Anganalala Manache Nadinchukonegani In telugu – అంగనలాల మనచే నాడించుకొనెగాని

అంగనలాల మనచే నాడించుకొనెగాని - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అంగనలాల మనచే నాడించుకొనెగాని కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంగనలాల మనచే నాడించుకొనెగాని – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 1
కీర్తన : అంగనలాల మనచే నాడించుకొనెగాని
సంఖ్య : 454
పుట: 304
రాగం: శంకరాభరణం

శంకరాభరణం

44 అంగనలాల మనచే నాడించుకొనెఁ గాని
సంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే

||పల్లవి||

వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయఁ గాని
తడయక పురుషోత్తముఁ డితఁడే
బడబాగ్నిజలధికిఁ బాయ కల్లుఁడాయఁ గాని
వెడలించె నమృతము విష్ణుఁ డితఁడే

॥ అంగ||

పులిగూడు దిన్నవాని పొందొక్కటే సేసెఁగాని
నలువంక లక్ష్మీనాథుఁ డితఁడే
చలికిఁ గోవరివానిసరుస బావాయఁ గాని
పలుదేవతల కెల్ల ప్రాణబంధుఁ డితఁడే

॥ అంగ||

యెక్కడో గొల్లసతుల కింటిమగఁ డాయఁ గాని
తక్కక వెదకే పరతత్వ మితఁడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁ గాని
తక్కక వేదముచెప్పే దైవ మీతఁడే.

॥ అంగ||

అవతారిక:

“ఓ అంగనలారా! ఈ పిల్లాడు ఇట్లా మనచేత ఆడింపబడుతున్నాడు కాని అసలు సంగతి తెలుసుకొంటే ఇతడే గొప్ప నెరజాణమ్మా!” అని ఆలాపిస్తున్నారు మన అన్నమాచార్యులవారు. ఇందులో వున్న ప్రహేళికలు (చిక్కు ప్రశ్నలు) జాగ్రత్తగా సమాధానాలు ఆలోచించి భావవివరణతో సరిజూసుకోండి. ఇదొక ‘క్విజ్ ప్రోగ్రాం’ అన్నమాట. తినబోయేముందు ఇది రుచి చూడండి… పులిగూడు దిన్నవాడెవడు? వాని పొందొక్కటే సేనుగాని. అంటే యేమిటి? ఆలోచించండి. ఎక్కడో గొల్లసతులకు ఇంటిమగడయ్యిం దెవరు? చలికిఁ గోవరివాడెవడు? అనుకున్నంత తేలికకాదు అని తెలుసుకోండి, మరి.

భావ వివరణ:

ఓ అంగనలారా (రమణుల్లారా!) ఈనాడు ఈయన మన చేత ఆడించబడుతున్నాడు. కాని, సంగతెరిగిన (అసలు విషయం తెలుసుకొంటే) ఇతడే గొప్ప నెరజాణ (అన్నీ తెలిసిన చతురుడు).

ఒడలు లేనివానికి (శరీరం లేనివాడికి) ఒక్కడే, తండ్రియైన వాడు (ఎవరు? (మన్మథుని తండ్రియైన శ్రీహరి). తడయక ఆలస్యములేక రక్షించే పురుషోత్తముడు కూడా ఇతడే. బడబాగ్నిని తనలో దాచుకున్న సముద్రునికి, పాయక (కోరి) అల్లుడైన వాడే, కాని అమృతాన్ని అందించినవాడు. ఈయనే | విష్ణువు.

ఈయన పులిగూడుతిన్నవాని పొందొక్కటే చేశాడు (భిక్షాటన చేసి ఆ భిక్ష భుజించేవాని స్నేహం చేసేవాడు)… అంటే (పరమశివుని మిత్రుడైన శ్రీహరి). అయినా ఈయన భిక్ష యెత్తడండీ. ఎందుకంటే అప్లైశ్వర్యములున్న లక్ష్మీదేవికి మగడండీ ఈయన. ఈయన చలికిన్ కోవరి వాని బావ. అంటే చల్లదనాన్నిచ్చే చంద్రునికి బావగారు అయిన శ్రీకాంతుడు. అంతేకాదు దేవతలందరికీ ప్రాణబంధువు.

ఎక్కడో రేపల్లెలో వున్న గొల్లపడుచులకి “ఇంటి మగడు” ఒకే ఇంటిపేరుండేట్లు చేసిన మగడు. యోగులందరూ తక్కక (వెనుదీయక) వెదకే పరతత్వము (పరబ్రహ్మ) ఇతడే. ఇవన్నీ అటుంచి శ్రీవేంకటాద్రి మీద వెలసి మమ్మల్ని యేలే దేవుడు ఈయనే. కానీ వేదాలన్నీ శ్లాఘించే పరాత్మరుడు కూడా ఈ దేవుడే.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Itani Neragakuntenila In Telugu – ఈతని నెఱగకుంటేనిల

ఈతని నెఱగకుంటేనిల - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఈతని నెఱగకుంటేనిల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఈతని నెఱగకుంటేనిల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన : ఈతని నెఱగకుంటేనిల
సంఖ్య : 536
పుట: 360
రాగం: లలిత

లలిత

45 ఈతని నెఱఁగకుంటే నిల స్వామిద్రోహము
ఘాతల నేఱు గుడిచి కాలువ పొగడుట.

||పల్లవి||

హరిపాదముననే యడఁగె లోకములెల్ల
హరినాభినే పౌడమి రదివో బ్రహ్మాదులు
హరినామము వేదాల కాదియు నంత్యము నాయ
హరిదాసులే వశిష్ఠాదు లిందరును.

||ఈత||

విష్ణుఁడే యమృత మిచ్చె
విష్ణుఁడే ధరణి మోఁచె విశ్వమంతాను
విష్ణుచక్రమున దైత్యవీరులెల్లా నడఁగిరి
విష్ణువుముఖమునందే విప్రులు జనించిరి.

||ఈత||

పరమపుశ్రీపతివే భారతరామాయణాలు
పరమాత్ముఁ డితఁడే పలుజీవులయందెల్లా
పరము చేచేతఁ జూపె పట్టి శ్రీవేంకటేశుఁడు
పరమానంద మొసఁగు భక్తులకు నితఁడు.

||ఈత||536

అవతారిక:

జగద్భర్త నారాయణుడు. మనకు భోజనమిచ్చి అది అరిగేశక్తినిచ్చి పుట్టినదాది తుది శ్వాసదాకా రక్షించేది పురుషోత్తముడే. ఆయన గురించి తెలియకపోవటం కన్న స్వామి ద్రోహం వుంటుందా. లౌకికంగా చూచినా మనకు వుద్యోగం ఇచ్చి, నెలనెలా జీతం ఇచ్చి పోషిస్తున్న మన యజమాని గురించి తెలుసుకోనివాడు ద్రోహియే కదా! అన్నమాచార్యులవారిలో కవి దీనిని నిరసిస్తూ ఏటినీరు తాగి కాలువనీళ్ళను పొగడటం అంటే ఇదే… అని దెప్పిపొడుస్తున్నారు. ప్రతి జీవిలోనూ అంతర్యామిగా వున్న ఈ శ్రీవేంకటేశుడే పరము చేచేత పట్టి జూపె అంటున్నారు.

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈతని (ఈ నారాయణుని యెరుగకుంటే (తెలియకపోతే) ఇల (భూమిపై) ఇంతకంటే స్వామిద్రోహం మరియొకటుంటుందా? ఘాతల దెబ్బతిన్నవాడు దీనావస్థలో) నీటినీల్ళ తాగి ప్రాణం నిలబెట్టుకొని, కాలువలో నీళ్ళు బాగుంటాయి అని పొగడటంలాంటిదే… ఇది కూడా అవునా?

విశ్వంలోని పదునాలుగు భువనాలూ ఈ శ్రీహరిపాదం కిందనే వున్నాయి. | ఒక్క తొక్కుడుతో అన్నీ చితక్కొట్టగలడు. అంతెందుకు సృష్టికర్త బ్రహ్మ మొదలైన వారంతా ఆయన నాభి (బొడ్డు) లోంచి పుట్టినవారేకదా! అసలు జ్ఞానానికి మూలమైన వేదముపుట్టిందే శ్రీహరి నామములోనుంచి వేదాంతము కూడా ఆయనే కదా! వశిష్ఠుడు మొదలైన సప్తఋషలు యెవ్వరనుకున్నారు? వారంతా హరిదాసులే.

ఆయన మహిమనెంతని పొగడగలం చెప్పండి? దేవతలు అమరులవటానికి కారణమైన అమృతం తెప్పించింది ఆయనే కదా! ఆదివరాహమై ఈ భూమిని మోసినవాడు శ్రీహరే కదా! రోజుకి 24 గంటలు, | సంవత్సరానికి 365 రోజులు 6 గంటలు (దాదాపుగా) సమయంపట్టేట్లు ఈ | భూమి ఒక గొప్ప సమయపాలన గతి నిర్దేవంతో నడుస్తున్నదే అదెవరివల్ల జరుగుతున్నది? రాక్షసులనందరినీ సుదర్శన చక్రంతో అడ్డగించినదెవరు? నేటికీ వేదవిజ్ఞానం విస్తరింపచేస్తున్న విప్రులు జన్మించింది కూడా ఆయన ముఖంలోనుంచే కదా!

భారత రామాయణాది పురాణవాఙ్మయం పుట్టిందే శ్రీహరి కథామృమును విస్తరింపజేయుటకు కదా! సర్వ జీవులయందున్న పరమాత్ముడు అంతర్యామీ ఈ దేవదేవుడే కదా! నేడు శ్రీవేంకటేశుడై పరము (మోక్షమును) చేనేతపట్టి (అభయవరద హస్తాలతో పట్టి) చూపుతూ భక్తులకు పరమానందమునిస్తున్న ఏడుకొండల యేలికయై భక్తులని అనుగ్రహిస్తున్నది ఈతడే కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

అన్నమయ్య కీర్తనలు – Annamayya Keerthanalu

అన్నమయ్య కీర్తనలు – Annamayya Keerthanalu

అన్నమయ్య కీర్తనలు – Annamayya Keerthanalu

 

  1. అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి
  2. ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల
  3. కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక
  4. నరుడా యీతడు ఆదినారాయణుడు గాక
  5. అతడితడా వెన్నలంతట దొంగిలినాడు
  6. నరులార నేఁడువో నారసింహజయంతి
  7. మంచివాడవంతేపో మాధవరాయా
  8. కోడెకాడు గదవమ్మ గోవిందరాజు
  9. వేడుక కాడితడు విట్టలేశుడు
  10. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా
  11. శ్రీవేంకటేశ్వరుఁడు శ్రీయలమేల్మంగతోడ
  12. సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
  13. వారిధిశయన వో వటపత్రపరియంక
  14. వైష్ణవులసొమ్ము నేను వారు నీసొమ్ములింతే
  15. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
  16. అంజినీదేవి కొడుకు హనుమంతుడు
  17. అప్పడైన హరియెక్కె నదివో తేరు
  18. అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
  19. చేకొని కొలువరో శ్రీనరసింహము
  20. రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
  21. ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
  22. జగములేలేవాడవు జనార్దనుడవు
  23. వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
  24. కరేణ కిం మాం గృహీతుం తే
  25. చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
  26. ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీద
  27. నాలం వా తవ నయవచనం
  28. చక్కని సరసపు శిశువు
  29. లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
  30. యెన్ని మారులు యిట్టె నీపనులు
  31. మేలుకొనవే
  32. హరి నీవే సర్వాత్మకుడవు
  33. కేశవదాసి నతి గెలిచితి నన్నిటాను
  34. నాపాలి ఘన నిధానమవు నీవే నన్ను
  35. తగు మునులు ఋషులు తపముల సేయగ
  36. ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
  37. అభయదాయకుడ వదెనీవే గతి
  38. హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
  39. సీతాసమేత రామ శ్రీరామ
  40. వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు
  41. దేవనీపక్షపాతమో తిరిగేలోకులవెల్తో
  42. ఒకరిగానగ నొడబడదు మనసు
  43. ఈడనిందరికి నేలికైవున్నాడు
  44. అంగనలాల మనచే నాడించుకొనెగాని
  45. ఈతని నెఱగకుంటేనిల
  46. ఎన్నిమహిమలవాడె యీ దేవుడు
  47. మియునెఱగని పామరులను మమ్ము
  48. అన్నిటిపైనున్నట్లు హరిపై నుండదు మతి
  49. శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
  50. నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే
  51. వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు
  52. వారివారి భాగ్యములు వ్రాసివున్నవి నొసళ్ల
  53. సదానందము సర్వేశ్వర నీ-
  54. కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
  55. కలశాపురముకాడ గాచుకున్నాడు
  56. సర్వేశ్వరా నీతో సరియెవ్వరు
  57. పేరు నారాయణుడవు బెంబాడిచేతలు నీవి
  58. ఇతని కితడేకాక యితరులు సరియా
  59. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు
  60. చూచి మోహించకుందురా సురలైన నరులైన
  61. ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు
  62. ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
  63. మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
  64. ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో
  65. అంగనకు విరహమే సింగారమాయ
  66. మలసీ చూడరో మగ సింహము
  67. నిద్దిరించి పాల జలనిధివలెనే
  68. రారా చిన్నన్నా రారోరి చిన్నవాఁడ
  69. వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
  70. శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
  71. దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
  72. ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
  73. బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల
  74. దాసోహమనుబుద్దిదలచరు దానవులు
  75. నారాయణుడ నీనామమె మంత్రించివేసి
  76. భక్తి నీపై దొకటె పరమసుఖము
  77. భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
  78. ఇందులోననే నెవ్వరిబోలుదు
  79. అతని నమ్మలే రల్పమతులు భువి
  80. హరియవతారమితడు అన్నమయ్య
  81. సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ
  82. మొలనూలి గొల్లెత మురియుచును
  83. శిన్నెక తేవే శెలువుని తా
  84. పసులు గాచేటి కోల పసపుజేల
  85. కుందణంపుమై గొల్లెత తా
  86. నెయ్యములల్లో నేరేళ్ళో
  87. అంజలిరంజలిరయం తే
  88. సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను
  89. ప్రలపనవచనై: ఫలమిహకిం
  90. తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు
  91. నమో నమో దశరథనందన మమ్ము రక్షించు
  92. ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము
  93. పరమవివేకులాల బంధువులాల
  94. చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న
  95. సమమతినని నీవే చాటుదువు
  96. నారాయణుని శ్రీనామమిది
  97. స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే
  98. కలిగె మాకిదె కైవల్యసారము
  99. హరిహరి యిందరికి నబ్బురముగాని యిది
  100. హరిహరి నీ మాయామహిమ
  101. ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు

Timmireddy Makuniche Distamaina Polamu In Telugu – తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
సంఖ్య : 52
పుట : 35
రాగం : సామంతం

సామంతం

15 తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసెఁ బొలము

॥పల్లవి||

నిండినట్టిమడుగులనీరువంకపొలము
కొండలు మోఁచిన పెద్దగొబ్బరపుఁబొలము
అండనే పొలమురాజులుండేటిపొలము
చెండివేసి మాకులెల్లా సెలగినపొలము

||తిమ్మి||

ఆసపడి వరదానమడిగినపొలము
బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము
రాసికెక్కే మునులకు రచ్చైనపొలము
వేసరక నాఁగేట వేగిలైన పొలము

||తిమ్మి||

మంచి గురుతైన రావిమానిచేనిపొలము
వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళిపొలము
యెంచఁగ శ్రీవేంకటేశు నిరవైనపొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటిపొలము

||తిమ్మి|| 52

అవతారిక:

ఇది అత్యద్భుతమైన దశావతారవర్ణన కీర్తించే అన్నమాచార్య కీర్తన. ఎంతో మేధాశక్తి వుంటేనే కాని ఈ కీర్తన అర్థంకాదు. తిమ్మన్న అంటే వేంకటేశ్వరుడు తిమ్మిరెడ్డి అంటే పరమాత్మ అయిన శ్రీవేంకటేశ్వరుడు. బొమ్మిరెడ్డి అంటే జీవాత్మయైన అంతర్యామి అంటే క్షేత్రజ్ఞుడు. దిష్టమైన పొలము అంటే (భాగ్యముకొద్దీ సంప్రాప్తించిన సాగుచేయదగిన మాగాణి వంటి క్షేత్రము లేక శరీరము). మా భాగ్యము కొద్దీ ఆ శ్రీవేంకటేశ్వరుడు మాకు ఈ దేహాన్నిచ్చి మాజీవాత్మకు ఒప్పగించి “వొరే దీనిని సక్రమంగా సాగుచేసుకోండిరా” అన్నాడు… ఇదీ ఈ కీర్తన పల్లవి. ఇకపై ఓపికగా చదివి భావ వివరణ నాస్వాదించండి.

భావ వివరణ:

తిమ్మిరెడ్డి (పరమాత్మ) మాకు దిష్టమైన (మా భాగ్యముననుసరించి) ఒక పొలము (క్షేత్రము) సాగుచేసికొనమని, బొమ్మిరెడ్డికి (అంతర్యామియైన క్షేత్రజ్ఞునికి) ఒప్పగించినాడు. ఇక చూసుకోండి ఎన్నిరకాల పొలములు సాగులోకి వచ్చాయో.

“నిండినట్టి మడుగుల నీరువంక పొలము” ఎప్పుడూ నిండుగా నీరువుండే చోట నీట్లో వుండేదేహము.. – (అంటే మత్స్యావతారము.) “కొండలు మోచిన పెద్దగొబ్బరపు పొలము” నిస్వార్థముగా పరులకోసం పెద్ద కొండను మోసిన దేహం… – (అంటే తాబేలు లేక కూర్మావతారం.) “అండనే పొలము రాజులు వుండేటి పొలము” సూకరములుండే దేహము – (అంటే వరాహావతారము). “చెండివేసి మాకులెల్లా చెలగిన పొలము”. మాలిన్యమును లేక పాపమును చెండాడి విజృంభించిన దేహము – (అంటే నరసింహావతారము).

“ఆస పడి వరదానము అడిగిన పొలము” యాచించి వరమును పొందిన దేహము – (అంటే వామనావతారము). “బాసలతో కడునెత్రుపట్టమైన పొలము” ప్రతిజ్ఞ పట్టి ఎంతో నెత్తురు పారించిన దేహము – (అంటే పరశురాముడు). “మునులకు రచ్చై రాసికెక్కిన పొలము” మునులకు రక్షణయై విఖ్యాతిగాంచిన దేహము – (అంటే శ్రీరామావతారము). “వేసరక నాగేట వేగిలైన పొలము” విసుగులేక నాగలి ధరించు ఉద్రేకియైన దేహము – (అంటే బలరామావతారము).

“మంచి గురుతైన రావిమాని చేని పొలము” అశ్వత్థవృక్షం క్రింద మంచి ప్రసిద్ధినొందిన దేహము – (అంటే బుద్ధావతారము). “వంచిన గుఱ్ఱము దోలే వయ్యాళిపొలము” అణుకువ గలిగిన గుఱ్ఱమునెక్కి విహారముచేసిన దేహము – (అంటే కల్కి అవతారము). “యెంచగ శ్రీవేంకటేశు నిరవైన పొలము” ప్రసిద్ధికెక్కిన శ్రీవేంకటేశ్వరుడై నెలకొనిన దేహము. మరి ఆ అద్భుతమైన పొలము యెట్లాంటిదంటే లోకులందరూ దానిని పంచుకొని, శరణని బ్రతుకుతున్నారు. అవును కదా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Vaishnavula Sommu Nenu Varu Nisommulinte In Telugu – వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే

వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : వైష్ణవుల సొమ్ము నేను వారు నీసొమ్ములింతే
సంఖ్య : 185
పుట : 124
రాగం : సాళంగనాట

సాళంగనాట

14 వైష్ణవులసొమ్ము నేను వారు నాసొమ్ములింతే
విష్ణుఁడ నీవెట్టైన వివరించుకోవయ్యా

॥పల్లవి||

నెఱి నీబంటనా హరి నీకంటే బలువులైన-
తఱి నీదాసులకే నే దాసుఁడగాక
గుఱుతెరుఁగుదునా నేఁ గోరి యింతకతొల్లి
గుఱుతు చూపిన మాగురువునేకాక

||వైష్ణ||

ముంచి నీకు మొక్కేఁగాక ముందే నీశరణులు
పెంచి పాదాలు నా నెత్తిఁబెట్టిరయ్య
పొంచి నీవేడ నేనేడ బుజముల ముద్రవెట్టి
సంచితమై సేసినట్టిసంబంధమేకాక

||వైష్ణ||

శ్రీవేంకటేశ నీసేవే సేసేఁగాక నేడీ-
సేవకుఁ దెచ్చెను వారిసేవేకాదా
భావమొక్కటిగా నాకుఁ బట్టిచ్చిరి నిన్ను వారు
ఆవలీవలికిఁ బరమార్థమేకాక

||వైష్ణ|| 185

అవతారిక:

విశిష్టాద్వైత మత దీక్ష స్వీకరించిన అన్నమాచార్యులవారు, బుజములపై శంఖచక్రముల ముద్రలు ధరించారు. తిరునామం నుదుటిపై ధరించారు. వైష్ణవ సిద్ధాంత ప్రచారకులై రోజుకి, కనీసం ఒక్క కీర్తన శ్రీవేంకటేశ్వరునిపై చెప్పారు. ఈ నాటికీ నాబోటి అనామకులను సైతం ఆ నామం అనుమానం లేకుండా రక్షిస్తున్నది. ఎందుకంటే.. వైష్ణవులంతా స్వామివారి సొమ్ము. అందుకే అన్నమయ్య “ఓ విష్ణుడా! నీవు యెట్లా అన్వయించుకొనినా పర్వాలేదు, నేను వైష్ణవుల సొత్తును. వారు నీసొత్తు” అని తేల్చిపారేశారు. స్వామీ! నిన్ను నాకు ఆ వైష్ణవులు పట్టిచ్చారయ్యా! అంటున్నారు.

భావ వివరణ:

ఓ విష్ణుదేవా! నేను వైష్ణవదీక్షను స్వీకరించినందున వైష్ణవుల సొమ్మునైతిని. మరి ఆ వైష్ణవులు నీసొమ్ము. అనగా నీదాసులైన వైష్ణవులకు నేను దాసుడను. ఆ విధంగా నేను నీకు చెందినవాడినే. దీనిని నీవెట్లు వివరించుకొనినా నీఇష్టమే.

ఓ హరీ! నెఱి (న్యాయంగా) నీబంటునయ్యేవాడినే కాని, నీదాసులువున్నారే వారికి వారి బలంతోపాటు నీ బలంకూడా తోడవటం వల్ల, వారు నీకంటే బలవంతులు. అటువంటప్పుడు నాకెప్పుడూ యెదురుగా వుండేవారి దాస్యం చేయుట నాకు మంచిది కదా! నేను ఇంతకు పూర్వం నిన్నెరుగను. తొల్లి (మొట్టమొదట) మా గురువులే నీ గుర్తులు చూపించితే నిన్ను గుర్తుపట్టగలిగాను. లేకపోతే నీవెవవరవో నాకేమి తెలుసు?

ఓ విష్ణుదేవా! నేను వేరే నీకు మొక్కవలసిన పనిలేదు. ఎందుకంటే, ఇంతకు ముందే నీశరణము పొందిన మా గురువులు నీపాదాలను మానెత్తినయెప్పుడో పెట్టేశారయ్యా! మాకు వైష్ణవ దీక్షనిచ్చింది అట్లాగే కదా! ఆ దీక్షే లేకపోతే నీవు యెక్కడ మేము యెక్కడ? మా రెండు భుజముల మీద నీ శంఖ చక్రముల ముద్రలు వేశారు. మాగురువులావిధంగా మన సంబంధాన్ని సంచితము చేశారు (కూడబెట్టారు) గానీ (లేకపోతే) నీవు నాకెట్లు తెలిసేవాడివి?

ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ నాడు నేను నీ సేవచేస్తున్నమాట నిజమే. కానీ నేను మొదట వారిని సేవించినందువల్లనే, నేను నిన్ను సేవించటం అన్నది జరిగింది. నాకు వారు భావమొక్కటిగా (అన్యధా శరణం నాస్తి అను ఒకే ఒక భావనతో) నిన్ను నాకు మాగురువులు పట్టిచ్చారు. అందువల్లనే మాకు ఆవలీవల పరమార్థము (ఇహపరములు రెండిటి పరమార్ధము దక్కినది). కాక నేను నిన్నెట్లెరుంగుదునయ్యా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Varidhi Shayana Vo Vatapatra Pariyanka In Telugu- వారిధిశయన వో వటపత్రపరియంక

వారిధిశయన వో వటపత్రపరియంక - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వారిధిశయన వో వటపత్రపరియంక కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వారిధిశయన వో వటపత్రపరియంక – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : వారిధిశయన వో వటపత్రపరియంక
సంఖ్య : 465
పుట: 314
రాగం: దేవగాంధారి

దేవగాంధారి

13 వారిధిశయన వో వటపత్రపరియంక
గారవాన మేలుకొని కన్నులు దెరవవే

॥పల్లవి||

ఘనయోగిహృదయపుకమలాలు వికసించె
వొనర విజ్ఞానసూర్యోదయమాయ
మును జీవపరమాత్మములజక్కవలు గూసె
వనజాక్ష మేలుకొని వాకిలి దెరవవే

॥వారిధి॥

కలుషములనేటిచీఁకట్లెల్లఁ బెడఁబాసె
నలువంక వేదకీరనాదము మ్రోసె
అలరి యితరధర్మాలనేటిచుక్కలు మాసె
జలజాక్ష మేలుకొని సతిమోము చూడవే

