్పినట్టు (సత్యసంధః కథ చూడండి) ఎవడైతే వ్యసనాలకు దూరముగా ఉంటాడో వాడే ధర్మమార్గాన నడువగలడు. కామాంధుడైన ఆ సహస్రాక్షుడు దూర్వాసమహర్షి వచ్చాడని ఎఱిగియూ ఆతనికి నమస్కరించలేదు. వ్యసనపరుడై పూజ్యపూజావ్యతిక్రమ దోషము చేసిన సహస్రాక్షుని రాక్షసుడివి కమ్మని ఆ మహర్షి శపించెను. తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తముతో శరణువేడిన ఆ సహస్రాక్షుని మహర్షి మన్నించి “రాజా! ఈ దుష్కార్యమునకు ఫలితమనుభవింపక తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థము కదా! కానీ భక్తుడవైన నీకు పరమాత్ముడైన శ్రీకృష్ణుని పాదస్పర్శచే కైవల్యము ప్రాప్తించును” అని ఆశీర్వదించెను. ఆ సహస్రాక్షుడే తృణావర్తుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

మానవుడు అన్ని వ్యసనములనుండి ఎల్లవేళలా దూరముగా ఉండవలెను. పరమ భక్తుడైనా ఒక్క స్త్రీలోలత్వం అనే వ్యసనము వలన దుష్కర్మ చేసి శాపగ్రస్తుడైనాడు సహస్రాక్షుడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Mancivadavantepo Madhavaraya In Telugu – మంచివాడవంతేపో మాధవరాయా

మంచివాడవంతేపో మాధవరాయా - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మంచివాడవంతేపో మాధవరాయా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : మంచివాడవంతేపో మాధవరాయా
సంఖ్య : 237
పుట 138
రాగం: దేసాళం

దేసాళం

7 మంచివాఁడవంతేపో మాధవరాయా
మంచుమాయ మాఁడుకూరి మాధవరాయా

॥పల్లవి||

మోనాననుండిన నన్ను ముట్టి వేఁడుకొనేనంటా
మానమేలంటేవోయి మాధవరాయా
నేనా సారెకు వచ్చి నీతో నెదురాడేదాన
మానవుగా మాఁడుకూరి మాధవరాయా

॥మంచి||

యోగసక్యానకే మాఇల్లుచొచ్చి వచ్చేవు
మగనాలిఁ గదవోయి మాధవరాయా
బగి వాయక కూచుండి పైఁ దొడవేసేవు నీ –
మగువనా మాఁడుకూరి మాధవరాయా

॥మంచి||

పనన్నాఁ బోనీవు వొడివట్టి తీసేవు
మాపుదాఁకా నేలోయి మాధవరాయా
కోపుగా శ్రీవేంకటాద్రిఁ గూడి చూపేవా నీయెమ్మె
మాపైనే మాఁడుకూరి మాధవరాయా.

॥మంచి||237

అవతారిక:

మాడుకూరు అనే గ్రామములో వెలసిన మాధవరాయనిపై సరస శృంగార కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. ఈయన మంచివాడే, కాని మంచుమాయగాడట. మంచువలె చల్లనైనవాడే కాని మాయగాడట. నాయిక మానమునంటి వేడుకొంటాడట. ఇక మౌనంగావుండటం ఆవిడవల్ల యేమవుతుంది చెప్పండి. మహానుభావా! నేను మగని చాటు ‘మగనాలి’ నన్నా వినిపించుకోడట. నేను ‘ఓపను’ అన్నాకూడా వదలడట. శ్రీవేంకటాద్రిపై కూడా ‘యెమ్మెలు’ చూపిస్తున్నావా నామీద అంటున్నారు. కొంచెం తికమకపెట్టే కీర్తనే ఇది. శృంగార భక్తిని రుచి చూడండి.

భావ వివరణ:

ఓ మాధవరాయా! నీవు మంచివాడవు. అంతే… నేను నీకు నిజమే చెబుతున్నాను. మాడుకూరిలో వెలసిన మాధవరాయా! నీవు చల్లే మాయలు మంచు మాయలు. మంచు అస్థిత్వమువలె, నీ వలపు మాయ నీ అస్థిరమైనది.

