Balakanda Sarga 5 In Telugu – బాలకాండ పంచమః సర్గః

Balakanda Sarga 5 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచమః సర్గలో రాముని జన్మవివరాలు వర్ణించబడ్డాయి. ఈ సర్గలో, రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు అనే దశరథ మహారాజు యొక్క నాలుగు కుమారుల జన్మకథ చెప్పబడుతుంది. వశిష్ఠ మహర్షి యజ్ఞం నిర్వహించి దశరథుని మూడు భార్యలు కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పాయసం ప్రసాదంగా ఇచ్చాడు. వారు ఈ పాయసాన్ని పూజగా స్వీకరించి, పవిత్రమైన సంతానాలను పొందారు. ఈ సర్గలో పిల్లల జన్మ సంభవాలు మరియు వారి బాల్యం ప్రధానాంశాలు. ఈ విభాగం రామాయణంలోని అత్యంత పుణ్యమైన ఘట్టాల్లో ఒకటిగా చెప్పబడుతుంది.

అయోధ్యావర్ణనా

సర్వా పూర్వమియం యేషామాసీత్కృత్స్నా వసుంధరా |
ప్రజపతిముపాదాయ నృపాణం జయశాలినామ్ ||

1

యేషాం స సగరో నామ సాగరో యేన ఖానితః |
షష్టిః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్ ||

2

ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనామ్ |
మహదుత్పన్నమాఖ్యనం రామాయణమితి శ్రుతమ్ ||

3

తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః |
ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా ||

4

కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ |
నివిష్టః సరయూతీరే ప్రభూతధనధాన్యవాన్ ||

5

అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోకవిశ్రుతా |
మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయమ్ ||

6

ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ |
శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్తామహాపథా ||

7

రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభితా |
ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః ||

8

తాం తు రాజా దశరథో మహారాష్ట్రవివర్ధనః |
పురీమావాసయామాస దివం దేవపతిర్యథా ||

9

కవాటతోరణవతీం సువిభక్తాంతరాపణామ్ |
సర్వయంత్రాయుధవతీముపేతాం సర్వశిల్పిభిః ||

10

సూతమాగధసంబాధాం శ్రీమతీమతులప్రభామ్ |
ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్నీశతసంకులామ్ ||

11

వధూనాటకసంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీమ్ |
ఉద్యానామ్రవణోపేతాం మహతీం సాలమేఖలామ్ ||

12

దుర్గగంభీరపరిఖాం దుర్గామన్యైర్దురాసదమ్ |
వాజివారణసంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా ||

13

సామంతరాజసంఘైశ్చ బలికర్మభిరావృతామ్ |
నానాదేశనివాసైశ్చ వణిగ్భిరుపశోభితామ్ ||

14

ప్రాసాదై రత్నవికృతైః పర్వతైరుపశోభితామ్ |
కూటాగారైశ్చ సంపూర్ణామింద్రస్యేవామరావతీమ్ ||

15

చిత్రామష్టాపదాకారాం వరనారీగణైర్యుతామ్ |
సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్ ||

16

గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితామ్ |
శాలితండులసంపూర్ణామిక్షుదండరసోదకామ్ ||

17

దుందుభీభిర్మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా |
నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమామ్ ||

18

విమానమివ సిద్ధానాం తపసాధిగతం దివి |
సునివేశితవేశ్మాంతాం నరోత్తమసమావృతామ్ ||

19

యే చ బాణైర్న విధ్యంతి వివిక్తమపరావరమ్ |
శబ్దవేధ్యం చ వితతం లఘుహస్తా విశారదాః ||

20

సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే |
హంతారోనిశితైర్బాణైర్బలాద్బాహుబలైరపి ||

21

తాదృశానాం సహస్రైస్తామభిపూర్ణాం మహారథైః |
పురీమావాసయామాస రాజా దశరథస్తదా ||

22

తామగ్నిమద్భిర్గుణవద్భిరావృతాం
ద్విజోత్తమైర్వేదషడంగపారగైః |
సహస్రదైః సత్యరతైర్మహాత్మభి-
-ర్మహర్షికల్పైరృషిభిశ్చ కేవలైః ||

23

Balakanda 5 Sarga In Telugu Meaning

పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశములోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ప్రస్తుతము మనము చదువుతున్న రామాయణము కూడా ఆ ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర.

సరయూ నదీ తీరంలో కోసల దేశము ఉండేది. ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్ఠులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరము చుట్టు శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రాకారము వెలుపల లోతైన అగడ్త ఉండేది.

ఆ నగరములో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ, కప్పము కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరములో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము సమతల పదేశములో నిర్మింపబడినది. ఆ నగరములో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి. వృధాగా ఏ ప్రదేశము వదిలి పెట్టబడలేదు.

ఆ నగరములో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ నగరంలో ఎంతో మంది యోధులు, వీరులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు. శబ్దవేది విద్యలో ప్రావీణ్యము సంపాదించినవారు.

(శబ్దవేది అంటే టార్గెట్ను చూడకుండా కేవలం ఆ టార్గెట్ నుండివెలువడే శబ్దమును విని టార్గెట్ను కొట్టడం.)

మానవులకు హాని చేయు క్రూర మృగములను ఆయుధములు ఉపయోగించికానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బలపరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య. కోసలదేశ రాజధాని.

అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరధ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నాడు. ఆ నగరములో నాలుగు జాతులవారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమ నిష్టాగరిష్ఠులు. ప్రతిరోజూ అగ్నిహోత్రము చేసేవారు. వారందరూ వేద వేదాంగములు చదివిన వారు. మంచి గుణములతో అలరారే వారు. నిత్యము అతిధులకు అన్నదానము చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికే వారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఐదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ షష్ఠః సర్గః (6) >>

Balakanda Sarga 3 In Telugu – బాలకాండ తృతీయః సర్గః

Balakanda Sarga 3 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండంలో మూడవ సర్గంలో, రాజ్యాభిషేకం సంబంధించిన వివరాలు వివరించబడుతున్నాయి. రాజు దశరథుడు అయోధ్యలో రాజ్యాభిషేకం చేసుకున్నాడు మరియు అది ఎలా జరిగిందో చెప్పబడుతుంది. అయోధ్యలో ఉన్నవారు విచారించి, సంతోషపడుతున్నారు. రాజరాజు దశరథుడు రాజాభిషేకం కొన్ని అద్భుత సమాచారాలతో ప్రారంభించారు. అయోధ్య నగరం సంపూర్ణం ఉల్లాసంగా అభివృద్ధి చేసుకుంది.

కావ్యసంక్షేపః

శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మసంహితమ్ |
వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః ||

1

ఉపస్పృస్యోదకం సమ్యఙ్మునిః స్థిత్వా కృతాంజలిః |
ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వీక్షతే గతిమ్ ||

2

రామలక్ష్మణసీతాభీ రాజ్ఞా దశరథేన చ |
సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్త్వతః ||

3

హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితమ్ |
తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్సంప్రపశ్యతి ||

4

స్త్రీతృతీయేన చ తథా యత్ప్రాప్తం చరతా వనే |
సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవేక్షితమ్ ||

5

తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః |
పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా ||

6

తత్సర్వం తాత్త్వతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతిః |
అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః ||

7

కామార్థగుణసంయుక్తం ధర్మార్థగుణవిస్తరమ్ |
సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతిమనోహరమ్ ||

8

స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా |
రఘునాథస్య చరితం చకార భగవానృషిః ||

9 [వంశస్య]

జన్మ రామస్య సుమహద్వీర్యం సర్వానుకూలతామ్ |
లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతామ్ ||

10

నానాచిత్రకథాశ్చాన్యా విశ్వామిత్రసమాగమే |
జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనమ్ ||

11

రామరామవివాదం చ గుణాన్దాశరథేస్తథా |
తథా రామాభిషేకం చ కైకేయ్యా దుష్టభావతామ్ ||

12

విఘాతం చాభిషేకస్య రామస్య చ వివాసనమ్ |
రాజ్ఞః శోకవిలాపం చ పరలోకస్య చాశ్రయమ్ ||

13

ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనమ్ |
నిషాదాధిపసంవాదం సూతోపావర్తనం తథా ||

14

గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనమ్ |
భరద్వాజాభ్యనుజ్ఞానాచ్చిత్రకూటస్య దర్శనమ్ ||

15

వాస్తుకర్మ వివేశం చ భరతాగమనం తథా |
ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియామ్ ||

16

పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామనివాసనమ్ |
దండకారణ్యగమనం విరాధస్య వధం తథా ||

17

దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేనాపి సంగతిమ్ |
అనసూయానమస్యాం చ అంగరాగస్య చార్పణమ్ ||

18

అగస్త్యదర్శనం చైవ జటాయోరభిసంగమమ్ |
పంచవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనమ్ ||

19

శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా |
వధం ఖరత్రిశిరసోరుత్థానం రావణస్య చ ||

20

మారీచస్య వధం చైవ వైదేహ్యా హరణం తథా |
రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణమ్ ||

21

కబంధదర్శనం చైవ పంపాయాశ్చాపి దర్శనమ్ |
శబరీ దర్శనం చైవ హనూమద్దర్శనం తథా |
విలాపం చైవ పంపాయం రాఘవస్య మహాత్మనః ||

22

ఋశ్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమమ్ |
ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలిసుగ్రీవవిగ్రహమ్ ||

23

వాలిప్రమథనం చైవ సుగీవప్రతిపాదనమ్ |
తారావిలాపం సమయం వర్షరాత్రనివాసనమ్ ||

24

కోపం రాఘవసింహస్య బలానాముపసంగ్రహమ్ |
దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనమ్ ||

25

అంగులీయకదానం చ ఋక్షస్య బిలదర్శనమ్ |
ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చైవ దర్శనమ్ ||

26

పర్వతారోహణం చైవ సాగరస్య చ లంఘనమ్ |
సముద్రవచనాచ్చైవ మైనాకస్యాపి దర్శనమ్ ||

27

[రాక్షసీతర్జనం చైవ ఛాయాగ్రాహస్య దర్శనమ్ |
సింహికాయాశ్చ నిధనం లంకామలయదర్శనమ్ |
రాత్రౌ లంకాప్రవేశం చ ఏకస్యాపి విచింతనమ్ ||

28

దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనమ్ |
ఆపానభూమిగమనమవరోధస్య దర్శనమ్ ||

29

అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనమ్ |
రాక్షసీతర్జనం చైవ త్రిజటాస్వప్నదర్శనమ్ ||

30

అభిజ్ఞానప్రదానం చ సీతాయాశ్చాభిభాషణమ్ |
మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ ||

31

రాక్షసీవిద్రవం చైవ కింకరాణాం నిబర్హణమ్ |
గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహాభిగర్జనమ్ ||

32

ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా |
రాఘవాశ్వాసనం చైవ మణినిర్యాతనం తథా ||

33

సంగమం చ సముద్రేణ నలసేతోశ్చ బంధనమ్ |
ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లంకావరోధనమ్ ||

34

విభీషణేన సంసర్గం వధోపాయనివేదనమ్ |
కుంభకర్ణస్య నిధనం మేఘనాదనిబర్హణమ్ ||

35

రావణస్య వినాశం చ సీతావాప్తిమరేః పురే |
విభీషణాభిషేకం చ పుష్పకస్య నివేదనమ్ ||

36

అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమమ్ |
రామాభిషేకాభ్యుదయం సర్వసైన్యవిసర్జనమ్ ||

37

స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనమ్ |
అనాగతం చ యత్కించిద్రామస్య వసుధాతలే |
తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవానృషిః ||

38

Balakanda Sarga 3 Meaning In Telugu

తనకు నారద మహర్షి చెప్పిన రామ కధ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచిం చాడు. తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేసాడు. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి ధర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు. నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు.

దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేసారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేసారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో, ఆ విషయముల నన్నింటినీ ఆమూలాగ్రంగా, యధాతథంగా తన యోగదృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు.

మహాతపస్వి అయిన వాల్మీకికి రామ చరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరిక కాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహా తపస్వి అయిన వాల్మీకి రామ చరిత్రను దర్శించిన తరువాత, తాను చూచినది చూచినట్టు, నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్థకామ మోక్షములలో, ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు, మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండే టట్టు, నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి, అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు, రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహా కావ్యమును రచించాడు.

ఆ రామాయణ మహా కావ్యములో రాముని జననము, ఆయన ధర్మనిరతి, పరాక్రమము, ఓర్పు గుణము, రాముని సౌందర్యము సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కధలు, గాధలు, శివధనుర్భంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించాడు. తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము, రాముని యౌవరాజ్య పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడం, రాముడు వనములకు పోవడం, దశరధుని నిర్మాణము, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దు:ఖించడం, రాముడు వారిని ఓదార్చి పంపివేయడం;

గంగానదిని దాటడం, గుహునితో రాముడు మాట్లాడటం, తన సారధి అయిన సుమంతుని రథము తీసుకొని వెనుకకు మరలు మనడం, సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోడం, ఆయన ఆదేశాను సారం చిత్రకూటమునకు వెళ్లడం, చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని ఉండటం, ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం, రాముడు నిరాకరించడం,

రాముడు తన తండ్రి మరణ వార్త విని దు:ఖించడం, తండ్రికి అంత్యక్రియలు జరిపించడం, తనపాదుకలను భరతునికి ఇవ్వడం, భరతుడు రాముని పాదుకలను తీసుకొని వెళ్లి నంది గ్రామములో నివసించడం, అక్కడే రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం,

తరువాత సీతారామలక్ష్మణులు దండకారణ్యము వెళ్లడం, అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, శరభంగుడు, సుతీక్షుడు మొదలగు మహాఋషుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయ తో మాట్లాడటం, అనసూయ సీతకు ఒంటికి పూసుకొనే లేపనము ఇవ్వడం, తరువాత రామలక్ష్మణులు శూర్పణఖను చూడటం, ఆమెను విరూపిగా చెయ్యడం, ఖరుడు మొదలగురాక్షసులను సంహరించడం.

ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం, రావణుడు మారీచుని సాయంకోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు ఆంగీక రించడం, రాముడు మారీచుని చంపడం, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం, రాముడు సీత కోసరం శోకించడం, కబంధుని చూడటం, పంపాసరస్సువద్దకు వెళ్లడం, శబరిని కలుసుకోవడం, అక్కడనుండి ఋష్యమూక పర్వత ప్రాంతమునకు వెళ్లడం, హనుమంతుడు రాముని కలవడం,

రామ సుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధము, వాలి వధ, వాలి కోసరం తార విలపించడం, రాముడు సుగ్రీవునకు కిష్కింధా రాజ్యము ఇవ్వడం, సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం, కాని సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం, రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరము ఇవ్వడం.

హనుమంతుడు సాగరమును లంఘించడం, మధ్యలో మైనాకుని చూడటం, సింహికను చంపడం, లంకా నగరము దగ్గర ఉన్న పర్వతమును చూడటం, రాత్రియందు హనుమంతుడు లంకానగరము ప్రవేశించడం, సీతను వెదుకుతూ పుష్పక విమానములో ప్రవేశించడం, రావణుని అంతఃపుర దర్శనం, తరువాత హనుమంతుడు అశోక వనములో ఉన్న సీతను చూడటం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వడం, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం, త్రిజటకు వచ్చిన స్వప్నవృత్తాంతము, హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోక వనమును నాశనం చెయ్యడం, ఇంద్రజిత్తుకు పట్టుబడటం, లంకాదహనము,

హనుమంతుడు సముద్రమును దాటి కిష్కింధకు రావడం, దారిలో మధువనమును నాశనం చేయడం, రామునికి సీతను చూచాను అనిచెప్పడం, సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం, రాముడు సుగ్రీవుడు వానర సేనతో సముద్రము వద్దకు చేరుకోవడం, నీలుని సాయంతో సేతువును నిర్మించడం, లంకా నగరం చేరుకోవడం,

లంకానగర ముట్టడి, రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి, విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం, యుద్ధములో కుంభకర్ణుడు, మేఘనాధుడు మరణించడం, రామరావణ యుద్ధము, రావణ వధ, సీతను స్వీకరిం చడం, విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం, సీతా సమేతుడై రాముడు పుష్పకవిమానములో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకము, వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయడం, రామరాజ్యవర్ణన, లోకాప నిందకు వెరిచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకూ వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తరువాత జరుగబోవు విషయములను వాల్మీకి ఉత్తర కావ్యములో రచించాడు.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో మూడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ చతుర్థః సర్గః (4) >>

Ayodhya Kanda Sarga 1 In Telugu – అయోధ్యాకాండ ప్రథమః సర్గః

Ayodhya Kanda Sarga 1 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ రామాయణ కావ్యంలో రెండవ విభాగము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. ఈ ప్రథమః సర్గఃలో రాముని గుణగణాలను, అయోధ్యలోని ప్రజల ఆనందం మరియు భవిష్యత్తులో రాముడు రాజ్యభిషేకం పొందబోతున్నదని ప్రజల ఆశలను వివరిస్తుంది. దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైన రాముని యువరాజుగా అభిషేకించాలనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు.

రామాభిషేకవ్యవసాయః

గచ్ఛతా మాతులకులం భరతేన మహాత్మనా |
శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీతః ప్రీతిపురస్కృతః ||

1

స తత్ర న్యవసద్భ్రాత్రా సహ సత్కారసత్కృతః |
మాతులేనాశ్వపతినా పుత్రస్నేహేన లాలితః ||

2

తత్రాపి నివసంతౌ తౌ తర్ప్యమాణౌ చ కామతః |
భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపమ్ ||

3

రాజాఽపి తౌ మహాతేజాః సస్మార ప్రోషితౌ సుతౌ |
ఉభౌ భరతశత్రుఘ్నౌ మహేంద్రవరుణోపమౌ ||

4

సర్వ ఏవ తు తస్యేష్టాశ్చత్వారః పురుషర్షభాః |
స్వశరీరాద్వినిర్వృత్తాశ్చత్వార ఇవ బాహవః ||

5

తేషామపి మహాతేజా రామో రతికరః పితుః |
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః ||

6

స హి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః |
అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణుః సనాతనః ||

7

కౌసల్యా శుశుభే తేన పుత్రేణామితతేజసా |
యథా వరేణ దేవానామదితిర్వజ్రపాణినా ||

8

స హి వీర్యోపపన్నశ్చ రూపవాననసూయకః |
భూమావనుపమః సూనుర్గుణైర్దశరథోపమః ||

9

స తు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వం చ భాషతే |
ఉచ్యమానోఽపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే ||

10

కథం‍చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి |
న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా ||

11

శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనైః |
కథయన్నాస్త వై నిత్యమస్త్రయోగ్యాంతరేష్వపి ||

12

బుద్ధిమాన్మధురాభాషీ పూర్వభాషీ ప్రియంవదః |
వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన గర్వితః ||

13

న చానృతకథో విద్వాన్వృద్ధానాం ప్రతిపూజకః |
అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే ||

14

సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణప్రతిపూజకః |
దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః ||

15

కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే |
మన్యతే పరయా కీర్త్యా మహత్స్వర్గఫలం తతః ||

16

నాశ్రేయసి రతో విద్వాన్న విరుద్ధకథారుచిః |
ఉత్తరోత్తరయుక్తీనాం వక్తా వాచస్పతిర్యథా ||

17

అరోగస్తరుణో వాగ్మీ వపుష్మాన్దేశకాలవిత్ |
లోకే పురుషసారజ్ఞః సాధురేకో వినిర్మితః ||

18

స తు శ్రేష్ఠైర్గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః |
బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతఃప్రియః ||

19

సమ్యగ్విద్యావ్రతస్నాతో యథావత్సాంగవేదవిత్ |
ఇష్వస్త్రే చ పితుః శ్రేష్ఠో బభూవ భరతాగ్రజః ||

20

కల్యాణాభిజనః సాధురదీనః సత్యవాగృజుః |
వృద్ధైరభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థదర్శిభిః ||

21

ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ప్రతిభానవాన్ |
లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః ||

22

నిభృతః సంవృతాకారో గుప్తమంత్రః సహాయవాన్ |
అమోఘక్రోధహర్షశ్చ త్యాగసంయమకాలవిత్ ||

23

దృఢభక్తిః స్థిరప్రజ్ఞో నాసద్గ్రాహీ న దుర్వచాః |
నిస్తంద్రిరప్రమత్తశ్చ స్వదోషపరదోషవిత్ ||

24

శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతరకోవిదః |
యః ప్రగ్రహానుగ్రహయోర్యథాన్యాయం విచక్షణః ||

25

సత్సంగ్రహప్రగ్రహణే స్థానవిన్నిగ్రహస్య చ |
ఆయకర్మణ్యుపాయజ్ఞః సందృష్టవ్యయకర్మవిత్ ||

26

శ్రైష్ఠ్యం శాస్త్రసమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ |
అర్థధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో న చాలసః ||

27

వైహారికాణాం శిల్పానాం విజ్ఞాతార్థవిభాగవిత్ |
ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజినామ్ ||

28

ధనుర్వేదవిదాం శ్రేష్ఠో లోకేఽతిరథసంమతః |
అభియాతా ప్రహర్తా చ సేనానయవిశారదః ||

29

అప్రధృష్యశ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః |
అనసూయో జితక్రోధో న దృప్తో న చ మత్సరీ ||

30

న చావమంతా భూతానాం న చ కాలవశానుగః |
ఏవం శ్రేష్ఠైర్గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః ||

31

సంమతస్త్రిషు లోకేషు వసుధాయాః క్షమాగుణైః |
బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యేణాపి శచీపతేః ||

32

తథా సర్వప్రజాకాంతైః ప్రీతిసంజననైః పితుః |
గుణైర్విరురుచే రామో దీప్తైః సూర్య ఇవాంశుభిః ||

33

తమేవం వ్రతసంపన్నమప్రధృష్యపరాక్రమమ్ |
లోకపాలోపమం నాథమకామయత మేదినీ ||

34

ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపమైః సుతమ్ |
దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః ||

35

అథ రాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః |
ప్రీతిరేషా కథం రామో రాజా స్యాన్మయి జీవతి ||

36

ఏషా హ్యస్య పరా ప్రీతిర్హృది సంపరివర్తతే |
కదా నామ సుతం ద్రక్ష్యామ్యభిషిక్తమహం ప్రియమ్ ||

