Balakanda Sarga 75 In Telugu – బాలకాండ పంచసప్తతితమః సర్గః

BalaKanda Sarga 75 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచసప్తతితమః సర్గలో, సందర్శకుడు పరశు రాముడు విష్ణువు మరియు శివుడి విల్లుల పురాణాలను రాముడికి వివరిస్తాడు. తన కుమారులను విడిచిపెట్టమని దశరథుడు చేసిన అభ్యర్థనను పట్టించుకోకుండా, పరశు రాముడు దశరథ రాముడిని నేరుగా ఉద్దేశించి, విష్ణువు యొక్క పొడవాటి ధనుస్సుతో లక్ష్యం వేయమని అడుగుతాడు మరియు దశరథ రాముడు అలా చేయగలిగితే, పరశురాముడు ద్వంద్వ యుద్ధం చేస్తానని చెప్పాడు. అతనిని.

వైష్ణవధనుఃప్రశంసా

రామ దాశరథే రామ వీర్యం తే శ్రూయతేఽద్భుతమ్ | [వీర]
ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్ ||

1

తదద్భుతమచింత్యం చ భేదనం ధనుషస్త్వయా |
తచ్ఛ్రుత్వాహమనుప్రాప్తో ధనుర్గృహ్యాపరం శుభమ్ ||

2

తదిదం ఘోరసంకాశం జామదగ్న్యం మహద్ధనుః |
పూరయస్వ శరేణైవ స్వబలం దర్శయస్వ చ ||

3

తదహం తే బలం దృష్ట్వా ధనుషోఽస్య ప్రపూరణే |
ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘ్యమహం తవ ||

4

తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా |
విషణ్ణవదనో దీనః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ||

5

క్షత్రరోషాత్ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశాః |
బాలానాం మమ పుత్రాణామభయం దాతుమర్హసి ||

6

భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయవ్రతశాలినామ్ |
సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి ||

7

స త్వం ధర్మపరో భూత్వా కాశ్యపాయ వసుంధరామ్ |
దత్త్వా వనముపాగమ్య మహేంద్రకృతకేతనః ||

8

మమ సర్వవినాశాయ సంప్రాప్తస్త్వం మహామునే |
న చైకస్మిన్హతే రామే సర్వే జీవామహే వయమ్ ||

9

బ్రువత్యేవం దశరథే జామదగ్న్యః ప్రతాపవాన్ |
అనాదృత్యైవ తద్వాక్యం రామమేవాభ్యభాషత ||

10

ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే |
దృఢే బలవతీ ముఖ్యే సుకృతే విశ్వకర్మణా ||

11

అతిసృష్టం సురైరేకం త్ర్యంబకాయ యుయుత్సవే |
త్రిపురఘ్నం నరశ్రేష్ఠ భగ్నం కాకుత్స్థ యత్త్వయా ||

12

ఇదం ద్వితీయం దుర్ధర్షం విష్ణోర్దత్తం సురోత్తమైః |
తదిదం వైష్ణవం రామ ధనుః పరపురంజయమ్ ||

13

సమానసారం కాకుత్స్థ రౌద్రేణ ధనుషా త్విదమ్ |
తదా తు దేవతాః సర్వాః పృచ్ఛంతి స్మ పితామహమ్ ||

14

శితికంఠస్య విష్ణోశ్చ బలాబలనిరీక్షయా |
అభిప్రాయం తు విజ్ఞాయ దేవతానాం పితామహః ||

15

విరోధం జనయామాస తయోః సత్యవతాం వరః |
విరోధే చ మహద్యుద్ధమభవద్రోమహర్షణమ్ ||

16

శితికంఠస్య విష్ణోశ్చ పరస్పరజయైషిణోః |
తదా తు జృంభితం శైవం ధనుర్భీమపరాక్రమమ్ ||

17

హుంకారేణ మహాదేవః స్తంభితోఽథ త్రిలోచనః |
దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః ||

18

యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ |
జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణుపరాక్రమైః ||

19

అధికం మేనిరే విష్ణుం దేవాః సర్షిగణాస్తదా |
ధనూ రుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశాః ||

20

దేవరాతస్య రాజర్షేర్దదౌ హస్తే ససాయకమ్ |
ఇదం చ వైష్ణవం రామ ధనుః పరపురంజయమ్ ||

21

ఋచీకే భార్గవే ప్రాదాద్విష్ణుః సన్న్యాసముత్తమమ్ |
ఋచీకస్తు మహాతేజాః పుత్రస్యాప్రతికర్మణః ||

22

పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మనః |
న్యస్తశస్త్రే పితరి మే తపోబల సమన్వితే ||

23

అర్జునో విదధే మృత్యుం ప్రాకృతాం బుద్ధిమాస్థితః |
వధమప్రతిరూపం తు పితుః శ్రుత్వా సుదారుణమ్ ||

24

క్షత్రముత్సాదయన్రోషాజ్జాతం జాతమనేకశః |
పృథివీం చాఖిలాం ప్రాప్య కాశ్యపాయ మహాత్మనే ||

25

యజ్ఞస్యాంతే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణే |
దత్త్వా మహేంద్రనిలయస్తపోబలసమన్వితః ||

26

స్థితోఽస్మి తస్మింస్తప్యన్వై సుసుఖం సురసేవితే |
అద్య తూత్తమవీర్యేణ త్వయా రామ మహాబల ||

27

శ్రుత్వాతు ధనుషో భేదం తతోఽహం ద్రుతమాగతః |
తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ ||

28

క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ధనురుత్తమమ్ |
యోజయస్వ ధనుఃశ్రేష్ఠే శరం పరపురంజయమ్ |
యది శక్నోసి కాకుత్స్థ ద్వంద్వం దాస్యామి తే తతః ||

29

Balakanda Sarga 75 In Telugu Pdf With Meaning

వసిష్ఠుడు, దశరథుడు, అర్పించిన అర్ఘ్య పాద్యములు, అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు, రాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమ వంతుడవనీ, వీర్య వంతుడవనీ ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా! ఈ విల్లు తీసుకో! ” అని రాముని పిలిచాడు పరశురాముడు.

ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు.

“ఓ పరశురామా! నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడవు. కాని నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా! నా కుమారులను ఏమీ చేయనని అభయము ఇమ్ము.

ఓ పరశురామా! నీవు సామాన్యుడవుకావు. పవిత్రమైన భృగు వంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు. నీవు జయించిన ఈ భూమండలము నంతా కశ్యపునకు దానం చేసావు. మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నావు. అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముని యుద్ధమునకు పిలుస్తున్నావు. రాముడు నీతో యుద్ధము చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము ఎవరమూ బతుకలేము. కాబట్టి మా కందరకూ ప్రాణభిక్ష పెట్టు.” అని వేడుకున్నాడు.

కాని పరశురాముడు దశరథుని మాటలు లెక్క చేయలేదు. రాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు విరిచిన ధనుస్సు, నా చేతిలో ఉన్న ధనుస్సు రెండూ గొప్పవి. దివ్యలోకములకు సంబంధించినవి. బాగా ధృడమైనవి. బలమైనవి. ఈ రెండు ధనుస్సులను విశ్వకర్మ తయారు చేసాడు. అందులో ఒక ధనుస్సును త్రిపురాసుర సంహార సమయంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు. ఆ ధనుస్సునే నీవు విరిచావు. ఈ రెండవ ధనుస్సు దేవతలు విష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణు ధనుస్సు అని అంటారు. ఈ ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది.

ఒక సారి దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి శివుడు, విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు? అని అడిగారు. బ్రహ్మ కూడా చెప్పలేకపోయూడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు. అవి వారిద్దరి మధ్య యుద్ధమునకు దారి తీసాయి. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారము చేసాడు. ఆ హుంకారమునకు శివుడు భయపడి పోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు.

పరమశివునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న శివ ధనుస్సును విదేహ దేశాధీశుడు అయిన దేవరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనుస్సును భృగు వంశీకుడు అయిన ఋచీకుని వద్ద ఉంచాడు. ఋచీకుడు మా తాతగారు. మా తాత గారైన ఋచీకుడు ఆ విష్ణు ధనుస్సును తన కుమారుడు. మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు.

పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రి జమదగ్ని ని చంపాడు. నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని వాని కుమారులను చంపాను. అతనినే కాదు క్షత్రియ వంశములో ఉన్న ప్రతి వానినీ పుట్టిన వాడిని పుట్టినట్టు సంహరించాను. క్షత్రియకులమును సర్వనాశనము చేసాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేసాను. క్షత్రియులను చంపి నేను జయించిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్రపర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. ఇప్పుడు నీవు శివధనుస్సును విరిచావు అని దివ్యదృష్టి ద్వారా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను.

ఓ రామా! నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మము ప్రకారము మాకు వంశపారంపర్యముగా సంక్రమించిన ఈ విష్ణుధనుస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వ యుద్ధము చెయ్యి. ” అని పలికాడు పరశురాముడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బదిఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్సప్తతితమః సర్గః (76) >>

Valmiki Ramayana Bala Kanda In Telugu – వాల్మీకి రామాయణం బాలకాండ

Valmiki Ramayana Bala Kanda In Telugu

బాలకాండ, రామాయణంలో మొదటి భాగం, శ్రీరాముడు మరియు అతని సోదరుల బాల్య జీవితం, అయోధ్య రాజ్యం మరియు దశరథుడు రాజు గురించి చెప్పబడింది. బాలకాండంలోని ముఖ్యమైన అంశాలు శ్రీరాముడు మరియు అతని సోదరుల జననం, విద్య, ఋష్యశృంగ యాగం మరియు పట్టాభిషేకం గురించి తెలుపుతాయి.

Valmiki Ramayana Bala Kanda Telugu Pdf

బాలకాండ

  1. ప్రథమః సర్గః
  2. ద్వితీయః సర్గః
  3. తృతీయః సర్గః
  4. చతుర్థః సర్గః
  5. పంచమః సర్గః
  6. షష్ఠః సర్గః
  7. సప్తమః సర్గః
  8. అష్టమః సర్గః
  9. నవమః సర్గః
  10. దశమః సర్గః
  11. ఏకాదశః సర్గః
  12. ద్వాదశః సర్గః
  13. త్రయోదశః సర్గః
  14. చతుర్దశః సర్గః
  15. పంచదశః సర్గః
  16. షోడశః సర్గః
  17. సప్తదశః సర్గః
  18. అష్టాదశః సర్గః
  19. ఏకోనవింశః సర్గః
  20. వింశః సర్గః
  21. ఏకవింశః సర్గః
  22. ద్వావింశః సర్గః
  23. త్రయోవింశః సర్గః
  24. చతుర్వింశః సర్గః
  25. పంచవింశః సర్గః
  26. షడ్వింశః సర్గః
  27. సప్తవింశః సర్గః
  28. అష్టావింశః సర్గః
  29. ఏకోనత్రింశః సర్గః
  30. త్రింశః సర్గః
  31. ఏకత్రింశః సర్గః
  32. ద్వాత్రింశః సర్గః
  33. త్రయస్త్రింశః సర్గః
  34. చతుస్త్రింశః సర్గః
  35. పంచత్రింశః సర్గః
  36. షట్త్రింశః సర్గః
  37. సప్తత్రింశః సర్గః
  38. అష్టాత్రింశః సర్గః
  39. ఏకోనచత్వారింశః సర్గః
  40. చత్వారింశః సర్గః
  41. ఏకచత్వారింశః సర్గః
  42. ద్విచత్వారింశః సర్గః
  43. త్రిచత్వారింశః సర్గః
  44. చతుశ్చత్వారింశః సర్గః
  45. పంచచత్వారింశః సర్గః
  46. షట్చత్వారింశః సర్గః
  47. సప్తచత్వారింశః సర్గః
  48. అష్టచత్వారింశః సర్గః
  49. ఏకోనపంచాశః సర్గః
  50. పంచాశః సర్గః
  51. ఏకపంచాశః సర్గః
  52. ద్విపంచాశః సర్గః
  53. త్రిపంచాశః సర్గః
  54. చతుఃపంచాశః సర్గః
  55. పంచపంచాశః సర్గః
  56. షట్పంచాశః సర్గః
  57. సప్తపంచాశః సర్గః
  58. అష్టపంచాశః సర్గః
  59. ఏకోనషష్టితమః సర్గః
  60. షష్టితమః సర్గః
  61. ఏకషష్టితమః సర్గః
  62. ద్విషష్టితమః సర్గః
  63. త్రిషష్టితమః సర్గః
  64. చతుఃషష్టితమః సర్గః
  65. పంచషష్టితమః సర్గః
  66. షట్షష్టితమః సర్గః
  67. సప్తషష్టితమః సర్గః
  68. అష్టషష్టితమః సర్గః
  69. ఏకోనసప్తతితమః సర్గః
  70. సప్తతితమః సర్గః
  71. ఏకసప్తతితమః సర్గః
  72. ద్విసప్తతితమః సర్గః
  73. త్రిసప్తతితమః సర్గః
  74. చతుఃసప్తతితమః సర్గః
  75. పంచసప్తతితమః సర్గః
  76. షట్సప్తతితమః సర్గః
  77. సప్తసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 55 In Telugu | అయోధ్యాకాండ పంచపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 55 In Telugu

అయోధ్యా కాండ సర్గ 55 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.

యమునాతరణమ్

ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రావరిందమౌ |
మహర్షిమభివాద్యాథ జగ్మతుస్తం గిరిం ప్రతి ||

1

తేషాం చైవ స్వస్త్యయనం మహర్షిః స చకార హ |
ప్రస్థితాంశ్చైవ తాన్ ప్రేక్ష్యపితా పుత్రానివాన్వగాత్ ||

2

తతః ప్రచక్రమే వక్తుం వచనం స మహామునిః |
భరద్వాజో మహాతేజాః రామం సత్యపరాక్రమమ్ ||

3

గంగాయమునయోః సంధిమాసాద్య మనుజర్షభౌ |
కాలిందీమనుగచ్ఛేతాం నదీం పశ్చాన్ముఖాశ్రితామ్ ||

4

అథాసాద్య తు కాలిందీం శీఘ్రస్రోతసమాపగాం |
తస్యాస్తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ ||

5

తత్ర యూయం ప్లవం కృత్వా తరతాంశుమతీం నదీమ్ |
తతో న్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్ఛదమ్ ||

6

వివృద్ధం బహుభిర్వృక్షైః శ్యామం సిద్ధోపసేవితమ్ |
తస్మై సీతాఽంజలిం కృత్వా ప్రయుంజీతాశిషః శివాః ||

7

సమాసాద్య తు తం వృక్షం వసేద్వాఽతిక్రమేత వా |
క్రోశమాత్రం తతో గత్వా నీలం ద్రక్ష్యథ కాననమ్ ||

8

పలాశబదరీమిశ్రం రమ్యం వంశైశ్చ యామునైః |
స పంథాశ్చిత్రకూటస్య గతః సుబహుశో మయా ||

9

రమ్యో మార్దవయుక్తశ్చ వనదావైర్విపర్జితః |
ఇతి పంథానమావేద్య మహర్షిః సంన్యవర్తతః ||

10

అభివాద్య తథేత్యుక్త్వా రామేణ వినివర్తితః |
ఉపావృత్తే మునౌ తస్మిన్ రామో లక్ష్మణమబ్రవీత్ ||

11

కృతపుణ్యాః స్మ సౌమిత్రే మునిర్యన్నోఽనుకంపతే |
ఇతి తౌ పురుషవ్యాఘ్రౌ మంత్రయిత్వా మనస్వినౌ ||

12

సీతామేవాగ్రతః కృత్వా కాలిందీం జగ్మతుర్నదీమ్ |
అథాఽసాద్య తు కాలిందీం శీఘ్రస్రోతోవహాం నదీమ్ ||

13

తౌ కాష్ఠసంఘాటమథో చక్రతుస్సుమహాప్లవమ్ ||

14

శుష్కైర్వంశైః సమాస్తీర్ణముశీరైశ్చ సమావృతమ్ |
తతో వేతసశాఖాశ్చ జంబూశాఖాశ్చ వీర్యవాన్ ||

15

చకార లక్ష్మణశ్ఛిత్వా సీతాయాః సుఖమాసనమ్ |
తత్ర శ్రియమివాచింత్యాం రామో దాశరథిః ప్రియామ్ ||

16

ఈషత్సంలజ్జమానాం తామధ్యారోపయత ప్లవమ్ |
పార్శ్వే చ తత్ర వైదేహ్యా వసనే భూషణాని చ ||

17

ప్లవే కఠినకాజం చ రామశ్చక్రే సహాయుధైః |
ఆరోప్య ప్రథమం సీతాం సంఘాటం ప్రతిగృహ్య తౌ ||

18

తతః ప్రతేరతుర్యత్తౌ వీరౌ దశరథాత్మజౌ |
కాలిందీమధ్యమాయాతా సీతా త్వేనామవందత ||

19

స్వస్తి దేవి తరామి త్వాం పారయేన్మే పతిర్ర్వతమ్ |
యక్ష్యే త్వాం గోనహస్రేణ సురాఘటశతేన చ ||

20

స్వస్తి ప్రత్యాగతే రామే పురీమిక్ష్వాకుపాలితామ్ |
కాలిందీమథ సీతా తు యాచమానా కృతాంజలిః ||

21

తీరమేవాభిసంప్రాప్తా దక్షిణం వరవర్ణినీ |
తతః ప్లవేనాంశుమతీం శీఘ్రగామూర్మిమాలినీమ్ ||

22

తీరజైర్బహుభిర్వృక్షైః సంతేరుర్యమునాం నదీమ్ |
తే తీర్ణాః ప్లవముత్సృజ్య ప్రస్థాయ యమునావనాత్ ||

23

శ్యామం న్యగ్రోధమాసేదుః శీతలం హరితచ్ఛదమ్ |
న్యగ్రోధం తముపాగమ్య వైదేహి వాక్యమబ్రవీత్ ||

24

నమస్తేఽస్తు మహావృక్ష పారయేన్మే పతిర్వ్రతమ్ |
కౌసల్యాం చైవ పశ్యేయం సుమిత్రాం చ యశస్వినీమ్ ||

25

ఇతి సీతాఽంజలిం కృత్వా పర్యగచ్ఛద్వనస్పతిమ్ |
అవలోక్య తతః సీతామాయాచంతీమనిందితామ్ ||

26

దయితాం చ విధేయాం చ రామో లక్ష్మణమబ్రవీత్ |
సీతామాదాయ గచ్ఛ త్వమగ్రతో భరతానుజ ||

27

పృష్ఠతోఽహం గమిష్యామి సాయుధో ద్విపదాం వర |
యద్యత్ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజా ||

28

తత్తత్ప్రదద్యా వైదేహ్యా యత్రాస్య రమతే మనః |
గచ్ఛతోస్తు తయోర్మధ్యే బభూవ జనకాత్మజా ||

29

మాతంగయోర్మధ్యగతా శుభా నాగవధూరివ |
ఏకైకం పాదపం గుల్మం లతాం వా పుష్పశాలినీమ్ ||

30

అదృష్టపూర్వాం పశ్యంతీ రామం పప్రచ్ఛ సాఽబలా |
రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ ||

31

సీతావచనసంరబ్దః ఆనయామాస లక్ష్మణః |
విచిత్రవాలుకజలాం హంససారసనాదితామ్ ||

32

రేమే జనకరాజస్య తదా ప్రేక్ష్య సుతా నదీమ్ |
క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ |
బహూన్మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతుర్యమునా వనే ||

33

విహృత్య తే బర్హిణపూగనాదితే
శుభే వనే వానరవారణాయుతే |
సమం నదీవప్రముపేత్య సమ్మతం
నివాసమాజగ్ము రదీనదర్శనాః ||

34

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 55 Meaning In Telugu

ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.

“ఓ రామా! మీరు గంగా యమునా సంగమ స్థానము చేరిన తరువాత యమునా నది ఒడ్డునే పడమటి వైపుగా వెళ్లండి. అక్కడ మీరు ఒక తెప్పను కట్టుకొని యమునను దాటండి. మీరు యమునను దాటిన తరువాత మీకు ఒక పెద్ద మర్రిచెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు శ్యామము. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సీత ఆ చెట్టుకు నమస్కారము ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి.

మీరు ఆ చెట్టు కింద ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొన వచ్చును. లేని ఎడల మీరు ప్రయాణము కొనసాగించవచ్చును. అలా ఒక క్రోసెడు దూరము వెళ్లగానే మోదుగ చెట్లతోనూ, రేగు చెట్లతోనూ వెదురు పొదలతోనూ నిండి ఉన్న ఒక అరణ్యము కనిపిస్తుంది. అది యమునా నది ఒడ్డున ఉంటుంది. అదే చిత్రకూటమునకు పోవు దారి. నేను ఆమార్గములో ఎన్నోసార్లు ప్రయాణము చేసాను. అది ఎంతో సురక్షితమైన మార్గము. ఏ ప్రమాదమూ ఉండదు.” అని అన్నాడు భరద్వాజుడు.

ఆ మాటలు విన్న రాముడు భరద్వాజుని చూచి నమస్కరించి “మీరు చేసిన సాయమునకు కృతజ్ఞతలు. ఇంక మీరు ఆశ్రమమునకు వెళ్లండి. మాకు ముందుకు వెళ్లడానికి అనుజ్ఞ ఇవ్వండి.” అని ప్రార్థించాడు. ఆమాటలు విన్న భరద్వాజుడు వారిని ఆశీర్వదించి వెనుకకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు సీత ముందుకు సాగారు.

వారు యమునా నదిని సమీపించారు. రాముడు లక్ష్మణుడు అక్కడక్కడా వెతికి కొన్ని కర్రలను తీసుకొని వచ్చారు. వాటిని తీగలతో కట్టి ఒక తెప్పను తయారు చేసారు. దాని మీద ఆకులతో మెత్తగా ఆసనములను ఏర్పాటు చేసారు. ముందు సీతను తెప్పలోకి ఎక్కించారు. తరువాత సీత వెంట దశరథుడు పంపిన వస్త్రములను, ఆభరణములను, రామ లక్ష్మణులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధము లను, తెప్పలో పెట్టారు. తరువాత రామ లక్ష్మణులు ఎక్కారు. అందరూ ఆ తెప్పలో యమునను దాటుతున్నారు.

తెప్ప యమునానదీ మధ్యకు రాగానే సీత యమునకు నమస్కరించింది. “అమ్మా యమునా నదీమతల్లీ! మమ్ములను చల్లగా కాపాడు. మా అరణ్య వాసము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు. మేము సురక్షితముగా అయోధ్యకు తిరిగి వస్తే నీకు వేయి గోవులను, వంద ఘటముల మద్యమును సమర్పించుకుంటాను.” అని మొక్కుకుంది.

తరువాత అందరూ యమునా నది దక్షిణతీరము చేరుకున్నారు. అందరూ తెప్పను దిగారు. భరద్వాజుడు చెప్పిన శ్యామ అనే వటవృక్షమును సమీపించారు. సీత ఆ వటవృక్షమునకు నమస్కరించింది. తమను చల్లగా చూడమని ప్రార్థించింది.
తరువాత వారు ముందుకు సాగారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు, మధ్యలో సీత వెనక రాముడు నడుస్తున్నారు. ఆ వనములోని అందాలు చూస్తూ నడుస్తున్నారు.

సీత తాను అంతకు ముందు చూడని వృక్షముల గూర్చి మొక్కలు, లతల గూర్చీ రాముని అడిగి తెలుసుకుంటూ ఉంది. లక్ష్మణుడు వెళ్లి ఆయా చెట్లయొక్క ఆకులను పూలను తీసుకొని వచ్చి సీతకు ఇచ్చాడు. ఆ ప్రకారంగా వారు ఒక త్రోసెడు దూరము నడిచారు. అక్కడ రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువులను చంపి తీసుకొని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. అంతలో చీకటి పడింది. వారు ఒక సమతల ప్రదేశములో ఆ రాత్రికి ఉండటానికి వసతి ఏర్పాటుచేసుకున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఐదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ షట్పంచాశః సర్గః (56) >>

Ayodhya Kanda Sarga 50 In Telugu – అయోధ్యాకాండ పంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 50 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ పంచాశః సర్గ, “గుహసంగతమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసం కోసం ప్రయాణిస్తారు మరియు వారి మార్గంలో గుహ అనే అనుచరుడు మరియు స్నేహితుడు కలుసుకుంటారు. గుహ, కేవట్ కులానికి చెందినవాడు, రాముడి పట్ల ఎంతో భక్తి మరియు ప్రేమ చూపిస్తూ, అతడిని ఆదరించే విధంగా ప్రవర్తిస్తాడు. రాముడు మరియు అతని కుటుంబం గుహతో గడిపిన సమయం, అతని ఆతిథ్యం, మరియు స్నేహం ఈ సర్గలో హృద్యంగా వర్ణించబడ్డాయి. ఈ సర్గ రాముడు తన నిస్వార్థత మరియు వినయంతో గుహను సంతృప్తి పరచడం, అలాగే స్నేహం మరియు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

గుహసంగతమ్

విశాలాన్కోసలాన్రమ్యాన్యాత్వా లక్ష్మణపూర్వజః |
అయోధ్యాఽభిముఖో ధీమాన్ప్రాంజలిర్వాక్వమబ్రవీత్ ||

1

ఆపృచ్ఛే త్వాం పురి శ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |
దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ ||

2

నివృత్తవనవాసస్త్వామనృణో జగతీపతేః |
పునర్ద్రక్ష్యామి మాత్రా చ పిత్రా చ సహ సఙ్గతః ||

3

తతో రుధిరతామ్రాక్షో భుజముద్యమ్య దక్షిణమ్ |
అశ్రుపూర్ణముఖో దీనోఽబ్రవీజ్జానపదం జనమ్ ||

4

అనుక్రోశో దయా చైవ యథార్హం మయి వః కృతః |
చిరం దుఃఖస్య పాపీయో గమ్యతామర్థసిద్ధయే ||

5

తేఽభివాద్య మహాత్మానం కృత్వా చాపి ప్రదక్షిణమ్ |
విలపంతో నరా ఘోరం వ్యతిష్ఠంత క్వచిత్క్వచిత్ ||

6

తథా విలపతాం తేషామతృప్తానాం చ రాఘవః |
అచక్షుర్విషయం ప్రాయాద్యథాఽర్కః క్షణదాముఖే ||

7

తతో ధాన్యధనోపేతాన్దానశీలజనాన్శివాన్ |
అకుతశ్చిద్భయాన్రమ్యాం శ్చైత్యయూపసమావృతాన్ ||

8

ఉద్యానామ్రవణోపేతాన్సంపన్నసలిలాశయాన్ |
తుష్టపుష్టజనాకీర్ణాన్గోకులాకులసేవితాన్ ||

9

లక్షణీయాన్నరేంద్రాణాం బ్రహ్మఘోషాభినాదితాన్ |
రథేన పురుషవ్యాఘ్రః కోసలానత్యవర్తత ||

10

మధ్యేన ముదితం స్ఫీతం రమ్యోద్యానసమాకులమ్ |
రాజ్యం భోగ్యం నరేంద్రాణాం యయౌ ధృతిమతాంవరః ||

11

తత్ర త్రిపథగాం దివ్యాం శివ తోయామశైవలామ్ |
దదర్శ రాఘవో గఙ్గాం పుణ్యామృషినిసేవితామ్ ||

12

ఆశ్రమైరవిదూరస్థైః శ్రీమద్భిః సమలంకృతామ్ |
కాలేఽప్సరోభిర్హృష్టాభిః సేవితాంభోహ్రదాం శివామ్ ||

13

దేవదానవగంధర్వైః కిన్నరైరుపశోభితామ్ |
నాగగంధర్వపత్నీభిః సేవితాం సతతం శివామ్ ||

14

దేవాక్రీడశతాకీర్ణాం దేవోద్యానశతాయుతామ్ |
దేవార్థమాకాశగమాం విఖ్యాతాం దేవపద్మినీమ్ ||

15

జలఘాతాట్టహాసోగ్రాం ఫేననిర్మలహాసినీమ్ |
క్వచిద్వేణీకృతజలాం క్వచిదావర్తశోభితామ్ ||

16

క్వచిత్స్తిమితగంభీరాం క్వచిద్వేగజలాకులామ్ |
క్వచిద్గంభీరనిర్ఘోషాం క్వచిద్భైరవనిస్వనామ్ ||

17

దేవసంఘాప్లుతజలాం నిర్మలోత్పలశోభితామ్ |
క్వచిదాభోగపులినాం క్వచిన్నిర్మలవాలుకామ్ ||

18

హంససారససంఘుష్టాం చక్రవాకోపకూజితామ్ |
సదా మత్తైశ్చ విహగైరభిసన్నాదితాంతరామ్ ||

19

క్వచిత్తీరరుహైర్వృక్షైర్మాలాభిరివ శోభితామ్ |
క్వచిత్ఫుల్లోత్పలచ్ఛన్నాం క్వచిత్పద్మవనాకులామ్ ||

20

క్వచిత్కుముదషండైశ్చ కుడ్మలైరుపశోభితామ్ |
నానాపుష్పరజోధ్వస్తాం సమదామివ చ క్వచిత్ ||

21

వ్యపేతమలసంఘాతాం మణినిర్మలదర్శనామ్ |
దిశాగజైర్వనగజైర్మత్తైశ్చ వరవారణైః ||

22

దేవోపవాహ్యైశ్చ ముహుః సన్నాదితవనాంతరామ్ |
ప్రమదామివ యత్నేన భూషితాం భూషణోత్తమైః ||

23

ఫలైః పుష్పైః కిసలయైర్వృతాం గుల్మైర్ద్విజైస్తథా |
శింశుమారైశ్చ నక్రైశ్చ భుజంగైశ్చ నిషేవితామ్ ||

24

విష్ణుపాదచ్యుతాం దివ్యామపాపాం పాపనాశినీమ్ |
[* తాం శంకరజటాజూటాద్భ్రష్టాం సాగరతేజసా || *]

25

సముద్రమహీషీం గఙ్గాం సారసక్రౌఞ్చనాదితామ్ |
ఆససాద మహాబాహుః శృఙ్గబేరపురం ప్రతి ||

26

తామూర్మికలిలావర్తామన్వవేక్ష్య మహారథః |
సుమంత్రమబ్రవీత్సూతమిహైవాద్య వసామహే ||

27

అవిదూరాదయం నద్యాః బహుపుష్పప్రవాలవాన్ |
సుమహానిఙ్గుదీవృక్షే వసామోఽత్రైవ సారథే ||

28

ద్రక్ష్యామః సరితాం శ్రేష్ఠాం సమ్మాన్యసలిలాం శివామ్ |
దేవదానవగంధర్వమృగమానుషపక్షిణామ్ ||

29

లక్ష్మణశ్చ సుమంత్రశ్చ బాఢమిత్యేవ రాఘవమ్ |
ఉక్త్వా తమిన్గుదీవృక్షం తదోపయయతుర్హయైః ||

30

రామోఽభియాయ తం రమ్యం వృక్షమిక్ష్వాకునందనః |
రథాదవాతరత్తస్మాత్సభార్యః సహలక్ష్మణః ||

31

సుమంత్రోఽప్యవతీర్యాస్మాన్మోచయిత్వా హయోత్తమాన్ |
వృక్షమూలగతం రామముపతస్థే కృతాంజలిః ||

32

తత్ర రాజా గుహో నామ రామస్యాత్మసమః సఖా |
నిషాదజాత్యో బలవాన్స్థపతిశ్చేతి విశ్రుతః ||

33

స శృత్వా పురుషవ్యాఘ్రం రామం విషయమాగతమ్ |
వృద్ధైః పరివృతోఽమాత్యైరజ్ఞాతిభిశ్చాభ్యుపాగతః ||

34

తతో నిషాదాధిపతిం దృష్ట్వా దూరాదుపస్థితమ్ |
సహ సౌమిత్రిణా రామః సమాగచ్ఛద్గుహేన సః ||

35

తమార్తః సంపరిష్వజ్య గుహో రాఘవమబ్రవీత్ |
యథాఽయోధ్యా తథేయం తే రామ కిం కరవాణి తే ||

36

ఈదృశం హి మహాబాహో కః ప్రప్స్యత్యతిథిం ప్రియమ్ |
తతః గుణవదన్నాద్యముపాదాయ పృథగ్విధమ్ |
అర్ఘ్యం చోపానయత్క్షిప్రం వాక్యం చేదమువాచ హ ||

37

స్వాగతం తే మహాబాహో తవేయమఖిలా మహీ |
వయం ప్రేష్యా భవాన్భర్తా సాధు రాజ్యం ప్రశాధి నః ||

38

భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదముపస్థితమ్ |
శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనం చ తే ||

39

గుహమేవం బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ ||

40

అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వథా వయమ్ |
పద్భ్యామభిగమాచ్చైవ స్నేహసందర్శనేన చ ||

41

భుజాభ్యాం సాధు వృత్తాభ్యాం పీడయన్వాక్యమబ్రవీత్ | [పీనాభ్యాం]
దిష్ట్యా త్వాం గుహ పశ్యామి హ్యరోగం సహ బాంధవైః ||

42

అపి తే కుశలం రాష్ట్రే మిత్రేషు చ ధనేషు చ |
యత్త్విదం భవతా కించిత్ప్రీత్యా సముపకల్పితమ్ |
సర్వం తదనుజానామి నహి వర్తే ప్రతిగ్రహే ||

43

కుశచీరాజినధరం ఫలమూలాశినం చ మామ్ |
విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరమ్ ||

44

అశ్వానాం ఖాదనేనాహమర్థీ నాన్యేన కేనచిత్ |
ఏతావతాఽత్ర భవతా భవిష్యామి సుపూజితః ||

45

ఏతే హి దయితా రాజ్ఞః పితుర్దశరథస్య మే |
ఏతైః సువిహితైరశ్వైర్భవిష్యామ్యహమర్చితః ||

46

అశ్వానాం ప్రతిపానం చ ఖాదనం చైవ సోఽన్వశాత్ |
గుహస్తత్రైవ పురుషాంస్త్వరితం దీయతామితి ||

47

తతశ్చీరోత్తరాసంగః సంధ్యామన్వాస్య పశ్చిమామ్ |
జలమేవాదదే భోజ్యం లక్ష్మణేనాఽఽహృతం స్వయమ్ ||

48

తస్య భూమౌ శయానస్య పాదౌ ప్రక్షాళ్య లక్ష్మణః |
సభార్యస్య తతోఽభ్యేత్య తస్థౌ వృక్షముపాశ్రితః ||

49

గుహోఽపి సహ సూతేన సౌమిత్రిమనుభాషయన్ |
అన్వజాగ్రత్తతో రామమప్రమత్తో ధనుర్ధరః ||

50

తథా శయానస్య తతోఽస్య ధీమతః
యశస్వినో దాశరథేర్మహాత్మనః |
అదృష్టదుఃఖస్య సుఖోచితస్య సా
తదా వ్యతీయాయ చిరేణ శర్వరీ ||

51

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 50 Meaning In Telugu

రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథము మీద కోసల దేశపు సరిహద్దుల వద్దకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగాడు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ “కాకుత్థ్స వంశస్థులచే పరిపాలింప బడుతున్న ఓ అయోధ్యా నగరమా! పుట్టినప్పటి నుండి నీ ఒడిలో
పెరిగాను. ఇప్పుడు విధి వశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను, నీలో నివసించు ప్రజలను విడిచిపోవుటకు మీ అనుమతి కోరుతున్నాను. అచిరకాలములోనే నేను వనవాసము పూర్తి చేసుకొని తిరిగి వస్తాను. అయోధ్యానగర ప్రవేశము చేస్తాను.”అని అయోధ్యాపురికి నమస్కరించాడు.