మోనాన వుండి నన్ను (నేను మౌనంగా వుంటే) ముట్టి వేడుకొంటావు (నన్ను తాకుతూ బ్రతిమిలాడతావు) నా మానము నంటి మరీ మాటలు కలుపుతావు. నేను నీయెదుటకు వచ్చి నా మౌనం వదలి నీతో యెదురుమాట్లాడేదాకా, మానవుగా (వదలిపెట్టవు కదా!) ఓ మాడుకూరి మాధవరాయా! నీతో వేగటం కష్టమే స్వామీ!

ఎగసక్కెములు (పరాచికాలు ఆడుకొంటూ మా ఇంట్లో దూరుతావు. నేను మగనాలిని (మగనిచాటు పెళ్ళాన్ని) అన్నా నన్ను విడిచిపెట్టవు. బగివాయక కూర్చుండి (నాపక్కనే కూర్చుండి) తొడపై చేతులు వేస్తావు. ఇదేమి అఘాయిత్యము? నేనేమి నీ మగువనా? (పెండ్లామునా? ఓ మాడుకూరి మాధవరాయా! ఇదేమన్నా మర్యాదగా వున్నదా ప్రభూ!

స్వామీ! నీ చిలిపి చేష్టలకు నేను ఓపను (తాళను) అన్నా, నన్ను పోనియవు. ఒడిసిపట్టి ఆక్రమింతువు. మాపుదాకా (చీకటిపడేదాకా చీకాకు పెడతావు). ఇట్లా అయితే యెట్లు ముడిపడుతుంది? కోపుగా (అందముగా) శ్రీవేంకటాద్రిమీద కూడి నీవే వేంకటేశ్వరుడవై నీ యెమ్మెలు (వన్నెలు) మాపైన చూపిస్తున్నావా? ఓ మాడుకూరి మాధవరాయా! మేము చరితార్థులమైనాము ప్రభూ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Neethikathalu – నీతి కథలు

Neethikathalu

నీతికథలు మానవత్వంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాయి . వివేకం, సహనం, ధైర్యం, సంపత్తి, ముక్కువ, ప్రేమ, సహానుభూతి, ధర్మం మరియు సంయమనం వంటి గుణాలు నీతికథలు అభివృద్ధి చేస్తాయి. అవి మన జీవనాన్ని ఆధరపరచి, మానవత్వాన్ని ఉన్నతముగా చేస్తాయి. నీతికథలు నేరుగా చాలా మంది మనుషులు మీదుగా ప్రభావితం అవుతున్నారు. నీతికథలు అనేవి సమాజాన్ని సమృద్ధం చేస్తాయి, అంతర్ముఖతను అభివృద్ధి చేస్తాయి మరియు సామాజిక సంగతులను ప్రేమ, సహనం, సహానభూతి, మరియు సంక్షేమంతో ప్రభావితం చేస్తాయి. నీతికథలు, మానవాళికి ఎలా నడుచుకోవాలి అనే మార్గాన్ని నిర్దేశిస్తుంటాయి. నీతి కథలలోని సారాంశాన్ని అర్ధం చేసుకొని వాటిని ఆచరింపబడడం వలన జీవితంలో సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి. మొదలగు నీతి కథలు కోసం ఈ క్రింది లింకులు ద్వారా తెలుసుకుందాం…

Neethikathalu – నీతి కథలు

శ్రీమద్రామాయణం లోని కథ

శ్రీమద్భాగవతము లోని కథ

శ్రీమహాభారతం లోని కథ

శ్రీ గర్గభాగవతం లోని కథ

విక్రమార్కుని సాహసగాధలలోని కథ

పెద్దలు చెప్పిన నీతికథ

స్వాతంత్ర్య సమరయోధులనాటి కథ

శ్రీ స్కాంద పురాణము లోని కథ

శివాజీ వీరగాధలలోని కథ

శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథ

శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ

శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథ

భరద్వాజ సంహిత లోని కథ

కఠోపనిషత్తు లోని కథ

శ్రీతులసీదాస కృత రామచరితమానసము లోని కథ

శ్రీ పద్మ పురాణం లోని కథ

వివిధ పురాణాల లోని కథ

శ్రీరామచరిత మానసము లోని కథ

శకటాసుర భంజనమ్ – Sakatasura Bhanjanam | శ్రీ గర్గభాగవతం లోని కథ

Srikrishna Leelalu - Sakatasura Bhanjanam Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – శకటాసుర భంజనమ్ కథ. 

