నిఘంటువు సాయం లేకపోతే ఈ కీర్తన వివరించడం దాదాపు అసాధ్యమే. కోడె వయసుగాడైన గోవిందరాజు వేడుకతో అధరామృతాల నాస్వాదిస్తుంటాడట. నిలువులు మేడమీద నిలిచివుంటాడట. కేళాకూళి అంటే జలక్రీడలని అర్థం. అవంటే మహా ఇష్టంట ఆయనకి. సైరణలేక జాజరచల్లుతాడట. రామలతో సరసాలాడతాడట. మోములు చూచి అందరితో ముచ్చట్లాడతాడట. పాన్పుపై గామిడై కూడినాడట. ఒకటారెండా? దాదాపు అన్నీ తెలియని తెలుగుమాటలే. తెలివిగా భావవివరణ చదివేద్దాం. పదండి ముందుకు. ఇంతకీ ఈ కీర్తన తిరుపతిలోని గోవిందరాజ స్వామిపైననే సుమండీ.
భావ వివరణ:
ఓ భామలారా! ఈ గోవిందరాజస్వామివున్నాడే, ఈయన కోడెగాడు గదమ్మా (కోడెవయసువాడు కదుటమ్మా!) ఈయన వేడుకతో భామల మోవితేనెలు (అధరామృతములను) విందారగించీని (విందువలె నాస్వాదిస్తాడు).
ఈ గోవిందరాజస్వామి తన కొలువుదీర్చియున్నాడు. కానీ తన చెలులతో (ఇద్దరు భామలు భూదేవి శ్రీదేవిలతో) పందేలాడీని (పందెములు కాస్తున్నాడు). ఆయన నిలువులు మేడల మీద (ఎత్తయిన మేడలమీద) నిలిచి అందరినీ పరికిస్తుంటాడు. తన చెలియలతో వలపులు చల్లుతూ వసంతోత్సవం చేసికొంటాడు (హెూలీ ఆడుతుంటాడన్నమాట).
ఆ గోవిందరాజస్వామికి ఇంకొక ఇష్టమైన ఆట వున్నది. అదే కేళాకూళి (జలక్రీడ). బహు కోరికతో ఆయన జలక్రీడను ఇంతులతో (స్త్రీలతో) నీరు చిమ్ముతూ చల్లులాడీ (చల్లుతూనే వుంటాడు). ఆయన శృంగార వనములో తూరుచు (దూరిపోయి) సైరణ లేక (ఆపటం అనేదే లేకుండా) జాజరలాడీని (వున్నట్టుండి వెనుక నుండి నీళ్ళు చిమ్మటం లాంటి కొంటె పనులు చేస్తుంటాడు).
ఈ గోవిందరాజస్వామే, గోముల (సౌకుమార్యంతో) శ్రీవేంకటాద్రిపై రామలతో (స్త్రీలతో) సరసములాడీని (సరసములాడుతున్న) శ్రీవేంకటేశ్వరుడు కూడా అయివున్నాడు. గామిడై (సర్వశ్రేష్ఠుడై) ఈ గోవిందరాజస్వామి తన శయ్యపై, కందువ గూడి (సమర్ధుడై కూడి) మోములు చూచి (వారి అందమైన మొగములను తదేకంగా చూస్తూ) ముచ్చటలాడుతుంటాడు. (ఇన్ని చేస్తూ కూడా శరణాగతులను ఒక కంట కనిపెడుతూనే వుంటాడు సుమా!)
విశిష్టా ద్వైతమత ప్రచారకుడై అన్నమాచార్యులవారు వూరూరా తిరిగి తన కీర్తనలను వినిపించి మరీ విష్ణుతత్త్వం ప్రబోధించారు. ఆ రోజుల్లో రామాలయంలేని వూరు వుండేదికాదు. ఏవూరికెళ్తే ఆవూరి శ్రీరామునిపై కీర్తన చెప్పేవారు. ప్రతి కీర్తనలోనూ రామకథను ఆద్యంతం గానం చేయడం ఆయన ప్రత్యేకత. బహుశా ఆ వూరిలో సంస్కృత పండితులెక్కువమంది వుంటే కీర్తన గీర్వాణిలో చెప్పేవారేమో. అందుకనే అన్నమయ్య సంస్కృత కీర్తనలు యెక్కువగా శ్రీరామునిపైనా నృశింహునిపైనా వున్నాయని నాకు అనిపిస్తుంది. అందుకే… ఓ నరులారా! ఈతడు ఆదినారాయణుడు దశరథసుతునిగా ధరణిలో కీర్తిని పొందాడు… అంటున్నారు.
భావ వివరణ:
ఓ నరులారా! ఈతడెవరనుకొన్నారు? ఆదిదేవుడైన ఆదినారాయణుడు. గాక (అయితే) ధరణిన్ కీరితికెక్కె (భూలోకంలో పేరుపొందినది మాత్రం) దశరథ సుతుడైన శ్రీరామచంద్రమూర్తి అనే సుమా! (మరి ఆయన చేసిన ఘనకార్యాలు అట్లున్నవి).
ఈయన తాటకి అనే రాక్షసిని సంహరించాడు. ఇందరుజూడ (విశ్వామిత్రుని యాగమును చూచుటకు వచ్చిన ఇంత మంది చూస్తుండగా) ఈయన దాని కొడుకులైన మారీచ సుబాహుల మదమును అణచినాడు. ఈచిన్నారి రాముడు, ఏతులకు (ఉద్ధతితో) శివధనస్సును విరిచి అట్టే (అవలీలగా) సీతను పెండ్లాడినాడు.
ఈయన లక్ష్మణుని ప్రేరేపించి ‘చుప్పనాతి’ అని పేరువడ్డ శూర్పనఖ ముక్కు చెవులను కోయించినాడు. సోదించి (వెదకి సోదించి (వెదకి వెదకి) రాక్షసులను సంహరించినాడు. ఆ తరువాత రావణాసురునివంటి వాని మదమణచిన వాలిని ఒక్క అమ్ము వేసి మట్టుబెట్టాడు. ఆ మహానుభావుడే ఈ చిన్నారి రాముడా!! కుప్పించి యెగిరే కోతులను ఒక సేనగా నడిపించిన నాయకుడా!! అవునయ్యా! ఈ కౌసల్యానందనుడే జలధిగట్టి (సముద్రముపై సేతువును నిర్మించి రావణునిపై దండెత్తి స్వర్ణలంకను సాధించినాడు.
ఆనాడావిధంగా రావణుని సంహరించాక ఆ లంకను రావణుని తమ్ముడైన విభీషణునికే పట్టము గట్టిన ధర్మమూర్తి ఈయన. తమ కోసల రాజధాని అయోధ్యా నగరానికి పట్టాభిషిక్తుడై పరిపాలించాడు. ఆనాటి త్రేతాయుగానంతరం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడై తదనంతరం ఈ కలియుగంలో ఇతడే కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై ఈ సృష్టిని రక్షిస్తున్నాడు. ఈ శ్రీరామచంద్రడే మా పాలనున్నాడు (మా పాల దైవమై వున్నాడు).
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ రామ అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…
శ్రీ రామ అష్టోత్తర శతనామావళి
ప్రతి నామమునకు ముందుగా ఓమ్ అని చదువుకొనవలయును
ఓమ్ శ్రీరామాయ నమః
రామభద్రాయ నమః
రామచంద్రాయ నమః
రాజీవలోచనాయ నమః
శ్రీమతే నమః
రాజేంద్రాయ నమః
రఘుపుంగవాయ నమః
జానకీవల్లభాయ నమః
జైత్రాయనమః
జితామిత్రాయ నమః
జనార్ధనాయ నమః
విశ్వామిత్ర ప్రియాయ నమః
దాంతాయ నమః
శరణత్రాణతత్పరాయ నమః
వాలి ప్రమథనాయ నమః
వాగ్మినే నమః
సత్యవాచే నమః
సత్యవిక్రమాయ నమః
సత్యవ్రతాయ నమః
వ్రత ధరాయ నమః
సదాహనుమదాశ్రితాయ నమః
కౌసలేయాయ నమః
ఖరధ్వంసినే నమః
విరాధవధ పండితాయ నమః
విభీషణ పరిత్రాత్రే నమః
దశగ్రీవశిరోహరాయ నమః
సప్త తాళ ప్రభేత్రే నమః
వేదాంతసారాయ నమః
వేదాత్మనే నమః
భవరోగస్యభేషజాయ నమః
దూషణశిరోహంత్రే నమః
త్రిమూర్తయే నమః
త్రిగుణాత్మకాయ నమః
త్రివిక్రమాయ నమః
త్రిలోకాత్మనే నమః
పుణ్యచారిత్రకీర్తనాయ నమః
త్రిలోకరక్షకాయ నమః
ధన్వినే నమః
దండకారణ్యపుణ్యకృతే నమః
అహల్యాశాపశమనాయ నమః
పితృభక్తాయ నమః
వరప్రదాయ నమః
జితక్రోధాయ నమః
జితమిత్రాయ నమః
జనార్ధనాయ నమః
ఋక్షవానరసంఘాతినే నమః
చిత్రకూట సమాశ్రయాయ నమః
జయంత త్రాణతత్పరాయ నమః
సుమిత్రాపుత్ర సేవితాయ నమః
సర్వదేవాదిదేవాయ నమః
సదావానర సేవితాయ నమః
మాయామారీచహంత్రే నమః
హర కోదండఖండనాయ నమః
మహాభోగాయ నమః
జామదగ్న్యమహాదర్పదళనాయ నమః
తాటకాంతకాయ నమః
సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః
మునిసంస్తుతాయ నమః
మహాయోగినే నమః
మహోదారాయ నమః
సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
సర్వపుణ్యాధిక ఫలాయ నమః
స్మృతసర్వాఘనాశనాయ నమః
ఆదిపురుషాయ నమః
మహాపురుషాయ నమః
పురాణపురుషస్తుతాయ నమః
పుణ్యోదయాయ నమః
దయాసారాయ నమః
పురాణపురుషోత్తమాయ నమః
స్మిత వక్రాయ నమః
హరయే నమః
సుందరాయ నమః
అనంత గుణగంభీరాయ నమః
సీతవాసనే నమః
మాయామానుషచారిత్రాయ నమః
సేతుకృతే నమః
మితభాషిణే నమః
పూర్వభాషిణే నమః
రాఘవాయ నమః
సస్వతీర్ధమయాయ నమః
మహాభుజాయ నమః
సర్వదేవస్తుత్యాయ నమః
సర్వయాజ్జాధిపాయ నమః
యజ్వినే నమః
జరామరణవర్జితాయ నమః
శివలింగప్రతిష్ఠాత్రే నమః
సర్వాభరణ భూషితాయ నమః
పరమాత్మనే నమః
పరబ్రహ్మాణే నమః
సచ్చిదానంద విగ్రహాయ నమః
పరస్మై జ్యోతిషే నమః
పరస్యైధామ్నే నమః
పరాకాశాయ నమః
పరాత్పరాయ నమః
పరేశాయ నమః
పారగాయ నమః
పారాయ నమః
శ్యామాంగాయ నమః
శూరాయ నమః
ధీరోదాత్త గుణాశ్రయాయ నమః
ధనర్ధరాయ నమః
మహాదేవాదిపూజితాయ నమః
జితరాశయ నమః
సర్వ దేవాత్మకాయ నమః
శివాయ నమః
శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సరివార సమేత శ్రీ రామ చంద్రాయ నమః
ముండుగా అందరికి నమస్కారం. ఈ రోజు మన భక్తివేద్.కం నందు మీకు పరిచయం చేస్తున్న అంశములు… అష్టకం అంటే ఏమిటి? అష్టకం యొక్క గొప్పదనం, మరియు ఎ సమయంలో ఎ అష్టకం చదవాలో, ఎ, ఏ అష్టకములను చదివితే మంచిదో మరియు వాటిని పటించడం వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది, ఈ క్రింద ఇచ్చిన లింకులు ఆధారంగా అవి ఏమిటో తెలుసుకుందాము…
హరిహరుల మధ్య అంతరం యెలా సాధ్యం? రెండూ పరమాత్మ రూపాలే. రక్షణ భారం హరిదైతే లయం చేసే బాధ్యత హరుడిది. ఇది పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నా, కొందరు అజ్ఞానులు హరిహరదూషణ చేసి పాపం మూట కట్టుకుంటున్నారు. జగమున నున్నది చైతన్యమొక్కటే అని హితబోధ జేస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. ‘సకలము హరిమయమని సరిదోచీని’ అంటున్నారు. ఈసృష్టిలో ఆపరాత్పరుడు తప్ప యెవ్వరూ స్వతంత్రులు కారు. అందరూ ఆయన ఆజ్ఞానువర్తనులే. ఇక ఔగాములేల అంటున్నారు. అంటే మేలుచేసేదెవడు? కీడుచేసేదెవడు అన్నీ ఆ నామాలవాడే, మనిషి మానవత్వంలేకపోతే జంతువే కదా! రెండుకాళ్ళ జంతువు.
భావ వివరణ:
ఓ ప్రజలారా! నా మనస్సు ఒకరిన్ (వేరే ఇంకొకరిని కానగ (దర్శించుటకు) ఒడబడదు (అంగీకరించదు). నాకు సకలము హరియని సరిదోచీని (సరిగా అనిపిస్తున్నది). అయినా సత్యమేమిటో వినండి.
మన అందరిలో అంతరాత్మ రూపంలో వున్న శ్రీహరి ఒక్కడే. జంతువులు అన్నియూ సమానమే. మనస్సు అనేది ఒకటి వుండుటచేత మనిషి మేలైన జంతువయ్యాడు. తన మనస్సులో శ్రీహరిని నిలపగలిగితే పాత్రత (యోగ్యత) కలుగుతుంది. లేకపోతే వాడూ యోగ్యతలేని ద్విపాదపశువే కదా! వంతుల (పంతముతో) వెదకితే అపాత్రుడైన ద్విపాదపశువును పాత్రుడైన ఘనుని చేయగలిగిన దేమిటి? హరిదాస్యమే..పో. (కేవలం శ్రీహరిదాసునిగా జీవించటమే).
ఈ జగత్తంతా ఒక్కటే. ఇందులో వుండే చైతన్యము (కదిలేశక్తి) కూడా ఒక్కటే. పంచభూతములు (భూమి, నీరు, కాంతి, గాలి మరియు ఆకాశము) ఏదో ఒక రూపంలో ప్రతిదాంట్లో వున్నాయి. వుండాలి కూడా. కాబట్టి అవి కూడా ఒక్కటే. మరి అటువంటి పాంచభౌతిక శరీరధారినైన నన్ను ఘనుని చేసిందెవరు? నా పైన వున్న ఈ హరిముద్రలే (శంఖ చక్ర ముద్రలు, తిరునామము). నగుతా (నవ్వుతూ) యెదురుగా అవి లేకుంటే నాలో లెక్కించుటకు ఇంకా యేమున్నది?
ఒకసారి ఆలోచించండి. మనం కావాలనుకొని పుట్టామా? కావలసినప్పుడు కావలసినచోట కావలసిన విధంగా చావగలమా? కడపట (చివరికి) ఒక్కడికైనా ఆ స్వాతంత్రం (ఛాయిస్) వున్నదా? మరి ఇంతోటి దానికి “ఔగాము” లేల? మేలైనదేమిటి కీడైనదేమిటి?) మనకి మేలు జరిగినా హరివల్లనే, కీడు జరిగినా హరివల్లనే. అన్నిటికీ కారణం శ్రీపతియైన వేంకటేశ్వరుడే. మరి అలాంటప్పుడు ఈ పగయెందుకు? ద్వేషమెందుకు? ఆయనను శరణంటే అదే ఘనము కదా!
శ్రీరామరక్షా స్తోత్రం ఓ మనోవైజ్ఞానికమైన ఓషధి, ఇందులో మానసిక రోగాలన్నీ దూరమై అలౌకిక మగు శక్తి ఉత్పన్నమయ్యే భావాలు నిండి ఉన్నాయి. ఈ క్రింది విదంగా వర్ణించబడింది…
Sri Rama Raksha Sthotram In Telugu
శ్రీ రామ రక్షా స్తోత్రం
హద్దులు మీరి మీరు భయపడుతూన్నప్పుడు అశాంతి మిమ్మల్ని అణగద్రొక్కే స్థితిలో బ్రతకాలని మీకు లేని సమయంలో ఘోరమైన అశాంతి ద్వేషాదులతో మీ జీవనం గడుస్తూన్నపుడు జీవితం నీరసంగా, దుఃఖమయంగా వున్నప్పుడు లోకమంతా దయారహితంగా, పాఖండంగా గోచరించే వేళలో – మీరు అవశ్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. సూక్ష్మమైన ఆధ్యాత్మికశక్తితో అవశ్యం మీరు లాభాన్ని పొందుతారు.
ధనబల, విద్యాబల, బుద్ధిబలాదుల కన్న మిన్న అయిన అధికబలం కలిగినట్టిది యీస్తోత్రము. దీనివల్ల దుష్టసంస్కారాలు దూరమై శుభసంస్కారాలు జాగృతమవుతాయి. ఆశాకిరణాలు బహిర్గతమవుతాయి. వేలాదిమంది ” శ్రీరామ రక్షాస్తోత్రం” వల్ల మృత్యు, అశాంతి, ఉన్మాదం, ఆత్మహత్య ఆదిగా గల రోగాలనుండి సంరక్షింపబడ్డారు. దీనివల్ల శరీరం రోగ రహితమవుతుంది. ఆరోగ్యం వర్ధిల్లుతుంది. మస్తిష్కమూ జ్ఞానతంతువులూ పరిపుష్టమవుతాయి.
స్మరణ శక్తి తీవ్రమవుతుంది. రక్తచాపం (బ్లడప్రెషర్) హృదయరోగాలు సమూలంగా నిర్మూలమవుతాయి. మానసిక ఆరోగ్య సంతులనార్ధం దీనిని నిత్యం పారాయణ చెయ్యాలి. అనుదినం ప్రతివ్యక్తి ముఖ్యంగా శ్రీరామ భక్తులూ పూజతో బాటు దీనిని అభ్యసించాలి. (సిద్ధ్యర్ధం నిత్యం 11 పారాయణాల వంతున 9రోజులు పారాయణ చెయ్యాలి.)
ఓం శ్రీ గణేశాయ నమః అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః! సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీ రామచంద్ర ప్రీత్యర్ధే రామ రక్షా స్తోత్ర జపే వినియోగః
తాత్పర్యము ||
ఈ రామరక్షా స్తోత్రానికి ఋషి బుధకౌశికుడు, దేవతలు సీతారాములు, శక్తిసీత, కీలకము హనుమంతుడు, దీని వినియోగము శ్రీరామచంద్రుని ప్రసన్నత కొరకు వున్నది. అందుకే రామరక్షా స్తోత్ర జపములో దీని వినియోగము వున్నది.
తా || రామా, రామభద్రా! రామచంద్రా ! విధాతృ స్వరూపా, రఘునాథా ! ప్రభూ, సీతా పతివీ అయిన నీకు నమస్కారము.
శ్లో || శ్రీ రామ రామ రఘునందన రామరామ |
శ్రీ రామ రామ భరతాగ్రజ రామరామ |
శ్రీ రామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీ రామ రామ శరణం భవ రామ రామ ||
తా || ఓ రఘునందనా, శ్రీరామా ! భరతాగ్రజా | భగవంతుడవగు ఓరామా ! ఓ రణకర్కశ ప్రభువైన రామా ! నీవు రక్షకుడవు కమ్ము.
శ్లో || శ్రీ రామ చంద్ర చరణా మనసా స్మరామి |
శ్రీరామ చంద్ర చరణా వచసా గృణామి |
శ్రీరామ చంద్ర చరణా శిరసా నమామి |
శ్రీరామ చంద్ర చరణా శరణం ప్రపద్యే ||
తా || శ్రీరామ చంద్రుని చరణములను నేను మనసా స్మరించు చున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా నేను కీర్తించుచున్నాను, శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణు వేడుచున్నాను.
శ్లో || మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
ర్నాన్యం జానే నైవ జానే న జానే.
తా || రాముడు నా తల్లి. రామచంద్రుడు నా తండ్రి. రాముడు నా ప్రభువు. రామచంద్రుడే నా సఖుడు. దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వము. అతనిని వీనా నేను మరెవరినీ యెంత మాత్రమూ ఎరుగను.
తా || రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడుసదా విజయశీలుడై =యుండును. లక్ష్మీపతియగు రామ భగవానుని నేను భజించెదను. రాక్షససెన్య సర్వస్వమును ధ్వంస మొనర్చిన శ్రీ రామచంద్రునకు నేను ప్రణమిల్లుచున్నాను. రామునికన్న ఘనమై అన్యమయిన ఆశ్రయము మరియొకటి లేదు. నేను అట్టి రాముని దాసుడను. నా చిత్తము సదా రామునియందే లగ్నమయి యుండు గాక! ఓ రామా! నీవు నన్నుద్ధరింపుము.
శ్లో || శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
తా || ( శ్రీశంకరుడు పార్వతీ దేవితో ‘ ఇట్లు పలుకుచున్నాడు) ఓ సుముఖీ! రామనామము విష్ణు సహస్రనామ తుల్యమైనది. నేను సర్వదా =రామ, రామ, రామ, అని యీ ప్రకారముగా మనోహరమైన రామనామమునందే రమించు చుందును.
( ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీ రామరక్షాస్తోత్రం సంపూర్ణం)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ అనురాఘవేంద్ర స్తోత్రంగురించి తెలుసుకుందాం…
Sri Anu Raghavendra Sthotram In Telugu
గోలోకవాసి, శ్రీహరి పార్ష దుడు నైనశ్రిశంఖుకర్ణుడు బ్రహ్మదేవు నా దేశానుసారముగ యీ యవనిపై బ్రహ్మదేవు శ్రీ ప్రహ్లాదునిగ, శ్రీ విభీషణునిగ, శ్రీ బాహ్లికునిగా, శ్రీ వ్యాస నాయతీర్థునిగ, శ్రీ రాఘ వేంద్ర తీర్థునిగా యుగయుగములంద వత పంచి శ్రీ హరిశక్తిని, భక్తిని ప్రచారమొనరించి ధర్మసంస్థా పనము గావించెను.
ఎవని పాదోదకమును కషాయముగ (మందుగ), ఏ గురు దేవుని శిరముపై నున్న బృందావన మృత్తికను (మట్టిని) మాత్రగ స్వీకరించినచో నిత్యము రోగము లన్నియు తొలగి పోవునో, ఆసద్గుణనిధి యగు గురురాఘ వేంద్రుని చేరి
సేవించెదను.
శ్రీలక్ష్మీనాథుని వక్షము నందు ధరించినవాడు, మంచి వారిని రక్షించుటలో ఆదరము కలవాడు, సంపన్నులు, శ్రేష్ఠులు రాజకుమారులు మొదలగువారి ముఖములచే అరుణవర్ణ ములుగ ప్రకాశించు పాదములు కలవాడు, స్త్రీలను జూచి మోహము పొందిన ద్విజుని పాపమును నశింపజేసి ఉద్ధరించినవాడు, కట పర్వత (మంత్రాలయ) ప్రదేశమునకు ఆభూషణ మైనరత్నము వంటివాడు, బ్రహ్మాదు లైన దేవతల యొక్క విందములను అర్చించువాడు నగు శ్రీ గురు దేవుని సేవించెదను.
స్మేరాననం నవఘనాఘననీలభాసం
శ్రీ జానకీ కనక పీఠవ రే నిషణ్ణం |
బింబాధరద్యుతిసుర క్తతనం స్వనాథం
సంప్రేక్ష్య మందహసితాంకగతా సదావ్యాత్ ||
9
మందహాసవదనము గలవాడును, నూతనమైన దట్టమైన మేఘముయొక్క నల్లని కాంతివంటి కాంతి గలవాడును, బంగారు పీఠమునందు ఆసీనుడై యున్నవాడును, బింబాధరము యొక్క కాంతిచే మిగుల యెజ్జగా చేయబడిన శరీరము గలవాడును, తనకు నాథుడును నగు శ్రీరాముని చూచుచు మందహాసము కలదియు అంకపీఠముపై గూర్చున్నదియు నగు ఆజానక దేవి ఎల్లప్పుడు రక్షించుగాక!
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రముగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకమ్గురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగిస్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… ఈ క్రింద ఇచ్చిన లింకు నందు శ్రీ చండి కవచం ఇవ్వబడినది. అది ఏమిటో తెలుసుకుందాం…
Sri Chandi Kavacham In Telugu
శ్రీ చండి కవచం
అథ దేవ్యాః కవచమ్
అస్య శ్రీ చండీకవచస్య బ్రహ్మా ఋషిః | అనుష్టు ప్ఛందః | చాముండా దేవతా | అంగన్యాసోక్తమాతరో బీజ౩ | నవార్ణో మంత్ర శృః | దిగ్బంధదేవతా స సత్త్వం. శ్రీ జగదంబా ప్రీత్యర్ధే శ్రీ చండిస్తోత్ర పాఠాంగత్వేన జపే వినియోగః |