అప్పటికే రాముడు వచ్చాడని వార్త తెలిసి సమీప గ్రామ ప్రజలు రాముని చూడటానికి అక్కడకు చేరుకున్నారు. వారిని చూచి రాముడు ఇలా అన్నాడు. “మీరు నా మీద జాలి చూపించారు. కాని మీ మీ పనులు మానుకొని నాకోసం దుఃఖించడం మంచిది కాదు. మీ పనులు చూచుకొనుడు.” అని వారికి నమస్కరించి చెప్పాడు. వారుకూడా రామునికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తరువాత రాముడు కోసల దేశమును దాటి వెళ్లిపోయాడు.

రాముడు ప్రయాణించు రథము పరమ పవిత్రమైన గంగాతీరము చేరుకొంది. గంగానదీ తీరమున గల మున్యాశ్రమ ములు గంగానదికి అలంకారముగా శోభిల్లుతున్నాయి. దేవలోకమునుండి అప్సరసలు గంగా స్నానము కొరకు అక్కడకు వస్తూ ఉంటారు. పవిత్రమైన ఆ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు సదా సేవిస్తూ ఉంటారూ. గంగ కొన్ని ప్రదేశములలో వేగంగానూ కొన్ని ప్రదేశములలో నెమ్మదిగానూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగానదిలో హంసలు, సారస పక్షులుయధేచ్ఛగా విహరిస్తుంటాయి. గంగానదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు గంగానదికి అలంకరించిన పూలమాలల వలె ప్రకాశిస్తున్నాయి. గంగానదీజలములు నిర్మలంగా స్వచ్ఛంగా పారుతున్నాయి. కాని అక్కడక్కడ మదగజములు గంగానదిలో దిగి స్నానము చేయడం వల్ల నీరు కలుషితము అవుతూ మరలా నిర్మలంగా మారుతూ ఉంది. గంగానదీ తీర ప్రాంతము అంతా మధురమైన ఫల వృక్షములతోనూ, పూల మొక్కలతోనూ నిండి సర్వాలంకార శోభిత అయిన మంగళకరమైన స్త్రీ వలె శోభిల్లుతూ ఉంది. అటువంటి గంగాతీరము వెంట ప్రయాణించి రాముడు శృంగిబేరపురమునకు చేరుకున్నాడు.

“సుమంత్రా! రథమును ఆపుము. ఇక్కడ ఒక ఇల్గుదీ వృక్షము ఉన్నది. ఈ వృక్షము ఫలములతో నిండి ఉంది. ఈ రాత్రికి మనము ఇక్కడే ఉండెదము. పవిత్ర గంగానదిలో స్నానము చేసి, ఈ చెట్టు కిందనే నిద్రించెదము.” అని అన్నాడు రాముడు.

రాముని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రథమును ఆవృక్షము కింద నిలిపాడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథము దిగారు. సుమంత్రుడు కూడా రథము దిగి రథమునకు కట్టిన గుర్రములను మేతకు విడిచి పెట్టి, రాముని వద్దకు వచ్చాడు.

ఆ శృంగిబేరపురంలో బోయజాతికి చెందిన వాడు, అక్కడ ఉన్న బోయలకు నాయకుడు, రామునికి మిత్రుడు అయిన గుహుడు అనే బోయవాడు నివసిస్తున్నాడు. రాముడు తన రాజ్యమునకు వస్తున్నాడని వార్త ముందే తెలిసిన గుహుడు కుల పెద్దలతోనూ, సేవకులతోనూ రాముని వద్దకు వచ్చాడు. గుహుని రాక విని రాముడు అతనికి ఎదురుపోయి అతనిని కౌగలించుకున్నాడు. గుహుని క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నాడు.

“రామా! ఇది నీకు పరాయి ఇల్లు కాదు. నీకు అయోధ్య ఎలాగో ఇదీ అలాగే. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చును. నీ వంటి మిత్రుడు అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు. క్షణంలో సమకూరుస్తాను.” అని అన్నాడు గుహుడు. రామునికి, సీత, లక్ష్మణుడు,సుమంత్రునికి రకరకాలైన భోజనములు, పానీయములు సమకూర్చాడు.

“రామా! భోజన పదార్థములు సిద్ధంగాఉన్నాయి. మీరందరూ భోజనం చేయండి.” అని అన్నాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు నా వద్దకు వచ్చి నన్ను ఆదరించడమే నీవు మాకు ఇచ్చే ఆతిధ్యము. నేను ప్రస్తుతము వనవాసములో మునివృత్తిలో ఉన్నాను. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొనను. ఫలములు తప్ప వేరే ఆహారము తీసుకొనను. కాని నా రథమునకు కట్టిన అశ్వములు మా తండ్రిగారికి ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారము సమకూర్చుము. అదే నాకుమహదానందము.” అని అన్నాడు రాముడు.

వెంటనే గుహుడు అశ్వములకు కావలసిన ఆహార ఏర్పాట్లు చేసాడు. ఆ రాత్రికి రాముడు కేవలము నీరు ఆహారంగా తీసుకొని నిద్రించాడు. గుహుడు ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. లక్ష్మణునితోనూ, సుమంత్రునితోనూ మాట్లాడుతూ మేలుకొని ఉన్నాడు.

రామునికి ఓ పట్టాన కటిక నేలమీద నిద్రపట్టలేదు. ఆ రాత్రి చాలా దీర్ఘంగా ఉన్నట్టు అనిపించింది రామునికి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకపంచాశః సర్గః (51) >>

Ayodhya Kanda Sarga 73 In Telugu – అయోధ్యాకాండ త్రిసప్తతితమః సర్గః 

Ayodhya Kanda Sarga 73

అయోధ్యాకాండ త్రిసప్తతితమః సర్గలో, భరతుడు, శత్రుఘ్నుడు మరియు వారి సహచరులు అరణ్యానికి చేరుకుని రాముడిని కలుసుకుంటారు. భరతుడు రాముని పాదాలకు నమస్కరిస్తూ అయోధ్యకు తిరిగి రావాలని వేడుకుంటాడు. రాముడు తన ధర్మాన్ని పాటిస్తూ, తండ్రి ఆజ్ఞను అవహేళన చేయలేమని స్పష్టం చేస్తాడు. భరతుడు రాముడికి పాదుకలను తీసుకువచ్చి, తన స్థానంలో రాజ్యం పాలించాలని కోరుతాడు. రాముడు తన పాదుకలను భరతుడికి అప్పగించి, భరతుడిని అంగీకరిస్తాడు. ఈ సర్గలో రాముడు తన వ్రతాన్ని కొనసాగిస్తూ, భరతుడు తన తమ్ముడి కర్తవ్యాన్ని గౌరవిస్తూ, పాదుకలను తీసుకుని తిరిగి వెళతాడు.

కైకేయీవిగర్హణమ్

శ్రుత్వా తు పితరం వృత్తం భ్రాతరౌ చ వివాసితౌ |
భరతో దుఃఖ సంతప్తైదం వచనమబ్రవీత్ || ౧ ||

కిం ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన శోచతః |
విహీనస్యాథ పిత్రా చ భ్రాత్రా పితృసమేన చ || ౨ ||

దుఃఖే మే దుఃఖమకరోర్వృణే క్షారమివాదధాః |
రాజానం ప్రేతభావస్థం కృత్వా రామం చ తాపసమ్ || ౩ ||

కులస్య త్వమభావాయ కాల రాత్రిరివాగతా |
అఙ్గారముపగూహ్య స్మ పితా మే నావబుద్ధవాన్ || ౪ ||

మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని |
సుఖం పరిహృతం మోహాత్కులేఽస్మిన్ కులపాంసిని || ౫ ||

త్వాం ప్రాప్య హి పితా మేఽద్య సత్యసంధో మహాయశాః |
తీవ్రదుఃఖాభిసంతప్తో వృత్తో దశరథో నృపః || ౬ ||

వినాశితో మహారాజః పితా మే ధర్మవత్సలః |
కస్మాత్ప్రవ్రాజితో రామః కస్మాదేవ వనం గతః || ౭ ||

కౌసల్యా చ సుమిత్రా చ పుత్రశోకాభిపీడితే |
దుష్కరం యది జీవేతాం ప్రాప్య త్వాం జననీం మమ || ౮ ||

నను త్వార్యోఽపి ధర్మాత్మా త్వయి వృత్తిమనుత్తమామ్ |
వర్తతే గురువృత్తిజ్ఞో యథా మాతరి వర్తతే || ౯ ||

తథా జ్యేష్ఠా హి మే మాతా కౌసల్యా దీర్ఘదర్శినీ |
త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే || ౧౦ ||

తస్యాః పుత్రం కృతాత్మానం చీరవల్కలవాససమ్ |
ప్రస్థాప్య వనవాసాయ కథం పాపే న శోచసి || ౧౧ ||

అపాపదర్శనం శూరం కృతాత్మానం యశస్వినమ్ |
ప్రవ్రాజ్య చీరవసనం కిం ను పశ్యసి కారణమ్ || ౧౨ ||

లుబ్ధాయా విదితః మన్యే న తేఽహం రాఘవం ప్రతి |
తథా హ్యనర్థో రాజ్యార్థం త్వయాఽఽనీతః మహానయమ్ || ౧౩ ||

అహం హి పురుషవ్యాఘ్రౌ అపశ్యన్ రామలక్ష్మణౌ |
కేన శక్తిప్రభావేన రాజ్యం రక్షితుముత్సహే || ౧౪ ||

తం హి నిత్యం మహారాజో బలవంతం మహాబలః |
అపాశ్రితోఽభూద్ధర్మాత్మా మేరుర్మేరువనం యథా || ౧౫ ||

సోఽహం కథమిమం భారం మహాధుర్యసముద్ధృతమ్ |
దమ్యో ధురమివాసాద్య సహేయం కేన చౌజసా || ౧౬ ||

అథవా మే భవేచ్ఛక్తిర్యోగైః బుద్ధి బలేన వా |
సకామాం న కరిష్యామి త్వామహం పుత్ర గర్ధినీమ్ || ౧౭ ||

న మే వికాంక్షా జాయేత త్యక్తుం త్వాం పాపనిశ్చయామ్ |
యది రామస్య నావేక్షా త్వయి స్యాన్మాతృవత్సదా || ౧౮ ||

ఉత్పన్నా తు కథం బుద్ధిస్తవేయం పాపదర్శినీ |
సాధుచారిత్రవిభ్రష్టే పూర్వేషాం నో విగర్హితా || ౧౯ ||

అస్మిన్కులే హి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే |
అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితాః || ౨౦ ||

న హి మన్యే నృశంసే త్వం రాజధర్మమవేక్షసే |
గతిం వా న విజానాసి రాజవృత్తస్య శాశ్వతీమ్ || ౨౧ ||

సతతం రాజవృత్తే హి జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే |
రాజ్ఞామేతత్సమం తత్స్యాదిక్ష్వాకూణాం విశేషతః || ౨౨ ||

తేషాం ధర్మైకరక్షాణాం కులచారిత్రశోభినామ్ |
అద్య చారిత్రశౌండీర్యం త్వాం ప్రాప్య వినివర్తతమ్ || ౨౩ ||

తవాపి సుమహాభాగాః జనేంద్రాః కులపూర్వగాః |
బుద్ధేర్మోహః కథమయం సంభూతస్త్వయి గర్హితః || ౨౪ ||

న తు కామం కరిష్యామి తవాఽహం పాపనిశ్చయే |
త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ || ౨౫ ||

ఏష త్విదానీమేవాహమప్రియార్థం తవనఘమ్ |
నివర్తయిష్యామి వనాత్ భ్రాతరం స్వజనప్రియమ్ || ౨౬ ||

నివర్తయిత్వా రామం చ తస్యాహం దీప్తతేజసః |
దాసభూతో భవిష్యామి సుస్థిరేణాంతరాత్మనా || ౨౭ ||

ఇత్యేవముక్త్వా భరతః మహాత్మా
ప్రియేతరైః వాక్య గణైస్తుదంస్తామ్ |
శోకాతురశ్చాపి ననాద భూయః
సింహో యథా పర్వతగహ్వరస్థః || ౨౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిసప్తతితమః సర్గః || ౭౩ ||

Ayodhya Kanda Sarga 73 Meaning In Telugu

తన తల్లి కైక ఎంతో సంతోషంతో చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు. కాని ఎదురుగా ఉన్నది కన్నతల్లి. అందుకని  తనకోపాన్ని బలవంతాన అణుచుకున్నాడు. కైకతో ఇలా అన్నాడు.

“అమ్మా! నా తండ్రి అకాల మరణం చెందాడు. నా సోదరులు అడవుల పాలయ్యారు. ఇంకా నాకు ఎందుకమ్మా ఈ రాజ్యము. అమ్మా! నా అన్న రాముడు అరణ్యానికి పోవుటకు, రాముని మీద ప్రేమతో నా తండ్రి మరణించుటకు నీవా కారణము? మా వంశమునకు అగ్నిలాగా దాపురించి కాల్చివేసావు కదమ్మా! ఈ విషయం తెలియక నా తండ్రి నిన్ను ఎంతో ఆదరించాడు కదా అమ్మా! నీ పాపముతో కూడిన ఆలోచనలకు నా తండ్రిని బలితీసుకున్నావు. నీ వలన మా ఇక్ష్వాకు వంశమే అపవిత్రమయింది. మా అందరికీ సుఖసంతోషాలు దూరం చేసావు. నీవు చేసిన అనాలోచితపు పని వలన నా తండ్రి మరణించాడు. చెప్పమ్మా! ఇదంతా ఎందుకు చేసావు? రాముని ఎందుకు అడవులకు పంపావు? నా తండ్రిని ఎందుకు చంపావు? ఇంతా చేసిన దానివి కౌసల్యను సుమిత్రను బతుకనిస్తావా! వాళ్లకు కూడా నీ చేతిలో మరణం తథ్యం. అమ్మా! రాముడు నిన్ను తన కన్నతల్లి కౌసల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా! మా పెద్దమ్మ కౌసల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగా ఆదరించింది కదమ్మా! అటువంటి రామునికి నారచీరలు కట్టి అడవులకు ఎలా పంపగలిగావు. కౌసల్యకు పుత్రశోకము ఎందుకు కలుగజేసావు? ఎవరి కోసం చేసావు ఇదంతా? ఇంత చేసికూడా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీవు మనిషివేనా లేక బండరాయివా!

అమ్మా! నేను, నీ కుమారుడు భరతుని, అడుగుతున్నాను. రాముని అరణ్యములకు పంపుటకు కారణమేమి? నాకురాజ్యము కట్టబెట్టడానికేనా! నాకు రాముని మీద ఉన్న భక్తి గౌరవము తెలిసే ఈ పని చేసావా? రాముడు లేకుండా ఈ రాజ్యభారం వహించే శక్తి నాకు ఉందనుకుంటున్నావా! నీకు తెలుసో లేదో! నా తండ్రి దశరథుడు కూడా తన వృద్ధాప్యంలో రాముని సహాయంతోనే ఈ రాజ్యాన్ని పరిపాలిం చాడు. అటువంటిది, రాముడు లేకుండా, నేను ఈ రాజ్యభారమును ఎలా మోయగలను అనుకున్నావు? ఒక వేళ నేను నా శాయశక్తులా ప్రయత్నించి ఈ రాజ్యభారమును మోయగలనేమో గానీ, నీ కోరిక మాత్రము తీర్చను. నీ కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఇదంతా చేసావు కాబట్టి నీ కోరిక ఎంత మాత్రమూ తీరదు.
అసలు నీవు నా తల్లివే కాదు. నిన్ను ఈక్షణముననే విడిచిపెడదామనుకుంటున్నాను. కానీ, రాముడు నిన్ను తన కన్న తల్లి కంటే ఎక్కవ ప్రేమతో చూచుకొనే వాడు. అందుకని ఆ పని చేయలేకపోతున్నాను.

అమ్మా! నాకు తెలియక అడుగుతాను! నీవు ఈ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించావా! దీని వలననీకు ఎంత అపకీర్తి వస్తుందో, మన వంశప్రతిష్ఠకు ఎంత భంగం వాటిల్లుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా! అసలు నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది. నీకే పుట్టిందా లేక ఎవరి ప్రోద్బలముతోనన్నా ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! నీకు రాజధర్మము, మా వంశాచారము తెలిసే ఈ పని చేసావా!

మా వంశాచారము ప్రకారము కొడుకులు అందరిలోకీ పెద్దవాడు రాజ్యభారము వహిస్తే, మిగిలిన వారు అన్నగారిని భక్తితో సేవిస్తారు. ఈ మాత్రం నీకు తెలియదా లేక నీకు మా వంశాచారము మీద, రాజ ధర్మము మీద గౌరవము లేదా! అమ్మా! ఇప్పుడు చెబుతున్నాను విను. మా ఇక్ష్వాకు వంశంలో, అందరిలోకీ పెద్దవాడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది మా కుల ధర్మము. మా ఇక్ష్వాకు వంశరాజులందరూ పాటిస్తున్న ఆచారము. ధర్మాచరణములో మా ఇక్ష్వాకు వంశీయులు ఎల్లప్పుడూ ముందుం టారు. ఈ నాడు నీవు మా రాజధర్మానికి చేటుతెచ్చావు. నీ పుత్ర వ్యామోహంతో మా వంశములోని రాజులందరికీ అపకీర్తి తెచ్చావు. అందుకని నేను మా ఇక్ష్వాకురాజధర్మము తప్పి ప్రవర్తించను. ఈ రాజ్యము నాకు అక్కరలేదు. ప్రాణత్యాగము అయినా చేస్తాను కానీ నీ కోరిక నెరవేర్చను. నేను ఇప్పుడే రాముని వద్దకు పోయి ఆయనను ప్రార్థించి వెనుకకు తీసుకొని వస్తాను. రాజ్యాభిషిక్తుని చేస్తాను. నేను రామునికి దాసునిగా ఉంటాను. నీకు ఇష్టంఉన్నా, లేకపోయినా ఇదే నా నిశ్చయము.”అని ఆవేశంతో అన్నాడు భరతుడు. భరతుని ఆవేశం చల్లారింది. తండ్రి మరణం గుర్తుకు వచ్చింది. ఆ దు:ఖము తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుఃసప్తతితమః సర్గః (74) >>

Valmiki Ramayana Aranya Kanda In Telugu – వాల్మీకి రామాయణే అరణ్యకాండ

Valmiki Ramayana Aranya Kanda In Telugu

అరణ్యకాండ రామాయణంలో మూడవ భాగం, ఈ కాండంలో రాముడు, సీత, లక్ష్మణులు అడవిలో గడిపిన 14 సంవత్సరాల కథను వివరిస్తుంది. ఈ కథాంశంలో చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి, వాటిలో కొన్ని దండకారణ్యానికి ప్రయాణం, విరాధుని వధ, జాబాలి, శరభంగుల ఆశ్రమాలు, పంచవటి, శూర్పణఖ వధ, రావణుని ప్రతీకారం, జటాయువు వధ, కబంధుని వధ, గుహలో హనుమానుని కలయిక.

Valmiki Ramayana Aranya Kanda In Telugu Pdf

అరణ్యకాండ

  1. ప్రథమః సర్గః
  2. ద్వితీయః సర్గః
  3. తృతీయః సర్గః
  4. చతుర్థః సర్గః
  5. పంచమః సర్గః
  6. షష్ఠః సర్గః
  7. సప్తమః సర్గః
  8. అష్టమః సర్గః
  9. నవమః సర్గః
  10. దశమః సర్గః
  11. ఏకాదశః సర్గః
  12. ద్వాదశః సర్గః
  13. త్రయోదశః సర్గః
  14. చతుర్దశః సర్గః
  15. పంచదశః సర్గః
  16. షోడశః సర్గః
  17. సప్తదశః సర్గః
  18. అష్టాదశః సర్గః
  19. ఏకోనవింశః సర్గః
  20. వింశః సర్గః
  21. ఏకవింశః సర్గః
  22. ద్వావింశః సర్గః
  23. త్రయోవింశః సర్గః
  24. చతుర్వింశః సర్గః
  25. పంచవింశః సర్గః
  26. షడ్వింశః సర్గః
  27. సప్తవింశః సర్గః
  28. అష్టావింశః సర్గః
  29. ఏకోనత్రింశః సర్గః
  30. త్రింశః సర్గః
  31. ఏకత్రింశః సర్గః
  32. ద్వాత్రింశః సర్గః
  33. త్రయస్త్రింశః సర్గః
  34. చతుస్త్రింశః సర్గః
  35. పంచత్రింశః సర్గః
  36. షట్త్రింశః సర్గః
  37. సప్తత్రింశః సర్గః
  38. అష్టాత్రింశః సర్గః
  39. ఏకోనచత్వారింశః సర్గః
  40. చత్వారింశః సర్గః
  41. ఏకచత్వారింశః సర్గః
  42. ద్విచత్వారింశః సర్గః
  43. త్రిచత్వారింశః సర్గః
  44. చతుశ్చత్వారింశః సర్గః
  45. పంచచత్వారింశః సర్గః
  46. షట్చత్వారింశః సర్గః
  47. సప్తచత్వారింశః సర్గః
  48. అష్టచత్వారింశః సర్గః
  49. ఏకోనపంచాశః సర్గః
  50. పంచాశః సర్గః
  51. ఏకపంచాశః సర్గః
  52. ద్విపంచాశః సర్గః
  53. త్రిపంచాశః సర్గః
  54. చతుఃపంచాశః సర్గః
  55. పంచపంచాశః సర్గః
  56. షట్పంచాశః సర్గః
  57. సప్తపంచాశః సర్గః
  58. అష్టపంచాశః సర్గః
  59. ఏకోనషష్టితమః సర్గః
  60. షష్టితమః సర్గః
  61. ఏకషష్టితమః సర్గః
  62. ద్విషష్టితమః సర్గః
  63. త్రిషష్టితమః సర్గః
  64. చతుఃషష్టితమః సర్గః
  65. పంచషష్టితమః సర్గః
  66. షట్షష్టితమః సర్గః
  67. సప్తషష్టితమః సర్గః
  68. అష్టషష్టితమః సర్గః
  69. ఏకోనసప్తతితమః సర్గః
  70. సప్తతితమః సర్గః
  71. ఏకసప్తతితమః సర్గః
  72. ద్విసప్తతితమః సర్గః
  73. త్రిసప్తతితమః సర్గః
  74. చతుఃసప్తతితమః సర్గః
  75. పంచసప్తతితమః సర్గః

Aranya Kanda Sarga 3 In Telugu – అరణ్యకాండ తృతీయః సర్గః

Aranya Kanda Sarga 3 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ తృతీయః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో ప్రవేశించి, ఋషులతో భేటి అవుతారు మరియు వారి ఆశీర్వాదాలు పొందుతారు. తరువాత, వారు పంచవటికి చేరి అక్కడ నివసించడం ప్రారంభిస్తారు. పంచవటిలో ఉండే సమయంలో రాముడు తన ధర్మానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, అరణ్యంలో రాక్షసులను అణచి వేస్తాడు.

విరాధప్రహారః

అథోవాచ పునర్వాక్యం విరాధః పూరయన్వనమ్ |
ఆత్మానం పృచ్ఛతే బ్రూతం కౌ యువాం క్వ గమిష్యథః ||

1

తమువాచ తతో రామో రాక్షసం జ్వలితాననమ్ |
పృచ్ఛంతం సుమహాతేజా ఇక్ష్వాకుకులమాత్మనః ||

2

క్షత్రియౌ వృత్తసంపన్నౌ విద్ధి నౌ వనగోచరౌ |
త్వాం తు వేదితుమిచ్ఛావః కస్త్వం చరసి దండకాన్ ||

3

తమువాచ విరాధస్తు రామం సత్యపరాక్రమమ్ |
హంత వక్ష్యామి తే రాజన్నిబోధ మమ రాఘవ ||

4

పుత్రః కిల జయస్యాహం మమ మాతా శతహ్రదా |
విరాధ ఇతి మామాహుః పృథివ్యాం సర్వరాక్షసాః ||

5

తపసా చాపి మే ప్రాప్తా బ్రహ్మణో హి ప్రసాదజా |
శస్త్రేణావధ్యతా లోకేఽచ్ఛేద్యాభేద్యత్వమేవ చ ||

6

ఉత్సృజ్య ప్రమదామేనామనపేక్షౌ యథాగతమ్ |
త్వరమాణౌ పలాయేథాం న వాం జీవితమాదదే ||

7

తం రామః ప్రత్యువాచేదం కోపసంరక్తలోచనః |
రాక్షసం వికృతాకారం విరాధం పాపచేతసమ్ ||

8

క్షుద్ర ధిక్త్వాం తు హీనార్థం మృత్యుమన్వేషసే ధ్రువమ్ |
రణే సంప్రాప్స్యసే తిష్ఠ న మే జీవన్గమిష్యసి ||

9

తతః సజ్యం ధనుః కృత్వా రామః సునిశితాన్ శరాన్ |
సుశీఘ్రమభిసంధాయ రాక్షసం నిజఘాన హ ||

10

ధనుషా జ్యాగుణవతా సప్త బాణాన్ముమోచ హ |
రుక్మపుంఖాన్ మహావేగాన్ సుపర్ణానిలతుల్యగాన్ ||

11

తే శరీరం విరాధస్య భిత్త్వా బర్హిణవాససః |
నిపేతుః శోణితాదిగ్ధా ధరణ్యాం పావకోపమాః ||

12

స విద్ధో న్యస్య వైదేహీం శూలముద్యమ్య రాక్షసః |
అభ్యద్రవత్సుసంక్రుద్ధస్తదా రామం సలక్ష్మణమ్ ||

13

స వినద్య మహానాదం శూలం శక్రధ్వజోపమమ్ |
ప్రగృహ్యాశోభత తదా వ్యాత్తానన ఇవాంతకః ||

14

అథ తౌ భ్రాతరౌ దీప్తం శరవర్షం వవర్షతుః |
విరాధే రాక్షసే తస్మిన్కాలాంతకయమోపమే ||

15

స ప్రహస్య మహారౌద్రః స్థిత్వాఽజృంభత రాక్షసః |
జృంభమాణస్య తే బాణాః కాయాన్నిష్పేతురాశుగాః ||

16

స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షసః | [బలాత్తు]
విరాధః శూలముద్యమ్య రాఘవావభ్యధావత ||

17

తచ్ఛూలం వజ్రసంకాశం గగనే జ్వలనోపమమ్ |
ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామః శస్త్రభృతాం వరః ||

18

తద్రామవిశిఖచ్ఛిన్నం శూలం తస్య కరాద్భువి |
పపాతాశనినా ఛిన్నం మేరోరివ శిలాతలమ్ ||

19

తౌ ఖడ్గౌ క్షిప్రముద్యమ్య కృష్ణసర్పోపమౌ శుభౌ |
తూర్ణమాపతతస్తస్య తదా ప్రాహరతాం బలాత్ ||

20

స వధ్యమానః సుభృశం బాహుభ్యాం పరిరభ్య తౌ |
అప్రకంప్యౌ నరవ్యాఘ్రౌ రోద్రః ప్రస్థాతుమైచ్ఛత ||

21

తస్యాభిప్రాయమాజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీత్ |
వహత్వయమలం తావత్పథాఽనేన తు రాక్షసః ||

22

యథా చేచ్ఛతి సౌమిత్రే తథా వహతు రాక్షసః |
అయమేవ హి నః పంథా యేన యాతి నిశాచరః ||

23

స తు స్వబలవీర్యేణ సముత్క్షిప్య నిశాచరః |
బాలావివ స్కంధగతౌ చకారాతిబలౌ తతః ||

24

తావారోప్య తతః స్కంధం రాఘవౌ రజనీచరః |
విరాధో నినదన్ఘోరం జగామాభిముఖో వనమ్ ||

25

వనం మహామేఘనిభం ప్రవిష్టో
ద్రుమైర్మహద్భిర్వివిధైరుపేతమ్ |
నానావిధైః పక్షిశతైర్విచిత్రం
శివాయుతం వ్యాలమృగైర్వికీర్ణమ్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే తృతీయః సర్గః ||

Aranya Kanda Sarga 3 Meaning In Telugu

తాను రామలక్ష్మణులను వివరాలు అడుగుతుంటే వాళ్లిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు.

“నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు. చెప్పండి మీరు ఎవరు? ఈ అరణ్యములకు ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళుతున్నారు?” అని అడిగాడు.

అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! మేము క్షత్రియులము. మునులము కాము. నా పేరు రాముడు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. కాల వశమున ఈ అరణ్యములో తిరుగుతున్నాము. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగాడు రాముడు.

“ఓ రామా! నేను రాక్షసుడను. నాపేరు విరాధుడు. నా తండ్రి పేరు జవుడు. నా తల్లి పేరు శతహ్రద. నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసాను. ఆయన వలన ఎవరిచేతా గాయపడకుండా, చావకుండా వరము పొందాను. నాకు ఈమె మీద మోహము కలిగింది. కాబట్టి మీరు ఇద్దరూ ఈమెను నాకు విడిచి పెట్టి ఇక్కడ నుండి పారిపొండి. లేకపోతే మీ ఇద్దరిని చంపి తింటాను. వెంటనే వెళ్లిపొండి.” అనిఅన్నాడు విరాధుడు.

ఆ మాటలకు రామునికి కోపం వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. కోపంతో విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! నీకు నా చేతిలో చావు మూడింది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను ప్రాణాలతో వదలను.”అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించి విరాధుని మీదికి వదిలాడు.

వరసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు. రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి. విరాధుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాధుడు తన తొడమీద ఉన్న సీతను కిందికి దించాడు. శూలాన్ని పట్టుకొని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదికి దూకాడు.

రామునికి లక్షణుడు కూడా తోడైనాడు. రామలక్ష్మణులు విరాధుని మీద బాణములను వర్షంలా కురిపించారు. ఆ రాక్షసుడు ఒక్కసారి ఆవులించి ఒళ్లు విదిలించగానే అతని శరీరమునకు గుచ్చుకున్న బాణములు అన్నీ జలజలా కింద రాలిపోయాయి. బ్రహ్మ వరప్రభావము వలన రామ లక్ష్మణులు వదిలిన బాణములు విరాధుని ఏమీ చేయలేకపోయాయి.

విరాధుడు మరలా శూలమును పైకెత్తి రామలక్ష్మణుల మీదికి దూకాడు. తన శూలమును రాముని మీదికి విసిరాడు. రాముడు రెండు బాణములతో ఆ శూలమును మధ్యలోనే ఖండించాడు. విరాధుని శూలము రెండు ముక్కలై కిందపడిపోయింది. రామలక్ష్మణులు రెండు కత్తులను తీసుకున్నారు. విరాధునిమీదికి దూకారు. ఆ కత్తులతో విరాధుని బలంగా కొట్టారు. ఇలా కాదని.

విరాధుడు రామలక్ష్మణులను తన చేతుల మధ్య బంధించాలని అనుకొన్నాడు. విరాధుని ఊహను పసికట్టాడు రాముడు. అక్ష్మణునితో ఇలా అన్నాడు.

“లక్షణా! వీడు మన ఇద్దరినీ చేతులతో ఎత్తుకొని మోసుకొని పోవాలని చూస్తున్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టు మనలను మోసుకుంటూ పోనిద్దాము. ఎందుకంటే మనం కూడా ఇదే దారిలో వెళ్లాలి కదా!” అని అన్నాడు.

ఇంతలో విరాధుడు రామలక్ష్మణులను తన చేతులతో ఎత్తుకొని తన బుజాల మీద కూర్చోపెట్టుకున్నాడు. అరణ్యంలోకి పరుగెత్తాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ చతుర్థః సర్గః (4) >>

Aranya Kanda Sarga 2 In Telugu – అరణ్యకాండ ద్వితీయః సర్గః

Aranya Kanda Sarga 2 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వితీయ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. వారు అటవీ జీవులతో మమేకమై, సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అటవీ సహజ సౌందర్యం వారికి అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. ఈ సమయంలో, సీత తన భక్తి మరియు ప్రేమతో రాముడిని నడిపిస్తుంది, లక్ష్మణుడు రాముడి ఆజ్ఞలను అనుసరిస్తూ రక్షణను కల్పిస్తాడు.

|| విరాధసంరోధః ||

కృతాతిథ్యోఽథ రామస్తు సూర్యస్యోదయనం ప్రతి |
ఆమంత్ర్య స మునీన్సర్వాన్వనమేవాన్వగాహత ||

1

నానామృగగణాకీర్ణం శార్దూలవృకసేవితమ్ |
ధ్వస్తవృక్షలతాగుల్మం దుర్దర్శసలిలాశయమ్ ||

2

నిష్కూజనానాశకుని ఝిల్లికాగణనాదితమ్ |
లక్ష్మణానుగతో రామో వనమధ్యం దదర్శ హ ||

3

వనమధ్యే తు కాకుత్స్థస్తస్మిన్ఘోరమృగాయుతే |
దదర్శ గిరిశృంగాభం పురుషాదం మహాస్వనమ్ ||

4

గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోదరమ్ |
బీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనమ్ ||

5

వసానం చర్మ వైయాఘ్రం వసార్ద్రం రుధిరోక్షితమ్ |
త్రాసనం సర్వభూతానాం వ్యాదితాస్యమివాంతకమ్ ||

6

త్రీన్సింహాంశ్చతురో వ్యాఘ్రాన్ద్వౌ వృషౌ పృషతాన్దశ | [వృకౌ]
సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరో మహత్ ||

7

అవసజ్యాయసే శూలే వినదంతం మహాస్వనమ్ |
స రామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీమ్ ||

8

అభ్యధావత సంక్రుద్ధః ప్రజాః కాల ఇవాంతకః |
స కృత్వా భైరవం నాదం చాలయన్నివ మేదినీమ్ ||

9

అంకేనాదాయ వైదేహీమపక్రమ్య తతోఽబ్రవీత్ |
యువాం జటాచీరధరౌ సభార్యౌ క్షీణజీవితౌ ||

10

ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసిధారిణౌ |
కథం తాపసయోర్వాం చ వాసః ప్రమదయా సహ ||

11

అధర్మచారిణౌ పాపౌ కౌ యువాం మునిదూషకౌ |
అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షసః ||

12

చరామి సాయుధో నిత్యమృషిమాంసాని భక్షయన్ |
ఇయం నారీ వరారోహా మమ భార్యా భవిష్యతి ||

13

యువయోః పాపయోశ్చాహం పాస్యామి రుధిరం మృధే |
తస్యైవం బ్రువతో ధృష్టం విరాధస్య దురాత్మనః ||

14

శ్రుత్వా సగర్వం వచనం సంభ్రాంతా జనకాత్మజా | [సగర్వితం వాక్యం]
సీతా ప్రావేపతోద్వేగాత్ప్రవాతే కదలీ యథా ||

15

తాం దృష్ట్వా రాఘవః సీతాం విరాధాంకగతాం శుభామ్ |
అబ్రవీల్లక్ష్మణం వాక్యం ముఖేన పరిశుష్యతా ||

16

పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్యాత్మసంభవామ్ |
మమ భార్యా శుభాచారాం విరాధాంకే ప్రవేశితామ్ ||

17

అత్యంతసుఖసంవృద్ధాం రాజపుత్రీం యశస్వినీమ్ |
యదభిప్రేతమస్మాసు ప్రియం వరవృతం చ యత్ ||

18

కైకేయ్యాస్తు సుసంపన్నం క్షిప్రమద్యైవ లక్ష్మణ |
యా న తుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శినీ ||

19

యయాఽహం సర్వభూతానాం హితః ప్రస్థాపితో వనమ్ |
అద్యేదానీం సకామా సా యా మాతా మమ మధ్యమా ||

20

పరస్పర్శాత్తు వైదేహ్యా న దుఃఖతరమస్తి మే |
పితుర్వియోగాత్సౌమిత్రే స్వరాజ్యహరణాత్తథా ||

21

ఇతి బ్రువతి కాకుత్స్థే బాష్పశోకపరిప్లుతే |
అబ్రవీల్లక్ష్మణః క్రుద్ధో రుద్ధో నాగ ఇవ శ్వసన్ ||

22

అనాథ ఇవ భూతానాం నాథస్త్వం వాసవోపమః |
మయా ప్రేష్యేణ కాకుత్స్థ కిమర్థం పరితప్యసే ||

23

శరేణ నిహతస్యాద్య మయా క్రుద్ధేన రక్షసః |
విరాధస్య గతాసోర్హి మహీ పాస్యతి శోణితమ్ ||

24

రాజ్యకామే మమ క్రోధో భరతే యో బభూవ హ |
తం విరాధే ప్రమోక్ష్యామి వజ్రీ వజ్రమివాచలే ||

25

మమ భుజబలవేగవేగితః
పతతు శరోఽస్య మహాన్మహోరసి |
వ్యపనయతు తనోశ్చ జీవితం
పతతు తతః స మహీం విఘూర్ణితః ||

26

[* అధికశ్లోకః – ఇత్యుక్త్వా లక్ష్మణః శ్రీమాన్రాక్షసం ప్రహసన్నివ | కో భవాన్వనమభ్యేత్య చరిష్యతి యథాసుఖమ్ || *]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్వితీయః సర్గః ||

Aranya Kanda Sarga 2 Meaning In Telugu PDF

రామలక్షణులు, సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోనే విశ్రమించారు. మరునాడు ఉదయము ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకొని రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా అరణ్యములోకి వెళ్లాడు. వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్యమృగములను చూచారు.

హటాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది. వాడు నరమాంసభక్షకుడు అని రాముడు గ్రహించాడు. రామలక్ష్మణులు వాడి వంక నిశితంగా చూచారు.

వాడు నల్లగా కొండ మాదిరి ఉన్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. వికృతాకారంతో ఉన్నాడు. వాడి శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. వాడి బుజం మీద ఒక శూలం ఉంది. దానికి మూడు సింహాలను, నాలుగు పెద్దపులులను, రెండు తోడేళ్లను, పది జింకలను, గుచ్చి తీసుకొని వెళుతున్నాడు.

ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూచాడు. గట్టిగా అరిచాడు. వారిని చంపడానికి వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి కళ్లక అందమైన సీత కనిపిపించింది. రావడం రావడం సీతను పట్టుకొన్నాడు. సీతను తీసుకొని పక్కకు వెళ్లాడు. రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు.

“జటలు ధరించిన మీరు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈ రోజు నా చేతిలో చావడం ఖాయం. మీరు ఇద్దరూ ముని కుమారుల వేషాలలో ఉన్నారు కదా! మీ వెంట ఈ స్త్రీ ఎందుకు ఉంది? ఈమె ఎవరు? ఈమెతో మీకు ఏమి సంబంధం? మునులు జితేంద్రియులు, సన్యాసులు కదా! మరి ముని ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించి మీరు ఎందుకు పాపం చేస్తున్నారు?” అని అన్నాడు ఆ రాక్షసుడు.

దానికి రాముడు ఆ రాక్షసుని చూచి ఇలా అన్నాడు. “నీవు మమ్ములను ఇలా అడుగుతున్నావే. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు.

“నేను ఒక రాక్షసుడను. నా పేరు విరాధుడు. నేను ఈ అరణ్యములో ఉన్న మునులను చంపి ఆహారంగా తింటూ ఉంటాను. మీ వెంట ఉన్న ఈ స్త్రీ నాకు కావాలి. ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను. ముని వేషములలో ఉండి కూడా ఈ స్త్రీని వెంటబెట్టుకొని తిరుగుతూ పాపం చేస్తున్న మిమ్ములను చంపి తింటాను.” అని అన్నాడు విరాధుడు.

ఆ మాటలు విన్న సీత చాలా భయపడింది. సీత శరీరం అంతా భయంతో వణికిపోయింది. విరాధుని ఒడిలో చిగురుటాకులా వణికిపోతున్న సీతను చూచి రాముడు చలించి పోయాడు. రాముడి మొహం పాలిపోయింది. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

లక్ష్మణా! ఆ దుర్మార్గుడు విరాధుడు సీతను తన ఒడిలోకి ఎలా లాక్కున్నాడో చూచావా! కైక మనకు ఏమి జరగాలని మనసులో అనుకున్నదో అదే జరుగుతూ ఉంది. లక్ష్మణా! కైక తన కుమారుడు భరతునికి రాజ్యం ఇప్పించుకోవచ్చు. మనలను అడవులకు పంపి ఇన్ని కష్టాలకు గురిచెయ్యడం ఎందుకు? కైక మనకు ఏమి జరగాలని కోరుకుంటూ అడవులకు పంపిందో అదే జరుగుతూ ఉంది. నాకు వనవాస ప్రాప్తి, నా తండ్రి మరణము, ఇదుగో ఇప్పుడు నా భార్యను పరపురుషుడు తాకడం, ఒడిలోకి లాక్కోవడం… ఇంతకన్నా కష్టాలు ఏముంటాయి?” అని వాపోయాడు రాముడు.

ఆ మాటలు విన్న అక్ష్మణుడు కోపంతో రగిలిపోయాడు.

“రామా! ఏమిటీ వెర్రి? నీవు దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడవు. ఇలా బేలగా మాట్లాడటం నీకు తగునా? అసలు ఇలా ఎందుకు పరితపిస్తున్నావు? రామా! నువ్వు చూస్తూ ఉండు. ఒకే బాణంతో వీడిని మట్టి కరిపిస్తాను. వీడి రక్తంతో నేలను తడిపేస్తాను. దేవేంద్రుడు పర్వతముల మీద వజ్రాయుధమును ప్రయోగించినట్టు విరాధుని మీద నేను బాణప్రయోగము చేస్తాను. వీడు కొండ కూలినట్టు కూలిపోతాడు. వీడి వక్షస్థలమును చీలుస్తాను. వీడి ప్రాణాలు హరిస్తాను.” అని కోపంతో ఊగిపోతూ అన్నాడు.

లక్ష్మణుడు. (ఒక్కమాట. విరాధుడురాక్షసుడు. నరమాంసము తినేవాడు. వాడు అన్న మాటలు చదివారు కదా. సన్యాసులు జితేంద్రియులు. వారి వెంట స్త్రీ ఉండకూడదు. వారికి స్త్రీ సాంగత్యము పనికిరాదు. ఇదీ ఆ రాక్షసునికి తెలిసిన నీతి. కాని ఈ నాడు మన మధ్యఉన్న స్వామీజీలు, సన్యాసుల చుట్టు ఉండేది ఆడవాళ్లే. సిల్కుజుబ్బాలు, చుట్టు ఆడవాళ్లు. తాము ఉండే గదుల్లో కిలోల కొద్దీ వెండి బంగారాలు, అక్రమ ఆస్తులు, పోలీసుకేసులు, అరెస్టులు ఇవి నిత్యకృత్యం అయ్యాయి. మరి ఆ రాక్షసుడికి ఉన్న జ్ఞానం కూడా మన స్వామీజీలకు లేదా! ఏమో! మీరే ఆలోచించండి)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ తృతీయః సర్గః (3) >>

Aranya Kanda Sarga 1 In Telugu – అరణ్యకాండ ప్రథమః సర్గః

Aranya Kanda Sarga 1 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” రామాయణంలోని అయిదు కాండల్లో మూడవది. ఇది రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలో 14 ఏళ్ళ వనవాసం గడుపుతూ చేసిన అనుభవాలను వివరిస్తుంది. ప్రథమ సర్గలో, వారు అరణ్యంలో ప్రవేశించి, అటవీ జీవులను కలుస్తారు మరియు శరభంగ, సుతీక్ష్ణ మునులతో సమావేశమవుతారు.

|| మహర్షిసంఘః ||

ప్రవిశ్య తు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ |
దదర్శ రామో దుర్ధర్షస్తాపసాశ్రమమండలమ్ ||

1

కుశచీరపరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృత్తమ్ |
యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలమ్ ||

2

శరణ్యం సర్వభూతానాం సుసంమృష్టాజిరం తథా |
మృగైర్బహుభిరాకీర్ణం పక్షిసంఘైః సమావృతమ్ ||

3

పూజితం చోపనృత్తం చ నిత్యమప్సరసాం గణైః |
విశాలైరగ్నిశరణైః స్రుగ్భాండైరజినైః కుశైః ||

4

సమిద్భిస్తోయకలశైః ఫలమూలైశ్చ శోభితమ్ |
ఆరణ్యైశ్చ మహావృక్షైః పుణ్యైః స్వాదుఫలైర్వృతమ్ ||

5

బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోషనినాదితమ్ |
పుష్పైర్వన్యైః పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా ||

6

ఫలమూలాశనైర్దాంతైశ్చీరకృష్ణాజినాంబరైః |
సూర్యవైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతమ్ ||

7

పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః |
తద్బ్రహ్మభవనప్రఖ్యం బ్రహ్మఘోషనినాదితమ్ ||

8

బ్రహ్మవిద్భిర్మహాభాగైర్బ్రాహ్మణైరుపశోభితమ్ |
స దృష్ట్వా రాఘవః శ్రీమాంస్తాపసాశ్రమమండలమ్ ||

9

అభ్యగచ్ఛన్మహాతేజా విజ్యం కృత్వా మహద్ధనుః |
దివ్యజ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః ||

10

అభ్యగచ్ఛంస్తథా ప్రీతా వైదేహీం చ యశస్వినీమ్ |
తే తం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః ||

11

లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీం చ యశస్వినీమ్ |
మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః ||

12

రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతామ్ |
దదృశుర్విస్మితాకారాః రామస్య వనవాసినః ||

13

వైదేహీం లక్ష్మణం రామం నేత్రైరనిమిషైరివ |
ఆశ్చర్యభూతాన్ దదృశుః సర్వే తే వనచారిణః ||

14

అత్రైనం హి మహాభాగాః సర్వభూతహితే రతమ్ |
అతిథిం పర్ణశాలాయాం రాఘవం సంన్యవేశయన్ ||

15

తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమాః |
ఆజహ్రుస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణః ||

16

మూలం పుష్పం ఫలం వన్యమాశ్రమం చ మహాత్మనః |
నివేదయిత్వా ధర్మజ్ఞాస్తతః ప్రాంజలయోఽబ్రువన్ ||

17

ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశాః |
పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః ||

18

ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ |
రాజా తస్మాద్వరాన్భోగాన్భుంక్తే లోకనమస్కృతః ||

19

తే వయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః |
నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః ||

20

న్యస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియాః |
రక్షితవ్యాస్త్వయా శశ్వద్గర్భభూతాస్తపోధనాః ||

21

ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైర్వన్యైశ్చ రాఘవమ్ |
అన్యైశ్చ వివిధాహారైః సలక్ష్మణమపూజయన్ ||

22

తథాన్యే తాపసాః సిద్ధా రామం వైశ్వానరోపమాః |
న్యాయవృత్తా యథాన్యాయం తర్పయామాసురీశ్వరమ్ ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ప్రథమః సర్గః ||

Aranya Kanda Sarga 1 Meaning In Telugu

రాముడు సీత, లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఆ దండకారణ్యములో ఎంతో మంది మహా మునులు ఆశ్రమములు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు. ఆ మునుల ఆశ్రమముల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము, భయమూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పక్షుల కిల కిలారావములతో, వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి.

ఆ మునుల ఆశ్రమములు విశాలమైన అగ్ని గృహములతోనూ, యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ, వేలాడుతున్న జింక చర్మములతోనూ, దర్భలతోనూ, అగ్నికార్యమునకు కావలసిన సమిధలతోనూ, నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ, తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్కనుండి వేదమంత్రములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీనుల విందుగా వినపడుతున్నాయి. ఆ ఆశ్రమములలో కేవలము తపస్సుచేసుకొనే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామలక్ష్మణులకు ఆ ప్రాంతము బ్రహ్మలోకము వలె కనిపించింది.

రాముడు, సీత, లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూచారు. వారంతా రామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు. కొందరు మునులు రామ లక్ష్మణుల దేహధారుఢ్యము, అంగసౌష్టవము చూచి ఆశ్చర్యపోయారు. వారిని రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు.

ఆ మునులందరూ రామ లక్ష్మణులకు, సీతకు ఒక పర్ణశాలను చూపించారు. వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు. కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు. మరి కొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకొని వచ్చి ఇచ్చారు. అందులో ముఖ్యులు, పెద్దవారు అయిన మునులు రాముని చూచి

“రామా! నీవు అయోధ్యకు మహారాజువు. రాజు లోక పూజ్యుడు. రాజు ప్రజలను ధర్మమార్గంలో నడిపిస్తాడు. రాజు దుష్టులను శిక్షిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు. అందుకే రాజును అందరూ గౌరవించాలి, పూజించాలి. ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో నాలుగవ అంశ అని అంటారు. అందు చేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ, రాజభోగములు ఇంద్రుని వలె అనుభవిస్తుంటాడు. ఈ ప్రదేశము అయోధ్యారాజ్యములో ఉంది. కాబట్టి నీవే మాకు రాజువు. నీవే మమ్ములను రక్షించాలి. నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు. రాజు అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, రాజు రాజే.

రామా! మా సంగతి నీకు తెలుసు కదా! మేమే అన్ని సంగములను విడిచి పెట్టి జితేంద్రియులమై, ఆ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాము. మాకు ఎవరైనా అపకారము చేసినా, వారి మీద కోపగించకోడానికి కూడా మేము ఇష్టపడము. కాబట్టి మా అందరినీ రాజువైన నీవే మా అందరినీ రక్షించాలి.” అని పలికారు.

తరువాత ఆ మునులు రామలక్ష్మణులకు, సీతకు అనేక ఫలములు, కంద మూలములు, ఇతరములైన ఆహార పదార్థములు తెచ్చి ఇచ్చారు. రాముడు వారు చెప్పిన మాటలను ఆలకించాడు. వారు ఇచ్చిన పదార్థములను, ఫలములను భక్తితో స్వీకరించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము మొదటి సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ద్వితీయః సర్గః (2) >>

Balakanda Sarga 73 In Telugu – బాలకాండ త్రిసప్తతితమః సర్గః

Bala Kanda Sarga 73 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, మేము ఏ ఆహ్వానం లేదా వివాహ కార్డు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు లేదా ఈ వివాహం కోసం కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ సమానంగా మరియు వ్యక్తిగతంగా స్వాగతం. ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా అక్కడికి వెళ్దాం.

దశరథపుత్రోద్వాహః

యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమమ్ |
తస్మింస్తు దివసే శూరో యుధాజిత్సముపేయివాన్ ||

1

పుత్రః కేకయరాజస్య సాక్షాద్భరతమాతులః |
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబ్రవీత్ ||

2

కేకయాధిపతీ రాజా స్నేహాత్కుశలమబ్రవీత్ |
యేషాం కుశలకామోఽసి తేషాం సంప్రత్యనామయమ్ ||

3

స్వస్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతిః |
తదర్థముపయాతోఽహమయోధ్యాం రఘునందన ||

4

శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ |
మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే ||

5

త్వరయాభ్యుపయాతోఽహం ద్రష్టుకామః స్వసుఃసుతమ్ |
అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితమ్ ||

6

దృష్ట్వా పరమసత్కారైః పూజనార్హమపూజయత్ |
తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః ||

7

ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ |
ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ ||

8

యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః |
భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః ||

9

వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి |
వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్ ||

10

రాజా దశరథో రాజన్కృతకౌతుకమంగళైః |
పుత్రైర్నరవరశ్రేష్ఠ దాతారమభికాంక్షతే ||

11

దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి |
స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమమ్ ||

12

ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా |
ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్ ||

13

కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే |
స్వగృహే కో విచారోఽస్తి యథా రాజ్యమిదం తవ ||

14

కృతకౌతుకసర్వస్వా వేదిమూలముపాగతాః |
మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నేర్యథార్చిషః ||

15

సజ్జోఽహం త్వత్ప్రతీక్షోఽస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః |
అవిఘ్నం క్రియతాం రాజన్కిమర్థమవలంబతే ||

16

తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా |
ప్రవేశయామాస సుతాన్సర్వానృషిగణానపి ||

17

తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ |
కారయస్వ ఋషే సర్వామృషిభిః సహ ధార్మికైః ||

18

రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో |
తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవానృషిః ||

19

విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ |
ప్రపామధ్యే తు విధివద్వేదిం కృత్వా మహాతపాః ||

20

అలంచకార తాం వేదిం గంధపుష్పైః సమంతతః |
సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః ||

21

అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః |
శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః ||

22

లాజపూర్ణైశ్చ పాత్రౌఘైరక్షతైరపి సంస్కృతైః |
దర్భైః సమైః సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకమ్ ||

23

అగ్నిమాధాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతమ్ |
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషిః ||

24

తతః సీతాం సమానీయ సర్వాభరణభుషితామ్ |
సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా ||

25

అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనమ్ |
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ||

26

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయేవానుగతా సదా ||

27

ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా |
సాధు సాధ్వితి దేవానామృషీణాం వదతాం తదా ||

28

దేవదుందుభినిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ |
ఏవం దత్త్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ ||

29

అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః |
లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళాం చ మమాత్మజామ్ ||

30

ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మా భూత్కాలస్య పర్యయః |
తమేవముక్త్వా జనకో భరతం చాభ్యభాషత ||

31

పాణిం గృహ్ణీష్వ మాండవ్యాః పాణినా రఘునందన |
శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః ||

32

శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా |
సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః ||

33

పత్నీభిః సంతు కాకుత్స్థా మా భూత్కాలస్య పర్యయః |
జనకస్య వచః శ్రుత్వా పాణీన్పాణిభిరస్పృశన్ ||

34

చత్వారస్తే చతసౄణాం వసిష్ఠస్య మతే స్థితాః |
అగ్నిం ప్రదక్షిణం కృత్వా వేదిం రాజానమేవ చ ||

35

ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః |
యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్ ||

36

కాకుత్స్థైశ్చ గృహీతేషు లలితేషు చ పాణిషు |
పుష్పవృష్టిర్మహత్యాసీదంతరిక్షాత్సుభాస్వరా ||

37

దివ్యదుందుభినిర్ఘోషైర్గీతవాదిత్రనిఃస్వనైః |
ననృతుశ్చాప్సరఃసంఘా గంధర్వాశ్చ జగుః కలమ్ ||

38

వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత |
ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనినాదితే ||

39

త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యా మహౌజసః |
అథోపకార్యాం జగ్ముస్తే సదారా రఘునందనాః | [భార్యా]
రాజాప్యనుయయౌ పశ్యన్సర్షిసంఘః సబాంధవః ||

40

Balakanda Sarga 73 In Telugu Pdf With Meaning

దశరథుడు తన కుమారులచేత గోదానములు ఇప్పించు చున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.

(భరతుని మేనమామ అంటే దశరథుని మూడవ భార్య, భరతుని తల్లి అయిన కైకేయి సోదరుడు అనగా కేకయ రాజు కుమారుడు).

కేకయ రాజ కుమారుడు, భరతునికి మేనమామ అయిన యుధాజిత్తును చూచి దశరథుడుఎంతో సంతోషించాడు. యుధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు.

“బావగారూ! మా తండ్రికేకయ రాజుగారు తమరిని కుశలము అడగమని అన్నాడు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా! మా తండ్రిగారు తన మేనల్లుడు అయిన భరతుని చూడవలెనని ముచ్చట పడు తున్నాడు. భరతుని నా వెంట తీసుకొని రమ్మని నన్ను పంపాడు. అందుకని నేను అయోధ్యానగరమునకు వెళ్లాను. మీరందరూ మీ కుమారుల వివాహమలు జరిపించుటకు విదేహ కు వెళ్లారని తెలిసి ఇక్కడకు వచ్చాను.” అని అన్నాడు యుధాజిత్తు.

దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారములు చేసాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయము అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాత:కాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొన్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు.

పెళ్లి కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుభ ముహూర్తంలో తోరము కట్టడం మొదలగు మంగళ కార్యములు ఆచరించారు. తరువాత నలుగురు సోదరులు, పురోహితులు, అందరూ దశరథుని వద్దకు వెళ్లారు. దశరథుని అనుమతితో వసిష్ఠుడు జనక మహారాజు వద్దకు పోయి ఇలాఅన్నాడు.

“ఓ జనక మహారాజా! దశరథమహారాజు తన కుమారులకు కౌతుక మంగళకార్యములనుపూర్తిచేసుకొని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలికదా! ” అని అన్నాడు.

“అదేమిటి మహర్షీ! మిథిల కూడా వారిదేకదా! వారికి అడ్డేమున్నది. వారునా అనుమతి కోసరం ఎదురు చూడ్డం ఏమిటి? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములను పూర్తిచేసుకొని కల్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను. సుముహూర్తము సమీపించుచున్నది. ఇంక ఆలస్యము చేయకుండా దశరథుల వారిని వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కొని రెండు.” అని అన్నాడు జనకుడు.

జనకుని మాట మేరకు దశరథుడు, తనకుమారులతో సహా పురోహితులు ముందు నడువగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారి నందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు.

“ ఓ వసిష్ఠ మహర్షీ! తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యము వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథపుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను.” అని అన్నాడు.

ఆ మాటలకు వసిష్ఠుడు తన అంగీకారము తెలిపాడు. తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుని, శతానందుని చెరి ఒక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు.

వివాహ మండపము మధ్యలో ఉన్న అగ్ని కుండములో అగ్నిహోత్రమును ఉంచాడు. హెమ కుండము చుట్టు గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్లు, ధూప పాత్రలు, శంఖ పాత్రలు, హోమము చేయు సాధనములు, నేతితో నిండినపాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వసిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వేల్చాడు. దర్భలు అగ్నిహోత్రము చుట్టూ పరిచాడు. వేద మంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమమును నిర్వర్తించాడు.

తరువాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకొని వచ్చి అగ్ని హోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు. రాముని చూచి ఇలా అన్నాడు.

“ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ,
ప్రతీఛ్ఛ చైనాం భద్రం తే పాణిం గృష్ణాష్వ పాణినా|”

“ఓ రామా! ఈమె నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము. పాణిగ్రహణము చేయుము. ఓరామా! ఈమె పతివ్రతయై నిన్ను ఎల్లప్పుడూ నీడవలె వెన్నంటి ఉండగలదు.” అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు. కన్యాదానం చేసాడు.

ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుభులు మోగించారు. పూలవర్షము కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాముల కల్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు.

తరువాత జనకుడు లక్ష్మణుని పిలిచాడు. “లక్ష్మణా! ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము. ఇంక ఆలస్యము చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు.” అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతికి అందించాడు.

తరువాత జనకుడు భరతుని చూచి ” ఓ భరతా! ఈమె నా కుమార్తె మాండవి. ఈమెను పాణిగ్రహణము గావించు.

ఓ శత్రుఘ్నా! ఈమె నా కుమార్తె శ్రుత కీర్తి. నీవు ఈమె పాణిని గ్రహించు.

ఓ రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులారా! మీరందరూ సౌమ్యులు. గుణవంతులు. మంచి ప్రవర్తన కలవారు. నాకుమార్తెలను మీ మీ భార్యలుగా స్వీకరించండి.” అని అన్నాడు.

అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తి చేతిని పట్టుకొన్నారు. పాణిగ్రహణ మహోత్సవము జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమ స్కారము చేసారు. తరువాత మామగారు జనకునికి నమస్కారము చేసారు. తరువాత పురోహితులు వసిష్ఠమహర్షికి నమస్కారము చేసారు. తరువాత వసిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమ మును వైభవోపేతంగా జరిపించాడు.

తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టు మూడు సార్లు ప్రదక్షిణము చేసారు. ఆ ప్రకారంగా సీతా రాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు.

వివాహ కార్యక్రమము తరువాత రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహములకు వెళ్లారు. వారి వెంట ఋషులు, పురోహితులు, బ్రాహ్మణులు కూడా వెళ్లారు. కుమారులను కోడళ్లను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిదిగృహమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ చతుఃసప్తతితమః సర్గః (74) >>