37

వృద్ధికామో హి లోకస్య సర్వభూతానుకంపనః |
మత్తః ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్ ||

38

యమశక్రసమో వీర్యే బృహస్పతిసమో మతౌ |
మహీధరసమో ధృత్యాం మత్తశ్చ గుణవత్తరః ||

39

మహీమహమిమాం కృత్స్నామధితిష్ఠంతమాత్మజమ్ |
అనేన వయసా దృష్ట్వా యథా స్వర్గమవాప్నుయామ్ ||

40

ఇత్యేతైర్వివిధైస్తైస్తైరన్యపార్థివదుర్లభైః |
శిష్టైరపరిమేయైశ్చ లోకే లోకోత్తరైర్గుణైః ||

41

తం సమీక్ష్య మహారాజో యుక్తం సముదితైర్గుణైః |
నిశ్చిత్య సచివైః సార్ధం యువరాజమమన్యత ||

42

దివ్యంతరిక్షే భూమౌ చ ఘోరముత్పాతజం భయమ్ |
సం‍చచక్షే చ మేధావీ శరీరే చాత్మనో జరామ్ ||

43

పూర్ణచంద్రాననస్యాథ శోకాపనుదమాత్మనః |
లోకే రామస్య బుబుధే సంప్రియత్వం మహాత్మనః ||

44

ఆత్మనశ్చ ప్రజానాం చ శ్రేయసే చ ప్రియేణ చ |
ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్నృపః ||

45

నానానగరవాస్తవ్యాన్పృథగ్జానపదానపి |
సమానినాయ మేదిన్యాః ప్రధానాన్పృథివీపతీన్ ||

46

తాన్వేశ్మనానాభరణైర్యథార్హం ప్రతిపూజితాన్ |
దదర్శాలంకృతో రాజా ప్రజాపతిరివ ప్రజాః ||

47

న తు కేకయరాజానం జనకం వా నరాధిపః |
త్వరయా చానయామాస పశ్చాత్తౌ శ్రోష్యతః ప్రియమ్ ||

48

అథోపవిష్టే నృపతౌ తస్మిన్పరబలార్దనే |
తతః ప్రవివిశుః శేష రాజానో లోకసమ్మతాః ||

49

అథ రాజవితీర్ణేషు వివిధేష్వాసనేషు చ |
రాజానమేవాభిముఖాః నిషేదుర్నియతా నృపాః ||

50

స లబ్ధమానైర్వినయాన్వితైర్నృపైః
పురాలయైర్జానపదైశ్చ మానవైః |
ఉపోపవిష్టైర్నృపతిర్వృతో బభౌ
సహస్రచక్షుర్భగవానివామరైః ||

51

Ayodhya Kanda Sarga 1 Meaning In Telugu

భరతుడు తన మేమతో కూడా తాత గారి ఇంటికి వెళ్లాడు. తనతో కూడా శత్రుఘ్నుని తీసుకొని వెళ్లాడు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంట్లో సుఖసంతోషాలతో ఉన్నప్పటికీ, అయోధ్యలో ఉన్న తల్లి తండ్రు లను మరిచిపోలేదు. ప్రతిరోజూ తమ తల్లి తండ్రులను మనసారా తల్చుకుంటూ ఉన్నారు.

అదే ప్రకారంగా దశరథుడు కూడా తన కుమారులు భరత శత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతి రోజూ తల్చుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే దశరథునికి తన నలుగురు కుమారులను సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు. అందుకనీ భరత శత్రుఘ్నులు తన ఎదుట లేకపోయినా అనుదినమూ వారిని తల్చుకుంటూ ఉండేవాడు.

కాని తన నలుగురు కుమారులలోనూ పెద్ద కుమారుడు రాముడు అంటే దశరథునకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి. కౌసల్యకు కూడా రాముడు అంటే పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్క నిముషం కూడా ఉండేది కాదు. ఇంక రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు.

రాముడు మంచి రూపవంతుడు. శౌర్యవంతుడు. పైగా దశరథుని కుమారుడు. రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. అందరితో మృదువుగా మాట్లాడేవాడు. తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే కాని వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు.

రాముడు అల్ప సంతోషి. ఎవరైనా తనకు చిన్న ఉపకారము చేసినా అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు ఎన్ని అపకార ములు చేసినా వాటిని మనసులో పెట్టుకొనే వాడు కాదు. రాముడు అస్త్రవిద్య శస్త్ర విద్యలు సాధన చేసేవాడు. తీరిక సమయములలో వయోవృద్ధులు జ్ఞానవృద్ధుల వద్దకు పోయి మంచి విషయములు నేర్చుకొనే వాడు. అంతేగాని వినోద విలాసములతో సమయమును వృధాచేసేవాడు కాదు.

రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు. ముందు తనే అందరినీ పలుకరించి వారి యోగక్షేమములు అడిగి తెలుసుకొనేవాడు. తాను అమితమైన పరాక్రమ వంతుడైనను కొంచెం కూడా గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవాడు.

రాముడికి ఉన్న మరొక మంచి లక్షణము రాముడు ఎన్నడూ అసత్యము పలికేవాడు కాదు. బ్రాహ్మణులను, పెద్దలను గౌరవించే వాడు. ప్రజలు తనను ఏ ప్రకారం గౌరవిస్తారో అదే ప్రకారము రాముడు కూడా శ్రీ గౌరవించేవాడు. రాముడికి కోపం అంటే ఏమిటో తెలియదు. అందరి మీద దయకలిగి ఉండేవాడు. దీనులను చూచి జాలిపడేవాడు. తోచిన సహాయము చేసేవాడు.

రాముడు ధర్మపరుడు. సకల ధర్మములను తెలిసినవాడు. కానీ ఏమీ తెలియనట్టు ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అని గర్వించేవాడు కాదు. రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియము లను అదుపులో ఉంచుకొని ప్రవర్తించేవాడు. రాముడు క్షత్రియుడు. అందుకని తన స్వధర్మము అయిన క్షత్రియ ధర్మమును ఆచరించే వాడు. రాముడు తనకు కానీ, ఇతరులకు కానీ కీడు చేసే కార్యముల యందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ధర్మవిరుద్ధంగా ఏ పనీ చేసేవాడు కాదు. ఎదుటి వారి ఆంతర్యమును గ్రహించి తగు విధంగా నేర్పుగా మాట్లాడేవాడు.

రాముడు తన ఆరోగ్యమును చక్కగ కాపాడుకొనేవాడు. ఎలాంటి దురలవాట్లకు లోనయ్యేవాడు కాదు. ఏ కాలములో ఎలా ఉండాలో, ఏ పని చెయ్యాలో తెలుసుకొని అలా ఉండేవాడు, ఆ పనులే చేసేవాడు. సాటివారలలో సాధువర్తనుడు అని పేరుతెచ్చుకున్నాడు. అంతేకాదు అయోధ్యపుర ప్రజలలో కూడా రాముడు సాధు వర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు.

అటువంటి రాముడు విద్యాభ్యాసము పూర్తి చేసు కున్నాడు. వేద వేదాంగములలో ప్రావీణ్యము సంపాదించాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుని మించిపోయాడు. తాను జన్మించిన ఇక్ష్వాకు వంశమునకు తన సద్గుణములతో వన్నె తెచ్చే వాడయ్యాడు. పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటి గురించి న తత్త్వమును బాగా ఆకళింపు చేసుకొని తదనుగుణంగా నడుచుకొనేవాడు. క్షత్రియోచితములైన ఆచార వ్యవహారములను చక్కగా అనుసరించేవాడు.

రాముడు తనలోని ఆలోచనలను పైకి కనపడనీయడు. పైకి నవ్వుతూనే ఉండేవాడు. మనసులోని భావములను ముఖంలో కనపడనిచ్చేవాడు కాదు. అనవసరంగా కోపగించుకోడం, సంతోషంతో పొంగిపోవడం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు. ఏ విషయంలోనూ మొండిగా పట్టుబట్టడం మొండిగా వాదించడం చేసేవాడు కాదు. స్థిరమైన బుద్ధికలవాడు.

ఏ పరిస్థితులతో కూడా మనస్సును చలింపనీయడు రాముడు. రామునికి సోమరి తనము అంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టేముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దు కొనేవాడు. ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దానిని గుర్తు పెట్టుకొని తగిన సమయ ములో ప్రత్యుపకారము చేసేవాడు.

రాముడు న్యాయశాస్త్రములో కూడా ప్రావీణ్యము సంపాదించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో అత్యంత నేర్పును ప్రదర్శించేవాడు. రాముడు రాజ్యపాలనలలో కూడా నిష్ణాతుడు. మంచి వారిని చేరదీసి ఆదరించేవాడు. దుర్మార్గులను దగ్గరకు చేరనిచ్చేవాడు. కాదు. రాజ్యపాలన కు కావలసిన ధనమును నేర్పుగా ప్రజలనుండి రాబట్టేవాడు. ఆ ధనమును వ్యయం చేయడంలోకూడా సంయమనం పాటించేవాడు. అనవసరమైన ఖర్చులను నివారించేవాడు.

రాముడు వేద వేదాంగములనే కాదు, ఇంకా ఇతరత్రా ఉన్న శాస్త్రములను కూడా బాగా అధ్యయనం చేసాడు. అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తగు మాత్రంగా సుఖములను అనుభవించేవాడు. సుఖములను అనుభవించేటప్పుడు కూడా ఎంతో జాగరూకతతో ఉండేవాడు. రాముడు సంగీత నృత్యములలో కూడా ప్రవేశము ఉన్నవాడు.

పైన చెప్పిన లక్షణములను బట్టి, రాముడు సాత్వికుడు భోగలాలసుడు అనుకుంటే పొరపాటే. ఆయనకు యుద్ధరీతులు అన్ని కూడా బాగా తెలుసు. గుర్రములను ఏనుగులను లొంగదీసుకొని మచ్చిక చేసుకొనేవాడు. ధనుర్విద్యలో ప్రావీణ్యము సంపాదించాడు. శత్రువుల ఎడల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడు. యుద్ధములో దేవతలు, రాక్షసులు ఎదురైనా జంకేవాడు కాదు. ధైర్యంతో ఎదిరించి గెలిచే సామర్థ్యము ఉన్నవాడు. అనిచెప్పి అందరి మీదా అనవసరంగా యుద్ధానికి కాలుదువ్వేవాడు కాదు.

రాముడు ఎవరిమీద కోపగించుకోడు. అవసరం అయినప్పుడు కోపం తెచ్చు కుంటాడు. అవసరం తీరగానే ఆ కోపాన్ని వదిలేస్తాడు. ఇన్ని సుగుణ ములు ఉన్నవాడు కాబట్టే రాముడు మూడులోకములలో కీర్తింప బడ్డాడు. రాముడు తన సుగుణములతో సూర్యుని వలె ప్రకాశించే వాడు.

ఇటువంటి సకలసద్గుణసంపన్నుడైన రాముడు తమకు రాజు కావాలని అయోధ్యా ప్రజలు కోరుకొనేవారు. ఇదే ఆలోచన దశరథునికి కూడా వచ్చింది. “తన జీవిత కాలంలో రాముడు రాజు అవుతాడా! రాముని రాజుగా నేను చూడగలనా!” అని అనుకున్నాడు. రాముడికి రాజు కాదగ్గ లక్షణములు ఉన్నాయా అని ఆలోచించాడు.

అయోధ్యావాసులందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాముడు ఎల్లప్పుడూ ప్రజల యొక్క వృద్ధిని కోరుకొనే వాడు. అయోధ్యా ప్రజలకు దశరథుని కంటే కూడా రాముడు అంటేనే ఎక్కువ గౌరవము అభిమానము. రాముడు బల పరాక్రమములలో యమునితోనూ ఇంద్రునితోనూ సమానమైనవాడు. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు. ధైర్యములో మేరుపర్వతము వంటి వాడు. ఒక రాజుకు ఉండవలసిన మంచి లక్షణములు అన్నీ రామునికి ఉన్నాయి.

ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దశరథుడు తనమంత్రులను పిలిపించాడు. వారితో ఆలోచించాడు. “అమాత్యులారా! నేను పెద్దవాడిని అయ్యాను. వయసు మీద పడింది. ఇంక రాజ్యపాలన చేయలేను. అయోధ్యప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. రాముడు రాజు అవడం అందరికీ సమ్మతమే. రాముడు రాజు అయితే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. దీనికి మీరంతా అనుమతిస్తారని ఆశిస్తున్నాను.” అని అన్నాడు.

మంత్రులంతా దశరథుని మాటలకు సంతోషంగా తమ ఆమోదము తెలిపారు. వారి అనుమతితో రాముని యువరాజును చేయడానికి నిశ్చయించాడు దశరథుడు. తరువాత దశరథుడు సభను ఏర్పాటు చేసాడు. సామంత రాజులను, పురప్రముఖులను, అధికారులను, ఉద్యోగులను సభకు ఆహ్వానించాడు..

ఇన్ని చేసాడు కానీ కేకయ దేశంలో ఉన్న భరతునికి, శత్రుఘ్నునికి ఈ విషయం తెలియజేయలేదు. తరువాత వారే తెలుసుకుంటారులే అని నిర్లక్ష్యం చేసాడు.

(అలా కాకుండా భరతుని, శత్రుఘ్నుని పిలిపించి వారితో కూడా చెప్పి వారి సమ్మతి కూడా తీసుకొని ఉంటే రామాయణ మహాకావ్యము ఇంతటితో ఆగిపోయి ఉండేదేమో!)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ప్రథమ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వితీయః సర్గః (2) >>

Balakanda Sarga 2 In Telugu – బాలకాండ ద్వితీయః సర్గః

Balakanda Sarga 2 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వితీయ సర్గలో, వాల్మీకి మహర్షి తన శిష్యుడు భారద్వాజుతో కలిసి ఆశ్రమంలో నివసిస్తున్నారు. ఒక రోజు, నారద ముని అక్కడికి వస్తారు. వాల్మీకి మహర్షి నారదునికి పాదాభివందనం చేసి, అతన్ని సన్మానించి, రాముడి మహిమలను వర్ణించమని కోరుతారు. వాల్మీకి మహర్షి రాముడి విశేషాలను తెలుసుకోవాలని అడుగుతారు – ధర్మవంతుడు, ధైర్యవంతుడు, వాక్కును నిలబెట్టేవాడు, ప్రజలకు ప్రీతిపాత్రుడు వంటి లక్షణాలను కలవాడు ఎవరో చెప్పమని.

బ్రహ్మాగమనమ్ 

నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారదః |
పూజయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః ||

1

యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తథా |
ఆపృచ్ఛ్యైవాభ్యనుజ్ఞాతః స జగామ విహాయసమ్ ||

2

స ముహూర్తం గతే తస్మిన్దేవలోకం మునిస్తదా |
జగామ తమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః ||

3

స తు తీరం సమాసాద్య తమసాయా మునిస్తదా |
శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమమ్ ||

4

అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ |
రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథా ||

5

న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ |
ఇదమేవావగాహిష్యే తమసాతీర్థముత్తమమ్ ||

6

ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా |
ప్రాయచ్ఛత మునేస్తస్య వల్కలం నియతో గురోః ||

7

స శిష్యహస్తాదాదాయ వల్కలం నియతేంద్రియః |
విచచార హ పశ్యంస్తత్సర్వతో విపులం వనమ్ ||

8

తస్యాభ్యాశే తు మిథునం చరంతమనపాయినమ్ |
దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారునిఃస్వనమ్ ||

9

తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః |
జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః ||

10

తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే |
భార్యా తు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరమ్ ||

11

వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా |
తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై ||

12

తథా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితమ్ |
ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత ||

13

తతః కరుణవేదిత్వాదధర్మోఽయమితి ద్విజః |
నిశామ్య రుదతీం క్రౌంచీమిదం వచనమబ్రవీత్ ||

14

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః |
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్ ||

15

తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః |
శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా ||

16

చింతయన్స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్ మతిమ్ |
శిష్యం చైవాబ్రవీద్వాక్యమిదం స మునిపుంగవః ||

17

పాదబద్ధోఽక్షరసమస్తంత్రీలయసమన్వితః |
శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా ||

18

శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమమ్ |
ప్రతిజగ్రాహ సంహృష్టస్తస్య తుష్టోఽభవద్గురుః ||

19

సోఽభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్యథావిధి |
తమేవ చింతయన్నర్థముపావర్తత వై మునిః ||

20

భరద్వాజస్తతః శిష్యో వినీతః శ్రుతవాన్ మునిః |
కలశం పూర్ణమాదాయ పృష్ఠతోఽనుజగామ హ ||

21

స ప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహ ధర్మవిత్ |
ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థితః ||

22

ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః |
చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుంగవమ్ ||

23

వాల్మీకిరథ తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః |
ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మితః ||

24

పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవందనైః |
ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వాఽనామయమవ్యయమ్ ||

25

అథోపవిశ్య భగవానాసనే పరమార్చితే |
వాల్మీకయే చ ఋషయే సందిదేశాసనం తతః ||

26

బ్రహ్మణా సమనుజ్ఞాతః సోఽప్యుపావిశదాసనే |
ఉపవిష్టే తదా తస్మిన్సాక్షాల్లోకపితామహే ||

27

తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః |
పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణబుద్ధినా ||

28

యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ |
శోచన్నేవ ముహుః క్రౌంచీముప శ్లోకమిమం పునః ||

29

పునరంతర్గతమనా భూత్వా శోకపరాయణః |
తమువాచ తతో బ్రహ్మా ప్రహస్య మునిపుంగవమ్ ||

30

శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణా |
మచ్ఛందాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేఽయం సరస్వతీ ||

31

రామస్య చరితం కృత్స్నం కురు త్వమృషిసత్తమ |
ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః ||

32

వృత్తం కథయ వీరస్య యథా తే నారదాచ్ఛ్రుతమ్ |
రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః ||

33

రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః |
వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహః ||

34

తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి |
న తే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి ||

35

కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్ |
యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే ||

36

తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి |
యావద్రామాయణ కథా త్వత్కృతా ప్రచరిష్యతి ||

37

తావదూర్ధ్వమధశ్చ త్వం మల్లోకేషు నివత్స్యసి |
ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మా తత్రైవాంతరధీయత ||

38

తతః సశిష్యో భగవాన్మునిర్విస్మయమాయయౌ |
తస్య శిష్యాస్తతః సర్వే జగుః శ్లోకమిమం పునః ||

39

ముహుర్ముహుః ప్రీయమాణా ప్రాహుశ్చ భృశవిస్మితాః |
సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా ||

40

సోఽనువ్యాహరణాద్భూయః శోకః శ్లోకత్వమాగతః |
తస్య బుద్ధిరియం జాతా వాల్మీకేర్భావితాత్మనః |
కృత్స్నం రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహమ్ ||

41

ఉదారవృత్తార్థపదైర్మనోరమై-
-స్తతః స రామస్య చకార కీర్తిమాన్ |
సమాక్షరైః శ్లోకశతైర్యశస్వినో
యశస్కరం కావ్యముదారధీర్మునిః ||

42

తదుపగతసమాససంధియోగం
సమమధురోపనతార్థవాక్యబద్ధమ్ |
రఘువరచరితం మునిప్రణీతం
దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్ ||

43

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే
ఆదికావ్యే బాలకాండే ద్వితీయః సర్గః ||

44

 

నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్మీకి

మహర్షి, మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తరువాత నారదుడు దేవలోకము వెళ్లిపోయాడు.

తరువాత వాల్మీకి మహర్షి తమసానదీ తీరమునకు వెళ్లాడు. ఏ మాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్లాడు. తన శిష్యుని తనకు కావలసిన పాత్ర, నార బట్టలు తెమ్మన్నాడు వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకికి చెంబు, నార బట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకొని వాల్మీకి ఆ వనమంతా ఒక సారి కలయ చూచాడు.

కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టి చంపాడు. ఆమగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడ పక్షి ఎంతో దుఃఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది.

ఏడుస్తున్న ఆ ఆడ పక్షిని చూచాడు వాల్మీకి. ఆయన మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవానిని చూచి ఇలా అన్నాడు.

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీ: సమా: |
యత్ క్రౌఞ్యమిథునాదేకమవధీ: కామమోహితమ్||

“ఓయీ బోయవాడా! నీవు మన్మధావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక దానిని చంపావు. కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడవు అవుదువు కాక!” అనే వాక్యము వాల్మీకి నోటి వెంటవచ్చింది.

అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు. “ఇదేమిటి! నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి! నానోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి!” అని అనుకున్నాడు. వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు. “ఆ క్రౌంచపక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా, దానిని చూచి నేను చలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యము చెప్పాను. అది వృధా కారాదు. అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది.” అని పలికాడు వాల్మీకి.

శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థము చేసాడు. తరువాత వాల్మీకి స్నానము చేయడానికి వెళ్లాడు. స్నానము చేసిన తరువాత తన ఆశ్రమమునకు పోతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళుతున్నాడు. వాల్మీకి ఆశ్రమమునకు పోయి తన నోటి వెంట వచ్చిన శ్లోకమును మననం చేసుకుంటూ ధ్యానములో కూర్చున్నాడు. ఆ ధ్యానములో ఆయనకు ఇతర వాక్యాలు కథలు స్ఫురించాయి.

ఆసమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి ఆయన ఆశ్రమమునకు వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము సమర్పించాడు. ఉచితాసనము మీద కూర్చోపెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశము మేరకు తాను కూడా ఒక ఆసనము మీదకూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాత్రము ఆ క్రౌంచపక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు. “ఆ హా! అందముగా విహరిస్తున్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా!” అని ఆలోచిస్తున్నాడు. వాల్మీకి మనస్సు దుఃఖంతో నిండి పోయింది. ఆప్రయత్నంగా ఆ వాక్యము ఆయన నోటి వెంట వచ్చింది.

ఆ వాక్యములను విన్నాడు బ్రహ్మ. ” ఓ వాల్మీకి మహర్షి! నీ నోట వెంట వచ్చిన వాక్యము శ్లోకమే. అందుకు సందేహము లేదు. ఇది నా సంకల్పమే. నా సంకల్పము వల్లనే నీ నోటి వెంట ఆ వాక్యము వెలువడింది. అది శ్లోకము అయింది. నీవు పుణ్యప్రదమును, మనస్సులను రమింపచేయునదియును అగు రాముని యొక్క చరితమును శ్లోకరూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు. గుణవంతుడు. బుద్ధిమంతుడు. రాముని కధను నీకు నారదుడు చెప్పాడు కదా. అదే కధను సవిస్తరముగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయములూ, తెలియని విషయములూ అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి.

