బింకమున చూడరో పిరితియ్యక నేడు
అంకపు దనుజ సంహార సింహము
వేంకటనగముపై వేదాచలము పై
కింక లేక వడి పెరిగిన సింహము
||లలల||
అవతారిక:
మలసి చూడరో (ఉద్యమించి చూడండయ్యా!) అంటున్నారు అన్నమాచార్యులవారు. ఎవరిని చూడాలి? ఈ మగసింహమును. అది మామూలు మగ సింగము కూడా కాదు అలవి మాలిన మాయల సింగమట. అహెూబల నృసింహునిపై చెప్పిన ఈ కీర్తనలో యెన్నో తెలియని విశేషాలున్నాయి. జాగ్రత్తగా చదివి ఆకలనం చేసికొనండి. చిచ్చరకంటితో అంటే అగ్నిని కురిపిస్తున్న కన్నులతో, జిగి సింహము మెరిసిపోతున్న సింహమట. వేంకటగిరి (తిరుమల) లోనూ వేదాచలంలో (అహెూబలం) లోనూ వున్నదొక్కరేనట. ఈయన, కింక లేక (కోపమును విడనాడి) వడి పెరిగిన సింహమట. అంటే యేమిటో!
భావ వివరణ:
ఓ భక్తులారా! ఈ మగసింహము (మొండెము మగవాడు, తల సింహపుది అయిన నరసింహుడు) కనువిందు చేయుచున్నాడు. ఈయనను చూడరో (చూడండయ్యా!) ఈయన అలవిమీరిన (అశక్యమైన) మాయల సింహము (లీలలు కలిగిన నరసింహుడు).
అదిగో ఈ ఆదిపురుషుని చూడండయ్యా! ఈయనే నారాయణుడు, ఈయన ఇప్పుడు పెదయౌబళమున (అహెూబలమునందు) పెనుసింహము (పెద్ద నరసింహుని) వలెనున్నాడు. బ్రహ్మాది దేవతలుగాని వేదాంత తతులు (వేదవేదాంగములు) గాని, వెదకి (ఆయనకోసం గాలించినా) కదిసి కానలేని (సరిగ్గా కనుగొనలేకపోయిన) నరసింహము.
ఈ జిగిసింహము (కాంతులు వెదజల్లు నృసింహుడు) చిచ్చర కంటితో (అగ్నిశిఖలు వెదజల్లు ఫాలనేత్రముతో వుజ్వలముగా ప్రకాశించుచుండగా మితిమీరియున్నాడు (అతిశయించినాడు). మెచ్చి మెచ్చి (బాగుగా కీర్తించుచూ) చూడరో (ఈ స్వామి దర్శనం చేసికోండి). తచ్చిన (కిక్కిరిసియున్న) వారధిలోన (నది రెండు ఒడ్డులను కలుపు వంతెనలో) నచ్చిన తరుణిని (తన హృదయేశ్వరి అయిన శ్రీలక్ష్మిని గోళ్ళతో గిలిగింతలిడుచున్న నృసింహుని చూడండి.
ఈయన ఉగ్రనరసింహుడే, కాని భక్తవత్సలుడు. నేడు పిరుదియ్యక (భయపడక) బింకమున చూడరో (ధైర్యంగా చూడండయ్యా!) దనుజుని (హిరణ్యకశిపుని) అంకమున (ఒడిలో కూర్చొనబెట్టుకొని సంహరించాడు. ఈ నృసింహుని కొలవండి. ఈయన కింకలేక (కోపమును వుపసంహరించుకొని) వడి పెరిగెను (త్వరగా ప్రీతిపాత్రుడైనాడు). తిరుమలవేంకటేశ్వరుడు ఈయనే అహెూబల నరసింహుడు ఈ దేవుడే.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు దారిద్ర్యదహన స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ కాత్యాయనీ దేవీ అష్టోత్తర శతనామావళిగురించి తెలుసుకుందాం…
Sri Katyayini Devi Ashtottara Shatanamavali In Telugu
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో తగు మునులు ఋషులు తపముల సేయగ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ముల్లోకాలలోను శ్రీహరిని వేడని వారెవరు? ఎంతోమంది ఋషులు, మునులు యెన్నెన్నో తపములు చేశారు ఆకాశాన్ని అందుకొనేంత కీర్తిని సంపాదించారు. కాని వారి కర్మములు పరిపక్వంచెంది తెగితేకాని వారికి నీ కృప కలుగదు. నీకృప వారికి యేజన్మలోనైనా యేక్షణాననైనా కలుగవచ్చును. అజ్ఞానంతో వారు నీకు అపకారం చేసినా వారు యెంత హీనస్థితిలోవున్నా పరిగెత్తి వారిని చేరి వారిని అక్కున చేర్చుకొంటావు. అన్నీ నీ అభయానికి పాత్రములే. కరిగాని, కాకిగాని, వుడతగాని, గద్దగాని, ఆవులుగాని, కోతులుగాని.. ఒక్కటనేమిటి యేదయినా నీ సంతతే, నీదే అనే కరుణ చూపిస్తావు. అందుకే నీవు జగత్పితవు అంటున్నారు అన్నమాచార్యులవారు. సాధ్యమైనంత వివరించటానికి ప్రయత్నించాను.
భావ వివరణ:
ఓ దేవదేవా! అనేకమంది ఋషులు, మునులు తగిన విధములుగా నీకోసం తపములనాచరించారు. కాని అందరికీ నీకృప కలిగిందా? ఆకాశాన్ని కొనే కీర్తి సంపాదించవచ్చు గాక! కాని కర్మము దీరక (పరిపక్వముకాక) నీకృప సిద్ధిస్తుందా?
ఓ భూరమణా! మందరగిరిధరా! నగధరా! (గోవర్ధనధారీ) ప్రఖ్యాతి చెందిన కౌస్తుభమణని ధరించినవాడా! శ్రీధరా! (శ్రీకాంతా!) నీలీలలనేమని వర్ణించను ప్రభూ! అలనాడు కరిని రక్షించావు (గజేంద్ర వరదుడు), కాకిని రక్షించావు (కాకాసురుని శిక్షింపబూనియు శరణంటే రక్షించాడు శ్రీరాముడు). నీ కరుణకు పాత్రులవ్వాలంటే హీనాధికములైన యేదైనా అర్హమే.
ఓ భవహరా! (పుట్టుక లేక చేయగల దేవా!) మురహర! (ముర అను అసురుని నిర్జించిన దేవా!) భక్త పాపహరా, ప్రపంచమున పాపుల భారమును నివారించువాడా! పురహరా! (త్రిపురాసురులను హరించినవాడా! నీ దయకు అర్హత యెవ్వరికైనా కలుగవచ్చును. ఆనాడు నీ రామావతారంలో, కవిసిన వుడుతకు (పరుగులు పెట్టి తన శరీరానికి ఇసుకను అంటించుకొని సేతువుపై విదిలించి సేతు నిర్మాణానికి తనదవంతు కృషి చేసిన ఒక చిన్ని ఉడుతకు మోక్షమిచ్చావు). గద్దయైన గరుత్మంతుని నీవాహనం చేసికొని గరుడ గమనుడవయ్యావు. వాటిని మెచ్చావు. అవల (ఆవిధంగా) వాటి జాతి మొత్తం ఈనాటికీ నీ గుర్తులను తమ శరీరంపై ధరించియున్నాయి.
ఓ శ్రీవేంకటాచలపతీ! శేషాద్రివాసా! గరుడాద్రివాసా! భూధరా! భూతపతీ! (సర్వ భూతముల ఆధారా!) నీ పావనమైన కృపకు పాత్రాపాత్ర భేదము లేదు. అందరికీ జీవనాధారమైన గోవులను కాచి గోవిందుడివైనట్లే, నిరుపయోగమైన కోతులకు కూడా క్రమశిక్షణ నేర్పి రామదండు చేశావు. ఎనలేని కీర్తినిచ్చావు. కరుణామూర్తీ! ఇంతకంటే యే నిరూపణలు ఇంతకంటే యే నిరూపణలు కావాలి తండ్రీ, నీవు కరుణాంతరంగుడవు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శివాష్టకమ్గురించి తెలుసుకుందాం…
ప్రహ్లాదునికి అందరిలోనూ హరియే కనుపించేవాడు. అన్నిటిలో వున్నది హరియే అని దృఢముగా నమ్మిన వానికే అది సాధ్యము. వారి వారి అభీష్టాలు నెరవేరుటతో మానవులు రకరకాల సాధనలను చేస్తారు. ప్రాపంచిక విషయాలలో కడతేరటం యేమంతకష్టం కాదు. శ్రీహరి శరణాగతుఉ వైకుంఠమ ఏ పొందగలరు; భవసాగరాన్ని సునాయాసంగా తరించగలరు; ముక్తిని కూడా పొందగలరు, ఎందుకంటే వారు పరంజ్యోతియైన శ్రీవేంకటేశ్వరుని భక్తులు కదా! అంటున్నారు అన్నమాచార్యులవారు.
భావ వివరణ:
అయ్యో! మతి (నామనస్సు) అన్నిటిపైన వున్నట్లు హరిపై నుండదు. ఏమి దౌర్భాగ్యము!! భక్త ప్రహ్లాదునివలె ఆ శ్రీహరిని కన్నుల యెదుట ప్రత్యక్షం చేసికొనుట అరుదా (అసంభవమా?) ఏమాత్రమూ కాదు.
ఇదివరలో ఒకడు గరుత్మంతుని అర్చించి ఆయన అనుగ్రహంతో ఆగతము (జరుగబోవునది) తెలిసికొని తానే ఘనుడనని విఱ్ఱవీగినాడు. అతడే అట్లయిన, ఆ గరుత్మంతుని అధిపతియైన జలజాక్షుడు శ్రీహరిపాదముల నర్చించువాడు, ఇలలో పరమార్థము నెరుగుట ఒక గొప్ప విషయమా?
మానివాడ (కొయ్యతో చేసిన ఓడ) నెక్కి మహాసముద్రములను దాటి రకరకములైన సంపదలను పొందుటకు అనేక నటనలు చేస్తాడు ఒకడు. వాడికే అటువంటి విశిష్టత కలిగితే ఇక శ్రీనాథుని పాదముల నాశ్రయించినవాడు భవసాగరమును దాటి పుణుడగుట అరుదా (అసంభవమైన విషయమా?) ఏమాత్రమూ కాదు.
ఒకానొకడు దీపమును తన చేత ధరించి తెగని చీకటి (అంతులేని అంధకారమును) అధిగమించి తన కళ్ళతో అన్నీ చూడగలిగి సుఖములననుభవించాడు. అటువంటప్పుడు పరంజ్యోతి అయిన శ్రీవేంకటేశ్వరుని భక్తుడు, ఓపి (ఓపికతో) ముక్తిని పొంది సర్వోన్నతుడవటం అరుదా (అసంభవమా?) ఏమాత్రం కాదు.
కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 1
కీర్తన : నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను
సంఖ్య : 108
పుట : 74
రాగం : శుద్ధ సావేరి
శుద్ధసావేరి
34 నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను
నీపాల నిడుకొంటి నీవే నీవే
నిధానము అంటే పాతరలో దాచివుంచిన సొమ్ము. “నాయందు నిధానమువలె సమయానికి, నీపాల (పట్ల) వుంచుకొని ఆదుకొంటావు. నా దిక్కూ మొక్కూ వేరెవరున్నారు తండ్రీ! నీవే నీవే” అని ఏడుకొండలూ దిగి స్వయంగా శ్రీనివాసుడే దిగివచ్చేలా ఆలాపిస్తున్నారు అన్నమాచార్యులవారు. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన బంధువు. ఆ విధంగా చూస్తే బంధువులు బండ్ల కొద్దీ వుంటారు కాని నిజబంధువు ఆ స్వామి తప్ప యెవ్వరూ వుండరు. అంకిలి వాపగ (ఆపద తొలగించ) నంతయు నీవే నీవే అంటున్నారు. మన అదృష్టం కొద్దీ ఈ అమృతధారలో తడిసే భాగ్యం కలుగుతున్నది. అవునా?
భావ వివరణ:
ఓ దేవదేవా! నాపాలి (నాకు లభించిన) గొప్ప నిధానమవు నీవే (పెద్దలు దాచివుంచిన పాతర నీవే). అందుకనే నిన్ను నాపాలన్ ఇడుకొంటి (నా పక్షాన అట్టేపెట్టుకొన్నాను). నీవే నీవే నాకు ఇంకెవ్వరూ వద్దు ప్రభూ!
ఒలసి (చేరి) నన్ను యేలునట్టి దైవము నీవే. నా బంధువులందరూ నా కష్టంలో నన్ను వదిలేశారు. కానీ నన్ను విడువని నిజమైన బంధువు నీవే. సంపదలనాసించేది సుఖమునిస్తాయని. కాని మా సంపదలు అనేక ఇబ్బందులనిస్తాయి. కాని నీవు మాత్రం అనేక సుఖములనిచ్చే సంపదవు. ఈ విధంగా ఇన్ని రకములైన భాగ్యముల నిచ్చే వాడవు నీవే నీవే.
ఆప్తుడు అంటే ఐశ్వర్యము వలె అదుకొనే సన్నిహితుడు. అయితే ఐశ్వర్యమునకుండే దుర్గుణమేమంటే అది యెప్పుడు విడిచిపెట్టి పోతుందో యెవ్వరికీ తెలియదు. కానీ ఓ శ్రీహరీ! నీవు పొదిగినట్లుగా యెన్నడూ వదలిపెట్టని ఆప్తుడవు. నేను చచ్చేదాకా నాతోడువుండే దేహములాగ నీవూ అదనతోడవు (అవసరమైన తోడువు). స్వామీ! నా మదము (అహంకారమును) బాపెడి మతియు (వివేకము) నీవే. పరికించి చూసే సర్వస్వమూ నీవే, నీవే నయ్యా!
ఇంకా చెప్పాలంటే… నాకే కాదు, ఈ లోకముల కన్నింటికీ యెప్పుడూ ఆధారము నీవే. (ఇన్ని లక్షల అంతరిక్షగాముల్లో ఒక్కటి తగిలినా మన ‘భూమి’ గతేమిటో చెప్పండి.) సృష్ఠి స్థితిలయలు పర్యవేక్షించే బ్రహ్మాదిదేవతల పతియు (యేలికవూ) నీవే. మాకు అడుగడుగునా అంకిలియే (ఆపదలే). దానిని తొలగించాలంటే ఇతరులకు సాధ్యమా? ఓ తిరువేంకటేశ్వరా! నీవేనయ్యా! నీవే సమర్థుడివి. ఇంకెవ్వరివల్లా కాదు తండ్రీ!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…