॥వారిధి||

కపటరాక్షసనేత్రకలుహారములు మోడ్చె
యిపుడే సుకర్మముల యెండలు గాసె
అపురూప శ్రీవేంకటాద్రీశ మేలుకొని
నిపుణుఁడ యిందిరయు నీవు మమ్ముఁ గానవే

॥వారిధి|| 465

అవతారిక:

“వటపత్రపరియంక” అంటే మఱియాకు తల్పముగా శయనించువాడని అర్థం. జక్కువలు అంటే చక్రవాక పక్షులు. కల్హారము అంటే తెలుపు రంగు మిళితమైన ఎఱ్ఱనికలువపూవు. తేలిక అని భ్రమ కలిగించే క్లిష్టమైన కీర్తన ఇది. వటపత్రశాయియైన జలధిశయన ఆదినారాయణునిపై అన్నమాచార్యులవారు చెప్పిన అద్భుతమైన కీర్తన ఇది ఆయన యోగీశ్వరుల హృదయకమలాలలో వుంటాడు. అన్య మతధర్మములను నక్షత్రాలు మాసిపోవునట్లు చేసే పూర్యోదయం అవుతుంది ఈయన నిదుర మేలుకొంటే. కపటులైన రాక్షసుల కన్నులనే కల్హారములు మ్రోడువారిపోతాయట. అంటే రాక్షసులు నశిస్తారని అర్థం.

భావ వివరణ:

ఓ వటపత్రపరియంకా! (మఱియాకు శయ్యగా పరుండిన వాడా!) వారిధిశయనా! (క్షీరసాగరముపై శయనించు దేవా!) గారవాన (మంగళప్రదుడవై) మేలుకొని కన్నులు తెరవవయ్యా!

ఓ ప్రభూ! నిన్ను జూచి ఘనులైన యోగేశ్వరుల హృదయ కమలములు వికసించినవి, యెందుకంటే వారిలో నిన్ను గూర్చిన విజ్ఞాన సూర్యోదయమైనది కదా! ఆ విజ్ఞాన సూర్యోదయమున జీవాత్మ పరమాత్మ అనే జక్కువలు (చక్రవాక పక్షులజంట) ఆనందముగ కూసినవి. (అంటే ఆ జంట నిజానికి తామొక్కటే అని కూస్తూన్నాయి అని భావము). ఓ వనజాక్షా! (పద్మనయనా!) నీ వైకుంఠద్వారపు వాకిలి తలుపులు తెరిపించి నిదురమేలుకొనవయ్యా!

ఓ జలజాక్షా! నీవు మేలుకొంటే దుర్మార్గము అనే చీకట్లన్నీ తొలగిపోతాయి నలుదెసలా చతుర్వేదములనెడి కీరములు (చిలుకలు) నాదముతో రవళిస్తాయి. ఈ లోకంలోవున్న వేద విహిత ధర్మములన్నియు నింగిలోని చుక్కలవలె (నక్షత్రముల తీరుగా) అదృశ్యమవుతాయి. ఓ దేవా! నిదురమేల్కొని ఒకపరి నీసతి మోమును పరికించుము.

ఓ దేవదేవా! నీవు మేలుకొంటే, కపటులైన రాక్షసుల నేత్రకలుహారములు (కన్నులనే లేత ఎఱుపురంగు కలువపూలు) మోడ్చె (ముడుచుకుపోతాయి). సుకర్మములు (వేదయుక్తమైన పనులు) అనే ఎండలుకాస్తాయి. అపురూపుడవైన శ్రీవేంకటేశ్వరా! నీవు నిదుర మేల్కొని ఇందిరాదేవితో కూడి నిపుణుడవై మమ్ము రక్షించి పరిపాలింపుము తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Satithoda Sare Sareku Sarasamuladukonta In Telugu – సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా

సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 14
కీర్తన : సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
సంఖ్య : 376
పుట : 218
రాగం : కాంబోది

కాంబోది

12 సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
తతితోడనారగించీ తగునె యీదేవుఁడు

॥పల్లవి||

ఒక్కమాటె వంటలెల్లా నొద్దనుండి వడ్డించి
మిక్కిలినలసె నలమేలుమంగ
చెక్కులఁ జెమటగారఁ జేరి యీపె వడ్డించఁగా
చొక్కి చొక్కి యారగించీఁ జూడరె యీదేవుఁడు

||సతితో||

పాఱి పాఱి బంగారుపళ్ళెములు వెట్టించి
మీఱి బుసకొట్టె నలమేలుమంగ
జాఱిన తురుముతోడఁ జవులాకె యడుగఁగ
ఆఱడి గూరలు మెచ్చీనంతలో నీదేవుఁడు

||సతితో||

వాలిన రాజసముతో వంటసాలలోననే
మేలిమిఁ గూచున్న దలమేలుమంగ
యీలోనె శ్రీవేంకటేశుఁడీపెఁ దానునారగించి
తాలమిఁ గాఁగిటఁగూడె దక్కక యీదేవుండు

॥సతితో॥ 376

అవతారిక:

అన్నమాచార్యులవారి వొక్కొక్క కీర్తనకు వొక్కొక్క ప్రత్యేకత వుంటుంది. ఇందులో చూడండి తన ముద్దుల సతితో ముచ్చట్లాడుకుంటూ మాటి మాటికీ సరసాలాడుతూ చాలా ఇష్టంగా భోజనం చేస్తున్నాడట ఆ దేవదేవుడు. తన చెక్కిళ్ళపై చెమటలు కారిపోతుంటే, సడలిన తనకొప్పును సవరించుకోలేక అలమేల్మంగమ్మ, తిప్పలు పడుతుంటే ఆహా! ఓహెూ! అని మెచ్చుకొంటూ ఆరగిస్తున్నాడట స్వామి. ఈలోనే అమ్మవారు కూడా ఆరగించి తాలిమితో యీదేవుని కౌగిట కరిగిపోయిందట. ధన్యోస్మి. ఏమి ఆ పదకవితాసౌరభం!! ఏమి ఆ కల్పనా చాతుర్యం!! ఏమని పొగడుదునయ్యా! అన్నమయ్యా!

భావ వివరణ:

సారెసారెకు (మాటిమాటికీ) సతితోడ (తన భార్యతో) సరసములాడుకొంటూ (చలోక్తులు విసురుతూ) ఈ దేవదేవుడు తగు తతితోడన్ (తగినంత ప్రీతితో) | ఆరగించీ (భుజించుచున్నాడు). ఆ వైనం వినండి.

జగముల తల్లి అలమేలుమంగ తను ఆయనకిష్టమని చేయించిన వంటకాలన్నింటిని ఒక్కటీ వదలకుండా వడ్డించింది. అందుచే ఆ తల్లి మిక్కిలి అలిసిపోయినది. ఆమె చెక్కుల జెమట (చెక్కిళ్ళపై శ్రమవలన చెమట) కారిపోతున్నది. ఆమె చేరి స్వయముగా వడ్డించుచునేయున్నది. ఈ దేవుడు చొక్కి చొక్కి (పారవశ్యముతో) ఆరగించుచున్నాడు. ఈ అద్భుత దృశ్యం మీ మనోనేత్రాలతో చూచి తరించండి.

ఈ తల్లి, పాఱిపాటి (తడవ తడవకూ) వంటకాలన్నీ బంగారు పళ్ళెరములలో పెట్టించి, అలసటతో మీఱి బుసకొట్టీ (పెద్దగా నిట్టూర్చింది) అలమేల్మంగమ్మకు ఆ పరిశ్రమవలన తురుము (సిగకొప్పు) సడలి పోయింది (వదులై విడిపోబోతున్నది). అయినా ఆమె కొప్పు సవరించుకొంటూనే, చవులడుగగా (వంటలెలావున్నాయండీ… అని అడుగుతుంటే) ఈ దేవుడు ఆఱడి (మించి) అంతలో (పూర్తిగా తినకుండానే) కూరలు మెచ్చీ (కూరలు యెంత బాగున్నాయి. ఆహా!! యేమి రుచి అని మెచ్చుకొన్నాడు).

ఆ తల్లి అటుపిమ్మట, వాలిన రాజసముతో (మిక్కిలి అతిశయించిన రాచఠీవితో) మేలిమి వంటసాలలో (స్వర్ణమయమైన ఆ వంటశాలోనే) తానూ భుజించుటకు కూర్చున్నది. ఈలోనె (ఈరీతిగా) శ్రీవేంకటేశ్వరుడు మరియు అలమేల్మంగ, ఆరగించిరి. ఆపై, తక్కక (తప్పకుండా) ఈ దేవదేవుడు తాలిమి (ఉత్సాహముతో) ఆ దేవిని కౌగిట కూడెన్.

శ్లో॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Hanuman Chalisa Chaupai 40 Meaning in Bengali

Many people believe that regular recitation of Hanuman Chalisa in English brings inner peace.

Hanuman Chalisa Chaupai 40 in Bengali with Meaning & Analysis

তুলসীদাস সদা হরি চেরা।
কীজৈ নাথ হৃদয় মহঁ ডেরা।

সারানুবাদ : তুলসীদাস সদাই আপনার সেবক হন। আপনি আমার হৃদঢ়ে বাস করুন।

ব্যাখ্যা : অন্তিম চৌপাঈঢে গোস্বামীজী ভাববিহুল হढ ঢাঁর মনের অস্তঃস্থলের অস্তরতম ইচ্ছাকে ব্যক্ত করছেন। তিনি সরাসরি প্রভুকে তাঁর হৃদয়ে এসে বাস করতে বলছেন। সাধারণত সাধক ও ভক্তরা প্রভুর পরমধামে নিত্য বিরাজ করার অভিলাষ রাখেন। অনেক ভক্ত প্রভুর চরণরজ নিত্য-প্রাপ্তির কামনা করেন।

প্রভুপ্রেমের উচ্চ অবস্থায় অহৈতুকী কৃপায় প্রভু পরম আনন্দে এই সব ভক্তের মনোবাসনা পূর্ণ করেন। কিন্তু গোস্বামীজী প্রভুকেই ভাই লক্ষ্মণ, মাতা সীতা ও শ্রীহনুমানজীর সঙ্গে তাঁর হৃদয়ে সদা অবস্থান করার প্রার্থনা জানাচ্ছেন। (চালীসার অন্তিম দোহায় এর বিস্তারিত ব্যাখ্যা আছে)। এই প্রার্থনা ভক্তপ্রেমের এক অতি উচ্চতম অবস্থার পরিচায়ক।

প্রশ্ন উঠঢে পারে তুলসীদাসজী এই প্রার্থনা কি কেবল নিজের জন্য করলেন ? কখনই নয়। বস্তুত তিনি সাধনমার্গের সবাইকে স্মরণ করাচ্ছেন যে তাঁরা মূলতঃ অনাদিকাল থেকে ভগবানের নিত্য দাস, তাঁর তটস্থ শক্তি, তাঁর বিভুচচেতন্যের অংশ অণুচেতন্য। তিনি এই কথা আধ্যাত্মিক মার্গের সবাইকে সর্বদা সমরণে রাখতে বলছেন। তিনি এই মার্গের পথিকদের আরো স্মরণ করিয়ে দিচ্ছেন যে, প্রভুর কাছে কোতো প্রার্থনা না করাই সর্বশ্রেষ্ঠ সাধনা, কারণ তিনি অন্তর্যামী হবার কারণে হৃদয়ের গভীর থেকে গভীরতম কোণে থাকা ইচ্ছাও জানেন।

নিক্ষাম সাধনাই শ্রেষ্ঠ সাধনা। কিন্ত জন্ম-জন্মাস্তরের দেহাত্ববোধ ও লৌকিক কামনা সাধককে পরমার্থিক যাত্রায়, না চাইলেও নিষ্কাম সাধন করতে দেয় না। গোস্বামীজী এখানে জোরের সঙ্গে জানাচ্ছেন যে কামনাই যদি করতে হয় তাহলে সেই উচ্চত্ম কামনাই প্রভুর কাছে করা উচিত যা তিনি নিজ্রের মধ্যেও জমিয়ে রেখেছেন অর্থাৎ ‘কীঁজ নাথ হৃদয় মইঁ ডেরা’।

আবার প্রশ্ন উঠতে পারে এই প্রার্থনার সঙ্গে ‘হনুমান চালীসা’র কোনো যোগ আছে? উত্তর হলো অবশ্য আছে। এই দুটি যার স্মরণ-মনটে থাকবে (১) ‘সদা হরি চেরা’; (২) কীজৈ নাথ रৃদয় মহঁ ডেরা’ ; তিনি অবশ্যই সাত্ত্বিক ভাবের অধিকারী হবেন এবং তার ‘হনুমান চালীসা’ পাঠ, শ্রীহনুমানজীর কৃপাকে অবশ্যই দ্রুত নামিয়ে আনবে এবং তাঁর মনের সব ইচ্ছা অবশ্যই পূর্ণ হবে।

Hanuman Chalisa Chaupai 39 Meaning in Bengali

Hanuman Chalisa Chaupai 39 Meaning in Bengali

Hanuman Chalisa Pdf is a timeless prayer that inspires unwavering faith in Lord Hanuman.

Hanuman Chalisa Chaupai 39 in Bengali with Meaning & Analysis

জো য়হ পঢ়ে হনুমান চালীসা।
হোয় সিদ্ধি সাখী ণৌীরীস।।

সারানুবাদ : যে এই হনুমান চালীসার পাঠ করবে, সে-ই সিদ্ধিপ্রাপ্ত হবে। ভগবান শংকর এর সাক্ষী।

ব্যাখ্যা : হনুমান চালীসা পাঠের মহিমা বর্ণনার ক্রমে আগের চৌপাঈ (৩৮নং) এর পর গোস্বামীজী দৃঢ়তার সঙ্গে আবার স্মরণ করাচ্ছেন-

(১) শ্রীহনুমান চালীসার পাঠ দ্বারা আমরা শ্রীহনুমানজীকে ঢাঁর কীর্তি, গুণ আর বলের স্মরণ করাই (যা তিনি ঋষি ভৃগু ও ঋষি অঙ্গীরার শিষ্যদের দেওয়া অভিশাপে বাল্যাবস্থায় ভুলে গিয়েছিলেন)। যার ফলে শ্রীহনুমানজী তাঁর নিজের স্বরূপ প্রাপ্ত হন, তাঁর পরাক্রম ফিরে আসে এবং আমাদেরও কার্য সিদ্ধ হয়।

  • শ্রীহনুমানজীর কৃপায় সর্বসিদ্ধি প্রাপ্ত হওয়া যায়, যেমন-
  • লোকিক সিদ্ধি,
  • ভক্তিমার্গের সিদ্ধি,
  • বৈরাগ্য সিদ্ধি,
  • জ্ঞান সিদ্ধি ইত্যাদি।

গোস্বামীজী বলছেন, ‘পুরুষার্থ’ করার পরও যার সফলতা আসে না এবং জীবনে চারদিক থেকে নিরাশা চেপে বসে, তিনিও যদি শ্রীহনুমান চালীসা পাঠ করেন, তবে ঢাঁর মনের ইচ্ছা পূর্ণ হতে পারে। প্রশ্ন উঠতে পারে ভাগ্যের লেখা কি শ্রীহনুমানজী পরিবর্তন করতে পারেন ? অবশ্যই পারেন কারণ ত্রিপুরারী ভগবান শিব ‘আগামী’কে পরিবর্তন করার ক্ষমতা রাখেন আর শ্রীহনুমানজী তো ঢাঁরই অবতার। সবচেয়ে বড় কথা ত্রিপুরারী নিজে তার সাক্রী হয়ে অবস্থান করছেন। মানব, এখন কোন সিদ্ধির কামনা করবেন লেটা ডাঁর নিজের বিষয়।

Hanuman Chalisa Chaupai 38 Meaning in Bengali

Hanuman Chalisa Chaupai 38 Meaning in Bengali

Devotees sing the Hanuman Chalisa Lyrics with devotion in temples and during religious gatherings.

Hanuman Chalisa Chaupai 38 in Bengali with Meaning & Analysis

জো শত বার পাঠ কর কোঈ।
ছূটহি বন্দি মহা সুখ হোঈ।

সারানুবাদ : যে এই চালীসা একশত বার পাঠ করবে, সে বন্ধন থেকে মুক্ত হবে এবং অত্যন্ত সুখী হবে।

ব্যাখ্যা : গোস্বামীজী চালীসা পাঠের মহিমা এই চৌপাঈ এবং এর পরের চৌপাঈতে কীর্তন করেছেন। প্রশ্ন উঠতে পারে এই ‘হনুমান চালীসা’ একশত বার পাঠ করলেই কি সত্যিকারের সুখ অর্থাৎ আধ্যাত্মিক আনন্দের সুখ এবং কঠিন সঙ্কট থেকে মুক্ত হওয়া যাবে? আরো প্রশ্ন হতে পারে ‘একশই’ কেন,

তার বেশি বা কম নয় কেন? সাংসারিক আকর্ষণে আসক্ত মানুষ যাদের ভৌতিক সুতোগ সুবিধা জোগাড় করতেই দিন পার হয়ে যাচ্ছে, তাদের শ্রীহনুমানজীর ওপর শ্রদ্ধা ও বিশ্বাস থাকলেও, অতবার পাঠ করার সময় যদি বার করতে না পারে, তাহলে তাদের সঙ্ষটমুক্তি এ আধ্যাছ্দিক আনন্দলাভের কি কোনো উপায় থাকবে না ?

শাস্ত্রকার ও কথাকারদের মত হলো এই ‘একশ’ শব্দ কেবলমাত্র ইঙ্গিতবাইী। এটা বলা এই কারণে যে, এই চালীসার ‘নিয়মিত’ পাঠ প্রয়োজন। যন্ত্রের মতো ‘একশ’ বার পাঠ করার কথা এই চোপাঈ বলছে না। পাঠ বা গান তখনই কার্যকরী হবে যখন শ্রীহুনুমানজীর প্রতি পূর্ণ প্রেম ও শ্রদ্ধা জাগরূক হবে। লক্ষ্য রাখতে হবে উচ্চারণের দিকেও। প্রত্যেকটি চৌপাঈ-এর অন্তঃর্নিহিত অর্থ ও তার ভাব জানা অত্যন্ত জরুরি।

যদি কেউ অত্যন্ত ভাবপূর্ণ ও একাগ্রতার সঙ্গে পাঠ করেন এবং তা নিয়মিত করেন, তবে সংখ্যা কম-বেশি যাই হোক, সেই পাঠ শ্রীহনুমানজীর কৃপায় পাঠককে ধীরে ধীরে সাংসারিক আকর্ষণ ও ভোগবাদী বৃত্তিগুলির বন্ধন থেকে অবশ্যই মুক্ত করবে। শধু তাই নয়, শ্রীহনুমানজীর কিছু কিছু গুণ সেই পাঠকের মন ও বুদ্ধিকে প্রভাবিত করবে, যেমন তার মধ্যে বিচারশীলতা, নির্ণয়শক্তি ও মানসিক দৃত়তা আনবে। যার ফলে তার মধ্যে সৎকর্ম করার বা সৎসঙ্গে যুক্ত হবার প্রবণতা বাড়বে।

এই চালীসা পাঠ বার বার করার ইচ্ছা আপনা আপনিই জাগবে। এর ফল আরো ভালো হবে যদি তা অপরের কল্যাণ কামনায় করা হয়। প্রভু শ্রীরাম সর্বব্যাপক ‘বিষুণুস্বরূপ’। জগতের কল্যাণ কামনার অর্থে প্রভু শ্রীরামের কাজ করা বোঝায়। শ্রীহনুমানজী বিভীষণকে বলেছিলেন যে, খালি রামনাম করলেই হবে না, প্রভুর কাজও করতে হবে। রাবণ তাঁকে বিতাড়িত করতে পারেন এই আশঙ্কা সন্ত্বেও শ্রীহনুমানজীর এই পরামর্শ বিভীষণ অক্ষরে অক্ষরে পালন করেছিলেন।

রাবণের ভ্রুকুটী উপেস্মা করেও তিনি জনকনন্দিনী সীতাকে প্রভু শ্রীরামের কাছে ফিরিয়ে দিতে বলেছিলেন। একথা বলার অপেক্ষা রাখে না যে ভৌতিক সুখ অল্প সময়ের জন্য হয় এবং এই সুখভোগ অনেক বন্ধনের কারণ হয়। কর্মাধীন জগত অমোঘ নিয়নে ‘…পুনরপী জনমং পুনরপী মরণং…’ চলতেই থাকে ও ভবিষ্যতে অনেক দুঃখ কষ্ট ভোগ করতে হয়, যা আমরা চাই বা না চাই।

তাই আতু-উপলক্ধি ও আত্ম-বিকাশের মার্গে চলা সাধক, ভক্ত, যোগী, কর্মী, জ্ঞানী, সবই আধ্যাছিক আনन्্স্বরূপ ‘মহাসুখ’ কামনা করে এবং ‘আবা-গমন’ থেকে মুক্ত হতে চায়। গোস্বামীজী তাই ‘হনুমান চালীসা’র মহিমা বর্ণনায় দৃত়তার সঙ্গে বলেছেন, ‘শ্রীহনুমান চালীসা’র নিয়মিত পাঠ পরিণামে ‘মহাসুখ’ অনুভব করায় এবং সব রকঙের বন্ধন থেকে মুক্ত করায়। গোস্বামীজীর নিজের জীবনেই একটি ঘটনা ঘটেছিল এবং তার থেকে এই পাঠের সিদ্ধান্ত তাঁর দৃঢ় হয়। ঘটনাটি সংক্ষেপে এই রকম-

একবার এক ব্রাহ্মণের অন্তিম যাত্রার প্রস্তুতি চলছিল। গোস্বামীজী ঘটনাক্রমে সেই স্থান দিয়ে পেরোচ্ছিলেন। হঠাৎ এক স্ত্রী তাঁর পা জড়িয়ে ধরে প্রার্থনা করলে, তিনি, না দেখেই, স্বাভাবিক ভাবে বলে উঠলেন, “অখণ সৌভাগ্যবতী হও।” তখন সেই মহিলা, যিনি সেই অন্তিমयত্রী ব্রাম্মাের স্ত্রী, বলে উঠলেন, “আপনার কথা ব্যর্থ। আমার স্বামী একটু আগেই মারা গেছেন এবং তাঁর অন্তিম যাত্রার প্রস্তুতি চলছে।”

গোস্বামীজী বলে উঠলেন, ” ‘মার মুখের শব্দ ব্যর্থ হওয়ার নয়। আমি তোমার পতিকে জীবিত করব।” গোস্বামীজী উপস্থিত সবাইকে চোখ বন্ধ করে শ্রদ্ধার সঙ্গে শ্রীরাম-নাম করতে বললেন। অত্যন্ত আশ্চর্যজনকভাবে উপস্থিত সবাই সেইই ব্রাঙ্মণকে প্রাণ ফিরে পেতে দেখল।

সেই সময়ের মোগল সম্রাট আকবরের কাছে এই খবর পৌছে গেল মন্ত্রী টোডরমল ও ভক্ত কবি রহিমের মাধ্যমে। বাদশাহ তুলসীদাসজীকে তাঁর দরবারে হাজির হতে বললেন। গোস্বামীজী সাহিত্যচর্চায় ব্যস্ত থাকার বারণে আমন্ত্রণ স্বীকার করলেন না। বাদশাহ আকবর তাঁর এই আচরণ ধৃষ্টতা ভেবে তাঁকে সৈন্য পাঠিয়ে ধরে এনে দরবারে কিছু ‘চমৎকার’ দেখাতে বললেন। গোস্বামীজী বললেন, “’আমি কোনো ‘চমৎকার’ করি না।

আমি শ্রীরামের ভক্ত মাত্র। এই সম্পূর্ণ লীলা এবং কৃপা আমার ইষ্টদেব শ্রীরামেরই।” বাদশাহ তখন তাচ্ছিলে্যের সঙ্গে বললেন, “তাই? ঠিক আছে। দেখি শ্রীরাম তোমার জন্য কি করেন!” এই কথা বলে গোস্বামীজীকে ফতেপুর সিকরীতে জেলে বন্দি করে রাখলেন। গোস্বামীজীও বাদশার কাছে না ঝুঁকে সেই জেলে বসেই ‘হনুমান চালীসা’ ক্রম্গাত চল্লিশ দিন পাঠ করলেন। এক অদ্ভুত ঘটনা ঘটলো। হঠাৎ অসংখ্য বানর কোথা থেকে এসে সমস্ত নগরীকে তছনছ করতে লাগলো। সমস্ত নগরবাসী ও মোগল সৈন্য এই বানরদের পরাক্রনমের কাছে অসহায়

হয়ে বানরদের কাঞ্ডকারখানা দেখতে লাগলো। কোলো এক বৃদ্ধ হাফিজ্জ তখন আকবরকে জানালেন যে, কোলো ‘পবিত্র সন্ত’ কে আপনি বন্দি ক:রেছেন বলে এই ঘটনা ঘটছে। বাদশাহ তাঁর ভুল বুঝতে পেরে গোস্বামীজীকে মুক্ত করলেন এবং তাঁর কাছে ক্ষম্মা প্রার্থনা করলেন।

গোস্বামীজী বাইরে আসতেই সেই বানরকুল শান্ত হরলা এবং তারা স্থানত্যাগ করলো। তুলসীদাসজী যাবার আগে আকবরকে জানালেন যে, তিনি যেন ফতেপুর সিকরী ছেড়ে অন্যত্র তাঁর রাজধানী করেন। বাদশাহ তাঁর রাজধানী পরে দিল্লী সরিয়ে নেন। ‘Warrior Ascetics And Indian Empires’ এবং ‘Hanuman’s Tale : The Message Of A Divine Monkey’ নামক গ্রষ্থে এই ঘটনার উল্লেখ পাওয়া যায়।