ఈ రామాయణ కావ్యములో నీవు రాసిన ఏ ఒక్కమాట కూడా అసత్యము కాదు. కాబట్టి నీవు రామ కధను శ్లోకరూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకూ రామ చరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీ చే రచింప బడిన రామాయణ కావ్యము ఎంత కాలము ప్రచారంలో ఉంటుందో అంత కాలమూ నేను సృష్టించిన సమస్తలోకములలో నీవు నివసిస్తావు.” అని పలికాడు బ్రహ్మదేవుడు. తరువాత బ్రహ్మదేవుడు అంతర్థానమయ్యాడు.

ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు. నాలుగు పాదములతో, సమసంఖ్యగల అక్షరములతో, మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటి కీ గానం చేయడం వలన శ్లోకత్వము పొందింది.

ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి “రామాయణ మహా కావ్యమును అంతా ఇదే విధంగా శ్లోకరూపంలో రచిస్తాను” అని నిశ్చయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామ చరితమును ఉదారమైన పదములతో, మనోహరములైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములలో రచించాడు. ఆ మహా కావ్యము సమాసములతోనూ, సంధులతోనూ, వ్యుత్పత్తులతోనూ, సుమధురములు, అర్థవంతములు అయిన వాక్యములతోనూ అలరారింది.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో రెండవ సర్గ సంపూర్ణము.

 ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ  తృతీయః సర్గః (3) >>

Valmiki Ramayana Ayodhya Kanda In Telugu – వాల్మీకి రామాయణం అయోధ్యకాండ

Valmiki Ramayana Ayodhya Kanda In Telugu

భారతీయ వాఙ్మయములో రామాయణము, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను ‘’కాండములు’’ అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో అయోధ్యా కాండ రెండవ కాండము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: శ్రీరాముని పట్టాభిషేక సన్నాహాలు, కైకేయి కోరిక, దశరధుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము..

Valmiki Ramayana Ayodhya Kanda Telugu PDF

అయోధ్యకాండ

  1. ప్రథమః సర్గః
  2. ద్వితీయః సర్గః
  3. తృతీయః సర్గః
  4. చతుర్థః సర్గః
  5. పంచమః సర్గః
  6. షష్ఠః సర్గః
  7. సప్తమః సర్గః
  8. అష్టమః సర్గః
  9. నవమః సర్గః
  10. దశమః సర్గః
  11. ఏకాదశః సర్గః
  12. ద్వాదశః సర్గః
  13. త్రయోదశః సర్గః
  14. చతుర్దశః సర్గః
  15. పంచదశః సర్గః
  16. షోడశః సర్గః
  17. సప్తదశః సర్గః
  18. అష్టాదశః సర్గః
  19. ఏకోనవింశః సర్గః
  20. వింశః సర్గః
  21. ఏకవింశః సర్గః
  22. ద్వావింశః సర్గః
  23. త్రయోవింశః సర్గః
  24. చతుర్వింశః సర్గః
  25. పంచవింశః సర్గః
  26. షడ్వింశః సర్గః
  27. సప్తవింశః సర్గః
  28. అష్టావింశః సర్గః
  29. ఏకోనత్రింశః సర్గః
  30. త్రింశః సర్గః
  31. ఏకత్రింశః సర్గః
  32. ద్వాత్రింశః సర్గః
  33. త్రయస్త్రింశః సర్గః
  34. చతుస్త్రింశః సర్గః
  35. పంచత్రింశః సర్గః
  36. షట్త్రింశః సర్గః
  37. సప్తత్రింశః సర్గః
  38. అష్టాత్రింశః సర్గః
  39. ఏకోనచత్వారింశః సర్గః
  40. చత్వారింశః సర్గః
  41. ఏకచత్వారింశః సర్గః
  42. ద్విచత్వారింశః సర్గః
  43. త్రిచత్వారింశః సర్గః
  44. చతుశ్చత్వారింశః సర్గః
  45. పంచచత్వారింశః సర్గః
  46. షట్చత్వారింశః సర్గః
  47. సప్తచత్వారింశః సర్గః
  48. అష్టచత్వారింశః సర్గః
  49. ఏకోనపంచాశః సర్గః
  50. పంచాశః సర్గః
  51. ఏకపంచాశః సర్గః
  52. ద్విపంచాశః సర్గః
  53. త్రిపంచాశః సర్గః
  54. చతుఃపంచాశః సర్గః
  55. పంచపంచాశః సర్గః
  56. షట్పంచాశః సర్గః
  57. సప్తపంచాశః సర్గః
  58. అష్టపంచాశః సర్గః
  59. ఏకోనషష్టితమః సర్గః
  60. షష్టితమః సర్గః
  61. ఏకషష్టితమః సర్గః
  62. ద్విషష్టితమః సర్గః
  63. త్రిషష్టితమః సర్గః
  64. చతుఃషష్టితమః సర్గః
  65. పంచషష్టితమః సర్గః
  66. షట్షష్టితమః సర్గః
  67. సప్తషష్టితమః సర్గః
  68. అష్టషష్టితమః సర్గః
  69. ఏకోనసప్తతితమః సర్గః
  70. సప్తతితమః సర్గః
  71. ఏకసప్తతితమః సర్గః
  72. ద్విసప్తతితమః సర్గః
  73. త్రిసప్తతితమః సర్గః
  74. చతుఃసప్తతితమః సర్గః
  75. పంచసప్తతితమః సర్గః
  76. షట్సప్తతితమః సర్గః
  77. సప్తసప్తతితమః సర్గః
  78. అష్టసప్తతితమః సర్గః
  79. ఏకోనాశీతితమః సర్గః
  80. అశీతితమః సర్గః
  81. ఏకాశీతితమః సర్గః
  82. ద్వయశీతితమః సర్గః
  83. త్ర్యశీతితమః సర్గః
  84. చతురశీతితమః సర్గః
  85. పంచాశీతితమః సర్గః
  86. షడశీతితమః సర్గః
  87. సప్తాశీతితమః సర్గః
  88. అష్టాశీతితమః సర్గః
  89. ఏకోననవతితమః సర్గః
  90. నవతితమః సర్గః
  91. ఏకనవతితమః సర్గః
  92. ద్వినవతితమః సర్గః
  93. త్రినవతితమః సర్గః
  94. చతుర్నవతితమః సర్గః
  95. పంచనవతితమః సర్గః
  96. షణ్ణవతితమః సర్గః
  97. సప్తనవతితమః సర్గః
  98. అష్టనవతితమః సర్గః
  99. ఏకోనశతతమః సర్గః
  100. శతతమః సర్గః
  101. ఏకాధికశతతమః సర్గః
  102. ద్వ్యధికశతతమః సర్గః
  103. త్ర్యధికశతతమః సర్గః
  104. చతురధికశతతమః సర్గః
  105. పంచాధికశతతమః సర్గః
  106. షడధికశతతమః సర్గః
  107. సప్తాధికశతతమః సర్గః
  108. అష్టాధికశతతమః సర్గః
  109. నవాధికశతతమః సర్గః
  110. దశాధికశతతమః సర్గః
  111. ఏకాదశాధికశతతమః సర్గః
  112. ద్వాదశాధికశతతమః సర్గః
  113. త్రయోదశాధికశతతమః సర్గః
  114. చతుర్దశాధికశతతమః సర్గః
  115. పంచదశాధికశతతమః సర్గః
  116. షోడశాధికశతతమః సర్గః
  117. సప్తదశాధికశతతమః సర్గః
  118. అష్టాదశాధికశతతమః సర్గః
  119. ఏకోనవింశత్యధికశతతమః సర్గః

← బాలకాండ అరణ్యకాండ  →

Balakanda Sarga 1 In Telugu – బాలకాండ ప్రథమః సర్గః

Balakanda Sarga 1 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. వాల్మీకి మహర్షి బాలకాండంలో రాముని జీవిత చరిత్రను అద్భుతమైన రీతిలో చూపించారు. రాముని బాల్య కథనం, ఆత్మవిశ్వాసం, సహజ సమానులు, భర్యలకు ప్రేమ మరియు సహాయకుల మధ్య వివిధ సమానాలను వర్ణించారు. రాజు దశరథుడు అయోధ్యలో రాజ్యం సంపాదించిన విషయంలో చిత్రీకరించారు. ఈ ప్రసంగంలో రాముని జన్మకు సంబంధించిన అనేక అద్భుత ఘటనలు చేరుకున్నాయి.

నారదవాక్యమ్ (సంక్షేప రామాయణం)

తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ ||

1

కోఽన్వస్మిన్సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ||

2

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ||

3

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః |
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||

4

ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే |
మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ||

5

శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః |
శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ||

6

బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః |
మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః ||

7 [బుద్ధ్యా]

ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః |
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్వశీ ||

8

బుద్ధిమాన్నీతిమాన్వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః |
విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః ||

9

మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః |
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ||

10

సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ |
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ||

11

ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః |
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ||

12

ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః |
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ||

13

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |
వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ||

14

సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ప్రతిభానవాన్ |
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః ||

15

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః |
ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః ||

16

స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః |
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ||

17

విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః |
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ||

18

ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః |
తమేవంగుణసంపన్నం రామం సత్యపరాక్రమమ్ ||

19

జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథః సుతమ్ |
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా ||

20

యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ప్రీత్యా మహీపతిః |
తస్యాభిషేకసంభారాన్దృష్ట్వా భార్యాఽథ కైకయీ ||

21

పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత |
వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ||

22

స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః | [చైవ]
వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ ||

23

స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ |
పితుర్వచననిర్దేశాత్కైకేయ్యాః ప్రియకారణాత్ ||

24

తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోఽనుజగామ హ |
స్నేహాద్వినయసంపన్నః సుమిత్రానందవర్ధనః ||

25

భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ |
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా ||

26

జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా |
సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమా వధూః ||

27

సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా |
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ ||

28

శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ |
గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్ ||

29

గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా |
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః ||

30

చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ |
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః ||

31

దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్సుఖమ్ |
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా ||

32

రాజా దశరథః స్వర్గం జగామ విలపన్సుతమ్ |
మృతే తు తస్మిన్భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ||

33

నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః |
స జగామ వనం వీరో రామపాదప్రసాదకః ||

34

గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమమ్ | [స మహా.]
అయాచద్భ్రాతరం రామమార్యభావపురస్కృతః ||

35

త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోఽబ్రవీత్ |
రామోఽపి పరమోదారః సుముఖః సుమహాయశాః ||

36

న చైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః |
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః ||

37

నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః |
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ||

38

నందిగ్రామేఽకరోద్రాజ్యం రామాగమనకాంక్షయా |
గతే తు భరతే శ్రీమాన్సత్యసంధో జితేంద్రియః ||

39

రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్రాగమనమేకాగ్రో దండకాన్ప్రవివేశ హ ||

40

ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః |
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ ||

41

సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా |
అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనమ్ ||

42

ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ |
వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ||

43

ఋషయోఽభ్యాగమన్సర్వే వధాయాసురరక్షసామ్ |
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ||

44

ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్ |
ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినామ్ ||

45

తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ |
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ||

46

తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్సర్వరాక్షసాన్ |
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ ||

47

నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ |
వనే తస్మిన్నివసతా జనస్థాననివాసినామ్ ||

48

రక్షసాం నిహతాన్యాసన్సహస్రాణి చతుర్దశ |
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః ||

49

సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ |
వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః ||

50

న విరోధో బలవతా క్షమో రావణ తేన తే |
అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః ||

51

జగామ సహమారీచస్తస్యాశ్రమపదం తదా |
తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ ||

52

జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ |
గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ ||

53

రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః |
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ ||

54

మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ |
కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనమ్ ||

55

తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః |
స చాఽఽస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్ ||

56

శ్రమణీం ధర్మనిపుణామభిగచ్ఛేతి రాఘవమ్ |
సోఽభ్యగచ్ఛన్మహాతేజాః శబరీం శత్రుసూదనః ||

57

శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః |
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ ||

58

హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః |
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ||

59

ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః |
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః ||

60

చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికమ్ |
తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ||

61

రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ |
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి ||

62

వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః |
సుగ్రీవః శంకితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే ||

63

రాఘవప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమమ్ |
దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభమ్ ||

64

ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః |
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనమ్ ||

65

బిభేద చ పునః సాలాన్సప్తైకేన మహేషుణా |
గిరిం రసాతలం చైవ జనయన్ప్రత్యయం తదా ||

66

తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః |
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా ||

67

తతోఽగర్జద్ధరివరః సుగ్రీవో హేమపింగళః |
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ||

68

అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః |
నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః ||

69

తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే |
సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ ||

70

స చ సర్వాన్సమానీయ వానరాన్వానరర్షభః |
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ||

71

తతో గృధ్రస్య వచనాత్సంపాతేర్హనుమాన్బలీ |
శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ||

72

తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితామ్ |
దదర్శ సీతాం ధ్యాయంతీమశోకవనికాం గతామ్ ||

73

నివేదయిత్వాఽభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ |
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ||

74

పంచ సేనాగ్రగాన్హత్వా సప్త మంత్రిసుతానపి |
శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ||

75

అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ |
మర్షయన్రాక్షసాన్వీరో యంత్రిణస్తాన్యదృచ్ఛయా ||

76

తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాం చ మైథిలీమ్ |
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ||

77

సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ |
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః ||

78

తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః |
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః ||

79

దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః |
సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ ||

80

తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే |
రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ||

81

తామువాచ తతో రామః పరుషం జనసంసది |
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ ||

82

తతోఽగ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్ |
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః ||

83

కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్ |
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః ||

84

అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణమ్ |
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ ||

85

దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ |
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః ||

86

భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః |
భరతస్యాంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ ||

87

పునరాఖ్యాయికాం జల్పన్సుగ్రీవసహితశ్చ సః |
పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా ||

88

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోఽనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||

89

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః | [ప్రహృష్టో]
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః ||

90

న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

91

న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా ||

92

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ ||

93

నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||

94

గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకమ్ |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||

95

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేఽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

96

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ||

97

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

98

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||

99

పఠన్ ద్విజో వాగృషభత్వమీయా-
-త్స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ |
వణిగ్జనః పణ్యఫలత్వమీయా-
-జ్జనశ్చ శూద్రోఽపి మహత్త్వమీయాత్ ||

100

వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు.

“ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్ర మవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటి వారి ఎడల ఆదర భావము కలవాడు, చేసినమేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా!

అంతేకాదు, మంచి నడవడి కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిస లాడేవాడు, అటువంటి వ్యక్తి ఎవరున్నారు?

ఓ మహర్షీ! మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ, ద్వేషములను దగ్గరకు రానీయని వాడు, యుద్దరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు,. ఇటువంటి సద్గుణములు కల నరుడిని (మానవుడిని) గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది.

దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు. అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి.” అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు.

అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణము లైన దుర్లభములైన గుణములు. కాని అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను. విను.

ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహా పురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల అందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు. మహావీరుడు. మంచి ప్రకాశము కలవాడు. అసాధారణమైన ధైర్యము కలవాడు.

అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు. నీతిమంతుడు. సకల శాస్త్ర పారంగతుడు. శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు. ఆజానుబాహుడు. స్ఫురద్రూపి. అందగాడు. విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనుస్సు చాలా గొప్పది. శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు, అని చెప్పి మరీ పొడుగు కాదు. రామునికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నాయి. సకల శుభ లక్షణ సమన్వితుడు రాముడు.

రాముడు సకల ధర్మములు తెలిసిన వాడు. సత్యమునే పలికెడు వాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు. మంచి యశస్వి. జ్ఞాన సంపన్నుడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు. శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైన వాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు. ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు.

రాముడు తనను తాను రక్షించుకుంటూ, తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు వేదాంగములు చదివిన వాడు. ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రముల అర్థములను తెలిసిన వాడు. మంచి జ్ఞాపక శక్తి కలవాడు. మంచి ప్రతిభావంతుడు. సర్వలోక ప్రియుడు. సాధుజనుల యందు, దీనుల యందు దయగలవాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే, సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు. హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు.

ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కాని రాముడు కోపం వస్తే ప్రళయాగ్నిస్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు.

అటువంటి రామునికి తండ్రి దశరధుడు. దశరధుడు సకలగుణాభిరాముడైన రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఇది దశరధుని భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరధుని తనకు పూర్వము ఇస్తానన్న రెండు వరములు ఇమ్మని కోరింది. ఆ రెండు వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్లగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పని, తప్పలేని దశరధుడు రాముని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు. తల్లితండ్రుల మాటలను శిరసావహించి, రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్లాడు.

రాముని తమ్ముడు లక్ష్మణుడు. అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యము లకు వెళ్లాడు. రాముని భార్య సీత. రామునికి ప్రాణసమాను రాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న. నారీలోకములో ఉ త్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా, రాముని విడిచి ఉండలేక, సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్లింది.

రాముడు, లక్ష్మణుడు సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తరువాత రాముని ఆదేశము మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిభేరపురములో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. తరువాత రాముడు తన సారధిని రధమును వెనక్కు తీసుకొని వెళ్ల మని పంపివేసాడు.

మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనమునుండి మరొక వనమునకుపోతూ, భారద్వాజమహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అను ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నివసిస్తున్నారు.

ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరధుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరధుని మరణం తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని వసిష్టుడు మొదలగు వారుకోరారు. కాని భరతుడు ఒప్పుకొన లేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిపి, తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు.

ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని, రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు. రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుని వెనక్కు పంపివేసాడు. భరతుడు రామ పాదుకలను భక్తితో స్వీకరించి, అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్లాడు. అక్కడు రాముని పాదుకలను ఉంచాడు. రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు.

తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష మహర్షిని, అగస్త్య మహర్షిని, ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉ న్నదని, ఆరాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు. తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు.

ఆ దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలు పేరు శూర్పణఖ. ఆమె కామ రూపిణి. ఆమె రాముని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేసాడు. శూర్పణఖ వెళ్లి రావణుని సైన్యాధి పతులైన ఖర, దూషణ, త్రిశిరులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది.

వారందరూ రాముని మీదికి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు. ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యము లో ఉన్నపుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు.

ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు. కాని మారీచుడు ఒప్పుకొనలేదు. ఖర, దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కాని రావణుడు వినలేదు. మారీచుని బలవంతంగా ఒప్పించాడు.

మారీచుని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమమునకు వెళ్లాడు. మారీచుని సాయముతో రాముని, లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు.

రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. సీత కనపడలేదు. సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువుకు దహన సంస్కారములు చేసారు. తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుని చూచారు. తమకు అపకారము చేయబోయిన కబంధుని చంపి అతనికి శాపవిముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్లమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేసారు రామలక్ష్మణులు.

తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్లారు. శబరి వారిని పూజించింది. తరువాత వారు పంపా తీరమునకు వెళ్లారు. అక్కడ హనుమంతుని చూచారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహము చేసారు. రాముడు తన గురించి సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తనకు, తన అన్న వాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు.

రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞచేసాడు. కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగింది. అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో పది యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేసాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది.

రాముని వెంటతీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్లాడు సుగ్రీవుడు. బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలిబయటకు వచ్చాడు. వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ల వద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేసాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసాడు.

తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు.

తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము చేసాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను ఐదుగురిని చంపాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింప బడ్డాడు. తరువాత తనను తాను విడిపించుకొని లంకాదహనము చేసాడు.

హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతన చూచాను అని రామునితో చెప్పాడు. తరువాత వానర సేనలతో సముద్ర తీరము చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు. తనకు దారి ఇవ్వని సముద్రుని తన రామబాణముతో అల్లకల్లోలము చేసాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ సేతువుమీదుగా లంకకు చేరుకున్నాడు.

రావణునితో యుద్ధముచేసి రావణుని సంహరించాడు. కాని అన్నిరోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహ పడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశము చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు.

రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు. రామ రాజ్యంలో అగ్ని భయం, చోర భయం, జలభయం, ఆకలి భయం గానీ, లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు.

రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగములు చేసాడు. లక్షల కొలదీ గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామ రాజ్యములో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు.
ఈ రామ చరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది. పుణ్యములను కలుగజేస్తుంది. ఈ రామ కధ వేదసమ్మతము. ఈ రామ చరిత్రను చదివినవారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్రపౌత్రాదు లతో సకలసుఖములు అనుభవిస్తారు. తరువాత స్వర్గలోకము చేరు కుంటారు.

ఈరామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులవుతారు.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో మొదటి సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ ద్వితీయః సర్గః (2) >>

Heramba Upanishad In Telugu – హేరంబోపనిషత్

Heramba Upanishad In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హేరంబోపనిషత్ హిందూ ధర్మశాస్త్రాల్లో ఒక ప్రముఖ ఉపనిషత్. ఇది హేరంబుడు లేదా గణపతి గురించి వివరిస్తుంది, ఆయన గణపతిదేవుని ఒక అవతారం. ఈ ఉపనిషత్‌లో హేరంబుని రూపం, గుణాలు, లీలలు, మహిమలు విపులంగా వర్ణించబడతాయి. హేరంబుని ఆరాధన, మంత్రాలు, శ్లోకాలు, తత్వాలు ఇందులో ప్రస్తావించబడతాయి. దీన్ని పఠించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం, శక్తి, మరియు దైవానుగ్రహం లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు హేరంబోపనిషత్ గురించి తెలుసుకుందాం.