శ్రీకృష్ణ లీలలు – శకటాసుర భంజనమ్

“ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలారా వీనులలర
మన యశోద చిన్ని మగవాని గనెనట చూచివత్తమమ్మ సుదతులారా”

అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ వ్రజభామలందఱూ చిన్ని కృష్ణుని చూడ వచ్చారు. బాలకృష్ణుని కురులు ముడిచి పరిమళ పుష్పములతో అలంకరించారు. ఆ చిన్ని శిశువు నుదుట కస్తూరి దిద్ది కాటుక పెట్టారు. చెవి పోగులు పులిగోరు చంద్రహారము బాలునికి ధరింపచేశారు. బోసి నవ్వులొకిస్తున్న జగన్నాథుని బుగ్గన గడ్డముపై చుక్కలు పెట్టారు. చేతులకు కడియాలు ముంజేతులకు మురుగులు మొలకు బంగారుత్రాడు కట్టారు. బాలుని రూపములో ఉన్న శేషశాయికి నీరాజనాలిచ్చి “ఉయ్యాలా బాలునూచెదరు” అంటూ బాలుని బండీ క్రిందనున్న పసిడి తొట్టిలో పడుకోబెట్టి లాలి పాటలు పాడారు. వ్రజభామలు ఎన్నో కానుకలు పిండివంటలు మొదలగునవి ఇచ్చారు.

ఈ కోలాహలంలో కంసప్రేరితుడైన శకటాసురుడు వాయు రూపములో వచ్చి పరమాత్మపై బండిని పడద్రోశాడు. ముద్దులొలికిస్తూ చిన్నికృష్ణుడు ఆ శకటమును (బండిని) తన్నాడు. రివ్వున బండీ ఎగిరి శకటునిపై పడి ఆతని తల వ్రక్కలయ్యెను. బండిపైనున్న క్షీర దధి భాండములు క్రింద పడి పగిలెను.

అలికిడి వినిన వ్రజభామలు కలవరుముతో చూడగా బాలకృష్ణుడు కేరింతలుకొట్టుచూ ఆడుకుంటున్నాడు. ఈ లీలను చూచిన గోపబాలురు జరిగిన సంగతి వ్రజభామలకు చెప్పిరి. ఆశ్చర్యపడి నందనందునకు ఎఱ్ఱని నీటితో దిష్టితీసి భూసురులచేత వేదాశీర్వచనములు చేయించి లోకరక్షకునకు రక్షకట్టిరి.

శకటాసురుని వృత్తాంతము:

హిరణ్యలోచనుని పుత్రుడైన ఉత్కచుడు చాలా క్రూరుడు. ఒకసారి అతడు తన స్వాభావికమైన క్రూరత్వముచే లోమశ మహర్షి ఆశ్రములోనున్న వృక్షలతాదులను పెఱికివేశాడు! ఆతని క్రూరబుద్ధిని చూసి ఆ మహర్షి “ఓరీ! పాము కుసుసము విడిచినట్టు నీవు ఈ దేహము విడువుము” అని శపించినాడు. పశ్చాత్తాపముతో మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఉత్కచుడు. “పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. అయిననూ నీవు చేసిన కర్మకు శిక్ష తప్పదు. ద్వాపరమున శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను విధించును. ఆ పురుషోత్తముని పాద స్పర్శతో నీకు శాపవిముక్తి కలుగుతుంది” అని శాపావశానం చెప్పాడు లోమశ మహర్షి. ఆ ఉత్కచుడే శకటాసురుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

క్రూరత్వం కడు దుష్టస్వభావము అసురలక్షనము. తోటి మానవులు జంతువులతోనే కాక వృక్షములతో కూడా మైత్రీభావముతో ఉండవలెనని మనకు ఈ కథ ద్వారా తెలిసినది. మన శాస్త్రాల ప్రకారం ఒక చెట్టును ఊరికే నఱకడం మహాపాపమ్. అవసరార్థం ఒక వృక్షమును నఱికితే దానికి బదులు నాలుగు వృక్షములు నాటమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఉత్కచుడు ఊరికే ఎన్నో వృక్షములను పెఱికివేసి ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం: