మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Ammavari Mangala Harathi Patalu In Telugu – మంగళ హారతులు
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అమ్మవారి పుణ్యమి అని పిలిచే అమ్మవారు మన భారతీయ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. అమ్మవారు అనగా దేవతా స్వరూపమైన తల్లి అని అర్థం. వివిధ ప్రాంతాల్లో అమ్మవారు వివిధ పేర్లతో పూజింపబడతారు. భారతీయుల విశ్వాసాలలో అమ్మవారు అన్ని శక్తులకు మూలమైన, సృష్టి, స్థితి, లయాలకు అధిపతిగా భావించబడతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు అమ్మవారి మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు స్తోత్రముల గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కులం కాదు గుణం ప్రధానం నీతికథ.
కులం కాదు గుణం ప్రధానం
(ఇది ఆరణ్యపర్వంలో మార్కండేయ మహాముని చెప్పిన కథ. దీన్నిబట్టి, కుల వర్గ విద్వేషాలు ఈవాటి నాగరిక సమాజంలో బలిసినంతగా ప్రాచీన కాలంలో ఉండేవి కావనీ, మంచి విషయం ఎవరి దగ్గర ఉన్నా గ్రహించవలసినదేనని తెలుసు కోవాలి.)
కులం కారణంగా ఉన్నత స్థానాలు, మర్యాదలు యివ్వడం ఈ వాడు పెరిగినంతగా భారతకాలం నాడు లేనేలేదు. గుణం ప్రధానంగా మనిషిని మర్యాద చేయడం అందరూ ఎఱిగిందే. అటువంటి అంశం
ఒకానొక గ్రామానికి సమీపంలో ఒక వనం. ఆ వపంలో ప్రశాంత ప్రదేశం. అక్కడొక చిన్ననది. ఆ నది ఒడ్డునే చక్కని నిడనిచ్చే పెద్ద చెట్టు. ఆ చెట్టు క్రింద కూర్చుని ఒక విపుడు తపస్సు చేసుకుంటూ, మధ్యాహ్నం కాగానే గ్రామంలోకి వెళ్ళి భిక్షాటనం చేసి జీవితం గడుపు తున్నాడు.
అలా తపస్సు చేసుకునే రోజులలో …..
ఓకనాడు
ఆయన భిక్షాటనకు లేచే సమయంలో చెట్టుమీది కొంగ రెట్ట వేసింది. అది ఆయన మీద పడింది.
అంతలో ఆయనకు చాలా కోపం వచ్చింది. అంతే: కన్నులు ఎర్రజేసి పై కి చూశాడు.
చూసిన మరుక్షణంలో ఆ కొంగ మాడి పడిపోయింది.
ఆయన యథాప్రకారం గ్రామంలో భిక్షకువెళ్ళి, ఒక యింటి గుమ్మంలో నిలబడి: ‘భవతి భిక్షాం దేహి”, అన్నాడు.
ఆ మాట చెవిని పడగానే యింట్లోని గృహలక్ష్మి ఆయనకు భిక్ష తేవడానికి వంటయింటి వయిపు నడిచింది.
అదే సమయానికి ఆమె భర్త దూర ప్రయాణం చేసి యింటికి వచ్చాడు.
భర్తన చూడగానే ఆమె చల్లని నీటితో ఆయన పాదాలు కడిగి, విసన కర్రతో కొంతసేపు విసిరి, భోజనం చేయించి, పరుండాక, భిక్ష తీసుకుని వీథిలోకి వచ్చింది.
అక్కడ నిలబడ్డ ముని కోపంగా చూశాడు. అప్పుడామె :
“స్వామీ! మీ కోపానికి మాడిపోయే కొంగను కాను. భర్తను మరెవరి విషయమయినా చూసుకుంటాను. పతి
సేవను మించిన పరమార్థం వేరే లేదు, నాకు ‘
అని నిలబడింది.
అప్పుడా ముని తెల్లబోయి :
‘అమ్మా! ఎక్కడో, అడవిలో జరిగిన నా కథ నీకు ఎలా తెలి సింది ? నాకు జ్ఞానబోధ చెయ్యి తల్లీ’, అని ప్రార్థించాడు.
గృహిణి : ‘మునీశ్వరా ! ఇక్కడకు కొద్ది దూరంలో మిథిలానగరం ఉంది. అక్కడ ఒక బోయవాడు మాంస విక్రయం చేసి జీవితం గడుపు తున్నాడు. వానిపేరు ధర్మవ్యాధుడు. ఆయన మీకు సర్వవిషయాలూ బోధిస్తాడు, వెళ్ళండి’, అంది. ఆయన బయలుదేరి నడిచి నడిచి మిథిలా నగరం చేరాడు.
నగరంలో అడుగు పెడుతూనే ధర్మవ్యాధుని నివాసం గురించి అడిగి, తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరాడు.
బడ్డాడు.
అక్కడ రకరకాల జంతువుల మాంసాలు చూసి దూరంగా నిం
వచ్చిన మునిని అంత దూరంలో చూసి ధర్మవ్యాధుడు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి:
‘ ఆర్యా ! ‘ ప్రణామాలు. మిమ్ము నా దగ్గరకు పంపిన పతివ్రతా శిరోమణి క్షేమంగా ఉన్నదా ? అని అడిగాడు.
వచ్చిన మునికి మతిపోతోంది.
‘అక్కడ ఆ యిల్లాలు కొంగ విషయం చెప్పింది. ఈ ధర్మ వ్యాధుడు ఆ ప్రతివ్రత క్షేమం అడిగాడు. ఇంతకాలంగా తపస్సు చేసినా ఏ శక్తి సాధించ లేకపోయాము,
ఆవిడ పతివ్రత కనుక ఆ వ్రత దీక్షతో దూరదృష్టి వచ్చి ఉండవచ్చు.
జంతువుల మాంసం అమ్ముకునే ఈ కసాయి వానికి ఇంత శక్తి ఎలా వచ్చింది’ అని ఆలోచనలో పడ్డాడు.
అది గ్రహించి ధర్మవ్యాధుడు :
‘స్వామీ! ఈ మాంసపు వాసన మీరు భరించలేరు. రండి మా యింటికి వెడదాం. నాకు యింతటి శక్తి ఎలా వచ్చిందని ఆలోచిస్తు న్నారు కదూ ! ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను ”
అని వినయంగా యింటికి తీసుబవెళ్ళాడు. వెడుతూనే వాకిట్లో మంచంమీద పడుకున్న, ముసలి తండ్రి పాదాలకు నమస్కరించి, ఆయన యోగ క్షేమాలు విచారించి, లోపల గడపలో ఉన్న తల్లికి నమ స్కరించి, ఆవిడకు సేవచేసి :
‘స్వామీ! ఇదే నేను చేసేవి. మనం ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు జరిపినా, తల్లి దండ్రులను సేవించుకోకపోతే ప్రయోజనం లేదు.
తొమ్మిది మాసాలు గర్భంలో మనలను భరించి, ప్రసవవేదనపడి, మనకు జన్మనిచ్చి, నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చే వరకూ మన ఆరోగ్యం కోపం ఆ తల్లి ఎన్నో అవస్థలు పడుతుంది.
అటువంటి తల్లి ఋణం ఎన్ని సేవలు చేసినా తీరుతుందా?
అలానే మన భవిష్యత్తుకు పునాదులు వేసి, మనకోసం ఎన్నో బాధలు పడే తండ్రి ఋణం కూడా తీరదు.
అయినా వారిని సేవించుకోవడం వల్ల కొంత ఋణ భారం తగ్గుతుంది.
వీరిని సేవించు కోవడం కంటె నేను చేసే సాధన ఏమీలేదు. దాని వల్లనే నేను సుఖంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. తల్లి దండ్రులను సేవించుకుంటూ ఆలుబిడ్డలను రక్షించుకుంటూ జీవితం నడుపుతున్నాను. అంతే! మరేంలేదు. మీకు మరో సందేహం కలిగి ఉంటుంది. మాంసం అమ్ముకుని బ్రతుకుతున్నాను కదా! అది జీవహింస కాదా, దానిపిల్ల పాపం కదా అని. ఇక్కడ తమ కొక పరమ రహస్యం చెప్పాలి.
అదీ ధర్మ సూక్ష్మం అంటే –
ఈ భూగోళంలో ప్రాణికోటి అంతా ఒక దానిమీద ఆధారపడి మరొకటి జీవిస్తున్నది. రెక్కలు విప్పుకు ఎగిరే పక్షులూ, నాలుగు కాళ్ళ జంతువులూ యివే ప్రాణులని మీరు అనుకుంటున్నారు. మీరు తినే ధాన్యం, కాయగూరలు, పళ్ళు అన్నింటిలోనూ జీశం ఉన్నది. అయితే అవి పక్షులవలె ఎగరడం లేదు కనక జీవం లేదనుకోవడం న్యాయమా।
జీవి బ్రతికి, పెరగడానికి మరోజీవం బలికాక తప్పదు.
అలాకాదు, యిదే జీవహింస అంటారా!
నేను మానినింతలో నా దుకాణానికి వచ్చేవారందరూ మాంసా హారం వదులుతారా ! అందుచేత మీరు ఈ అనుమానం వదిలేయండి. ప్రాణాలు నిలిపు కోవడానికి ఆవశ్యకమయిన ఆహారంకోసం జరిపేది హింసకాదు.
మరొశ్రమాలు ఈ జంతువులను ఎవరో సంహరించి తెస్తారు. నా వృత్తి ధర్మానుసారం దీనిని విక్రయం చేసి బ్రతుకుతాను.
వ్యాపారంలో దొంగ తూకాలూ, అధిక లాభాలూ నేనెరుగను.
నా ధర్మాన్ని నేను విడిచి పర ధర్మాన్ని స్వీకరించము. ఆకలి గొన్న వారికి పిడికెడు అన్నం పెడతాను. నా మీద ఆధారపడి జీవించే వారందరి యోగ క్షేమాలు తెలుసుకుంటాను. ఇరుగు, పొరుగులవారి కష్ట సుఖాలలో భాగం పంచు కుంటాను.
అన్నిటినీ మించిన విషయం –
ఈ మనస్సు ఉన్నదే యిది స్థిరంగా నిలబడదు. ముందు దీన్ని లొంగదియ్యాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. నిర్మల బుద్ధితో నిరంతరం పరమేశ్వరారాధనం చెయ్యాలి.
నేను చేసేది యింతే! ఈ మాత్రం చెయ్యగలిగితే మనకు ఏ బాధలూ ఉండవు, ఈ జీవితం ఎంతవరకూ పరోపకారానికి ఉపయోగపడితే అంత ధన్యం’ అని బోధించాడు.
గొడ్డు మాంసం అమ్ముకుని జీవించే బోయవాడు చేసిన ప్రబోధంతో మనస్సు నిర్మలమై ప్రశాంతంగా వాని వద్ద సెలవు తీసుకుని తపస్సు కేసుకునేందుకు వెళ్ళాడాయన.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గురుసేవ సత్ఫలితం ఇస్తుందినీతికథ.
గురుసేవ సత్ఫలితం ఇస్తుంది
(ఇది ఆదిపర్వంలో కథ. గురు సేవ ఎంత అవసరమో, దాని ఫలితం ఎంతటిదో గ్రహించాలి.)
ఆ రోజులలో ఒకానొక గురుకులంలో పైలుడు అనే పేరుగల ఉపా ధ్యాయు డుండేవాడు. ఆయన దగ్గర ఎందరో విద్యాభ్యానంచేసేవారు.
ఆ రోజులలో గురుకులాలంటే చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆ ఆశ్రమంలోనే ఉండాలి. వారికి అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పించే భారం రాజు మీద ఉండేది. నిరంతరం గురు సన్నిధానంలో ఆయన సేవచేస్తూ వినయ విధేయతలతో విద్యనేర్చుకునేవారు. గురువుగారు కూడా వారిని తన బిడ్డలుగా చూసుకుని ఎవరికి ఏ విద్యయందు అభిరుచి ఉన్నదో గ్రహించి ఆ విద్యనే నేర్పేవాడు. తనకు కావలసిన విద్యనేర్ప గల గురువును అన్వేషిస్తూ విద్యార్థి తిరిగేవాడు. అవీ అనాటి గురుకులాలు.
అటువంటి గురుతులంలో పైలునివద్ద ఉదంకుడని శిష్యుడుండే వాడు. ఈ ఉదంకుడు విద్యపూర్తి చేసుకుని సంప్రదాయం ప్రకారం గురువుగారి దగ్గర సెలవుతీసుకునే ముందు, చేతులు కట్టుకు నిలబడి, తలవంచి.
‘ఆచార్యా! గురునక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించండి’, అన్నాడు
అప్పుడు పైలుడు చిరునవ్వు నవ్వి, ఆశీర్వదించి :
“నాయనా నీ వంటి శిష్యుడు దొరకడం మా అదృష్టం. గురు దక్షిణ ఏమీ అవసరం లేదు,’ అన్నాడు.
ఉదంకుడు అలాగే నిలబడి:
‘ఆచార్యా! గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళడం న్యాయంకాదు. కమఠ మీరు ఆజ్ఞాపించండి’, అన్నాడు.
వాని పట్టుదల, ధర్మవిరతిచూపి సంతోషంతో:
నాయనా! ఇంతకాలంగా నువ్వు చేసిన సేవను మించిన గురు దక్షిణ లేదు. అయినా నువ్వు తప్పదంటున్నావు కనుక ఆశ్రమంలోకి వెళ్ళి అమ్మగారు ఏం కోరుకుంటారో అడుగు’, అన్నాడు పై లుడు.
ఉదంకుడు లోపలకు వెళ్ళి గురువుగారి భార్యకు నమస్కరించి విష యం చెప్పాడు.
అప్పుడావిడ :
‘నాయనా మీ గురువుగారి దగ్గర పౌష్యుడనే రాజు విద్యనేర్పు కున్నాడు. ఆ రాజుభార్య ధరించే కుండలాలు నాకు తెచ్చిపెట్టు, అంది.
ఉదంకుడు పరమానందంతో బయలుదేర పండగా ఆవిడ పిలిచి ” నాయనా ! ఇంక నాలుగు రోజులలో నేను ఒక వ్రతం చెయ్య బోతున్నాను. అప్పటికి అవి తీసుకురావాలి’ అంది.
‘చిత్తం, తల్లీ’ అని ఉదంకుడు బయలుదేరాడు.
కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక మహావృషభంమీద ఒకా నౌక పురుషుడు అడ్డుగా వచ్చి:
‘ఈ గోమయం భక్షించివెళ్ళు. అనుమానించకు. దీన్ని మీ గురువుగారు కూడా భక్షించారు’, అనగానే ఉదంకుడు మాట్లాడకుండా అది తిని, త్వరగా రాజు గారింటికి వెళ్ళాడు.
మహారాజు చిరునవ్వుతో ఆహ్వానించి, అతని సమాచారం అడిగి: ‘మీ రాకవల్ల మా జన్మ ధన్యమయింది. ఊరకరారు మహాత్ములు! ఏ పనిమీద వచ్చారో చెప్పండి’, అనగా గురుపత్ని కోరిక వివరించాడు.
మహారాజు వినయంగా
‘ ఓ విద్వాంసుడా ? మీరు ఏదికోరినా ఇవ్వవలసిందే. ఇప్పుడు మీరు స్వయంగా అంతఃపురానికి వెళ్ళి మహారాణిని అడగండి. ఆవిడ సంతోషంగా ఇస్తుంది’, అన్నాడు.
ఉదంకుడు క్షణాలలో అంతిపురికిపోయి తిరిగివచ్చి :
‘రాజా! మీరు విద్వాంసులతో పరిహాసాలాడుతా రమకో లేదు. మహారాణి అంతఃపురంలో లేదు’, అన్నాడు.
రాజు: ఓ మహాత్మా! క్షమించాలి. అపవిత్రులకు నా భార్య కనబడదు. మీ వంటివారు అుచిగా ఉన్నారనీ అనలేను.
ఉదంకుడు: గుర్తుకు వచ్చింది మహారాజా! నేను వచ్చేదారిలో ఆ పొరపాటు జరిగింది. ప్రయాణపు తొందరలో నేను కాళ్ళూ, చేతులూ, ముఖం కడగకుండా ఆచమించాను. ఇలాచెప్పి అప్పటి కప్పుడు అన్నీ ముగించి అంతఃపురానికి వెళ్ళి ఎదురుగా వినయంతో నిలిచిన రాణికి తన రాశకు కారణం చెప్పాడు.
రాణి! విద్వాంసుల కోరిక తీర్చడం మా విధి. ఇవిగో రత్న కుండలాలు తీసుకోండి. ఒకమాట. ఈ కుండలాలు దొంగిలించాలని చిర కాలంగా తక్షకుడు వేచి ఉన్నాడు. అది కనిపెట్టుకుంటూ వెళ్ళండి.
ఉదంకుడు అవి తీసుకుని చక చక వస్తున్నాడు. కొంక దూరం వచ్చేసరికి దారి వెంట ముసలి బిచ్చగాడు వానిని వెన్నంటి వస్తున్నాడు.
ఉదంకుడు సాయంకాలానికి ఒక చెరువు దగ్గరటచేరి, కుండలాలు ఒడ్డున పెట్టి సంధ్యావందనం ఆరంభించగా ఆ దొంగ వాటిని ఆవహరించి పారిపోయాడు.
ఉడంకుడు తిరిగి చూసేసరికి ఆ దొంగవాడు పాములామారి ఒక బిలంలో దూరాడు. దాన్ని తవ్వడానికి ఉదంకుడు శ్రమపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆ బిలాన్ని విశాలం చేశాడు.
దానిగుండా పోయి పోయి ఉదంకుడు నాగలోకానికిపోయి అనేక విధాల ప్రార్థనలు చేసినా తక్షకుడు కనిపించలేదు.
కనిపించకపోగా ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చుని తెలుపు నలుపు దారాలతో వస్త్రం నేస్తున్నారు.
నేత చక్రాన్ని ఆరుగురు తిప్పుతున్నారు. దానికి వన్నెండు ఆకులు ఉన్నాయి. ఎదురుగా అశ్వంమీద ఒక పురుషుడు కనిపించాడు. అందరినీ స్తుతించగా ఆ పురుషుడు ప్రసన్న వదనంతో ‘ వరం కోరుకో’ అన్నాడు.
ఉదంకుడు: నాగలోకమంతా నా వశంలో ఉండాలి.
“అయితే ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు’ అన్నాడా పురుషుడు.
అప్పటికే కాలాతీతం కావస్తున్నది. ‘గురుపత్నీ వ్రత సమయానికి ఎలాచేరడం’ అని విచారిస్తుండగా ఆ పురుషుడు తన గుర్రంయిచ్చి అదృశ్యం అయ్యాడు.
మరుక్షణంలో ఉదంకుడు గురువుగారి ఆశ్రమం దగ్గర దిగాడు. గుర్రం మాయమయ్యింది.
అప్పటికి గురువుగారి భార్య అభ్యంగస్నానంచేసి వ్రతానికి సన్నద్ధు రాలవు తున్నది.
ఉదంకుడు ఆవిడ పాదాలకు నమస్కరించి, కుండలాలు అర్పించి, ఆశీర్వాదం పొంది, గురువుగారి దగ్గరకు వచ్చాడు.
ఇంత ఆలస్యం ఎందుకయింది అని గురువుగారు అడుగగా జరిగిన విషయాలన్నీ వివరించి వాటి అంతరార్థం బోధించమని కోరాడు. ‘నాయనా! నీకు ఎదురుపడిన పురుషుడు దేవేంద్రుడు. ఆ వృషభం ఆయన ఐరావతం. ఆ గోమయం అమృతం. అది భక్షించక పోతే నువ్వు నాగలోకంలో జీవించవు.
నాగలోకంలో స్త్రీలను చూశావే, వారు ధాత- విధాతలు.
నలుపు తెలుపు దారాలు రాత్రింబవళ్ళు. చక్రాన్ని తిప్పే ఆరుగురూ ఋతువులు, పన్నెండాకులూ మాసాలు. ఆ చక్రం సంవత్సర రూప మయిన కాలచక్రం.
అక్కడ కనిపించిన పురుషుడు దేవేంద్రుడు. ఆ గుర్రం అగ్ని హోత్రుడు.
ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇంద్రుడు నాకు ప్రాణమిత్రుడు. నువ్వు నా శిష్యుడవు కనక నీకు అపాయం జరగకుండా కాపాడాడు. నీ వలె వినయ విధేయతలతో, గురుశుశ్రూష చేసి విద్యనేర్చుకునే వారిని ఎప్పుడూ దేవతలు కాపాడుతారు. ఇకనువ్వు మీ ఇంటికి వెళ్ళు. నీకు” సర్వశుభాలూ కలుగుగాక’, అని గురువుగారు ఆశీర్వదించాడు.
Lord Rama Mangala Harathi With Lyrics In Telugu – మంగళ హారతులు
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీరాముడు (లేదా శ్రీరామచంద్రుడు) హిందూ మతంలో ప్రముఖమైన దేవుడు. ఆయనను విష్ణువు యొక్క ఏడవ అవతారంగా పూజిస్తారు. రాముడు ఐక్య వేదాన్తం, ధర్మ పరిపాలకుడు, సత్యవ్రతుడు, క్షమాశీలతగల వ్యక్తి, గొప్ప భర్త, ప్రేమపూర్వక భక్తుడు మరియు క్షమాశీలతగల రాజు అని పిలుస్తారు. శ్రీరాముడు దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి కుమారుడిగా అయోధ్యలో జన్మించాడు. రాముడి కథ ప్రధానంగా రామాయణం అనే మహాకావ్యంలో వర్ణించబడింది. వాల్మీకి మహర్షి రాసిన ఈ రామాయణం, 24,000 శ్లోకాలతో, రాముడి జీవితాన్ని మరియు ఆయన యాత్రలను వివరిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీరాముడు మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…
పల్లవి: నిరాకార నిరంజనా నీకు హారతీ
మా రామచంద్రునకు మనసు హారతీ నా మనసు హారతీ
॥ నిరాకార
చ 1) పంచభూతములను ఐదు
ప్రమిదల గాను చేసినాను
మించిపోయే గుణము తీసి
మంచి వత్తి వేసినాను
అహంకారమనే గుణము తీసి
అక్షతలు చేసినాను
కామమనే గుణము తీసి
తరచి చమురు పోసినాను
చ 2) మాయ అనే తెరను తీసి దక్షిణగా ఉంచినాను
దూషణమనే గుణము తీసి ధూపముగ వేసినాను
కామ క్రోధములను తీసి కైవత్తిగ వెలిగించినాను
ప్రేమయనే గుణముతీసి నైవేద్యము చేసినాను
||నిరాకార||
బాలుడా నీకిదే హారతీ
శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామచంద్రా నీకు కర్పూర హారతి – వలె (శంకరాభరణ రాగం – మిశ్రచాపు తాళం)
చ 1) బాలుడా నీ కిదే హారతి
సుగుణ బాలుడవై వర్థిల్లుమా
చాలగ దేవదేవులు కొలచుచు
శాశ్వత సుఖముల నొందుమా
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలుగురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… జూదం తగదు నీతికథ.
జూదం తగదు
(ఈ కథ ఆదిపర్వంలో ఉంది.)
తన వలె కష్టాలపాలయిన మహామహులు చరిత్రలో ఎవరయినా ఉన్నారా అని ధర్మరాజు అడుగగా బృహదశ్వమహర్షి చెపుతున్నాడు.
“ధర్మనందనా ! నిజానికి నువ్వు పడే కష్టం ఎంతటిదయ్యా ! తమ్ములు నలుగురూ, నీ భార్యా నీ దగ్గర ఉన్నారు. ఈ వనాలలోని మునులూ, ఋషులూ నీకు ధర్మబోధ చేస్తూ, ఓదారుస్తూన్నారు.
ఈ మాత్రం కూడా లేకుండా భార్యకు దూరమై ఎన్నో బాధలు పడిన నలమహారాజున్నాడు. ఆయన కూడా జూదంలోనే రాజ్యం, పంప దమా కోలుపోయి నావా యాతనలూ పడ్డాడు. ఆ కథ విను.
భారతదేశంలో ఉండే అనేక రాజ్యాలలో నిషేధదేశం ఒకటి. ఆ రాజ్యాన్ని వీరసేనుడనే రాజుకొడుకు నలుడు పాలిస్తున్నాడు. ఈ సల మహారాజు సర్వసద్గుణ సంపన్నుడు, విద్యావంతుడు, రూపంలో మన్మ థుడు. సత్యవ్రతంతో విద్వాంసులను పూజించే వాడు.
అయితే పాండురాజనందనా! ఆయనకు కూడా నీలానే జూదం అంటే మహా ప్రీతి. ఆ విద్యలో మంచి నేర్పు కూడా ఉంది. సరే ఆ విషయం అలా ఉంచు.
ఆ రోజులలో విదర్భ రాజ్యాన్ని పాలించే భీముడనే రాజుకి దమ యంతి అనే పేరు గల కుమార్తె ఉండేది. ఆమెకు పదహారేళ్ళు నిండే నాటికి ఆమె గుణ, శీల, మందర రూపాలను గురించి దేశదేశాలలో చెప్పుకునే వారు.
సాధారణంగా అందం కల ఆడవారికి వినయం ఉండదు. కొంద రికి శీలం ఉండదు. వినయము, శీలమూ లేని అందగత్తెమ గురించి అందరూ ఆడిపోసుకుంటారే తప్ప మంచి మాట అనరు.
అలా కాకుండా ఈ దమయంతి తవ అందం కంటె వినయ, గుణ, శీలాలతో అందరి మెప్పునూ పొందింది.
అలానే పదాచార, పద్గుణ రూపాలకు, సాహస పరాక్రమాలు తోడుగా ఉన్న నలమహారాజుకి దమయంతి తగిన ఇల్లాలు కాగలదని దేశ దేశాలు తిరిగే విద్వాంసులు అంటుండే వారు. ఈ వార్త నల దమయంతు లిద్దరి చెవిని పడింది. ఒకరినొకరు చూచుకోకుండానే వారి మధ్య అమ రాగం అంకురించింది.
అలా ఉండగా, ఒకనాడు నలుడు తన ఉద్యానవనంలో విహారం సాగించే సమయంలో అక్కడ తిరిగే హంసలలో ఒక రాయంచ నలుని చేతికి చిక్కింది.
దాని అందాన్ని చూసి ఆనందించే నలునితో ఆ హంసః
‘మహారాజా! నువ్వు నన్ను విడిచిపెడితే నేను విదర్భదేశం వెళ్ళి అక్కడ నీ గుణ, రూప, సాహసాలు వివరించి ఆమెకు నీ యందు అనురాగం కలిగేలా చేస్తాను’ అంది.
నలుడు విడిచిపెట్టాడు.
హంస బయలు దేరి వెళ్ళి విదర్భ రాజు ఉద్యానవనంలో విహ రించే దమయంతిని సమీపించి నలుని గుణ గణాలు కీర్తించింది.
ఆ మాటలు విని దమయంతి హంసను లాలించి ఇదే విధంగా నా గురించి ఆ మహారాజుకి చెప్పవలసిందిగా ప్రార్థించింది.
హంస అలాగే అని వెళ్ళి విషయమంతా నలునికి విశదం చేసింది.
తన కుమార్తె వయసు గమనించి విదర్భరాజు స్వయంవరం ప్రక ఉంచాడు.
ఆ స్వయంవరానికి దేశదేశాల రాజులతో పాటు దేవతలు కూడా వచ్చారు. వారు వచ్చే దారిలో నలుని చూసి, తమ పక్షాన దమయంతి దగ్గరకు రాయబారిగా పంపారు.
దేవతల అనుగ్రహం వల్ల నలుడు ఎవరికంటా పడకుండా పరావరి దమయంతి అంతఃపురంలో ఆమె ఎదుట నిలిచాడు.
ఆ సుందరాకారుని చూసి దమయంతి ఆశ్చర్యంతో
‘ఆర్యా! దివ్యసుందరాకారంతో ఉన్న మీరెవరు? ఈ అంతః పురంలోకి పోతుటీగ రావడానికి వీలులేదే మీరెలా వచ్చారు?’ అంది.
నలుడు: కల్యాణీ! నేను ఇంద్ర, వరుణ, యమ, అగ్నిహోత్రులు పంపగా వారి అమ గ్రహం వల్ల ఎవరి కంటబడక ఇక్కడకు దూతగా వచ్చాను. రేపు స్వయంవరంలో నువ్వు ఈ నలుగురిలో ఒకరిని వరించాలి.
‘మహారాజా ! నా మనసెప్పుడు మిమ్మే ప్రాణనాథునిగా వరం చింది. అలనాడు హంస చెప్పిన నాటి మంచి మిమ్మే ఆరాధిస్తున్నాను. ఈ స్వయంవరం మీ కోసమే ప్రకటించారు. మీరు నా భర్త, అలా జర గని నాడు మరణమె శరణ్యం’ అంది.
పరిపరివిధాల దేవతల ఘనతను గురించి చెప్పి, వారిలో ఎవరినో ఒకరిని వరించడం ఉచితం అని పలుడు ఎంత బోధించినా అంగీకరించ లేదు దమయంతి. ‘దేవతా సమక్షంలోనే మిమ్ము వరిస్తాను’ అంది.
నలుడు తిరిగి వచ్చి అంతా వివరించాడు.
దేవతలు ఆశవీడక మరునాడు స్వయంవర మండపానికి నలుని వేషంలో వచ్చి వాని పక్కనే కూర్చున్నారు.
గమయంతి స్వయంవర సభలో అడుగు పెట్టి ఒక్కొక్కరినే చూస్తూ నలుని సమీపించింది. అక్కడ అయిదుగురు నలమహారాజులు కనిపించగా ‘ ఓ దివ్యపురుషులారా! నేను ప్రేమించే వలనుహారాజు మీలో ఎవరు?ి అందిం
వారు నలుగురూ లేచి నిలబడ్డారు. వలుడు కదలలేదు. అప్పుడు దమయంతి ఆ ఎలుగురికీ నమస్కరించి వలుని మెడలో పూలమాల వేసింది.
దేవతలు వారిని దీవించి వెళ్ళారు.
నలుడు భార్యాసహితుడై తన రాజ్యానికి వచ్చాడు.
పన్నెండు సంవత్సరాలు సుఖ సంతోషాలతో నలదమయంతులు జీవితం సాగించారు. వారికి ఇంద్రసేనుడనే కుమారుడు, ఇంద్రసేన అనే కుమార్తె కలిగారు. వారు చక్కని శిక్షణలో పెరుగుతున్నారు.
ఆ రోజులలో పొరుగు రాజయిన పుష్కరుడు నలుని దగ్గరకు వచ్చి తనతో జూదం ఆడమన్నాడు.
జూదానికి, యుద్ధానికి ఆహ్వానం వస్తే తిరస్కరించరాదు అనే నియమం అంగీకరించాడు.
జూదం ఆరంభమయింది. పుష్కరుని మాయజూడంలో నలుడు ఒక్కొక్క పందెం ఓడిపోతున్నాడు.
ఓడిన కొద్దీ ఆవేశంతో పందెం పెంచుతున్నాడు. గెలిచిన ఆనం దంతో పందెం కాస్తున్నాడు పుష్కరుడు. రోజులు గడుస్తున్నాయి. భర్త జూదంలో సర్వం ఓడిపోతున్నట్టు తెలిసి దమయంతి తన బిడ్డ లిద్దర్నీ ఒక రథం మీద పుట్టింటికి పంపింది.
అన్ని సంపదలూ ఓడిపోయిన నలునితో పుష్కరుడు
‘ ఇంక నీ దగ్గర పైసా కాసులేదు. నీ భార్య ఉంది. ఆమెను కూడా పందెం కాస్తావా?’ అన్నాడు.
నలుడు దీనవదనంతో కోట దాటి వచ్చాడు. దమయంతి కూడా అనుసరించింది.
శత్రు నగరంలో ఉండరాదని రాజ్యం విడిచి వారు వెడుతున్నారు.
(వజలందరూ)
‘జూదం ఎంత పని చేసింది : ధర్మప్రభువయిన నలమహారాజుకి ‘కూడా కష్టాలు తెచ్చిపెట్టింది’, అని కంటనీరు పెట్టారు.
నల దమయంతు లిద్దరూ తిరిగి తిరిగి ఆహారం కూడా దొరకనిచోట మంచి నీరు తాగి కాలం గడుపుతున్నారు.
అలా ఉండగా ఒకనాడు వారి సమీపంలో కొన్ని పక్షులు కని పించగా నలుడు వాటిని పట్టుకోవాలని ఉత్తరీయం వాటిమీద విసిరాడు. అవి ఆ బట్టతో సహా ఎగిరిపోయాయి. అప్పుడు భార్య పైట చెరగు పగం చింపి తన ఉత్తరీయం చేసుకున్నాడు.
కొంతదూరం నడిచి నాలుగు దారులు కలిసి ఒక కూడలిలో నిం బడి:
‘దమయంతీ! ఇంతవరకూ నాతో ఎన్నో కష్టాలు అనుభవించావు.” ఇప్పుడు నీకు శ్రేయోమార్గం బోధించాలని ఉంది. ‘
ఇదిగో ఇటు దక్షిణంగా వెడితే అవంతీ దేశం చేరుతావు. అటు నుంచి కొంచెం ముందుకు వెడితే విదర్భదేశం వస్తుంది’, అన్నాడు.
దమయంతి ఆ మాటలు విని కన్నీరు విడిచి ‘నాథా! ఎందుకు చెపుతున్నారు నాకు ఈ దారి? రాజ్యం పోయినా, సంపదలు పోయినా కట్టుబట్ట పోయినా మిమ్మల్ని నేను విడవలేదు. మీతోనే కష్టమయినా, సుఖమయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా అయినా మీ దుఃఖాన్ని తగ్గించడానికే నేను మీతో ఉన్నాను. నన్ను వదలకండి’- అంది.
అప్పుడు నలుడు :
‘ దమయంతీ । భార్యకంటె ఈ ప్రపంచంలో స్నేహితుడూ, ఆప్త బంధువు ఎవరూ లేరు. ఈ విషయం నే నెరుగుదును. ఎరిగి నిన్ను విడిచిపెడతానని ఎందుకనుకున్నావు? ఒక వేళ నీకు నేను దూరమయినా నా మనస్సు ఎప్పుడూ నీ మీదనే ఉంటుంది. మన ప్రేమకు అంతరాయం ఉండదు * ‘ అన్నాడు.
అలా మాట్లాడుకుంటూ వారు ఒక పత్రం చేరారు. ఆ రాత్రి నిద్రి స్తున్న వేళ దమయంతిని విడవలేక విడవలేక విడిచి వెళ్ళిపోయాడు. నలుడు.
తెలతెలవారు తూండగా నిద్రలేచిన దమయంతి భర్తకోసం గోలు గోలున విలపిస్తూ పత్రం విడిచి ఊరు దాటి అడవిదారి పట్టి వెదకడం ఆరంభించింది.
తిరుగుతూండగా ఓ కిరాతుడు ఆమెను చూసి మోహించి బలాత్కారం చెయ్యబోయి, ఆ పతివ్రత వేడిచూపులకు తట్టుకోలేక నేలకూలాడు.
దొరికిన పండుతిని, నీరుతాగి భర్తకోసం పిచ్చిదానిలా తిరుగుతూ చేదిదేశం చేరింది. అక్కడి జనులందరూ ఆమెను పిచ్చిదానిగా, భావించి
వెంటాడుతూంటే, రాజభవనం నుంచి చూసిన రాజమాత తన దాసిని పంపి దమయంతిని రాజభవనంలోకి రప్పించింది”.
దమయంతి రాజభవనంలోని అంతః పురంలో మహారాణి నందాదేవి దగ్గరకు రాగానే ఆవిడ ఆదరంతో కూర్చుండ బెట్టింది. పరిచారిక అందరినీ దూరంగా వెళ్ళమని
‘అమ్మాయీ ఎవరింటి బిడ్డవమ్మా! నీ భర్త ఎవరు? ఈ దశలో ఎందుకున్నావు? అలంకారాలు లేకపోయినా, జుట్టు చిందర వందరగా ఉన్నా, మాసిన బట్టలతో ఉన్నా నీలో దివ్యశోభ కనిపిస్తున్నది. సత్యం చెప్పు తల్లీ ‘ ! అని బుజ్జగింపుగా అడిగింది.
దమయంతి విచారంతో
‘ మహారాణి । నేను ఎవరి బిడ్డనని చెప్పను? ఆ కథ మరచి పోయాను. ప్రస్తుతం ఏకాకిని, సైరంధ్రి వృత్తిలో నాకు ప్రవేశంఉంది, రాజాంతః పురాలలో, నా నియమాలకు భంగం కలగనిచోట ఆ వృత్తిలో ఉంటాను.
నా భర్త గుణ, శీల రూపవంతుడు. కానీ, అన్యాయంగా జరిగిన జూదంలో అన్నీ కోలుపోయి అడవులపాలయాము. ఆయన నన్ను ఒక సత్రంలో ఒంటరిగా విడిచివెళ్ళాడు. ఆయనకోసం తిరుగుతూ తిరుగుతూ యిలా వచ్చాను. మీరు నా నియమాలకు అంగీకరిస్తే యిక్కడే ఉంటాను’ అంది.
అంగీకరించింది మహారాణి.
తన కొమార్తెను పిలిచి మహారాణి అన్ని విషయాలూ చెప్పి, * ఈమెను కంటికి రెప్పవలె చూసుకోవాలి’ అంది. ఆ విధంగా దమ యంతి వారి అంతఃపురంలో కాలం గడుపుతున్నది.
ఆ రాత్రి సత్రంలో బయలుదేరిన వలుడు ఒక మహారణ్యంలో సాగుతూండగా అక్కడ దావానలం వ్యాపించి మంటలు లేచాయి.
మంటలలో నుండి ఆర్తనాదం వినిపించింది. దీని జన రక్షణ దీక్షకల నలుడు అటునడువగా –
‘ఓ పుణ్యాత్ముడా! ఇటురా నేను నాగజాతి కర్కోటకుడను. నారదులవారి శాపంవల్ల యిక్కడ కర్రలా పడి ఉన్నాము. నీ దర్శనంతో నాకు శాపం పోతుందని ఆయనే అన్నారు. నన్ను ఈ మంటల నుండి కాపాడితే నీకు మేలు చేస్తాను’ అని కర్కోటకుడు పణకగా నలుడు వానిని యీవలకు తెచ్చి వదిలాడు.
అపుడు శర్కోటకుడు :
‘ఆర్యా! మీరు పది అడుగులు వేయండి. మీకు శుభం కలుగు తుంది’, అన్నాడు.
నలుడు పదో అడుగు వెయ్యగానే కర్కోటకుడు నలుని కాటు వేశాడు. ఆ పర్పవిషం ఎక్కగానే నలుడు నల్లని మరుగుజ్జు వాడయాడు.
నలుడు తెల్ల బోయిచూడగా, కర్కోటకుడు:
మహారాజా ! బాధపడకు. ప్రస్తుతం నన్ను కలిపురుషుడు బాధిస్తు న్నాడు. నా విషంతో వాడు పడుతూంటాడు. అంతవరకూ నీ రూపం ఎవరికీ తెలియకుండా రహస్యంగా గడపడానికే నేను కాటు వేశాను. ఇది మొదలు నీ పేరు బాహుకుడు.
ఇప్పుడు నువ్వు అయోధ్యకు వెళ్ళి ఆ రాజు ఋతువర్ణుని కొలువులో చేరు. ఆయనకు జూదం అంటే పిచ్చి. ఆయన దగ్గర ఆ విద్య గ్రహించా అంటే నీకు తెలిసిన అశ్వహృదయం ఆయనకు నేర్పాలి. దానితో మిగిలిన కార్యాలు చక్కబడతాయి.
నీకు నీ రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను స్మరించు’, అని చెప్పి మాయమయ్యాడు.
బాహుక రూపంతో నలుడు అయోధ్య చేరి, రాజును దర్శించి, తనకు అశ్వశాస్త్రం తెలుసుననీ, ద్యూతం కూడా వచ్చుననీ, పంట చెయ్యటంలో మంచి అనుభవం ఉన్నదని చెప్పగా, ఆ మహారాజు వానిని తన అశ్వపాలకుడుగా నియమించాడు.
అలా కాలం గడుపుతున్నాడు నలుడు, నిత్యం రాత్రి వేళల దమ యంతినే స్మరించు కుంటూ.
తన కుమార్తె దమయంతి, అల్లుడు నలమహారాజు అరణ్యాల పాలయారని విన్న విదర్భరాజు విచారంలో తన నగరంలోని విప్రవరు లను రావించి :
‘ వేదవిదులారా మీరు దేశ దేశాలు తిరుగుతూ అనేక నగరాలు చూస్తుంటారు. ఎక్కడయినా నా కుమార్తె, ఆమె భర్త కనిపిస్తే వార్త నాకు అందించండి. అందుకు ప్రత్యుపకారంగా మీకు అగ్రహారం యిచ్చి వందల గోవులు సమర్పిస్తాను’ అన్నాడు.
వారందరూ తమ పర్యటనలో నందమయంతుల జాడ తెలుసు కోవడానికి ప్రయత్నాలు ఆరంభించారు.
వారిలో సుదేవుడనే విద్వాంసుడు చేది రాజ్యంచేరి, రాజు యింట శుభకార్యం జరిగే వేళ అక్కడ ఉన్న నారీమణులమధ్య దమయంతిని గుర్తుపట్టాడు.
నెమ్మదిగా వీలు చూసి ఆమెను ఏకాంతములో కలిసి, తన కథ చెప్పాడు సుదేవుడు.
దమయంతి మాట్లాడకుండా బొట బొట కన్నీరు విడిచింది. అది. చూసి రాజకుమారి సునంద ఆ విషయం తన తల్లితో చెప్పింది.
రాజమాత ఆ విప్రునిచేరి వివరా అడిగింది.
ఆయన సంగతులన్నీ చెప్పి:
‘మహారాణి చూశారా! ఈ అమ్మాయి కనుబొమలమధ్య తిలకం వలె ఒక పుట్టుమచ్చ ఉంది. అదిచూసి నేను గుర్తుపట్టాను’ అనగా రాజు మాత దమయంతిని దగ్గరగా తీసుకునిః
బిడ్డా! మీ అమ్మా నేను అక్క-చెల్లెళ్ళం. నీకు ఎంతటి దురవస్థ పట్టిందమ్మా ! అని విచారించింది.
కొంత సేవయాక దమయంతి :
‘పిన్నీ! ఇంతకాలం నే నెవరో తెలియకపోయినా ఎంతో ఆదరంగా చూశావు. ఇప్పుడు నన్ను ఈ విద్వాంసుని వెంట మా పుట్టింటికి పంపు. అక్కడ నా బిడ్డ లిద్దరూ ఉన్నారు. వారిని చూసుకుని కొంత అశ్వాసం పొందుతాను’ అంది.
మరునాడే దమయంతి పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. కన్నబిడ్డలు తల్లిని కౌగిలించుకుని సంతోషంతో కంటనీరు పెట్టారు.
దమయంతి బిడ్డలిద్దరినీ దగ్గరగా తీసుకుని ముద్దాడి, వెన్నుదువ్వి, కన్నీరు తుడిచి, బుజ్జగించింది.
ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. మరునాడు దమయంతి తల్లిత తన భర్తను అన్వేషించే ప్రయత్నం సాగించమంది.
ఆ పనికి బయలుదేరే విద్వాంసులందరినీ రావించి దమయంతి :
‘పుణ్య పురుషులారా! మీరు వెళ్ళిన ప్రతి రాజసభలోనూ యీ సందేశం వినిపించి, అందరినీ పరీక్షగాచూచి, యిది వినగానే ఎవరు చలిస్తారో వానిని గురించి వివరాలు తెలుసుకు రండి.
జూదరి అయిన ఓ ప్రాణేశ్వరా! పతిసేవకే అంకిత మయిన భార్యను నిద్రలో ఉండగా విడిచి, ఆమె చీర చెరగు కట్టుకు వెళ్ళావు. నాటి నుంచీ ఆమె అదే దశలో నిన్నే స్మరిస్తూ కృశిస్తున్నది. కనికరంతో ఆమెకు నీ దర్శన భాగ్యం అనుగ్రహించు ‘
అని దమయంతి వినిపించిన సందేశంతో వెళ్ళిన వారిలో అందరూ ఏ సమాచారం లేకుండానే వచ్చారు.
వారిలో మదేవుడనే విప్రవరుడు దమయంతి దగ్గరకు వచ్చి:
‘అమ్మా! దేశ దేశాలు తిరిగి నేను అయోధ్యలో ఋతుపర్ణుని ఆస్థానంలో నీ సందేశం వినిపించాను. ఆ సభలో ఎవ్వరూ జవాబివ్వలేదు. కాని, సభదాటి వచ్చాక, దారిలో ఒక పురుషుడు (ఆ మహారాజుగారి ఆశ్వపాలకుడు, బాహుకుడని ఆయన పేరు) నేను పలికిన మాటలకు జవాబిచ్చాడు’ అని చెప్పాడు.
ఒక రథం విదర్భ నగర సరిహద్దులలో ప్రవేశిస్తున్నది. ఆ వేగానికి భూమి కంపిస్తున్నది. రాతికోట గోడలు ఊగిపలాడుతున్నాయి. అంత దూరం మంచి అంతఃపురానికి వినబడింది రథ చక్ర నేమిధ్వని.
దమయంతి గుండె పులకించింది. ‘సందేహం లేదు, అది నలుని సారథ్యమే. అంత వేగంగా మరెవరూ రథాన్ని నడవలేరు, ‘ అని నిశ్చయించింది.
రథం కోటలోని మధ్య ప్రాకారానికి రాగానే ఆ వార్తవిని విదర్భ రాజు మర్యాదగా ఎదురువచ్చి ఋతుపర్ణునికి స్వాగతం పలికి, అతిథి మర్యాదలు నడిపాడు.
నగరంలో ఎక్కడా స్వయంవర సన్నాహాలు కాని, ఆ ప్రయ త్నాలు కాని కనిపించక ఋతువర్ణుడు తెల్లబోయాడు. ఇలా స్వయంవర వార్త తనకు ఎందుకు పంపారో తెలియలేదు.
ఋతుపర్ణుడు ఎందుకు వచ్చాడో విదర్భ రాజుకు తెలియలేదు.
‘మిత్ర ధర్మంగా వచ్చానన్నా డాయన.
‘సంతోషం’ అన్నాడీయన.
దమయంతి తన చెలికత్తెను పిలిచి :
“కేశినీ। ఆ రథం మీద వచ్చిన పొట్టి చేతుల కురూపివున్నాడే ఆయన ఎవరో ఆయన కథ ఏవిటో వివరంగా తెలుసుకురా’ అని సంపీ౦ంది,
ఆమె నెమ్మదిగా రథం దగ్గరకు వెళ్ళి బాహుకుని చేరి కుశల ప్రశ్నలతో సంభాషణ మొదలు పెట్టి, సేకరించిన సమాచారంతో డమ యంతి దగ్గరకు వచ్చి:
‘అమ్మా రథం మీద వచ్చిన కురూపి ఋతువర్ణులవారి సారథి. మనం పంపిన బ్రాహ్మణుని సందేశం విని ఏ సమాధానం యిచ్చాడో అనే మాటలు చెప్పి విలపించాడమ్మా’ అంది.
దమయంతికి అర్థమయింది ఆ వ్యక్తి నలుడే అని. అయితే ఈ వికారరూపం ఏమిటో అర్థంకాక, మరోసారి దూతికను పంపి, వాని చర్యలన్నీ పసిగట్టి రమ్మంది.
వెళ్ళిన దూతిక తిరిగి వచ్చి:
‘అమ్మా! అంతా అద్భుతంగా ఉన్నదమ్మా!
మన కోటమంచి వారికి అన్నీ పండని పదార్థాలు పంపించారు. అక్కడ వంటశాలలో నీళ్ళులేవు, నిప్పులేదు. బాహుకుడు ఒక్కసారి అక్కడున్న ఖాళీ కుండలలోకి చూడగానే అవి నీటితో నిండాయి. రెండు గడ్డి పరకలు తీసి సూర్యుని కెదురుగా ఉంచాడు. అవి మండడం ఆరం భించాయి. క్షణాలలో వంట పూర్తి అయింది.
ఆ పరిసరాలలోని మన ంతానికుంజాలలో వికసించిన పువ్వులు తీసి ఆయన నలిపి పారేశాడు. ఆ చేతులలో అంత నలిగినా అవి వాడి పోకుండా అప్పుడే రేకులు విచ్చిన వాసన లీముతున్నాయి.
అలా దూతిక చెప్పుతూంటే దమయంతి విశ్వాసం మరింత పెరిగి, ఆయన వండిన పదార్థాలు తీసుకు రమ్మని చెప్పింది. తెచ్చిన వంట కాల రుచిని బట్టి అది నలుని చేతి వంటయే అని గ్రహించింది.
తన బిడ్డ లిద్దరినీ యిచ్చి దూతికను నలుని దగ్గరకు పంపింది. వారిని చూస్తూనే దగ్గరకు తీసుకుని బాహుకుడు గోలు గోజున విలపించాడు.
తన పిల్లలు కూడా యిలా ముద్దుగా ఉండే వారనీ, వీరిని చూడ గానే వారు గుర్తు వచ్చి విచారించా’ ననీ అన్నాడు.
ఈ కబురు విన్న దమయంతికి సందేహం పూర్తిగా తీరింది. తల్లి దగ్గరకు వెళ్ళి :
‘అమ్మా! ఆయనను అంతఃపురానికి రప్పించి అసలు విషయం తెలుసుకోవాలి’ అంది.
ఆవిడ మహారాజుతో సంప్రదించి బాహుకుని రప్పించింది.
దమయంతిని చూస్తూనే బాహుకుడు కంటనీరు పెట్టాడు. దుఃఖం పొంగిపొర్లింది. దమయంతి కూడా అదే దశలో పడింది కొంత సేపు యిద్దరూ దుఃఖించారు.
దమయంతి దుఃఖాన్ని దిగమింగుతూ :
‘బాహుకా! ఘోరారణ్యంలో భార్యను విడిచి వెళ్ళిన పురుషుని ఎక్కడయినా చూశావా? ఆమె ఎ అపరాధం చేసిందని అలా విడిచి వెళ్ళాడో కనుక్కున్నావా ? దేవతలను కూడా తిరస్కరించి అనురాగంతో వరించి, సంతానవతిని అయిన నన్ను అలా ఒంటరిగా వదలి వెళ్ళడం న్యాయమనీ భావించాడా ఆయన ధర్మార్థ కామాలు మూడూ కలిసి సాగించి, అనుభవిద్దాం అని అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న నన్ను విడవడం ధర్మమా ? ‘
అని అడుగుతూంటే బాహుకుని కన్నుల వెంట అశ్రుధారలు కురిశాయి.
‘ ఓ మహాసాధ్వీ | యింకా నీ మాటల శూలాలతో నన్ను వేధించకు. మనకు కలిగిన క్లేశాలన్నీ కలిపురుషుని పగవల్ల వచ్చినవి. ఇప్ప టికి వాడు నన్ను విడిచాడు. కమక యిక్కడకు రాగలిగాను.
అనురాగంతో ఆనందమయ జీవితం గడిపిన నారీమణి పంపురు మని వివాహ మాడుతుందని ఊహించలేకపోయాను. మీ నాన్నగారు నీ ద్వితీయ స్వయంవరం ప్రకటించడం వల్ల మా మహారాజును తీసుకు వచ్చాను’ అని రోదించాడు.
అప్పుడు దమయంతి :
“నన్ను శంకించకండి. మీ జాడ కని పెట్టడానికి నేనే ఆ నందేశం పంపాను. నగరంలో స్వయంవర సన్నాహాలు మీకు కనబడ్డాయా మా నాన్న గారికి కూడా మీ రెందుకు వచ్చారో తెలీదు. మీరు తప్ప ఇంత దూరం రథాన్ని ఒక్కరోజులో నడపగలవారు లేరని ఎరుగుదును. నా ఊహ నిజమయింది’ అంది.
బాహుకుడు కర్కోటకుని స్మరించాడు. అంతే బాహుకుడు నలు డుగా సుందర రూపంతో సాక్షాత్కరించాడు. నలదమయంతులు ఇద్దరూ ఒకరి నొకరు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు.
వాడిపోతున్న నారు మడికి తొలకరి చినుకులు పడినట్లు వారి దుఃఖభర హృదయాలు ఆనంద గగనంలో విహరించాయి. మరునాడు తెలతెల వారుతూండగా నందమయంతులు అభ్యంగన స్నానంచేసి నూతన వస్త్రాలు ధరించి మహారాజును సమీపించి నమస్కరించారు.
ఆయన వరమ సంతోషంతో వారిని ఆశీర్వదించి నగరంలో ఉత్ప వాలు జరిపించాడు.
తన సేవకుడుగా ఉన్న బాహుకుడు వలుడని తెలియగానే ఋతు ఎర్ణుడు వచ్చి క్షమార్పణ కోరాడు. అనంతరం వారివద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు.
నలదమయంతులు కొంతకాలం ఇక్కడే సుఖభోగాలు అనుఖి వించారు.
అప్పుడొకనాడు నలుడు:
‘నే నిప్పుడు పుష్కరుని ఓడించగల ద్యూత రహస్యాలు నేర్పు కున్నాను. వెళ్ళి వాడితో ఆడి, ఓడించి మన రాజ్యం సంపాదించి వస్తామ’ అని వెళ్ళి పుష్కరుని జూదానికి పిలిచాడు. పుష్కరుడు వరమ సంతోషంతో జూదానికి దిగి సర్వమూ ఓడిపోయి నలుని పాదాల మీద పడ్డాడు.
నలుడు వానిని క్షమించి :
“నీ రాజ్యానికి నవ్వుహా ” అన్నాడు.
అనంతరం దమయంతినీ, బిడ్డలనూ రప్పించి ధర్మమార్గావ సత్య పాలనం సాగించి సర్వ ప్రకారంజకుడనే పేరు సంపాదించాడు.
అని మార్కండేయుడు కథ ముగిస్తూ
ధర్మనందనా ! విన్నావుకదా!
ఆయన ఎన్ని క్లేశాలు పడినా ధర్మమార్గం విడవక సత్యం తప్పక నడిచి నందువల్ల సుఖంగా జీవించి, కీర్తి సంపాదించాడు అన్నాడు.