Heramba Upanishad In Telugu

హేరంబోపనిషత్

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

అథాతో హేరంబోపనిషదం వ్యాఖ్యాస్యామః | గౌరీ సా సర్వమఙ్గలా సర్వజ్ఞం పరిసమేత్యోవాచ |

అధీహి భగవన్నాత్మవిద్యాం ప్రశస్తాం యయా జన్తుర్ముచ్యతే మాయయా చ |
యతో దుఃఖాద్విముక్తో యాతి లోకం పరం శుభ్రం కేవలం సాత్త్వికం చ || ౧ ||

తాం వై స హోవాచ మహానుకమ్పాసిన్ధుర్బన్ధుభువనస్య గోప్తా |
శ్రద్ధస్వైతద్గౌరీ సర్వాత్మనా త్వం మా తే భూయః సంశయోఽస్మిన్ కదాచిత్ || ౨ ||

హేరంబతత్త్వే పరమాత్మసారే నో వై యోగాన్నైవ తపోబలేన |
నైవాయుధప్రభావతో మహేశి దగ్ధం పురా త్రిపురం దైవయోగాత్ || ౩ ||

తస్యాపి హేరంబగురోః ప్రసాదాద్యథా విరిఞ్చిర్గరుడో ముకున్దః |
దేవస్య యస్యైవ బలేన భూయః స్వం స్వం హితం ప్రాప్య సుఖేన సర్వమ్ || ౪ ||

మోదన్తే స్వే స్వే పదే పుణ్యలబ్ధే సవైర్దేవైః పూజనీయో గణేశః |
ప్రభుః ప్రభూణామపి విఘ్నరాజః సిన్దూరవర్ణః పురుషః పురాణః || ౫ ||

లక్ష్మీసహాయోఽద్వయకుఞ్జరాకృతిశ్చతుర్భుజశ్చన్ద్రకలాకలాపః |
మాయాశరీరో మధురస్వభావస్తస్య ధ్యానాత్ పూజనాత్తత్స్వభావాః || ౬ ||

సంసారపారం మునయోఽపి యాన్తి స వా బ్రహ్మా స ప్రజేశో హరిః సః |
ఇన్ద్రః స చన్ద్రః పరమః పరాత్మా స ఏవ సర్వో భువనస్య సాక్షీ || ౭ ||

స సర్వలోకస్య శుభాశుభస్య తం వై జ్ఞాత్వా మృత్యుమత్యేతి జన్తుః |
నాన్యః పన్థా దుఃఖవిముక్తిహేతుః సర్వేషు భూతేషు గణేశమేకమ్ || ౮ ||

విజ్ఞాయ తం మృత్యుముఖాత్ ప్రముచ్యతే స ఏవమాస్థాయ శరీరమేకమ్ |
మాయామయం మోహయతీవ సర్వం స ప్రత్యహం కురుతే కర్మకాలే || ౯ ||

స ఏవ కర్మాణి కరోతి దేవో హ్యేకో గణేశో బహుధా నివిష్టః |
స పూజితః సన్ సుముఖోఽభిభూత్వా దన్తీముఖోఽభీష్టమనన్తశక్తిః || ౧౦ ||

స వై బలం బలినామగ్రగణ్యః పుణ్యః శరణ్యః సకలస్య జన్తోః |
తమేకదన్తం గజవక్త్రమీశం విజ్ఞాయ దుఃఖాన్తముపైతి సద్యః || ౧౧ ||

లంబోదరోఽహం పురుషోత్తమోఽహం విఘ్నాన్తకోఽహం విజయాత్మకోఽహమ్ |
నాగాననోఽహం నమతాం సుసిద్ధః స్కన్దాగ్రగణ్యో నిఖిలోఽహమస్మి || ౧౨ ||

న మేఽన్తరాయో న చ కర్మలోపో న పుణ్యపాపే మమ తన్మయస్య |
ఏవం విదిత్వా గణనాథతత్త్వం నిరన్తరాయం నిజబోధబీజమ్ || ౧౩ ||

క్షేమఙ్కరం సన్తతసౌఖ్యహేతుం ప్రయాన్తి శుద్ధం గణనాథతత్త్వమ్ |
విద్యామిమాం ప్రాప్య గౌరీ మహేశాదభీష్టసిద్ధిం సమవాప సద్యః |
పూజ్యా పరా సా చ జజాప మన్త్రం శంభుం పతిం ప్రాప్య ముదం హ్యవాప || ౧౪ ||

య ఇమాం హేరంబోపనిషదమధీతే స సర్వాన్ కామాన్ లభతే | స సర్వపాపైర్ముక్తో భవతి | స సర్వైర్వేదైర్జ్ఞాతో భవతి | స సర్వైర్దేవైః పూజితో భవతి | స సర్వవేదపారాయణఫలం లభతే | స గణేశసాయుజ్యమవాప్నోతి య ఏవం వేద | ఇత్యుపనిషత్ |

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

మరిన్ని ఉపనిషత్తులు:

Sri Lalitha Ashtottara Shatanamavali In Telugu – శ్రీ లలితాష్టోత్తర శతనామావళిః

Sri Lalitha Ashtottara Shatanamavali In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితాష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ లలితాష్టోత్తర శతనామావళిః

ఓం ఐం హ్రీం శ్రీం అని ప్రతి నామమునకు ముందు చేర్చి అర్చనచేయాలి.
ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమః
ఓం హిమాచల మహావంశపావనాయై నమోనమః
ఓం శంకరార్ధాంగ సౌందర్యశరీరాయై నమోనమః
ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమోనమః
ఓం మహాతిశయసౌందర్యలావ ణాయయై నమోనమః
ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమోనమః
ఓం సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమోనమః
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమోనమః
ఓం కస్తూరీ తిలకోల్లాసినిటలాయై నమోనమః
ఓం భస్మరేఖాంకి తల సన్మస్తకాయై నమోనమః

10

ఓం వికచాంభోరుహదళ లోచనాయై నమోనమః
ఓం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమోనమః
ఓం లసత్కాంచనతాటంకయుగళాయై నమోనమః
ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమోనమః
ఓం తాంబూల పూరిత స్మేరవదనాయై నమోనమః
ఓం సుపక్వదాడిమీబీజరదనాయై నమోనమః
ఓం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమోనమః
ఓం స్థూలముక్తాఫలోదారసుహారాయై నమోనమః
ఓం గిరీశబద్ధమాంగళ్య మంగళాయై నమోనమః
ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమోనమః

20

ఓం పద్మకైరవమందార సుమాలిన్యై నమోనమః
ఓం సువర్ణకుంభయుగ్మాభ సుకుచాయై నమోనమః
ఓం రమణీయచతుర్భాహుసంయుక్తాయై నమోనమః
ఓం కనకాంగదకేయూరభూషితాయై నమోనమః
ఓం బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై నమోనమః
ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమోనమః
ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమోనమః
ఓం దివ్యభూషణసందోహరంజితాయై నమోనమః
ఓం పారిజాతగుణాధిక్య పదాబ్జాయై నమోనమః
ఓం సుపద్మరాగసంకాశచరణాయై నమోనమః

30

ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమోనమః
ఓం శ్రీకంఠనేత్ర కుముదచంద్రికాయై నమోనమః
ఓం సచామరరమావాణీవీజితాయై నమోనమః
ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమోనమః
ఓం భూతేశాలింగనోద్భూతపుల కాంగ్యై నమోనమః
ఓం అనంగజనకాపాంగవీక్షణాయై నమోనమః
ఓం బ్రహ్మోపేంద్రశిరోరత్న రంజితాయై నమోనమః
ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమోనమః
ఓం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమోనమః
ఓం అమృతాది మహాశక్తిసంవృతాయై నమోనమః

40

ఓం ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమోనమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమోనమః
ఓం దేవర్షి భిస్తూయమానవైభవాయై నమోనమః
ఓం కలశోద్భవ దుర్వాసఃపూజితాయై నమోనమః
ఓం మత్తేభవక్రషడ్వక్తవత్సలాయై నమోనమః
ఓం చక్రరాజమహాయంత్రమధ్యవర్యై నమోనమః
ఓం చిదగ్నికుండసంభూతసుదేహాయై నమోనమః
ఓం శశాంకఖండసంయుక్త మకుటాయై నమోనమః
ఓం మత్తహంసవధూ మందగమనాయై నమోనమః
ఓం వందారుజనసందోహవందితాయై నమోనమః

50

ఓం అంతర్ముఖ జనానందఫలదాయై నమోనమః
ఓం పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమోనమః
ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమోనమః
ఓం నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమోనమః
ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమోనమః
ఓం రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమోనమః
ఓం హానివృద్ధి గుణాధిక్యరహితాయై నమోనమః
ఓం మహాపద్మాటవీమధ్యనివాసాయై నమోనమః
ఓం జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమోనమః
ఓం మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమోనమః

60

ఓం దుష్టభీతి మహాభీతిభంజనాయై నమోనమః
ఓం సమస్తదేవదనుజప్రేరికాయై నమోనమః
ఓం సమస్తహృదయాంభోజనిలయాయై నమోనమః
ఓం అనాహతమహాపద్మమందిరాయై నమోనమః
ఓం సహస్రార సరోజాతవాసి తాయై నమోనమః
ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమోనమః
ఓం వాణీగాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమోనమః
ఓం రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై నమోనమః
ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమోనమః
ఓం సహస్రరతిసౌందర్యశరీరాయై నమోనమః

70

ఓం భావనామాత్రసంతుష్ట హృదయాయై నమోనమః
ఓం సత్యసంపూర్ణ విజ్ఞానసిద్ధిదాయై నమోనమః
ఓం త్రిలోచనకృతోల్లాస ఫలదాయై నమోనమః
ఓం శ్రీసుధాబ్ధి మణిద్వీపమధజ్యిగాయై నమోనమః
ఓం దక్షాధ్వర వినిర్భేదసాధనాయై నమోనమః
ఓం శ్రీనాథసోదరీభూతశోభితాయై నమోనమః
ఓం చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమోనమః
ఓం సర్వోపాధివినిర్ముక్త చైతన్యాయై నమోనమః
ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమోనమః
ఓం సృష్టిస్థితితిరోధాన సంకల్పాయై నమోనమః

80

ఓం శ్రీషోడశాక్షరీ మంత్రమధ్యగాయై నమోనమః
ఓం అనాద్యంతస్వయంభూత దివ్యమూర్యై నమోనమః
ఓం భక్తహంసపరీముఖ్యవియోగాయై నమోనమః
ఓం మాతృమండలసంయుక్తలలితాయై నమోనమః
ఓం భండదైత్యమహాసత్త్వనాశనాయై నమోనమః
ఓం క్రూరభండ శిరశ్ఛేదనిపుణాయై నమోనమః
ఓం ధాత్రచ్యుతసురాధీశసుఖదాయై నమోనమః
ఓం చండముండనిశుంభాది ఖండనాయై నమోనమః
ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమోనమః
ఓం మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమోనమః

90

ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమోనమః
ఓం మహేశయుక్తనటనతత్పరాయై నమోనమః
ఓం నిజభర్తృముఖాంభోజచింతనాయై నమోనమః
ఓం వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమోనమః
ఓం జన్మమృత్యుజరారోగ భంజనాయై నమోనమః
ఓం విధేయముక్త విజ్ఞానసిద్ధిదాయై నమోనమః
ఓం కామక్రోధాది షడ్వర్గనాశనాయై నమోనమః
ఓం రాజరాజార్చితపదసరోజాయై నమోనమః
ఓం సర్వవేదాంత సంసిద్ధసుతత్త్వాయై నమోనమః
ఓం శ్రీ వీరభక్త విజ్ఞాననిధానాయై నమోనమః

100

ఓం అశేషదుష్టదనుజసూదనాయై నమోనమః
ఓం సాక్షాదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమోనమః
ఓం హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమోనమః
ఓం దక్షప్రజాపతిసుతావే షాఢ్యాయై నమోనమః
ఓం సుమబాణేక్షుకోదండమండితాయై నమోనమః
ఓం నిత్యయౌవనమాంగల్య మంగళాయై నమోనమః
ఓం మహాదేవసమాయుక్తశరీరాయై నమోనమః
ఓం చతుర్వింశతి తత్వైక్య స్వరూపాయై నమోనమః

108

Skandopanishad In Telugu – స్కందోపనిషత్

Skandopanishad In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. స్కందోపనిషత్ హిందూ ధర్మశాస్త్రాల్లో ఒక ప్రముఖ ఉపనిషత్. ఇది అంగారకుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పిలవబడే స్కంద దేవుడిని ప్రశంసిస్తుంది. ఈ ఉపనిషత్‌లో స్కందుని మహిమలు, అవతారాలు, ఆయన లీలలు విపులంగా వర్ణించబడతాయి. భక్తి మార్గంలో ఇది ప్రాధాన్యతను కలిగి ఉంది. స్కందోపనిషత్‌లో శ్లోకాలు, మంత్రాలు, స్కందుని తత్వాలు వివరిస్తారు. దీన్ని చదవడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం, దైవానుగ్రహం లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు రాజశ్యామలారహస్యోపనిషత్ గురించి తెలుసుకుందాం.

Skandopanishad In Telugu

స్కందోపనిషత్

యత్రాసంభిన్నతాం యాతి స్వాతిరిక్తభిదాతతిః |
సంవిన్మాత్రం పరం బ్రహ్మ తత్స్వమాత్రం విజృంభతే ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||

అచ్యుతోఽస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః |
విజ్ఞానఘన ఏవాస్మి శివోఽస్మి కిమతః పరమ్ || ౧ ||

న నిజం నిజవద్భాత్యంతఃకరణజృంభణాత్ |
అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః || ౨ ||

సంవిన్మాత్రస్థితశ్చాహమజోఽస్మి కిమతః పరమ్ |
వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి || ౩ ||

చిజ్జడానాం తు యో ద్రష్టా సోఽచ్యుతో జ్ఞానవిగ్రహః |
స ఏవ హి మహాదేవః స ఏవ హి మహాహరిః || ౪ ||

స ఏవ హి జ్యోతిషాం జ్యోతిః స ఏవ పరమేశ్వరః |
స ఏవ హి పరం బ్రహ్మ తద్బ్రహ్మాహం న సంశయః || ౫ ||

జీవః శివః శివో జీవః స జీవః కేవలః శివః |
తుషేణ బద్ధో వ్రీహిః స్యాత్తుషాభావేన తండులః || ౬ ||

ఏవం బద్ధస్తథా జీవః కర్మనాశే సదాశివః |
పాశబద్ధస్తథా జీవః పాశముక్తః సదాశివః || ౭ ||

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః || ౮ ||

యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి || ౯ ||

యథాంతరం న భేదాః స్యుః శివకేశవయోస్తథా |
దేహో దేవాలయః ప్రోక్తః స జీవః కేవలః శివః |
త్యజేదజ్ఞాననిర్మాల్యం సోఽహం‍భావేన పూజయేత్ || ౧౦ ||

అభేదదర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః |
స్నానం మనోమలత్యాగః శౌచమింద్రియనిగ్రహః || ౧౧ ||

బ్రహ్మామృతం పిబేద్భైక్ష్యమాచరేద్దేహరక్షణే |
వసేదేకాంతికో భూత్వా చైకాంతే ద్వైతవర్జితే || ౧౨ ||

ఇత్యేవమాచరేద్ధీమాన్స ఏవం ముక్తిమాప్నుయాత్ |
శ్రీపరమధామ్నే స్వస్తి చిరాయుష్యోన్నమ ఇతి || ౧౩ ||

విరించినారాయణశంకరాత్మకం
నృసింహ దేవేశ తవ ప్రసాదతః |
అచింత్యమవ్యక్తమనంతమవ్యయం
వేదాత్మకం బ్రహ్మ నిజం విజానతే || ౧౪ ||

తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః | దివీవ చక్షురాతతమ్ | తద్విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే | విష్ణోర్యత్పరమం పదమ్ | ఇత్యేతన్నిర్వాణానుశాసనమితి వేదానుశాసనమితి వేదానుశాసనమిత్యుపనిషత్ || ౧౫ ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||

ఇతి స్కందోపనిషత్సమాప్తా |

మరిన్ని ఉపనిషత్తులు:

Gowri Devi Pooja Vidhanam In Telugu- శ్రీ గౌరి దేవి పూజ

Gowri Devi Pooja Vidhanam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజలు హిందూ మతంలో ఆరాధన, ప్రార్థన, మరియు ధార్మిక అనుబంధానికి ముఖ్యమైన భాగం. పూజలు దేవతలకు, దేవుళ్లకు, మరియు ఇతర ఆధ్యాత్మిక శక్తులకు ఆరాధన చూపడానికి, వారి ఆశీర్వాదాలు పొందడానికి చేస్తారు. పూజల ద్వారా మనసుకు శాంతి, ఆనందం, మరియు అనుభూతిని పొందవచ్చు. గౌరి పూజా హిందూ మతంలో ముఖ్యమైన పూజా. ఇది ముఖ్యంగా ఆడవారు వారి కుటుంబ సంక్షేమం కోసం మరియు భర్తల దీర్ఘాయుష్షు కోసం చేస్తారు. గౌరి దేవి పూజ, ముఖ్యంగా గౌరి హబ్బా లేదా గౌరిహబ్బా అని కూడా పిలుస్తారు, ఇది గణేష్ చతుర్థికి ముందు రోజు జరుపుకుంటారు. గౌరి దేవి పూజా, పరమ శివుడి భార్య అయిన గౌరి దేవిని ఆరాధించడం ద్వారా ప్రారంభమవుతుంది. గౌరి దేవి శక్తి మరియు కాంతి స్ఫూర్తిని సూచిస్తుంది. ఆమెను ఆరాధించడం వల్ల జీవితంలో శుభం, ఆనందం మరియు శాంతి కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గౌరి దేవి పూజ గురించి తెలుసుకుందాం.

శ్రీ గౌరి దేవి పూజ

ప్రాణ ప్రతిష్ఠా

హ్రాం హ్రీం క్రోం యం రం లం సం శం షం హం సః
మంగళ గౌరీదేవతా స్థిరా భవతు – సుప్రసన్నా భవతు – వరదా భవతు – అనుచు గౌరీదేవిని ప్రతిష్ఠించి ఈ క్రింది విధముగా జెప్పుచూ నమస్కారము చేయవలెను.

దీపారాధనమ్

శ్లో॥ దీపస్త్వం బ్రహ్మరూపో సి – జ్యోతిషాం ప్రభు రవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ – సర్వాన్ కామాంశ్చ దేహి మే ||
దీపదేవతాభ్యోనమః – అని దీపమును పువ్వులతో పూజించవలెను. తరువాత పరిశుద్ధహృదయముతో పుష్పములు తీసికొని మ్రొక్కుచు శ్రీ మంగళగౌరీ దేవిని ఈ విధముగా ధ్యానించవలెను.

శ్లో॥ సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరి కాం
సమందహాసితేక్షణాం – సశరచాపపాశాంకుశాం |
అశేషజనమోహినీ – మరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం – జపవిధౌ స్మరే దంబికామ్ ॥

కల్లోలోల్ల సితామృతాబ్దిల హరీ – మధ్యే విరాజన్మణి
ద్వీపే కల్పకవాటికాపరివృతే – కాదంబవాట్యుజ్జ్యలే |
రత్నస్తంభసహస్రనిర్మితసభా -మధ్యే విమూనోత్తమే
చింతారత్నవినిర్మితం జనని! తే – సింహాసనం భావయే॥

హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నవరత్నఖచితసింహాసనం సమర్పయామి అని వినుతించి శ్రీ మంగళగౌరికి సింహాసనము నొసంగినట్లు భావన చేసి పువ్వుల నుంచవలెను.

ఆవాహనమ్

ఆగచ్ఛ సర్వదేవేశి। సర్వకార్యార్థసిద్ధయే।
సర్వసిద్ధిప్రదే! దేవి। సర్వపాపప్రణాశిని.
హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః ఆవాహనం సమర్పయామి.

పాద్యమ్

గంగాదిసలిలై ర్యుకై – సుగన్దేన సువాసితం!
పాద్యం గృహాణ సుశ్రోణి – రుద్రపత్ని! నమోస్తుతే ॥

హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః పుష్పముతో చల్లవలెను.
అర్ఘ్యం సమర్పయామి కలశ జలమును

అర్ఘ్యమ్

భాగీరథ్యాదిసలిలం – నానాతీర్థసమన్వితం
కర్పూరగంధసంయుక్త మర్థ్యం తుభ్యం దదా మ్యహమ్ ||
హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః – అర్ఘ్యం సమర్పయామి- అని కలశ జలమును పుష్పముతో చల్లవలెను.

ఆచమనమ్

హ్రీం శ్రీం మంగళగౌరీదేవతాయై నమః
ఆచమనం సమర్పయామి.

అని కలశములోని జలమును దేవి ఆచమనమును చేయుట కనుకొని, పుష్పముతో అందించవల యును.

మధుపర్కమ్

స్వర్ణపాత్రే సమానీతం – దధిఖండమధుపుతం
మధుపర్కం గృహాణేదం – మయా దత్తం సరేశ్వరి ॥

హ్రీం శ్రీం మంగళగౌర్యైనమః – మధుపర్కం సమర్పయామి. మధుపర్కమును సమర్పించవలెను. (పాలు, తేనె కలిపిన ద్రవ్యము)

పంచామృతమ్

క్షీరం దధ్యాజ్యమధురా – శర్క రాఫల సంయుతం
స్నానం స్వీకురు దేవేశి। సర్గస్థిత్యంతరూపిణి॥
హ్రీం శ్రీం మంగళగౌర్యైనమః – పంచామృతస్నానం సమర్పయామి.

స్నానమ్

హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి. పువ్వుతో నీరు జల్లవలెను.

వస్త్రమ్

సర్వదే! సర్వదా గౌరి! సర్వాభరణ భూషితే !
పీతాంబరద్వయ మిదం గృహాణ పరమేశ్వరి.

హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః – కంచుకం సమర్పయామి – అని రవికె, వస్త్రము మున్నగునవి సమర్పించి పువ్వులు చల్లి నమస్కరించవలెను.

హ్రీం శ్రీం మంగళగౌర్యైనమః ఉత్తరీయం సమర్పయామి – ఉత్తరీయమును సమర్పించవలెను.

గన్దం

గన్దం మనోహరం దివ్యం – దివ్యం – ఘనసారసమన్వితం
తుభ్యం భవాని ! దాస్వామి – చోత్తమం చానులేపనమ్ ||
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః – చల్లని గంధం సమర్పయామి గంధమును గౌరీదేవిపై చిందించవలెను.

అక్షతలు

అక్షతాన్ శుభవర్ణాభాన్ – హరిద్రాద్యై స్సుసంయుతాన్
కాత్యాయని ! గృహాణ త్వం – సర్వదేవనమస్కృతే.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయైనమః – అక్షతాన్ సమర్పయామి.

మరిన్ని పూజలు: