Sri Dattatreya Stotram In Telugu – శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్

Sri Dattatreya Stotram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Dattatreya Stotram Lyrics

శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్

జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్ |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||

1

అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తః పరమాత్మా దేవతా, శ్రీదత్త ప్రీత్యర్థే జపే వినియోగః ||

నారద ఉవాచ |
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

1

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ||

2

కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

3

హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

4

యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

5

ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవః సదాశివః | [మధ్యే విష్ణు]
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

6

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

7

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

8

జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

9|

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తు తే ||

10

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

11

అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

12

సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ |
సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

13

శూలహస్త గదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

14

క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్త ముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తు తే ||

15

దత్త విద్యాఢ్య లక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

16

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తు తే ||

17

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ ||

18

ఇతి శ్రీనారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ |

మరిన్ని స్తోత్రములు:

Ammavari Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

Ammavari Mangala Harathi Patalu In Telugu

Ammavari Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అమ్మవారి పుణ్యమి అని పిలిచే అమ్మవారు మన భారతీయ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. అమ్మవారు అనగా దేవతా స్వరూపమైన తల్లి అని అర్థం. వివిధ ప్రాంతాల్లో అమ్మవారు వివిధ పేర్లతో పూజింపబడతారు. భారతీయుల విశ్వాసాలలో అమ్మవారు అన్ని శక్తులకు మూలమైన, సృష్టి, స్థితి, లయాలకు అధిపతిగా భావించబడతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అమ్మవారి మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

దేవీ త్రినేత్రణీ

పావన స్వభావ దేవీ శ్రీదేవీ
(శంకరాభరణ స్వరాలు – త్రిశ్రం తాళం)

చ 1) దేవీ త్రినేత్రీణి దివ్య సుకృతి
నవ్య హరతీ
అవ్యయ హారతీ – దివ్యహారతి-సతీసార హారతీ॥

చ 2) జగములేల చాలును
నీ చరణ యుగళియే
చరణయుగళియే – చరణయుగళియే
కరుణ యుగళియే – సతీ పంచయుగలకీ॥

చ 3) నరసమాంబ ఆశ్రితవరా
సరస గుణగుణా
సరస గుణగుణా సరస గుణగుణా
సరస గుణగుణా సతీ సర్వగుణగుణా

జయ జయ హారతి జయ వరలక్ష్మీ

ప్రియనయ జయలక్ష్మీ వరలక్ష్మీ
(పున్నాగ వరాళి రాగం – ఆదితాళం)

పల్లవి: జయ జయ హారతీ జయవరలక్ష్మీ
జయ జయ మంగళ మమ్మా భవానీ

||జయ||

చ 1) పతిత పావనీ పాపవిమోచని
పరమ కృపాకరి శుభ శాంభవి

||జయ||

చ 2) కోటి సూర్య వంశాభరణీ
మాతా మహేశ్వరీ మము బ్రోవుమమ్మా

||జయ||

మణి మాణిక్యాంబ నీకు మహిత మంగళం

మాణిక్య వీణాపాణీ! మాణిక్యాంబా!
(పీలురాగ స్వరాలు – త్రిశ్రం తాళం)

చ 1) మనీ మాణిక్యాంబ నీకు మహిత మంగళం
దేవి నీదు పాదములకు దివ్యమంగళం

॥మణి॥

చ 2) దేవి నీకు సరిసమాను లెవరు లేరుగా
దేవరాజు మునులు పొగడ దివ్య మంగళం

॥మణి॥

మంగళ హారతిదే ఓ అనసూయాదేవీ

అమృతానందమయీ! అనసూయాదేవీ!
(హరికాంభోజి స్వరాలు – త్రిశ్రగతి ఆదితాళం)

పల్లవి: మంగళం హారతీదే శ్రీ అనసూయాదేవీ నీకు
మంగళహారతిదే శ్రీ అత్రిమహాముని అతివా

చ 1) చిన్ననాటి నుండి నీవు పతిభక్తితో మెలగి
నారద మహామునికి రాళ్లు సెనగలు చేసితిని

॥మం॥

లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవులు గూడి మిమ్ము
భంగము చేయుటకు పతులను వేడితి

॥మం॥

చ 3) ముగ్గురు మూర్తులు ఏక కాలము నందు
అతిధులై వచ్చిరట అత్రిమహాముని కడకు

॥మం॥

చ 4) అన్నంబు కూరలు అతివ వడ్డించగ
వంటి వస్త్రంబుతోటి వద్దుపో పొమ్మనిరి

॥మం॥

చ 5) పతివ్రతవు నీవు కనుక పతినామ స్మరణచేసి
కమండల ఉదకములో గ్రక్కున చల్లితివి

॥మం॥

చ 6) ముగ్గురు మూర్తులు ముద్దుబాలురై
ఉగ్గుబాలు పోసి నీవు ఉయ్యాల లూపితివి

॥మం॥

చ 7) లక్ష్మీ సరస్వతి మరి పార్వతీదేవి గూడి
పరుగున వచ్చితిరి ఆత్రిముని ఆశ్రమమునకు

॥మం॥

చ 8) పతిభిక్ష పెట్టమని పాదములపై బడగ
ఉయ్యాలలో బాలురను ఒడిలోను ఉంచితివి

॥మం॥

చ 9) తల్లీ మీకు మేము వరములిస్తామంటే
త్రిమూర్తులు నీ కడుపున పుట్టుటే కోరితివి

॥మం॥

చ 10) వరుసతో వారింట దత్తాత్రేయులై జన్మించి
సంతోష సాగరమున నోలలాడించితివి

॥మం॥

మంగళగిరికి మంగళ మివ్వరే

హరి మనోహర విహరీ గిరీ!
(మోహనరాగం – మిశ్రచాపుతాళం)

చ 1) మంగళ గౌరికి మంగళమివ్వరె
గంగాధరుని రాణి గౌరి పార్వతి

॥మం॥

చ 2) అష్ట హస్త్రములతో అవతరించినట్టి
దుష్ట సంహారిణికి తుహిన గిరిజకపుడు

॥మం॥

మంగళమిదే మాతా అన్నపూర్ణ

అర్ణవోదీర్ణా! అపర్ణా! అన్నపూర్ణా!
(పుష్పతిలకా రాగం – ఆదితాళమ్)

పల్లవి: మంగళమిదె మాతా అన్నపూర్ణా
రంగని సోదరి మగళాంబ నీకు

॥మం॥

చ 1) విశ్వ జనని నీదు మాతా అన్నపూర్ణ
విశ్వముల వాసి విశ్వనాధు రాణి

॥మం॥

చ 2) సాక్షి రూపిణివి మోక్షదాయినివి-మహ
లక్ష్మీ నా మొర విను విశాలాక్షి తల్లీ

॥మం॥

చ 3) సారసాక్షి నన్ను సరగను బ్రోవు
వారణాసి పురి గౌరీ భారతాంబ

॥మం॥

చ 4) మానసమున నీదు ధ్యాన మెపుడు మరువ
దాసురాల నిదే మంగళంబు నీకు

॥మం॥

రమణీ మంగళ మనరే

సుమనస సుమరస రమణీయ మణీ!
శ్రీలక్ష్మీ (వసంత రాగం – త్రిశ్రగతి ఆదితాళం)

పల్లవి: రమణీ మంగళ మనరే
కమలాల యకు నిట

॥రమణీ||

చ 1) సమద కుంజర యానకు సుకృత విధానకు
కమల రిపు బిండానకు
కర కమల ముకుళ భక్తాభిమానకు

॥రమణీ||

చ 2) లలిత పల్లవ పాణికి నీల జలధర నిభ వేణికీ
జలజ లోచను రాణికీ సాధు సుగుణ శ్రేణికి

॥రమణీ||

చ 3) కలుము లీనెడు మొలక నవ్వుల కలికికి తలిరుబోణికి
సారస దళ నేత్రికి – సౌమ్య
చారు శోభన గాత్రికి

॥రమణీ||

చ 4) భూరి కరుణా ధాత్రికి సర్వ వనితా మైత్రికి
క్రూరభవ త్రికాల మిత్రకు క్షీరపారావార పుత్రికి

॥రమణీ||

చ 5) పోషితాఖిల లోకకూ దురిత తాపన రాగకూ
శేష దాసావన సరోరుహ
శ్రీకరావళీ కమల లోకకు

॥రమణీ||

రమణీ నీకిదుగోనే రతనాల హారతి

అతులిత వితరణి బాణి! లక్ష్మీ
(కేదార రాగం – మిశ్రచాపు తాళం)

పల్లవి: రమణి నీ కిదుగోనే! రతనాల హారతి
హారతి గైకొని! అష్టఐశ్వరము లీయవే

॥రమణీ॥

చ 1) నిదుర కంటికి లేక నిన్ను నే ప్రార్థింతు
నన్ను మన్ననజేసి నళినాక్షి వర మీయవే

॥రమణీ॥

చ 2) అలరు బోణిరొ నీకు! అమరిన పూజలు
మహాలక్ష్మీ మమ్ము బ్రోవు! మాదేవి మామీద దయచూడు

॥రమణీ॥

చ 3) ఐదవతనము చాల! ఆతివ కోరితి నమ్మా
ఆలస్య మిక నేల! ఆనతియ్యవే తల్లీ

॥రమణీ॥

రాణి భారతి శర్వాణి భారతి

అజుని రాణీ! వీణా పుస్తక పాణి!
(సింధుభైరవి రాగం – ఆదితాళం)

చ 1) రాణీ భారతీ శార్వాణీ భారతీ
పాణిలోచనా గొనుము ఇదే ముత్యాల హారతి

॥ రాణీ ॥

చ 2) పల్లవా ధర మృధు వల్లనాధరా
మల్లెపూల సరు లొసగెద మగువ హారతి

॥ రాణీ ॥

చ 3) మధుర భాషిణీ ఈ మందహాసినీ
సదా కావలెనే ముదం బొప్పగా

॥ రాణీ ॥

మమ్ముల నేలిన లలితా హారతి

(భైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: మమ్ముల నేలిన లలితా హారతి
యమ్మగు నీ చరణముమ్మలే మా గతి
సమ్ముద మొప్పగ రమ్మమ్మా యిటు

॥మ॥

చ 1) అమ్మా రాజరాజేశ్వరీ దేవీ
నమ్మితి నీ చరణమ్ములే లలితా
నమ్మినకృప శ్రీ త్రిపుర సుందరీ
యిమ్మహి నను బ్రోవగ రమ్మమ్మా

॥మ॥

చ 2) పలుకుల తేనెలు చిలికిన
చిలుకల కొలికి లలిత లలితరస
గులికా తలపులు నిలిపితి నీపై
అలరుచు వచ్చీ ఆదుకొనుము సతి

॥మ॥

Ammavari Mangala Harathi Patalu With Lyrics

సుందరీ శుభవదన

ఆనంద నందన వన సుందరీ! త్రిపుర సుందరీ
(పూరీ కళ్యాణిరాగం – రూపక తాళం)

పల్లవి: సుందరీ శుభవదనా
వందన మిదె గొను త్రిపుర

॥సుందరీ॥

చ 1) అభయమిచ్చి బ్రోచునట్టి త్రిభువనేశ్వరి
శుభదాయని శంకరి కృపగొను కామేశ్వరి

॥సుందరీ॥

చ 2) దిక్కునీవే నమ్మియుంటి దీనన బ్రోవవే
మక్కువతో నీ పదములు మ్రొక్కెదనే మోహనాంగీ

॥సుందరీ॥

చ 3) నీదు మాయ తెలియతరమే హే దయానిధే అంబా

హారతి గొనుమా

సుమరస సుమ కోమలాంగీ బాల త్రిపుర సుందరీ
(జంఝాటిరాగం – జుంపె తాళం)

పల్లవి: హారతి గొనుమా కమలాలయా
రామా కర్పూరపు హారతి

॥హారతి ||

అనుపల్లవి: నారీ నీపాద వారిజములు
కోరెదను మది జయ హారతి

॥హారతి ||

చ 1) పల్లవ పాణి బాణి బాలికామణి
చాల నమ్మితి బాలరో యికజాల
మేలను బ్రోవగ జయహారతి

॥హారతి ||

చ 2) ఇందువదనా సింధుర మందగమనా
కుందరవదన బొగడగ జయహరతీ

॥హారతి ||

హారతు లివ్వరే నారీమణులారా!

పరమ పావనీ తిరుప్పావై ఆండాళ్ళదేవీ
(భైరవిరాగం – మిశ్రచాపు తాళం)

పల్లవి: హారతులివ్వరే నారీమణులారా
వారిజాక్షులు మా తల్లి ఆండాళ్ళుకు

॥హారతు॥

చ 1) పచ్చలు స్థాపిన పళ్ళెరములో
ముచ్చటలదీర మత్స్య కంఠులార

॥హారతు॥

చ 2) తల్లి తాయారుకు శ్రీదేవి భూదేవి
కెల్ల కోర్కెలిచ్చు కర్పూరాండాళ్ళుకు

॥హారతు॥

చ 3) తల్లి చంద్రమతి ద్రౌపది మానవతి
సకల కోర్కె లిచ్చి యాండాళ్ళుకు

॥హారతు॥

చ 4) కోరిన వారికి కొంగు బంగారమై
సమస్త కోర్కెలిచ్చు తల్లి యాండాళ్ళుకు

॥హారతు॥

ఆదరించి మమ్ము బ్రోచి చేకొను హారతి

॥సుందరీ॥

హారతి గొనుమా

సుమరస సుమ కోమలాంగీ బాల త్రిపుర సుందరీ
(జంఝాటిరాగం – జుంపె తాళం)

పల్లవి: హారతి గొనుమా కమలాలయా
రామా కర్పూరపు హారతి

॥హారతి ||

అనుపల్లవి: నారీ నీపాద వారిజములు
కోరెదను మది జయ హారతి

॥హారతి ||

చ 1) పల్లవ పాణి బాణి బాలికామణి
చాల నమ్మితి బాలరో యికజాల
మేలను బ్రోవగ జయహారతి

॥హారతి ||

చ 2) ఇందువదనా సింధుర మందగమనా
కుందరవదన బొగడగ జయహరతీ

॥హారతి ||

శ్రీరంగ మణికిని – శ్రితకల్పవల్లికిని

ధీమణి! సుమాణి! నభోమణీ బీబీ నాంచారీ
(మధ్మమావతి రాగం ఆదితాళం)

పల్లవి: శ్రీరంగమణీకని! శ్రితకల్పవల్లికిని
చిత్తజుని తల్లికిని! శ్రీపతికి
నారీ శిరోమణికిని! నవపద్మ పాణికి
నన్నేలు శ్రీరంగ! నాంచారునకు

||జయ మంగళం మహోత్సవ మంగళం||

చ 1) సొగసుగడు మెరయ! కర్పూరపు పరిమళము
ముదముగను జవాది! మేనలది
అగణితంబైనట్టి! హారములు ధరియించి
నగుచున్న శ్రీరంగ! నాంచారునకు

||జయ||

చ 2) కోటలేడును చుట్టు! కోవెలలు నూటారు
నాటుకొని కావేరీ! నడుమనున్న
నాటకుడు శ్రీరంగనాధు! వక్షము నందున
నటియించు శ్రీరంగ! నాంచారునకు

||జయ||

చ 3) బంగారు పళ్ళెరములో! భాసిల్లు నవరత్న
శృంగారమైన మంగళహారతి
అంగీకరించి మాకు! అఖిల సంపదలొసగు
రంగైన శ్రీరంగ నాంచారునకు

||జయ||

సర్వం హనుమదర్పణమస్తు

Ammavari Mangala Harathi Patalu

లలితా హారతి

శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత – పసిడి పాదాలకిదె నీరాజనం
రమేశ్వరుని పుణ్యభాగ్యాలరాశి ఆ సింహమధ్యకు రత్న నీరాజం

– బంగారు తల్లికిదె నీరాజనం

1. బంగారు హారాలు సింగారు మొలకించు అంబికా హృదయకూ నీరాజనం
శ్రీగౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీసింహాసనేశ్వరికి నీరాజనం

||బంగారం||

2. కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతొ నీరాజనం
పాశాంకుశ పుష్పబాణ చాపదారికి, పరమపావనమైన నీరాజనం

||బంగారం||

3. కాంతి కిరణాలతో కలికిమెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం
కాంతలందరి పసుపు-కుంకుమలు కాపాడు కాత్యాయినికి నిత్యనీరాజనం

||బంగారం ||

4. చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం
కలవరేకులవంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం

||బంగారం||

5. ముదమారమోమున ముచ్చటగ ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్యలహలకిదే నీరాజనం

||బంగారం||

6. శుక్రవారము నాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మీకిదే నీరాజనం
శృంగేరి పీఠమున సుందరాకారిణి, శారదామాయికిదే నీరాజనం

||బంగారం||

7. ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్యనీరాజనం
జన్మజన్మల తల్లి జగధీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం

||బంగారం||

8. సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదె నీరాజనం
ఆత్మార్పణతో నిత్యనీరాజనం బంగారం తల్లికిదే నీరాజనం

||బంగారం||

అంబ నీకిదిగో మంగళ త్రికాలమందు దేవి నీకిదిగో మంగళం

||బంగారం||

మంగళ హారతి

రచయిత : బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం – కెంపైన నీరాజనం

– భక్తి పెంపైన నీరాజనం.

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
బాగైన అందెలకు నీరాజనం – బంగారు నీరాజనం

– భక్తి పొంగారు నీరాజనం.

నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు
మా తల్లి గాజులకు నీరాజనం – రాగాల నీరాజనం

– భక్తి తాళాల నీరాజనం.

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మా తల్లి నవ్వులకు నీరాజనం – ముత్యాల నీరాజనం భక్తి

– భక్తి జతనాల నీరాజనం.

చెకిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగరకు నీరాజనం – రతనాల నీరాజనం

– భక్తి జతనాల నీరాజనం.

పసిబిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు
మా తల్లి చూపులకు నీరాజనం – అనురాగ నీరాజనం

– భక్తి కనరాగ నీరాజనం.

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మా తల్లి కుంకుమకు నీరాజనం – నిండైన నీరాజనం

– భక్తి మెండైన నీరాజనం.

తేటిపిల్లల వోలె గాలి కల్లలనాడు.
మా తల్లి కురులకు నీరాజనం – నీలాల నీరాజనం

– భక్తి భావాల నీరాజనం.

జగదేకమోహిని, సర్వేశగేహిని
మా తల్లి రూపునకు నీరాజనం – నిలువెత్తు నీరాజనం

– భక్తి విలువెత్తు నీరాజనం.

మరిన్ని భక్తి గీతాలు : 

Sthotralu – స్తోత్రాలు

Sthotralu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు  స్తోత్రముల గురించి తెలుసుకుందాం…

Sthotralu – స్తోత్రాలు

Kulam Kadu Gunam Pradhanam In Telugu – కులం కాదు గుణం ప్రధానం

Kulam Kadu Gunam Pradhanam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కులం కాదు గుణం ప్రధానం నీతికథ.

కులం కాదు గుణం ప్రధానం

(ఇది ఆరణ్యపర్వంలో మార్కండేయ మహాముని చెప్పిన కథ. దీన్నిబట్టి, కుల వర్గ విద్వేషాలు ఈవాటి నాగరిక సమాజంలో బలిసినంతగా ప్రాచీన కాలంలో ఉండేవి కావనీ, మంచి విషయం ఎవరి దగ్గర ఉన్నా గ్రహించవలసినదేనని తెలుసు కోవాలి.)

కులం కారణంగా ఉన్నత స్థానాలు, మర్యాదలు యివ్వడం ఈ వాడు పెరిగినంతగా భారతకాలం నాడు లేనేలేదు. గుణం ప్రధానంగా మనిషిని మర్యాద చేయడం అందరూ ఎఱిగిందే. అటువంటి అంశం

ఒకానొక గ్రామానికి సమీపంలో ఒక వనం. ఆ వపంలో ప్రశాంత ప్రదేశం. అక్కడొక చిన్ననది. ఆ నది ఒడ్డునే చక్కని నిడనిచ్చే పెద్ద చెట్టు. ఆ చెట్టు క్రింద కూర్చుని ఒక విపుడు తపస్సు చేసుకుంటూ, మధ్యాహ్నం కాగానే గ్రామంలోకి వెళ్ళి భిక్షాటనం చేసి జీవితం గడుపు తున్నాడు.

అలా తపస్సు చేసుకునే రోజులలో …..
ఓకనాడు
ఆయన భిక్షాటనకు లేచే సమయంలో చెట్టుమీది కొంగ రెట్ట వేసింది. అది ఆయన మీద పడింది.
అంతలో ఆయనకు చాలా కోపం వచ్చింది. అంతే: కన్నులు ఎర్రజేసి పై కి చూశాడు.

చూసిన మరుక్షణంలో ఆ కొంగ మాడి పడిపోయింది.
ఆయన యథాప్రకారం గ్రామంలో భిక్షకువెళ్ళి, ఒక యింటి గుమ్మంలో నిలబడి: ‘భవతి భిక్షాం దేహి”, అన్నాడు.
ఆ మాట చెవిని పడగానే యింట్లోని గృహలక్ష్మి ఆయనకు భిక్ష తేవడానికి వంటయింటి వయిపు నడిచింది.

అదే సమయానికి ఆమె భర్త దూర ప్రయాణం చేసి యింటికి వచ్చాడు.

భర్తన చూడగానే ఆమె చల్లని నీటితో ఆయన పాదాలు కడిగి, విసన కర్రతో కొంతసేపు విసిరి, భోజనం చేయించి, పరుండాక, భిక్ష తీసుకుని వీథిలోకి వచ్చింది.

అక్కడ నిలబడ్డ ముని కోపంగా చూశాడు. అప్పుడామె :
“స్వామీ! మీ కోపానికి మాడిపోయే కొంగను కాను. భర్తను మరెవరి విషయమయినా చూసుకుంటాను. పతి
సేవను మించిన పరమార్థం వేరే లేదు, నాకు ‘

అని నిలబడింది.
అప్పుడా ముని తెల్లబోయి :
‘అమ్మా! ఎక్కడో, అడవిలో జరిగిన నా కథ నీకు ఎలా తెలి సింది ? నాకు జ్ఞానబోధ చెయ్యి తల్లీ’, అని ప్రార్థించాడు.

గృహిణి : ‘మునీశ్వరా ! ఇక్కడకు కొద్ది దూరంలో మిథిలానగరం ఉంది. అక్కడ ఒక బోయవాడు మాంస విక్రయం చేసి జీవితం గడుపు తున్నాడు. వానిపేరు ధర్మవ్యాధుడు. ఆయన మీకు సర్వవిషయాలూ బోధిస్తాడు, వెళ్ళండి’, అంది. ఆయన బయలుదేరి నడిచి నడిచి మిథిలా నగరం చేరాడు.

నగరంలో అడుగు పెడుతూనే ధర్మవ్యాధుని నివాసం గురించి అడిగి, తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరాడు.
బడ్డాడు.

అక్కడ రకరకాల జంతువుల మాంసాలు చూసి దూరంగా నిం

వచ్చిన మునిని అంత దూరంలో చూసి ధర్మవ్యాధుడు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి:

‘ ఆర్యా ! ‘ ప్రణామాలు. మిమ్ము నా దగ్గరకు పంపిన పతివ్రతా శిరోమణి క్షేమంగా ఉన్నదా ? అని అడిగాడు.

వచ్చిన మునికి మతిపోతోంది.

‘అక్కడ ఆ యిల్లాలు కొంగ విషయం చెప్పింది. ఈ ధర్మ వ్యాధుడు ఆ ప్రతివ్రత క్షేమం అడిగాడు. ఇంతకాలంగా తపస్సు చేసినా ఏ శక్తి సాధించ లేకపోయాము,

ఆవిడ పతివ్రత కనుక ఆ వ్రత దీక్షతో దూరదృష్టి వచ్చి ఉండవచ్చు.

జంతువుల మాంసం అమ్ముకునే ఈ కసాయి వానికి ఇంత శక్తి ఎలా వచ్చింది’ అని ఆలోచనలో పడ్డాడు.

అది గ్రహించి ధర్మవ్యాధుడు :
‘స్వామీ! ఈ మాంసపు వాసన మీరు భరించలేరు. రండి మా యింటికి వెడదాం. నాకు యింతటి శక్తి ఎలా వచ్చిందని ఆలోచిస్తు న్నారు కదూ ! ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను ”

అని వినయంగా యింటికి తీసుబవెళ్ళాడు. వెడుతూనే వాకిట్లో మంచంమీద పడుకున్న, ముసలి తండ్రి పాదాలకు నమస్కరించి, ఆయన యోగ క్షేమాలు విచారించి, లోపల గడపలో ఉన్న తల్లికి నమ స్కరించి, ఆవిడకు సేవచేసి :

‘స్వామీ! ఇదే నేను చేసేవి. మనం ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు జరిపినా, తల్లి దండ్రులను సేవించుకోకపోతే ప్రయోజనం లేదు.

తొమ్మిది మాసాలు గర్భంలో మనలను భరించి, ప్రసవవేదనపడి, మనకు జన్మనిచ్చి, నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చే వరకూ మన ఆరోగ్యం కోపం ఆ తల్లి ఎన్నో అవస్థలు పడుతుంది.

అటువంటి తల్లి ఋణం ఎన్ని సేవలు చేసినా తీరుతుందా?
అలానే మన భవిష్యత్తుకు పునాదులు వేసి, మనకోసం ఎన్నో బాధలు పడే తండ్రి ఋణం కూడా తీరదు.
అయినా వారిని సేవించుకోవడం వల్ల కొంత ఋణ భారం తగ్గుతుంది.

వీరిని సేవించు కోవడం కంటె నేను చేసే సాధన ఏమీలేదు. దాని వల్లనే నేను సుఖంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. తల్లి దండ్రులను సేవించుకుంటూ ఆలుబిడ్డలను రక్షించుకుంటూ జీవితం నడుపుతున్నాను. అంతే! మరేంలేదు. మీకు మరో సందేహం కలిగి ఉంటుంది. మాంసం అమ్ముకుని బ్రతుకుతున్నాను కదా! అది జీవహింస కాదా, దానిపిల్ల పాపం కదా అని. ఇక్కడ తమ కొక పరమ రహస్యం చెప్పాలి.

అదీ ధర్మ సూక్ష్మం అంటే –
ఈ భూగోళంలో ప్రాణికోటి అంతా ఒక దానిమీద ఆధారపడి మరొకటి జీవిస్తున్నది. రెక్కలు విప్పుకు ఎగిరే పక్షులూ, నాలుగు కాళ్ళ జంతువులూ యివే ప్రాణులని మీరు అనుకుంటున్నారు. మీరు తినే ధాన్యం, కాయగూరలు, పళ్ళు అన్నింటిలోనూ జీశం ఉన్నది. అయితే అవి పక్షులవలె ఎగరడం లేదు కనక జీవం లేదనుకోవడం న్యాయమా।

జీవి బ్రతికి, పెరగడానికి మరోజీవం బలికాక తప్పదు.
అలాకాదు, యిదే జీవహింస అంటారా!
నేను మానినింతలో నా దుకాణానికి వచ్చేవారందరూ మాంసా హారం వదులుతారా ! అందుచేత మీరు ఈ అనుమానం వదిలేయండి. ప్రాణాలు నిలిపు కోవడానికి ఆవశ్యకమయిన ఆహారంకోసం జరిపేది హింసకాదు.

మరొశ్రమాలు ఈ జంతువులను ఎవరో సంహరించి తెస్తారు. నా వృత్తి ధర్మానుసారం దీనిని విక్రయం చేసి బ్రతుకుతాను.

వ్యాపారంలో దొంగ తూకాలూ, అధిక లాభాలూ నేనెరుగను.
నా ధర్మాన్ని నేను విడిచి పర ధర్మాన్ని స్వీకరించము. ఆకలి గొన్న వారికి పిడికెడు అన్నం పెడతాను. నా మీద ఆధారపడి జీవించే వారందరి యోగ క్షేమాలు తెలుసుకుంటాను. ఇరుగు, పొరుగులవారి కష్ట సుఖాలలో భాగం పంచు కుంటాను.

అన్నిటినీ మించిన విషయం –

ఈ మనస్సు ఉన్నదే యిది స్థిరంగా నిలబడదు. ముందు దీన్ని లొంగదియ్యాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. నిర్మల బుద్ధితో నిరంతరం పరమేశ్వరారాధనం చెయ్యాలి.

నేను చేసేది యింతే! ఈ మాత్రం చెయ్యగలిగితే మనకు ఏ బాధలూ ఉండవు, ఈ జీవితం ఎంతవరకూ పరోపకారానికి ఉపయోగపడితే అంత ధన్యం’ అని బోధించాడు.

గొడ్డు మాంసం అమ్ముకుని జీవించే బోయవాడు చేసిన ప్రబోధంతో మనస్సు నిర్మలమై ప్రశాంతంగా వాని వద్ద సెలవు తీసుకుని తపస్సు కేసుకునేందుకు వెళ్ళాడాయన.

మరిన్ని నీతికథలు మీకోసం:

Guruseva Satphalitam Istundi In Telugu – గురుసేవ సత్ఫలితం ఇస్తుంది

Guruseva Satphalitam Istundi In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గురుసేవ సత్ఫలితం ఇస్తుంది నీతికథ.

గురుసేవ సత్ఫలితం ఇస్తుంది

(ఇది ఆదిపర్వంలో కథ. గురు సేవ ఎంత అవసరమో, దాని ఫలితం ఎంతటిదో గ్రహించాలి.)

ఆ రోజులలో ఒకానొక గురుకులంలో పైలుడు అనే పేరుగల ఉపా ధ్యాయు డుండేవాడు. ఆయన దగ్గర ఎందరో విద్యాభ్యానంచేసేవారు.

ఆ రోజులలో గురుకులాలంటే చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆ ఆశ్రమంలోనే ఉండాలి. వారికి అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పించే భారం రాజు మీద ఉండేది. నిరంతరం గురు సన్నిధానంలో ఆయన సేవచేస్తూ వినయ విధేయతలతో విద్యనేర్చుకునేవారు. గురువుగారు కూడా వారిని తన బిడ్డలుగా చూసుకుని ఎవరికి ఏ విద్యయందు అభిరుచి ఉన్నదో గ్రహించి ఆ విద్యనే నేర్పేవాడు. తనకు కావలసిన విద్యనేర్ప గల గురువును అన్వేషిస్తూ విద్యార్థి తిరిగేవాడు. అవీ అనాటి గురుకులాలు.

అటువంటి గురుతులంలో పైలునివద్ద ఉదంకుడని శిష్యుడుండే వాడు. ఈ ఉదంకుడు విద్యపూర్తి చేసుకుని సంప్రదాయం ప్రకారం గురువుగారి దగ్గర సెలవుతీసుకునే ముందు, చేతులు కట్టుకు నిలబడి, తలవంచి.

‘ఆచార్యా! గురునక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించండి’, అన్నాడు
అప్పుడు పైలుడు చిరునవ్వు నవ్వి, ఆశీర్వదించి :
“నాయనా నీ వంటి శిష్యుడు దొరకడం మా అదృష్టం. గురు దక్షిణ ఏమీ అవసరం లేదు,’ అన్నాడు.

ఉదంకుడు అలాగే నిలబడి:
‘ఆచార్యా! గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళడం న్యాయంకాదు. కమఠ మీరు ఆజ్ఞాపించండి’, అన్నాడు.
వాని పట్టుదల, ధర్మవిరతిచూపి సంతోషంతో:

నాయనా! ఇంతకాలంగా నువ్వు చేసిన సేవను మించిన గురు దక్షిణ లేదు. అయినా నువ్వు తప్పదంటున్నావు కనుక ఆశ్రమంలోకి వెళ్ళి అమ్మగారు ఏం కోరుకుంటారో అడుగు’, అన్నాడు పై లుడు.

ఉదంకుడు లోపలకు వెళ్ళి గురువుగారి భార్యకు నమస్కరించి విష యం చెప్పాడు.

అప్పుడావిడ :
‘నాయనా మీ గురువుగారి దగ్గర పౌష్యుడనే రాజు విద్యనేర్పు కున్నాడు. ఆ రాజుభార్య ధరించే కుండలాలు నాకు తెచ్చిపెట్టు, అంది.

ఉదంకుడు పరమానందంతో బయలుదేర పండగా ఆవిడ పిలిచి ” నాయనా ! ఇంక నాలుగు రోజులలో నేను ఒక వ్రతం చెయ్య బోతున్నాను. అప్పటికి అవి తీసుకురావాలి’ అంది.

‘చిత్తం, తల్లీ’ అని ఉదంకుడు బయలుదేరాడు.
కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక మహావృషభంమీద ఒకా నౌక పురుషుడు అడ్డుగా వచ్చి:

‘ఈ గోమయం భక్షించివెళ్ళు. అనుమానించకు. దీన్ని మీ గురువుగారు కూడా భక్షించారు’, అనగానే ఉదంకుడు మాట్లాడకుండా అది తిని, త్వరగా రాజు గారింటికి వెళ్ళాడు.

మహారాజు చిరునవ్వుతో ఆహ్వానించి, అతని సమాచారం అడిగి: ‘మీ రాకవల్ల మా జన్మ ధన్యమయింది. ఊరకరారు మహాత్ములు! ఏ పనిమీద వచ్చారో చెప్పండి’, అనగా గురుపత్ని కోరిక వివరించాడు.

మహారాజు వినయంగా
‘ ఓ విద్వాంసుడా ? మీరు ఏదికోరినా ఇవ్వవలసిందే. ఇప్పుడు మీరు స్వయంగా అంతఃపురానికి వెళ్ళి మహారాణిని అడగండి. ఆవిడ సంతోషంగా ఇస్తుంది’, అన్నాడు.

ఉదంకుడు క్షణాలలో అంతిపురికిపోయి తిరిగివచ్చి :
‘రాజా! మీరు విద్వాంసులతో పరిహాసాలాడుతా రమకో లేదు. మహారాణి అంతఃపురంలో లేదు’, అన్నాడు.

రాజు: ఓ మహాత్మా! క్షమించాలి. అపవిత్రులకు నా భార్య కనబడదు. మీ వంటివారు అుచిగా ఉన్నారనీ అనలేను.

ఉదంకుడు: గుర్తుకు వచ్చింది మహారాజా! నేను వచ్చేదారిలో ఆ పొరపాటు జరిగింది. ప్రయాణపు తొందరలో నేను కాళ్ళూ, చేతులూ, ముఖం కడగకుండా ఆచమించాను. ఇలాచెప్పి అప్పటి కప్పుడు అన్నీ ముగించి అంతఃపురానికి వెళ్ళి ఎదురుగా వినయంతో నిలిచిన రాణికి తన రాశకు కారణం చెప్పాడు.

రాణి! విద్వాంసుల కోరిక తీర్చడం మా విధి. ఇవిగో రత్న కుండలాలు తీసుకోండి. ఒకమాట. ఈ కుండలాలు దొంగిలించాలని చిర కాలంగా తక్షకుడు వేచి ఉన్నాడు. అది కనిపెట్టుకుంటూ వెళ్ళండి.

ఉదంకుడు అవి తీసుకుని చక చక వస్తున్నాడు. కొంక దూరం వచ్చేసరికి దారి వెంట ముసలి బిచ్చగాడు వానిని వెన్నంటి వస్తున్నాడు.

ఉదంకుడు సాయంకాలానికి ఒక చెరువు దగ్గరటచేరి, కుండలాలు ఒడ్డున పెట్టి సంధ్యావందనం ఆరంభించగా ఆ దొంగ వాటిని ఆవహరించి పారిపోయాడు.

ఉడంకుడు తిరిగి చూసేసరికి ఆ దొంగవాడు పాములామారి ఒక బిలంలో దూరాడు. దాన్ని తవ్వడానికి ఉదంకుడు శ్రమపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆ బిలాన్ని విశాలం చేశాడు.

దానిగుండా పోయి పోయి ఉదంకుడు నాగలోకానికిపోయి అనేక విధాల ప్రార్థనలు చేసినా తక్షకుడు కనిపించలేదు.

కనిపించకపోగా ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చుని తెలుపు నలుపు దారాలతో వస్త్రం నేస్తున్నారు.

నేత చక్రాన్ని ఆరుగురు తిప్పుతున్నారు. దానికి వన్నెండు ఆకులు ఉన్నాయి. ఎదురుగా అశ్వంమీద ఒక పురుషుడు కనిపించాడు. అందరినీ స్తుతించగా ఆ పురుషుడు ప్రసన్న వదనంతో ‘ వరం కోరుకో’ అన్నాడు.

ఉదంకుడు: నాగలోకమంతా నా వశంలో ఉండాలి.
“అయితే ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు’ అన్నాడా పురుషుడు.

ఉదంకుడు ఊదగా నాగలోకంనిండా అగ్నిజ్వాలలు వ్యాపించాయి. ఆ మంటలకు తాళలేక తక్షకుడువచ్చి కుండలాలు సమర్పించి పాదాలమీద వడ్డాడు.

అప్పటికే కాలాతీతం కావస్తున్నది. ‘గురుపత్నీ వ్రత సమయానికి ఎలాచేరడం’ అని విచారిస్తుండగా ఆ పురుషుడు తన గుర్రంయిచ్చి అదృశ్యం అయ్యాడు.

మరుక్షణంలో ఉదంకుడు గురువుగారి ఆశ్రమం దగ్గర దిగాడు. గుర్రం మాయమయ్యింది.

అప్పటికి గురువుగారి భార్య అభ్యంగస్నానంచేసి వ్రతానికి సన్నద్ధు రాలవు తున్నది.

ఉదంకుడు ఆవిడ పాదాలకు నమస్కరించి, కుండలాలు అర్పించి, ఆశీర్వాదం పొంది, గురువుగారి దగ్గరకు వచ్చాడు.

ఇంత ఆలస్యం ఎందుకయింది అని గురువుగారు అడుగగా జరిగిన విషయాలన్నీ వివరించి వాటి అంతరార్థం బోధించమని కోరాడు. ‘నాయనా! నీకు ఎదురుపడిన పురుషుడు దేవేంద్రుడు. ఆ వృషభం ఆయన ఐరావతం. ఆ గోమయం అమృతం. అది భక్షించక పోతే నువ్వు నాగలోకంలో జీవించవు.

నాగలోకంలో స్త్రీలను చూశావే, వారు ధాత- విధాతలు.
నలుపు తెలుపు దారాలు రాత్రింబవళ్ళు. చక్రాన్ని తిప్పే ఆరుగురూ ఋతువులు, పన్నెండాకులూ మాసాలు. ఆ చక్రం సంవత్సర రూప మయిన కాలచక్రం.

అక్కడ కనిపించిన పురుషుడు దేవేంద్రుడు. ఆ గుర్రం అగ్ని హోత్రుడు.

ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇంద్రుడు నాకు ప్రాణమిత్రుడు. నువ్వు నా శిష్యుడవు కనక నీకు అపాయం జరగకుండా కాపాడాడు. నీ వలె వినయ విధేయతలతో, గురుశుశ్రూష చేసి విద్యనేర్చుకునే వారిని ఎప్పుడూ దేవతలు కాపాడుతారు. ఇకనువ్వు మీ ఇంటికి వెళ్ళు. నీకు” సర్వశుభాలూ కలుగుగాక’, అని గురువుగారు ఆశీర్వదించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Lord Rama Mangala Harathi With Lyrics In Telugu – మంగళ హారతులు

Lord Rama Mangala Harathi With Lyrics In Telugu

Lord Rama Mangala Harathi With Lyrics In Telugu – మంగళ హారతులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీరాముడు (లేదా శ్రీరామచంద్రుడు) హిందూ మతంలో ప్రముఖమైన దేవుడు. ఆయనను విష్ణువు యొక్క ఏడవ అవతారంగా పూజిస్తారు. రాముడు ఐక్య వేదాన్తం, ధర్మ పరిపాలకుడు, సత్యవ్రతుడు, క్షమాశీలతగల వ్యక్తి, గొప్ప భర్త, ప్రేమపూర్వక భక్తుడు మరియు క్షమాశీలతగల రాజు అని పిలుస్తారు. శ్రీరాముడు దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి కుమారుడిగా అయోధ్యలో జన్మించాడు. రాముడి కథ ప్రధానంగా రామాయణం అనే మహాకావ్యంలో వర్ణించబడింది. వాల్మీకి మహర్షి రాసిన ఈ రామాయణం, 24,000 శ్లోకాలతో, రాముడి జీవితాన్ని మరియు ఆయన యాత్రలను వివరిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీరాముడు మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

ధీరునకు వనధి గంభీరునకు

శుంభత్సారంభ గాంభీర్యా! శ్రీరామా
(పున్నాగవరాళి రాగం – మిశ్రచాపుతాళం)

చ 1) ధీరునకు వనధి గంభీరునకు
దుష్ట సంహారునకు ఘనమణి హరునకునూ,
హర కర్పూర నీ హర హీర పటీర
రాళి కీర్తి విస్తారునకునూ

॥జయ మంగళం నిత్య శుభ॥

చ 2) మంగళము రామునకు మహిత శుభధామునకు
మంగళము సీతా సమేతునకునూ
మంగళము సుర మకుట మణి లలిత పాదునకు
మంగళము క్షీరాబ్ధి మందిరునకూ

॥జయ మంగళం నిత్య శుభ॥

చ 3) అద్యునకు బ్రహ్మది వేద్యునకు
దుర్మదభేద్యునకు ప్రజరుజా వైద్యునకునూ
సద్యోఫల ప్రదున కాద్యంత రహితునకు
విద్యా విలేక జన హృద్యునకూ

॥జయ మంగళం నిత్య శుభ॥

చ 4) జైత్రునకు సౌమిత్రి మిత్రునకు
భక్తవన చైత్రునకు నవపద్మ నేత్రునకునూ
మిత్ర వంశాబ్ది సన్నిత్రునకు సుర వినుత
పాత్రునకు జగదవని సూత్రునకునూ

॥జయ మంగళం నిత్య శుభ॥

నిరాకారా నిరంజనా నీకు హారతి

నీహార సాకార నిర్మలానందా! శ్రీరామా
(పూరి కళ్యాణ రాగం – త్రిశ్రగతి తాళం)

పల్లవి: నిరాకార నిరంజనా నీకు హారతీ
మా రామచంద్రునకు మనసు హారతీ నా మనసు హారతీ

॥ నిరాకార

చ 1) పంచభూతములను ఐదు
ప్రమిదల గాను చేసినాను
మించిపోయే గుణము తీసి
మంచి వత్తి వేసినాను
అహంకారమనే గుణము తీసి
అక్షతలు చేసినాను
కామమనే గుణము తీసి
తరచి చమురు పోసినాను

చ 2) మాయ అనే తెరను తీసి దక్షిణగా ఉంచినాను
దూషణమనే గుణము తీసి ధూపముగ వేసినాను
కామ క్రోధములను తీసి కైవత్తిగ వెలిగించినాను
ప్రేమయనే గుణముతీసి నైవేద్యము చేసినాను

||నిరాకార||

బాలుడా నీకిదే హారతీ

శ్రీరామ జయరామ జయ జయ రామ
శ్రీరామచంద్రా నీకు కర్పూర హారతి – వలె
(శంకరాభరణ రాగం – మిశ్రచాపు తాళం)

చ 1) బాలుడా నీ కిదే హారతి
సుగుణ బాలుడవై వర్థిల్లుమా
చాలగ దేవదేవులు కొలచుచు
శాశ్వత సుఖముల నొందుమా

॥బాలుడా||

చ 2) విద్యాధికుల వెలయుచు విద్యల
వేదమె నేర్చి సుఖింపుమా
ఘనమతినై విద్యా గురువుల యెడ
కడు భక్తిని చెల్లింపుమా

॥బాలుడా||

చ 3) ఆయుర్భాగ్యము నొంది ధరిత్రిని
అఖిల సుఖముల నొందుమా
కృత్యం బైన సనాతనంబు మును
హితమతి తోడ చరింపుమా

॥బాలుడా||

చ 4) జననీ జనకుల అజ్ఞల నెల్ల
సతతము తలను ధరింపుమా
పాయని దేహారోగ్య సుఖముల
నిత్యముగ బడసి వర్థిల్లుమా

॥బాలుడా||

చ 5) బంధు జనాదరంబు నీకు ఇల
పాత్రుడవై చరియింపుమా
బంధ విమోచన పరామాత్ముని
కడు భక్తిని చెల్లింపుమా

॥బాలుడా||

మంగళ మనరేమీ రంగనా మణులారా

రంగు హొరంగు చెలరేగిన శ్రీరామా
కాంభోజి రాగం – త్రిశ్రగరి ఆదితాళం)

పల్లవి: మంగళ మనరేమీరంగనామణులారా!
పొంగుచు దాసుల బ్రోచిన స్వామికి

చ 1) దశరథ పుత్రునకు దశముఖ శత్రువునకు
శశివదనునకు విశద చారిత్రునకు

॥మం॥

చ 2) పుండరీకాక్షునకు కుండల శయనునకు
చండ విక్రమునకు ఆంజనేయ సఖునకు

॥మం॥

చ 3) ఘననిభ తేజునకు మునిజన పూజ్యునకు
అమరనుత సేవ్వునకు జానకీనాథునకు

॥మం॥

చ 4) మదన సుందరునకు సదమల గాత్రునకు
సదయ సద్భక్తునకు ఉదయగిరి నిలయునకు

॥మం॥

మంగళం ధీరునకు

సారభీర ధీరోదారునకు సూర్యరాయ
అరభి రాగం – త్రిశ్రగతి ఆదితాళం)

చ 1) మంగళం ధీరునకు అబ్ధి గంభీరునకూ
దుష్ట సంహారునకూ ఘన మణీహారునకు
హారతి కర్పూర – నీ హార హార పటీర
తారాళి కీర్తి విస్తారునకు మంగళం||

చ 2) మంగళం రామునకు మహిత శుభనామమునకు
మంగళం సీతా సమన్వితునకు మంగళం|
సుర మకుట మణి కలిత పాదునకు మంగళం
క్షీరాబ్ధి మందిరునకు జయ మంగళం||

చ 3) అద్యునకు బ్రహ్మదివేద్యునకు దుర్మదా
భేద్యునకు ప్రజరుజా వైద్యునకు సర్వపాప
హరునకు సద్యఃఫల ప్రదునకు ఆద్యంత
రహితునకు విద్యా వివేక జన హృద్యునకు

చ 4) జైత్రునకు సౌమిత్రి మిత్రునకు భక్తవన
చైత్రునకు నవపద్మ నేత్రునకునూ మిత్ర
వంశాబ్ది సన్మిత్రునకు సురవినుత పాత్రునకు
జగదావన సూత్రునకు జయ మంగళం|

మంగళ మిదిగో మందర ధరా

సంకందన సుందర వందితా శ్రీరామా
(హరి కాంభోజిరాగం – మిశ్రచాపుతాళం)

చ 1) మంగళ మిదిగో మందర ధరా
మధుసూదనా పలు! మాట లింతేనా

॥మం॥

చ 2) మత్స్యావతార! కూర్మావతార
రక్షించుము రా రామావతారా

॥మం॥

చ 3) కర్పూర హారతి! కరుణతో గైకొను
కౌశల్య తనయా! కరి రాజ వరదా

॥మం॥

చ 4) గోవిందా శౌరీ! గోపాల కృష్ణా
గోవర్ధ నోద్ధార! కాచి రక్షించరా

॥మం॥

రంగా! నీకిదే మంగళం

రంగదుత్తుంగ నానందతరంగా రంగ!
(మోహనరాగం ఆదితాళం)

పల్లవి: రంగా నీకిదే మంగళం – కస్తూరి రంగా నీకిదే మంగళం
చ 1) రంగ ఖగరాట్ తురంగ కలుష వి
భంగా తవ మోహనాంగా వయ్యారి

॥రంగా॥

చ 2) హరే విబుధ విహారీ ఉభయ
కావేరీ తీర విహారీ వయ్యారి

॥రంగా॥

చ 3) అన్నా యితరుల నన్నెవరు-నీ
కన్న నన్ను బ్రోవుచున్నా-వయ్యారి

॥రంగా॥

చ 4) లీలా శేషాంశు లీలా కరుణాల
వాలా జగత్పరిపాలా-వయ్యారి

॥రంగా॥

చ 5) అయ్యా వరము మాకియ్య నిను నమ్మి
తయ్య నను బ్రోవుమయ్య-వయ్యారీ

॥రంగా॥

చ 6) హాసా మహ చిద్విలాసా శేషాచల
దాశార్చిత పరమేశా-వయ్యారి

॥రంగా॥

రమా రమణ గొనుమా

క్షమా సుమా రామా!
(ఆనందభైరవి రాగం ఆదితాళం)

పల్లవి: రమా రమణ గొనుమా జయ హారతి గొనుమా
అను పల్లవి కౌశల్య సుకుమార కమలా మనోహరా
దశరథ వరపుత్ర శశిశేఖర మిత్రా

॥రమా॥

చ 1) ఈశా పరమేశా జగధీశా దాస జన హృదయ
వాసా చిద్విలాస సర్వలోక వాసా శ్రీనివాసా

చ 2) రామా రఘు రామా రణభీమా
రామా రఘు వంశాంబుధి సోమా
నీల మేఘ శ్యామా నిగమాంత గుణనీమా
తారకరామ స్కందపురి రామా

రామ రామ యని రమణులు స్మరియించి

భూమ క్షేమానంద సీతా శ్రీరామా
(సురట రాగం – మిశ్రచాపుతాళం)
ఘల్లు ఘల్లు మని-వలె

చ 1) రామ రామ యని రమణులు స్మరియించి
రంగైన రాఘవునకు శృంగార గాత్రునకు హరివిల్లు
విరచియు అతివను పెండ్లాడి
అతిఘోర వనములో మసలిన రామా

॥మంగళమ మంగళం||

చ 2) రాతి నాతిగ జేసి రాక్షసులు వధియించి
ఆదివిష్ణుడవయి అవతరించిన స్వామి
ఆ పాప కర్మునిచే అతివను గోల్పోయి
అక్కడ వనములో వెతలు చెందిన స్వామి

॥మంగళమ మంగళం||

చ 3) గురువు ఆజ్ఞకు నాడు అతి బద్ధుడై యుండి
రంగైన తాటకిని సంహరించి, మౌని
జన్నము గాచి సౌమిత్రి జాడగాంచి
సకల సంతోషముతో నీరజనేత్రా

॥మంగళమ మంగళం||

చ 4) నారదు తుంబురులు నృత్యముగానము చేయ
బ్రహ్మరుద్రాదులు పలువిధముల పాడ
దశరథ మహరాజు నిండా దీవెనలిచ్చి
సకల సంభ్రమముతో శోభిల్లు రామా

॥మంగళమ మంగళం||

చ 5) రామ రామ యని రమణులు స్మరియించి
రంగైన రాఘవునకు శృంగార గాత్రునకు
నిగమ గోచర రామ నిత్య పరంధామ
నీకు అర్పణము గాను నీరాజనమ్ము

॥మంగళమ మంగళం||

Lord Rama Mangala Harathi

సీతా రామ జయ మంగళం

దశరథ తనయా జయ మంగళం
రాజీవలోచన జయ మంగళం

చ 1) కౌశల్య వర కుమార ఘనత మీరగ భానువంశ
పాలకా నీకు వజ్రాల హారతు లివిగో

||రామ||

చ 2) ముని వెంట వేగ వెడలి తాటకి మద మణచి
యజ్ఞమును గాచిన స్వామీ నీకు ముత్యాల హారతు లివిగో

||రామ||

చ 3) శృంగారమున సీతకు మంగళ సూత్రము కట్టిన
రంగగు రామా నీకు మంగళ హారతులివిగో

||రామ||

చ 4) ముత్యాల తలంబ్రాలు ముదముతో సీతకు బోసిన
సత్యస్వరూపునకు చంద్రాల హారతి యిదిగో

||రామ||

చ 5) నాలుగోనాడు నాగవల్లి కిపుడు
బలి గావించిన స్వామీ మీకు పచ్చల హారతు లివిగో

||రామ||

చ 6) మెచ్చి సీత నప్పగించి సంతోషించిన
స్వామీ నీకు నీలాల హారతి లివిగో

||రామ||

చ 7) జనకుని కూతురిని జానకిని పెండ్లాడిన
వీర రామచంద్ర నీకు వజ్రాల హారతులివిగో

॥రామ||

రామా! కర్పూర హారతి గైకొనుమా

రవికుల జలథి సోమా రాజలలామా
శ్రీరామా (సింధుభైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: రామా కర్పూర హారతి గైకొనుమా

చ 1) సోదరు లిద్దరు లేడి కోసము వేగ
ఆ మాయ రావణుడు అ సీతను కొనిపోగ

॥రామా॥

చ 2) పర్ణశాలకు పోయి వెదకి చూచిన గాని
తరుణి గానక తల్లడిల్లితి శ్రీరామా

||రామా॥

రామచంద్రాయ జనకరాజ మనోహరాయ

ధీరాయ! శుభాయ! నందరాయ! శ్రీరామా
(నవరోజ్ స్వరాలు – త్రిశ్రగతి తాళం)

చ 1) రామచంద్రాయ జనక
రాజతనయ మనోహరాయ మామ కాభీష్ట దాయ

॥మహిత మంగళం||

చ 2) కౌశలేద్రాయ మంద హాసదాస పోషకాయ
వాసవాది వినుత సర్వ

॥దాయ మంగళం||

చ 3) చారు కుంకు మోపోత చందనాది చర్చితాయ
సారకటక శోభితాయ

॥భూరి మంగళం||

చ 4) లలిత రత్న కుండలాయ తులసీ వన మాలికాయ
జలజ సదృశ దేహాయ

॥చారు మంగళం||

చ 5) దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ
భావ గురువరాయ

॥భవ్య మంగళం||

చ 6) పుండరీ కాక్షాయ పూర్ణ చంద్రావనాయ
ఆండజ వాహనాయ

॥ఆతుల మంగళం॥

చ 7) రాజ విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్ర కాశితాయ

॥శుభమంగళం||

చ 8) రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరి పరాయ

॥చారు మంగళం||

రామచంద్రా నీకు కర్పూరహారతిస్తును

సుగుణ గుణ సాంద్రా! శ్రీరామచంద్రా!
(శంకరాభరణ రాగం – మిశ్రచాపుతాళం)

చ 1) రామచంద్రా నీకు కర్పూరహారతి గైకొనుమా
పాము మీదను పవళించిన
స్వామి నిన్నిక మరువను

||రామ||

చ 2) ఎన్ని విధముల నన్నుతించిన కన్నులకే కనిపించవా?
నన్నుగన్న తండ్రి నీకే విన్నవించిన బ్రోవవా

||రామ||

చ 3) కోపమేలను దాపుచేరితి పాపములు నెడబాపరా
తామరసాక్ష నీదు పదములు
తప్పకను భజియింతురా

||రామ||

చ 4) పన్నగ గజరాజు నేలిన భక్తవత్సలు డందురూ
నన్ను రక్షణ సేయకుండిన నమ్మా నీ కథలన్నియూ

||రామ||

ధీరునకు వనధి గంభీరునకు

ధీరసమీరా! సారసమీరా! శ్రీరామా
(పున్నాగవళి రాగం – మిశ్రచాపు తాళం)

చ 1) ధీరునకు వనధి గంభీరునకు
దుష్టసంహారునకు ఘనమణీ హారునకునూ
హర కర్పూర నీహార పటీర
తారాళి కీర్తి విస్తారునకునూ

॥జయ మంగళం నిత్య శుభమంగళం ॥

చ 2) మంగళము రామునకు మహిత శుభధామునకు
మంగళం సీతా సమేతునకునూ
మంగళం సుర మకుట మణీలలిత పాదునకు
మంగళం క్షీరాబ్ధి మందిరునకూ

॥జయ మంగళం||

చ 3) ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు
దుర్మద భేద్యునకు భవరుజా వైద్యునకునూ
సద్యోఫల ప్రదున కాద్యంత రహితునకు
విద్యా వివేక జనహృద్యునకూ

॥జయ మంగళం||

చ 4) జైత్యునకు సౌమిత్రి మిత్రునకు
భక్తవన చైత్రునకు నవపద్మ నేత్రునకునూ
మిత్రవంశాబ్ది సన్మిత్రునకు సుర వినుత
పాత్రునకు జగదావన సూత్రునకునూ

॥జయ మంగళం ॥

సీతా సమేతాయ

సీతాఖ్యాత సంప్రీతా సీతా
(అఠాణా రాగం – జుంపె తాళం)

చ 1) సీతా సమేతాయ శ్రితమనోల్లాస
నీతి వాక్యాయ అతి నిర్మలాయ
రాతి నాతిగ జేసి రక్షంచి జగములను
దాతవై బ్రోచు దశరథ సుతాయ

॥జయ మంగళం నిత్యశుభ||

చ 2) మౌనితో చనుదెంచి దుష్టరక్షణము చేసి
శివుని విల్విరిచి సీతను వరియించి
అయోధ్యపురికి భువినెన్నగ
జనుదెంచి కౌశల్యా గారాలపట్టికిపుడు

॥జయ॥

చ 3) రామచంద్రున కపుడు రాజ్యాభి షేకంబు
చేయవలెనని రాజు చెప్పగాను
తామసంబున కైక తన వరమ్ములిమ్మనగ
బూమిపై వ్రాలిన పుణ్యదాసుడు

॥జయ॥

హారతి గైకొను అరమరచేయక

గురుతర సుందరవర వదనా! శ్రీరామా
(యమునా కళ్యాణి రాగం తాళం)

పల్లవి: హారతి గైకొను అరమర చేయక
ఆశ్రిత పాలా శ్రీరామచంద్ర

॥హారతి ||

చ 1) శివుని విల్లు విరచి సీతను పెండ్లాడి
పరశురాముని భంగపరచిన శ్రీరామా

॥హారతి ||

చ 2) లక్ష్మణ సోదర తక్షణమేగియు
ఈ స్థితిలోన ఇక దయ చూడు

॥హారతి ||

చ 3) అచ్యుతా! అహల్యా శాప పరిహారా
సీతా మనోహరా శ్రీరామచంద్రా

॥హారతి ||

హారతి గైకొనుమా శ్రీరామచంద్రా!

రవికుల చంద్రా! సత్కీర్తి సాంద్రా
(కన్నడ రాగం – ఆదితాళం)

పల్లవి: హారతి గైకొనుమా శ్రీరామచంద్రా

చ 1) కర్పూర హారతి కరుణతో గైకొను
కనికర ముంచుమా కౌశల్య తనయా

॥హారతి ||

చ 2) మంగళ హారతి మహిమతో గైకొని
మరి మరి మము బ్రోవ దశరధ తనయా

॥హారతి ||

శ్రీరామా గొను కర్పూర హారతిదిగో

గారా మారగ జేచితికోరా శ్రీరామా
(సింధుభైరవి రాగం – ఆదితాళం)

పల్లవి: శ్రీరామా గొను కర్పూర హారతిదిగో
సీతాదేవికి ముత్యాల హారతిదిగో

చ 1) నిత్య నిరామయ భృత్యుల బ్రోవరారా
సత్య స్వరూపా గొను సర్వేశ హారతిదిగో

||శ్రీరామా||

చ 2) బ్రోవా నందన సుంత ఆది మధ్యాంత శూన్య
వాద భేద విహీన పరమాత్మా హారతిదిగో

||శ్రీరామా||

చ 3) వేంకట శివగురుని శంకలేక బ్రోవ
వేంకట రంగనాయన కిచ్చిన హారతిదే

||శ్రీరామా||

మరిన్ని భక్తి గీతాలు : 

Go Pooja Phalitamulu In Telugu – గో పూజా ఫలితములు

Go Pooja Phalitamulu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోమాత పూజా ఫలితములు గురించి తెలుసుకుందాం…

Gomata Pooja Phalithalu In Telugu

గో పూజా ఫలితములు

  1. గో ప్రదక్షిణము భూ ప్రదక్షిణముతో సమానము.
  2. ఆవు కుడి ప్రక్కను బ్రహ్మ ఉండును. అచట పూజించినవారికి సంతానము కలుగును.
  3. గోవు కొమ్ములకు ఎడమప్రక్క విష్ణువు ఉండును. కాన ఆ తావును పూజించిన వారికి జ్ఞానమోక్షములు లభించును.
  4. ఆవు కొమ్ముల చివరిభాగములో మూడు కోట్లు ఏబదిలక్షల తీర్థములు వుండును. వాటిపై చల్లిన నీటిని త్రాగిననూ, శిరస్సున, చల్లుకొనినూ త్రివేణీ సంగమ స్నానఫలము లభించును.
  5. ఆవు నుదుటి భాగమునందు సాంబశివుడు వుండును. కావున మల్లె పూవులతో పూజించి నచో కాశీవిశ్వేశ్వరుని పూజించిన ఫలితము కలుగును.
  6. గోవు ముక్కునందు సుబ్రహ్మణ్యస్వామి వసిం చును. ఆ భాగమును పూజించినవారికి చెవి పోటురాదు. సంతాననష్టము వుండదు.
  7. ఆవుచెవియందు అశ్వనీదేవతలు ఉంటారు. ఆ ప్రదేశములను పూజించినచో అసాధ్య రోగములు నివారింపబడును.
  8. ఆవు కన్నులలో సూర్యచంద్రులు వుంటారు. వానిని పూజించినవారికి అజ్ఞానమనే చీకటినశించి జ్ఞానకాంతియు, సకల సంపదలు కలుగును.
  9. ఆవు నాలుకపై వరుణదేవుడు ఉండును. దానిని పూజించినచో సంతానము కలుగును.
  10. ఆవు హుంకారమునందు సరస్వతి వుండును. దానిని పూజించినచో విద్య లభించును.
  11. ఆవు గండస్థలముల (చెక్కిళ్ళు) యందు కుడి భాగమున యముడు, ఎడమభాగమున ధర్మ దేవతయు వుందురు. దానిని పూజించినచో యమబాధలు వుండవు. ధర్మపరులకు లభించే పుణ్యలోకము ప్రాప్తించి, జ్ఞానవృద్ధి యగును.
  12. ఆవు పెదవులయందు ప్రాతఃసంధ్యాది దేవతలు ఉందురు. దానిని పూజించినచో సంధ్యా సమయంలో కావించిన పాపములు తొలగును.
  13. ఆవు కంఠమునందు ఇంద్రుడు వుండును. దానిని పూజించినవారికి ఇంద్రియ పాటవము కలుగును. సంతానాభివృద్ధి యగును. పక్షవా తాది రోగములు రావు.
  14. ఆవు వక్షస్థలము నందు సాధ్యదేవతలు వుం దురు. ఆ భాగమును పూజించినవారికి సాధింపరాని కార్యములు ఉండవు.
  15. ఆవు నాలుగుపాదములలోను నాలుగు పురు షార్ధములు వుండును. ఆ నాల్గింటిని పూజించినవారికి ధర్మార్ధకామమోక్షములు సిద్ధించును.
  16. ఆవు గిట్టలచివరి భాగమున నాగులు వుందురు. ఆ ప్రదేశమున పూజించినవారికి గంధర్వలోకములు లభించును.
  17. ఆవు గిట్టలనందు గంధర్వులు వుందురు. అచట పూజించినవారికి నాగలోకము సిద్ధిం చును. ఈ భూమియందు నాగభయము వుండదు.
  18. ఆవుగిట్టల ప్రక్క భాగములందు దేవవేశ్యలు ఉందురు. అచట పూజించినవారికి అప్సరో లోకము సిద్ధించును.

మరిన్నిపూజా విధానాలు:

Judam Tagadu In Telugu – జూదం తగదు

Judam Tagadu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… జూదం తగదు నీతికథ.

జూదం తగదు

(ఈ కథ ఆదిపర్వంలో ఉంది.)

తన వలె కష్టాలపాలయిన మహామహులు చరిత్రలో ఎవరయినా ఉన్నారా అని ధర్మరాజు అడుగగా బృహదశ్వమహర్షి చెపుతున్నాడు.

“ధర్మనందనా ! నిజానికి నువ్వు పడే కష్టం ఎంతటిదయ్యా ! తమ్ములు నలుగురూ, నీ భార్యా నీ దగ్గర ఉన్నారు. ఈ వనాలలోని మునులూ, ఋషులూ నీకు ధర్మబోధ చేస్తూ, ఓదారుస్తూన్నారు.

ఈ మాత్రం కూడా లేకుండా భార్యకు దూరమై ఎన్నో బాధలు పడిన నలమహారాజున్నాడు. ఆయన కూడా జూదంలోనే రాజ్యం, పంప దమా కోలుపోయి నావా యాతనలూ పడ్డాడు. ఆ కథ విను.

భారతదేశంలో ఉండే అనేక రాజ్యాలలో నిషేధదేశం ఒకటి. ఆ రాజ్యాన్ని వీరసేనుడనే రాజుకొడుకు నలుడు పాలిస్తున్నాడు. ఈ సల మహారాజు సర్వసద్గుణ సంపన్నుడు, విద్యావంతుడు, రూపంలో మన్మ థుడు. సత్యవ్రతంతో విద్వాంసులను పూజించే వాడు.

అయితే పాండురాజనందనా! ఆయనకు కూడా నీలానే జూదం అంటే మహా ప్రీతి. ఆ విద్యలో మంచి నేర్పు కూడా ఉంది. సరే ఆ విషయం అలా ఉంచు.

ఆ రోజులలో విదర్భ రాజ్యాన్ని పాలించే భీముడనే రాజుకి దమ యంతి అనే పేరు గల కుమార్తె ఉండేది. ఆమెకు పదహారేళ్ళు నిండే నాటికి ఆమె గుణ, శీల, మందర రూపాలను గురించి దేశదేశాలలో చెప్పుకునే వారు.

సాధారణంగా అందం కల ఆడవారికి వినయం ఉండదు. కొంద రికి శీలం ఉండదు. వినయము, శీలమూ లేని అందగత్తెమ గురించి అందరూ ఆడిపోసుకుంటారే తప్ప మంచి మాట అనరు.

అలా కాకుండా ఈ దమయంతి తవ అందం కంటె వినయ, గుణ, శీలాలతో అందరి మెప్పునూ పొందింది.

అలానే పదాచార, పద్గుణ రూపాలకు, సాహస పరాక్రమాలు తోడుగా ఉన్న నలమహారాజుకి దమయంతి తగిన ఇల్లాలు కాగలదని దేశ దేశాలు తిరిగే విద్వాంసులు అంటుండే వారు. ఈ వార్త నల దమయంతు లిద్దరి చెవిని పడింది. ఒకరినొకరు చూచుకోకుండానే వారి మధ్య అమ రాగం అంకురించింది.

అలా ఉండగా, ఒకనాడు నలుడు తన ఉద్యానవనంలో విహారం సాగించే సమయంలో అక్కడ తిరిగే హంసలలో ఒక రాయంచ నలుని చేతికి చిక్కింది.

దాని అందాన్ని చూసి ఆనందించే నలునితో ఆ హంసః
‘మహారాజా! నువ్వు నన్ను విడిచిపెడితే నేను విదర్భదేశం వెళ్ళి అక్కడ నీ గుణ, రూప, సాహసాలు వివరించి ఆమెకు నీ యందు అనురాగం కలిగేలా చేస్తాను’ అంది.

నలుడు విడిచిపెట్టాడు.
హంస బయలు దేరి వెళ్ళి విదర్భ రాజు ఉద్యానవనంలో విహ రించే దమయంతిని సమీపించి నలుని గుణ గణాలు కీర్తించింది.

ఆ మాటలు విని దమయంతి హంసను లాలించి ఇదే విధంగా నా గురించి ఆ మహారాజుకి చెప్పవలసిందిగా ప్రార్థించింది.

హంస అలాగే అని వెళ్ళి విషయమంతా నలునికి విశదం చేసింది.
తన కుమార్తె వయసు గమనించి విదర్భరాజు స్వయంవరం ప్రక ఉంచాడు.

ఆ స్వయంవరానికి దేశదేశాల రాజులతో పాటు దేవతలు కూడా వచ్చారు. వారు వచ్చే దారిలో నలుని చూసి, తమ పక్షాన దమయంతి దగ్గరకు రాయబారిగా పంపారు.

దేవతల అనుగ్రహం వల్ల నలుడు ఎవరికంటా పడకుండా పరావరి దమయంతి అంతఃపురంలో ఆమె ఎదుట నిలిచాడు.

ఆ సుందరాకారుని చూసి దమయంతి ఆశ్చర్యంతో

‘ఆర్యా! దివ్యసుందరాకారంతో ఉన్న మీరెవరు? ఈ అంతః పురంలోకి పోతుటీగ రావడానికి వీలులేదే మీరెలా వచ్చారు?’ అంది.

నలుడు: కల్యాణీ! నేను ఇంద్ర, వరుణ, యమ, అగ్నిహోత్రులు పంపగా వారి అమ గ్రహం వల్ల ఎవరి కంటబడక ఇక్కడకు దూతగా వచ్చాను. రేపు స్వయంవరంలో నువ్వు ఈ నలుగురిలో ఒకరిని వరించాలి.

దమయంతిః తమరెవరో చెప్పలేదు?
నలుడు నన్ను నలుడంటారు. నిషధ చక్రవర్తిని.
దమయంతి సిగ్గుతో, ఆనందంతో తలవంచి-

‘మహారాజా ! నా మనసెప్పుడు మిమ్మే ప్రాణనాథునిగా వరం చింది. అలనాడు హంస చెప్పిన నాటి మంచి మిమ్మే ఆరాధిస్తున్నాను. ఈ స్వయంవరం మీ కోసమే ప్రకటించారు. మీరు నా భర్త, అలా జర గని నాడు మరణమె శరణ్యం’ అంది.

పరిపరివిధాల దేవతల ఘనతను గురించి చెప్పి, వారిలో ఎవరినో ఒకరిని వరించడం ఉచితం అని పలుడు ఎంత బోధించినా అంగీకరించ లేదు దమయంతి. ‘దేవతా సమక్షంలోనే మిమ్ము వరిస్తాను’ అంది.

నలుడు తిరిగి వచ్చి అంతా వివరించాడు.
దేవతలు ఆశవీడక మరునాడు స్వయంవర మండపానికి నలుని వేషంలో వచ్చి వాని పక్కనే కూర్చున్నారు.

గమయంతి స్వయంవర సభలో అడుగు పెట్టి ఒక్కొక్కరినే చూస్తూ నలుని సమీపించింది. అక్కడ అయిదుగురు నలమహారాజులు కనిపించగా ‘ ఓ దివ్యపురుషులారా! నేను ప్రేమించే వలనుహారాజు మీలో ఎవరు?ి అందిం

వారు నలుగురూ లేచి నిలబడ్డారు. వలుడు కదలలేదు. అప్పుడు దమయంతి ఆ ఎలుగురికీ నమస్కరించి వలుని మెడలో పూలమాల వేసింది.

దేవతలు వారిని దీవించి వెళ్ళారు.
నలుడు భార్యాసహితుడై తన రాజ్యానికి వచ్చాడు.

పన్నెండు సంవత్సరాలు సుఖ సంతోషాలతో నలదమయంతులు జీవితం సాగించారు. వారికి ఇంద్రసేనుడనే కుమారుడు, ఇంద్రసేన అనే కుమార్తె కలిగారు. వారు చక్కని శిక్షణలో పెరుగుతున్నారు.

ఆ రోజులలో పొరుగు రాజయిన పుష్కరుడు నలుని దగ్గరకు వచ్చి తనతో జూదం ఆడమన్నాడు.

జూదానికి, యుద్ధానికి ఆహ్వానం వస్తే తిరస్కరించరాదు అనే నియమం అంగీకరించాడు.

జూదం ఆరంభమయింది. పుష్కరుని మాయజూడంలో నలుడు ఒక్కొక్క పందెం ఓడిపోతున్నాడు.

ఓడిన కొద్దీ ఆవేశంతో పందెం పెంచుతున్నాడు. గెలిచిన ఆనం దంతో పందెం కాస్తున్నాడు పుష్కరుడు. రోజులు గడుస్తున్నాయి. భర్త జూదంలో సర్వం ఓడిపోతున్నట్టు తెలిసి దమయంతి తన బిడ్డ లిద్దర్నీ ఒక రథం మీద పుట్టింటికి పంపింది.

అన్ని సంపదలూ ఓడిపోయిన నలునితో పుష్కరుడు
‘ ఇంక నీ దగ్గర పైసా కాసులేదు. నీ భార్య ఉంది. ఆమెను కూడా పందెం కాస్తావా?’ అన్నాడు.
నలుడు దీనవదనంతో కోట దాటి వచ్చాడు. దమయంతి కూడా అనుసరించింది.
శత్రు నగరంలో ఉండరాదని రాజ్యం విడిచి వారు వెడుతున్నారు.

(వజలందరూ)
‘జూదం ఎంత పని చేసింది : ధర్మప్రభువయిన నలమహారాజుకి ‘కూడా కష్టాలు తెచ్చిపెట్టింది’, అని కంటనీరు పెట్టారు.

నల దమయంతు లిద్దరూ తిరిగి తిరిగి ఆహారం కూడా దొరకనిచోట మంచి నీరు తాగి కాలం గడుపుతున్నారు.

అలా ఉండగా ఒకనాడు వారి సమీపంలో కొన్ని పక్షులు కని పించగా నలుడు వాటిని పట్టుకోవాలని ఉత్తరీయం వాటిమీద విసిరాడు. అవి ఆ బట్టతో సహా ఎగిరిపోయాయి. అప్పుడు భార్య పైట చెరగు పగం చింపి తన ఉత్తరీయం చేసుకున్నాడు.

కొంతదూరం నడిచి నాలుగు దారులు కలిసి ఒక కూడలిలో నిం బడి:

‘దమయంతీ! ఇంతవరకూ నాతో ఎన్నో కష్టాలు అనుభవించావు.” ఇప్పుడు నీకు శ్రేయోమార్గం బోధించాలని ఉంది. ‘

ఇదిగో ఇటు దక్షిణంగా వెడితే అవంతీ దేశం చేరుతావు. అటు నుంచి కొంచెం ముందుకు వెడితే విదర్భదేశం వస్తుంది’, అన్నాడు.

దమయంతి ఆ మాటలు విని కన్నీరు విడిచి ‘నాథా! ఎందుకు చెపుతున్నారు నాకు ఈ దారి? రాజ్యం పోయినా, సంపదలు పోయినా కట్టుబట్ట పోయినా మిమ్మల్ని నేను విడవలేదు. మీతోనే కష్టమయినా, సుఖమయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా అయినా మీ దుఃఖాన్ని తగ్గించడానికే నేను మీతో ఉన్నాను. నన్ను వదలకండి’- అంది.

అప్పుడు నలుడు :
‘ దమయంతీ । భార్యకంటె ఈ ప్రపంచంలో స్నేహితుడూ, ఆప్త బంధువు ఎవరూ లేరు. ఈ విషయం నే నెరుగుదును. ఎరిగి నిన్ను విడిచిపెడతానని ఎందుకనుకున్నావు? ఒక వేళ నీకు నేను దూరమయినా నా మనస్సు ఎప్పుడూ నీ మీదనే ఉంటుంది. మన ప్రేమకు అంతరాయం ఉండదు * ‘ అన్నాడు.

అలా మాట్లాడుకుంటూ వారు ఒక పత్రం చేరారు. ఆ రాత్రి నిద్రి స్తున్న వేళ దమయంతిని విడవలేక విడవలేక విడిచి వెళ్ళిపోయాడు. నలుడు.

తెలతెలవారు తూండగా నిద్రలేచిన దమయంతి భర్తకోసం గోలు గోలున విలపిస్తూ పత్రం విడిచి ఊరు దాటి అడవిదారి పట్టి వెదకడం ఆరంభించింది.

తిరుగుతూండగా ఓ కిరాతుడు ఆమెను చూసి మోహించి బలాత్కారం చెయ్యబోయి, ఆ పతివ్రత వేడిచూపులకు తట్టుకోలేక నేలకూలాడు.

దొరికిన పండుతిని, నీరుతాగి భర్తకోసం పిచ్చిదానిలా తిరుగుతూ చేదిదేశం చేరింది. అక్కడి జనులందరూ ఆమెను పిచ్చిదానిగా, భావించి

వెంటాడుతూంటే, రాజభవనం నుంచి చూసిన రాజమాత తన దాసిని పంపి దమయంతిని రాజభవనంలోకి రప్పించింది”.

దమయంతి రాజభవనంలోని అంతః పురంలో మహారాణి నందాదేవి దగ్గరకు రాగానే ఆవిడ ఆదరంతో కూర్చుండ బెట్టింది. పరిచారిక అందరినీ దూరంగా వెళ్ళమని

‘అమ్మాయీ ఎవరింటి బిడ్డవమ్మా! నీ భర్త ఎవరు? ఈ దశలో ఎందుకున్నావు? అలంకారాలు లేకపోయినా, జుట్టు చిందర వందరగా ఉన్నా, మాసిన బట్టలతో ఉన్నా నీలో దివ్యశోభ కనిపిస్తున్నది. సత్యం చెప్పు తల్లీ ‘ ! అని బుజ్జగింపుగా అడిగింది.

దమయంతి విచారంతో
‘ మహారాణి । నేను ఎవరి బిడ్డనని చెప్పను? ఆ కథ మరచి పోయాను. ప్రస్తుతం ఏకాకిని, సైరంధ్రి వృత్తిలో నాకు ప్రవేశంఉంది, రాజాంతః పురాలలో, నా నియమాలకు భంగం కలగనిచోట ఆ వృత్తిలో ఉంటాను.

నా భర్త గుణ, శీల రూపవంతుడు. కానీ, అన్యాయంగా జరిగిన జూదంలో అన్నీ కోలుపోయి అడవులపాలయాము. ఆయన నన్ను ఒక సత్రంలో ఒంటరిగా విడిచివెళ్ళాడు. ఆయనకోసం తిరుగుతూ తిరుగుతూ యిలా వచ్చాను. మీరు నా నియమాలకు అంగీకరిస్తే యిక్కడే ఉంటాను’ అంది.

అంగీకరించింది మహారాణి.
తన కొమార్తెను పిలిచి మహారాణి అన్ని విషయాలూ చెప్పి, * ఈమెను కంటికి రెప్పవలె చూసుకోవాలి’ అంది. ఆ విధంగా దమ యంతి వారి అంతఃపురంలో కాలం గడుపుతున్నది.

ఆ రాత్రి సత్రంలో బయలుదేరిన వలుడు ఒక మహారణ్యంలో సాగుతూండగా అక్కడ దావానలం వ్యాపించి మంటలు లేచాయి.

మంటలలో నుండి ఆర్తనాదం వినిపించింది. దీని జన రక్షణ దీక్షకల నలుడు అటునడువగా –

‘ఓ పుణ్యాత్ముడా! ఇటురా నేను నాగజాతి కర్కోటకుడను. నారదులవారి శాపంవల్ల యిక్కడ కర్రలా పడి ఉన్నాము. నీ దర్శనంతో నాకు శాపం పోతుందని ఆయనే అన్నారు. నన్ను ఈ మంటల నుండి కాపాడితే నీకు మేలు చేస్తాను’ అని కర్కోటకుడు పణకగా నలుడు వానిని యీవలకు తెచ్చి వదిలాడు.

అపుడు శర్కోటకుడు :
‘ఆర్యా! మీరు పది అడుగులు వేయండి. మీకు శుభం కలుగు తుంది’, అన్నాడు.
నలుడు పదో అడుగు వెయ్యగానే కర్కోటకుడు నలుని కాటు వేశాడు. ఆ పర్పవిషం ఎక్కగానే నలుడు నల్లని మరుగుజ్జు వాడయాడు.

నలుడు తెల్ల బోయిచూడగా, కర్కోటకుడు:
మహారాజా ! బాధపడకు. ప్రస్తుతం నన్ను కలిపురుషుడు బాధిస్తు న్నాడు. నా విషంతో వాడు పడుతూంటాడు. అంతవరకూ నీ రూపం ఎవరికీ తెలియకుండా రహస్యంగా గడపడానికే నేను కాటు వేశాను. ఇది మొదలు నీ పేరు బాహుకుడు.

ఇప్పుడు నువ్వు అయోధ్యకు వెళ్ళి ఆ రాజు ఋతువర్ణుని కొలువులో చేరు. ఆయనకు జూదం అంటే పిచ్చి. ఆయన దగ్గర ఆ విద్య గ్రహించా అంటే నీకు తెలిసిన అశ్వహృదయం ఆయనకు నేర్పాలి. దానితో మిగిలిన కార్యాలు చక్కబడతాయి.

నీకు నీ రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను స్మరించు’, అని చెప్పి మాయమయ్యాడు.

బాహుక రూపంతో నలుడు అయోధ్య చేరి, రాజును దర్శించి, తనకు అశ్వశాస్త్రం తెలుసుననీ, ద్యూతం కూడా వచ్చుననీ, పంట చెయ్యటంలో మంచి అనుభవం ఉన్నదని చెప్పగా, ఆ మహారాజు వానిని తన అశ్వపాలకుడుగా నియమించాడు.

అలా కాలం గడుపుతున్నాడు నలుడు, నిత్యం రాత్రి వేళల దమ యంతినే స్మరించు కుంటూ.

తన కుమార్తె దమయంతి, అల్లుడు నలమహారాజు అరణ్యాల పాలయారని విన్న విదర్భరాజు విచారంలో తన నగరంలోని విప్రవరు లను రావించి :

‘ వేదవిదులారా మీరు దేశ దేశాలు తిరుగుతూ అనేక నగరాలు చూస్తుంటారు. ఎక్కడయినా నా కుమార్తె, ఆమె భర్త కనిపిస్తే వార్త నాకు అందించండి. అందుకు ప్రత్యుపకారంగా మీకు అగ్రహారం యిచ్చి వందల గోవులు సమర్పిస్తాను’ అన్నాడు.

వారందరూ తమ పర్యటనలో నందమయంతుల జాడ తెలుసు కోవడానికి ప్రయత్నాలు ఆరంభించారు.

వారిలో సుదేవుడనే విద్వాంసుడు చేది రాజ్యంచేరి, రాజు యింట శుభకార్యం జరిగే వేళ అక్కడ ఉన్న నారీమణులమధ్య దమయంతిని గుర్తుపట్టాడు.

పతి వియోగంతో, అరణ్య యాత్రల క్లేశాలతో కృశించిన దమ యంతి రాహు గ్రస్తమయిన చంద్రబింబంలా, ఎండకు వాడిపోయిన తామరపూవులా కనిపించింది.

నెమ్మదిగా వీలు చూసి ఆమెను ఏకాంతములో కలిసి, తన కథ చెప్పాడు సుదేవుడు.

దమయంతి మాట్లాడకుండా బొట బొట కన్నీరు విడిచింది. అది. చూసి రాజకుమారి సునంద ఆ విషయం తన తల్లితో చెప్పింది.

రాజమాత ఆ విప్రునిచేరి వివరా అడిగింది.
ఆయన సంగతులన్నీ చెప్పి:
‘మహారాణి చూశారా! ఈ అమ్మాయి కనుబొమలమధ్య తిలకం వలె ఒక పుట్టుమచ్చ ఉంది. అదిచూసి నేను గుర్తుపట్టాను’ అనగా రాజు మాత దమయంతిని దగ్గరగా తీసుకునిః

బిడ్డా! మీ అమ్మా నేను అక్క-చెల్లెళ్ళం. నీకు ఎంతటి దురవస్థ పట్టిందమ్మా ! అని విచారించింది.

కొంత సేవయాక దమయంతి :
‘పిన్నీ! ఇంతకాలం నే నెవరో తెలియకపోయినా ఎంతో ఆదరంగా చూశావు. ఇప్పుడు నన్ను ఈ విద్వాంసుని వెంట మా పుట్టింటికి పంపు. అక్కడ నా బిడ్డ లిద్దరూ ఉన్నారు. వారిని చూసుకుని కొంత అశ్వాసం పొందుతాను’ అంది.

మరునాడే దమయంతి పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. కన్నబిడ్డలు తల్లిని కౌగిలించుకుని సంతోషంతో కంటనీరు పెట్టారు.

దమయంతి బిడ్డలిద్దరినీ దగ్గరగా తీసుకుని ముద్దాడి, వెన్నుదువ్వి, కన్నీరు తుడిచి, బుజ్జగించింది.

ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. మరునాడు దమయంతి తల్లిత తన భర్తను అన్వేషించే ప్రయత్నం సాగించమంది.

ఆ పనికి బయలుదేరే విద్వాంసులందరినీ రావించి దమయంతి :

‘పుణ్య పురుషులారా! మీరు వెళ్ళిన ప్రతి రాజసభలోనూ యీ సందేశం వినిపించి, అందరినీ పరీక్షగాచూచి, యిది వినగానే ఎవరు చలిస్తారో వానిని గురించి వివరాలు తెలుసుకు రండి.

జూదరి అయిన ఓ ప్రాణేశ్వరా! పతిసేవకే అంకిత మయిన భార్యను నిద్రలో ఉండగా విడిచి, ఆమె చీర చెరగు కట్టుకు వెళ్ళావు. నాటి నుంచీ ఆమె అదే దశలో నిన్నే స్మరిస్తూ కృశిస్తున్నది. కనికరంతో ఆమెకు నీ దర్శన భాగ్యం అనుగ్రహించు ‘

అని దమయంతి వినిపించిన సందేశంతో వెళ్ళిన వారిలో అందరూ ఏ సమాచారం లేకుండానే వచ్చారు.

వారిలో మదేవుడనే విప్రవరుడు దమయంతి దగ్గరకు వచ్చి:

‘అమ్మా! దేశ దేశాలు తిరిగి నేను అయోధ్యలో ఋతుపర్ణుని ఆస్థానంలో నీ సందేశం వినిపించాను. ఆ సభలో ఎవ్వరూ జవాబివ్వలేదు. కాని, సభదాటి వచ్చాక, దారిలో ఒక పురుషుడు (ఆ మహారాజుగారి ఆశ్వపాలకుడు, బాహుకుడని ఆయన పేరు) నేను పలికిన మాటలకు జవాబిచ్చాడు’ అని చెప్పాడు.

ఒక రథం విదర్భ నగర సరిహద్దులలో ప్రవేశిస్తున్నది. ఆ వేగానికి భూమి కంపిస్తున్నది. రాతికోట గోడలు ఊగిపలాడుతున్నాయి. అంత దూరం మంచి అంతఃపురానికి వినబడింది రథ చక్ర నేమిధ్వని.

దమయంతి గుండె పులకించింది. ‘సందేహం లేదు, అది నలుని సారథ్యమే. అంత వేగంగా మరెవరూ రథాన్ని నడవలేరు, ‘ అని నిశ్చయించింది.

ఆ ధ్వనికి విదర్భలోని గుర్రాలు, ఏనుగులూ గజ గజ లాడి ఆకాశంలోకి తలలెత్తి చూశాయి భయంగా.

రథం కోటలోని మధ్య ప్రాకారానికి రాగానే ఆ వార్తవిని విదర్భ రాజు మర్యాదగా ఎదురువచ్చి ఋతుపర్ణునికి స్వాగతం పలికి, అతిథి మర్యాదలు నడిపాడు.

నగరంలో ఎక్కడా స్వయంవర సన్నాహాలు కాని, ఆ ప్రయ త్నాలు కాని కనిపించక ఋతువర్ణుడు తెల్లబోయాడు. ఇలా స్వయంవర వార్త తనకు ఎందుకు పంపారో తెలియలేదు.

ఋతుపర్ణుడు ఎందుకు వచ్చాడో విదర్భ రాజుకు తెలియలేదు.
‘మిత్ర ధర్మంగా వచ్చానన్నా డాయన.
‘సంతోషం’ అన్నాడీయన.
దమయంతి తన చెలికత్తెను పిలిచి :

“కేశినీ। ఆ రథం మీద వచ్చిన పొట్టి చేతుల కురూపివున్నాడే ఆయన ఎవరో ఆయన కథ ఏవిటో వివరంగా తెలుసుకురా’ అని సంపీ౦ంది,

ఆమె నెమ్మదిగా రథం దగ్గరకు వెళ్ళి బాహుకుని చేరి కుశల ప్రశ్నలతో సంభాషణ మొదలు పెట్టి, సేకరించిన సమాచారంతో డమ యంతి దగ్గరకు వచ్చి:

‘అమ్మా రథం మీద వచ్చిన కురూపి ఋతువర్ణులవారి సారథి. మనం పంపిన బ్రాహ్మణుని సందేశం విని ఏ సమాధానం యిచ్చాడో అనే మాటలు చెప్పి విలపించాడమ్మా’ అంది.

దమయంతికి అర్థమయింది ఆ వ్యక్తి నలుడే అని. అయితే ఈ వికారరూపం ఏమిటో అర్థంకాక, మరోసారి దూతికను పంపి, వాని చర్యలన్నీ పసిగట్టి రమ్మంది.

వెళ్ళిన దూతిక తిరిగి వచ్చి:
‘అమ్మా! అంతా అద్భుతంగా ఉన్నదమ్మా!
మన కోటమంచి వారికి అన్నీ పండని పదార్థాలు పంపించారు. అక్కడ వంటశాలలో నీళ్ళులేవు, నిప్పులేదు. బాహుకుడు ఒక్కసారి అక్కడున్న ఖాళీ కుండలలోకి చూడగానే అవి నీటితో నిండాయి. రెండు గడ్డి పరకలు తీసి సూర్యుని కెదురుగా ఉంచాడు. అవి మండడం ఆరం భించాయి. క్షణాలలో వంట పూర్తి అయింది.

ఆ పరిసరాలలోని మన ంతానికుంజాలలో వికసించిన పువ్వులు తీసి ఆయన నలిపి పారేశాడు. ఆ చేతులలో అంత నలిగినా అవి వాడి పోకుండా అప్పుడే రేకులు విచ్చిన వాసన లీముతున్నాయి.

అలా దూతిక చెప్పుతూంటే దమయంతి విశ్వాసం మరింత పెరిగి, ఆయన వండిన పదార్థాలు తీసుకు రమ్మని చెప్పింది. తెచ్చిన వంట కాల రుచిని బట్టి అది నలుని చేతి వంటయే అని గ్రహించింది.

తన బిడ్డ లిద్దరినీ యిచ్చి దూతికను నలుని దగ్గరకు పంపింది. వారిని చూస్తూనే దగ్గరకు తీసుకుని బాహుకుడు గోలు గోజున విలపించాడు.

తన పిల్లలు కూడా యిలా ముద్దుగా ఉండే వారనీ, వీరిని చూడ గానే వారు గుర్తు వచ్చి విచారించా’ ననీ అన్నాడు.

ఈ కబురు విన్న దమయంతికి సందేహం పూర్తిగా తీరింది. తల్లి దగ్గరకు వెళ్ళి :

‘అమ్మా! ఆయనను అంతఃపురానికి రప్పించి అసలు విషయం తెలుసుకోవాలి’ అంది.

ఆవిడ మహారాజుతో సంప్రదించి బాహుకుని రప్పించింది.
దమయంతిని చూస్తూనే బాహుకుడు కంటనీరు పెట్టాడు. దుఃఖం పొంగిపొర్లింది. దమయంతి కూడా అదే దశలో పడింది కొంత సేపు యిద్దరూ దుఃఖించారు.

దమయంతి దుఃఖాన్ని దిగమింగుతూ :
‘బాహుకా! ఘోరారణ్యంలో భార్యను విడిచి వెళ్ళిన పురుషుని ఎక్కడయినా చూశావా? ఆమె ఎ అపరాధం చేసిందని అలా విడిచి వెళ్ళాడో కనుక్కున్నావా ? దేవతలను కూడా తిరస్కరించి అనురాగంతో వరించి, సంతానవతిని అయిన నన్ను అలా ఒంటరిగా వదలి వెళ్ళడం న్యాయమనీ భావించాడా ఆయన ధర్మార్థ కామాలు మూడూ కలిసి సాగించి, అనుభవిద్దాం అని అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న నన్ను విడవడం ధర్మమా ? ‘

అని అడుగుతూంటే బాహుకుని కన్నుల వెంట అశ్రుధారలు కురిశాయి.

‘ ఓ మహాసాధ్వీ | యింకా నీ మాటల శూలాలతో నన్ను వేధించకు. మనకు కలిగిన క్లేశాలన్నీ కలిపురుషుని పగవల్ల వచ్చినవి. ఇప్ప టికి వాడు నన్ను విడిచాడు. కమక యిక్కడకు రాగలిగాను.

అనురాగంతో ఆనందమయ జీవితం గడిపిన నారీమణి పంపురు మని వివాహ మాడుతుందని ఊహించలేకపోయాను. మీ నాన్నగారు నీ ద్వితీయ స్వయంవరం ప్రకటించడం వల్ల మా మహారాజును తీసుకు వచ్చాను’ అని రోదించాడు.

అప్పుడు దమయంతి :

“నన్ను శంకించకండి. మీ జాడ కని పెట్టడానికి నేనే ఆ నందేశం పంపాను. నగరంలో స్వయంవర సన్నాహాలు మీకు కనబడ్డాయా మా నాన్న గారికి కూడా మీ రెందుకు వచ్చారో తెలీదు. మీరు తప్ప ఇంత దూరం రథాన్ని ఒక్కరోజులో నడపగలవారు లేరని ఎరుగుదును. నా ఊహ నిజమయింది’ అంది.

బాహుకుడు కర్కోటకుని స్మరించాడు. అంతే బాహుకుడు నలు డుగా సుందర రూపంతో సాక్షాత్కరించాడు. నలదమయంతులు ఇద్దరూ ఒకరి నొకరు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు.

వాడిపోతున్న నారు మడికి తొలకరి చినుకులు పడినట్లు వారి దుఃఖభర హృదయాలు ఆనంద గగనంలో విహరించాయి. మరునాడు తెలతెల వారుతూండగా నందమయంతులు అభ్యంగన స్నానంచేసి నూతన వస్త్రాలు ధరించి మహారాజును సమీపించి నమస్కరించారు.

ఆయన వరమ సంతోషంతో వారిని ఆశీర్వదించి నగరంలో ఉత్ప వాలు జరిపించాడు.

తన సేవకుడుగా ఉన్న బాహుకుడు వలుడని తెలియగానే ఋతు ఎర్ణుడు వచ్చి క్షమార్పణ కోరాడు. అనంతరం వారివద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు.

నలదమయంతులు కొంతకాలం ఇక్కడే సుఖభోగాలు అనుఖి వించారు.

అప్పుడొకనాడు నలుడు:
‘నే నిప్పుడు పుష్కరుని ఓడించగల ద్యూత రహస్యాలు నేర్పు కున్నాను. వెళ్ళి వాడితో ఆడి, ఓడించి మన రాజ్యం సంపాదించి వస్తామ’ అని వెళ్ళి పుష్కరుని జూదానికి పిలిచాడు. పుష్కరుడు వరమ సంతోషంతో జూదానికి దిగి సర్వమూ ఓడిపోయి నలుని పాదాల మీద పడ్డాడు.

నలుడు వానిని క్షమించి :
“నీ రాజ్యానికి నవ్వుహా ” అన్నాడు.
అనంతరం దమయంతినీ, బిడ్డలనూ రప్పించి ధర్మమార్గావ సత్య పాలనం సాగించి సర్వ ప్రకారంజకుడనే పేరు సంపాదించాడు.

అని మార్కండేయుడు కథ ముగిస్తూ
ధర్మనందనా ! విన్నావుకదా!
ఆయన ఎన్ని క్లేశాలు పడినా ధర్మమార్గం విడవక సత్యం తప్పక నడిచి నందువల్ల సుఖంగా జీవించి, కీర్తి సంపాదించాడు అన్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Gomatha Mahatmyamu In Telugu – గోమాత మహాత్మ్యము

Gomatha Mahatmyamu Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గో మహాత్మ్యము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

Go Mahatmyamu In Telugu Lyrics

గో మహాత్మ్యము తెలుపు శ్లోకములు

కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థిప గవార్ధే ప్రశస్యతేవీర | సర్వపాపహరంశివమ్ || గోమూత్రంగోమయం క్షీరం దధిసర్పికుశోదకం నిర్దిష్టం పంచగవ్యం తు సర్వపాపహరంశుభం గో,భూ,తిల,హిరణ్యాజ్యవాసో ధాన్యగుడానిచ రౌప్యం లవణమిత్యాహు । దశదానాఃప్రకీర్తితాః నమోగోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవచ నమోబ్రహ్మసుతాభ్య శ్చ పవిత్రాభ్యోనమోనమః నమోబ్రహ్మణ్యదేవయ గోబ్రాహ్మణహితాయచ | జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయనమోనమః గవాం శతహస్రం చ బ్రాహ్మణేభ్యోనరాధిపః | ఏకైకశో దదౌరాజాపుత్రా నుద్దిశ్యధర్మతః | సువర్ణ శృంగ్యఃసంపన్నా, సవత్సాః కాంస్యదోహనాః గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభః॥ గవాం రుక్మవిషాణీనాం రూప్యాంఫ్రిణాంసువాససామ్ | పయశ్శీలవయోరూప వత్సోపస్కార సంపదామ్ | గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి స్సత్యవాదిభిః | ఆలుబ్జె ర్దానాశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ || సర్వోపనిషదో గావో దోగ్ధాగోపాలనందనః | పార్థోవత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం ||

ధేను మాహాత్మ్యమ్

శ్లో॥ గోమయ ప్రాశన ఫలంమయావక్తుం శక్యతే |
ధేనుమాహాత్మ్యమేతత్తేవక్ష్యామి శుణుపార్వతి ||
పాదేషుపితరశ్చైవ ఖురాగ్రేవసవస్తథా |
ఊరౌచద్వాదశాదిత్యాః పృష్ఠాదిక్పాలకాస్తధా॥
జిహ్వాయాంచ చతుశ్వేదాః దేవతా దంతపంక్తిషు |
నాసిక్యాం శీతలాదేవి ఋషయశ్చక్షుషీతధా ||
భ్రూమధ్యేచ నవబ్రహ్మ ఫాలే జీవేశ్వరస్తధా |
భుజేవాణీ ముఖేజ్యేష్ఠా అస్థి చర్మేచ శాంకరీ॥
శ్రోత్రే శంఖంచ చక్రంచ శృంగేచ తులసీవనం |
కరిణ్యాం కామధేనుశ్చ ఉదరేధరణీతధా ||
లాంగూలేచ మహానద్యస్తన మూలేచ కేశవః |
స్తనే సప్తసముద్రాశ్చ క్షీరేపంచామృతాస్తధా ||
మూత్రేభాగీరథీచైవ శ్రీలక్ష్మిర్గోమయే తథా |
సర్వరోమసు రుద్రాశ్చ ధేనాస్తిష్టంతి సర్వదా ||
ఆమల్కఫలమాత్రంచ స్మృతంగోమయభక్షణమ్ |
సప్తజన్మాఘనాశం చ ఏకవారేచ భక్షణమ్ ||
ద్వివారేభక్షణేపుత్రాన్ పౌత్రాన్ సౌభాగ్యమాప్నుయాత్ |
త్రివారభక్షణే విష్ణుసాయుజ్యంప్రాప్నుయాత్ |
మాఘేశుక్లేచ సప్తమ్యాం గోష్ఠదేవాలయేపిచ |
విష్ణుపూజాంచ గోపూజాం సదాగోమయభక్షణమ్ |
వర్షమేకంతు కర్తవ్యం తథా ఉద్యాపనం చరేత్ ||
ఉద్వాపన విధింవక్ష్యే సౌవర్ణే రాజతేనవా |
స్వగృహోక్తవిధానేన మండలం కారయేత్తతః ||
మండపం పాలవల్లీంచ రంగవల్లీం లిఖిత్తతః ||
ద్వాత్రింశత్కలశాంశ్చైవ తదభావేతదర్థకం |
కలాశాన్ స్థాపయేత్తత్రవస్త్రాలంకారసంయుతాన్ ||
సౌవర్ణే రాజతేనాపి గాంచవిష్ణుంచ స్థాపయేత్ |
రాత్రేజాగరణంకృత్వా ప్రభాతే విమలేంభసి |
స్నానంకృత్వా విధానేన పూర్వవత్పూజయేద్దరిమ్
స్వర్ణశృంగీం రౌప్యఖురాంగాందద్యాద్భాహ్మణాయవై
దంపతీపూజనం కృత్వా బ్రాహ్మణాన్ భోజయేత్తతః ||
తాంబూలం దక్షిణాందద్యా త్స్వయంభుజీతబంధుభిః |
అనసూయాదిభి స్త్రీభిః చక్రే ఏతద్ర్వతంపురా ||

మరిన్ని భక్తి యోగం:

Go Suktam In Telugu – గో సూక్తం

Go Suktam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గో సూక్తం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

Go Suktam Lyrics

గో సూక్తం

ఆ గావో అగ్మన్నుత భద్రమక్రన్త్సీదన్తు గోష్ఠే రణయన్త్వస్మే ।
ప్రజావతీః పురురుపా ఇహ స్యురిన్ద్రాయ పూర్వీరుషసో దుహానాః ॥

ఇన్ద్రో యజ్వనే పృణతే చ శిక్షత్యుపేద్దదాతి న స్వం మాషుయతి ।
భూయోభూయో రయిమిదస్య వర్ధయన్నభిన్నే ఖిల్యే ని దధాతి దేవయుమ్ ॥

న తా నశన్తి న దభాతి తస్కరో నాసామామిత్రో వ్యథిరా దధర్షతి ।
దేవాంశ్చ యాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిః సచతే గోపతిః సహ ॥

న తా అర్వా రేణుకకాటో అశ్నుతే న సంస్కృతత్రముప యన్తి తా అభి ।
ఉరుగాయమభయం తస్య తా అను గావో మర్తస్య వి చరన్తి యజ్వనః ॥

గావో భగో గావ ఇన్ద్రో మ అచ్ఛాన్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ।
ఇమా యా గావః స జనాస ఇన్ద్ర ఇచ్ఛామీద్ధృదా మనసా చిదిన్ద్రమ్ ॥

యూయం గావో మేదయథా కృశం చిదశ్రీరం చిత్కృణుథా సుప్రతీకమ్ ।
భద్రం గృహం కృణుథ భద్రవాచో బృహద్వో వయ ఉచ్యతే సభాసు ॥

ప్రజావతీః సూయవసం రిశన్తీః శుద్ధా అపః సుప్రపాణే పిబన్తీః ।
మా వః స్తేన ఈశత మాఘశంసః పరి వో హేతి రుద్రస్య వృజ్యాః ॥

ఉపేదముపపర్చనమాసు గోషూప పృచ్యతామ్ ।
ఉప ఋషభస్య రేతస్యుపేన్ద్ర తవ వీర్యే ॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

మరిన్ని భక్తి యోగం: