Ayodhya Kanda Sarga 75 In Telugu – అయోధ్యాకాండ పంచసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 75

అయోధ్యాకాండ పంచసప్తతితమః సర్గంలో, సుమంత్రుడు రాముడు, సీత, లక్ష్మణులను గంగానది వద్ద వదిలి కుశలముగా తిరిగి అయోధ్యకు చేరుకుంటాడు. సుమంత్రుడు వధూతి దశరథుని వద్దకు వెళ్ళి రాముని అరణ్యవాసం గురించి వివరించాడును. దశరథుడు రాముని వేదనతో బాధపడి, వేదనతో వ్యాకులుడైనాడు. రాముడు లేని జీవితాన్ని తట్టుకోలేక, రాముడి తలపులో ఉంటూ కన్నీళ్ళతో వ్యతిరేకిస్తున్నాడు. ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదు, రాముని స్వరాన్ని మళ్లీ వినాలని తహతహలాడతాడు. దశరథుడు చివరికి తాపత్రయంతో రాముడి తలపులో తన ప్రాణాలు విడుస్తాడు.

భరతశపథః

దీర్ఘకాలాత్సముత్థాయ సంజ్ఞాం లబ్ధ్వా చ వీర్యవాన్ |
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం దీనాముద్వీక్ష్య మాతరమ్ || ౧ ||

సోఽమాత్యమధ్యేభరతో జననీమభ్యకుత్సయత్ |
రాజ్యం న కామయే జాతు మంత్రయే నాపి మాతరమ్ || ౨ ||

అభిషేకం న జానామి యోఽభూద్రాజ్ఞా సమీక్షితః |
విప్రకృష్టే హ్యహం దేశే శత్రుఘ్నసహితోఽవసమ్ || ౩ ||

వనవాసం న జానామి రామస్యాహం మహాత్మనః |
వివాసనం వా సౌమిత్రేః సీతాయాశ్చ యథాఽభవత్ || ౪ ||

తథైవ క్రోశతస్తస్య భరతస్య మహాత్మనః |
కౌసల్యా శబ్దమాజ్ఞాయ సుమిత్రామిదమబ్రవీత్ || ౫ ||

ఆగతః క్రూర కార్యాయాః కైకేయ్యా భరతః సుతః |
తమహం ద్రష్టుమిచ్ఛామి భరతం దీర్ఘదర్శినమ్ || ౬ ||

ఏవముక్త్వా సుమిత్రాం సా వివర్ణా మలినా కృశా |
ప్రతస్థే భరతః యత్ర వేపమానా విచేతనా || ౭ ||

స తు రామానుజశ్చాపి శత్రుఘ్న సహితస్తదా |
ప్రతస్థే భరతః యత్ర కౌసల్యాయా నివేశనమ్ || ౮ ||

తతః శత్రుఘ్నభరతౌ కౌసల్యాం ప్రేక్ష్య దుఃఖితౌ |
పర్యష్వజేతాం దుఃఖార్తాం పతితాం నష్ట చేతనామ్ || ౯ ||

రుదంతౌ రుదతీం దుఃఖాత్సమేత్యార్యాం మనస్వినీమ్ |
భరతం ప్రత్యువాచేదం కౌసల్యా భృశ దుఃఖితా || ౧౦ ||

ఇదం తే రాజ్య కామస్య రాజ్యం ప్రాప్తమకంటకమ్ |
సంప్రాప్తం బత కైకేయ్యా శీఘ్రం క్రూరేణ కర్మణా || ౧౧ ||

ప్రస్థాప్య చీరవసనం పుత్రం మే వనవాసినమ్ |
కైకేయీ కం గుణం తత్ర పశ్యతి క్రూరదర్శినీ || ౧౨ ||

క్షిప్రం మామపి కైకేయీ ప్రస్థాపయితుమర్హతి |
హిరణ్యనాభో యత్రాస్తే సుతః మే సుమహా యశాః || ౧౩ ||

అథవా స్వయమేవాహం సుమిత్రానుచరా సుఖమ్ |
అగ్నిహోత్రం పురస్కృత్య ప్రస్థాస్యే యత్ర రాఘవః || ౧౪ ||

కామం వా స్వయమేవాద్య తత్ర మాం నేతుమర్హసి |
యత్రాసౌ పురుషవ్యాఘ్రః పుత్రో మే తప్యతే తపః || ౧౫ ||

ఇదం హి తవ విస్తీర్ణం ధనధాన్యసమాచితమ్ |
హస్త్వశ్వరథసంపూర్ణం రాజ్యం నిర్యాతితం తయా || ౧౬ ||

ఇత్యాదిబహుభిర్వాక్యైః క్రూరైః సంభర్త్సితోఽనఘః |
వివ్యథే భరతస్తీవ్రం వ్రణే తుద్యేవ సూచినా || ౧౭ ||

పపాత చరణౌ తస్యాస్తదా సంభ్రాంతచేతనః |
విలప్య బహుధాఽసంజ్ఞో లబ్దసంజ్ఞస్తతః స్థితః || ౧౮ ||

ఏవం విలపమానాం తాం భరతః ప్రాంజలిస్తదా |
కౌసల్యాం ప్రత్యువాచేదం శోకైః బహుభిరావృతామ్ || ౧౯ ||

ఆర్యే కస్మాదజానంతం గర్హసే మామకిల్భిషమ్ |
విపులాం చ మమ ప్రీతిం స్థిరాం జానాసి రాఘవే || ౨౦ ||

కృతా శాస్త్రానుగా బుద్ధిర్మాభూత్తస్య కదాచన |
సత్యసంధః సతాం శ్రేష్ఠో యస్యార్యోఽనుమతే గతః || ౨౧ ||

ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యం చ ప్రతి మేహతు |
హంతు పాదేన గాం సుప్తాం యస్యార్యోఽనుమతే గతః || ౨౨ ||

కారయిత్వా మహత్కర్మ భర్తా భృత్యమనర్థకమ్ |
అధర్మః యోఽస్య సోఽస్యాస్తు యస్యార్యోఽనుమతే గతః || ౨౩ ||

పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ |
తతస్తం ద్రుహ్యతాం పాపం యస్యార్యోఽనుమతే గతః || ౨౪ ||

బలిషడ్భాగముద్ధృత్య నృపస్యారక్షతః ప్రజాః |
అధర్మః యోఽస్య సోఽస్యాస్తు యస్యార్యోఽనుమతే గతః || ౨౫ ||

సంశ్రుత్య చ తపస్విభ్యః సత్రే వై యజ్ఞదక్షిణామ్ |
తాం విప్రలపతాం పాపం యస్యార్యోఽనుమతే గతః || ౨౬ ||

హస్త్యశ్వరథసంబాధే యుద్ధే శస్త్రసమాకులే |
మా స్మ కార్షీత్సతాం ధర్మం యస్యార్యోఽనుమతే గతః || ౨౭ ||

ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమతా |
స నాశయతు దుష్టాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౨౮ ||

మా చ తం వ్యూఢబాహ్వంసం చంద్రార్కసమతేజనమ్ |
ద్రాక్షీద్రాజ్యస్థమాసీనం యస్యార్యోఽనుమతే గతః || ౨౯ ||

పాయసం కృసరం చాగం వృథా సోఽశ్నాతు నిర్ఘృణః |
గురూంశ్చాప్యవజానాతు యస్యార్యోఽనుమతే గతః || ౩౦ ||

గాశ్చ స్పృశతు పాదేన గురూన్ పరివదేత్స్వయమ్ |
మిత్రే ద్రుహ్యేత సోఽత్యంతం యస్యార్యోఽనుమతే గతః || ౩౧ ||

విశ్వాసాత్కథితం కించిత్పరివాదం మిథః క్వచిత్ |
వివృణోతు స దుష్టాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౩౨ ||

అకర్తా హ్యకృతజ్ఞశ్చ త్యక్తాత్మా నిరపత్రపః |
లోకే భవతు విద్వేష్యో యస్యార్యోఽనుమతే గతః || ౩౩ ||

పుత్రైర్దారైశ్చ భృత్యైశ్చ స్వగృహే పరివారితః |
సైకో మృష్టమశ్నాతు యస్యార్యోఽనుమతే గతః || ౩౪ ||

అప్రాప్య సదృశాన్ దారాననపత్యః ప్రమీయతామ్ |
అనవాప్య క్రియాం ధర్మ్యాం యస్యార్యోఽనుమతే గతః || ౩౫ ||

మాత్మనః సంతతిం ద్రాక్షీత్స్వేషు దారేషు దుఃఖితః |
ఆయుః సమగ్రమప్రాప్య యస్యార్యోఽనుమతే గతః || ౩౬ ||

రాజ స్త్రీబాలవృద్ధానాం వధే యత్పాపముచ్యతే |
భృత్యత్యాగే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతామ్ || ౩౭ ||

లాక్షయా మధుమాంసేన లోహేన చ విషేణ చ |
సదైవ బిభృయాద్భృత్యాన్ యస్యార్యోఽనుమతే గతః || ౩౮ ||

సంగ్రామే సముపోఢే స్మ శత్రుపక్షభయంకరే |
పలాయామానో వధ్యేత యస్యార్యోఽనుమతే గతః || ౩౯ ||

కపాలపాణిః పృథివీమటతాం చీరసంవృతః |
భిక్షమాణో యథోన్మత్తో యస్యార్యోఽనుమతే గతః || ౪౦ ||

మద్యే ప్రసక్తో భవతు స్త్రీష్వక్షేషు చ నిత్యశః |
కామక్రోధాభిభూతస్తు యస్యార్యోఽనుమతే గతః || ౪౧ ||

మా స్మ ధర్మే మనో భూయాదధర్మం సునిషేవతామ్ |
అపాత్రవర్షీ భవతు యస్యార్యోఽనుమతే గతః || ౪౨ ||

సంచితాన్యస్య విత్తాని వివిధాని సహస్రశః |
దస్యుభిర్విప్రలుప్యంతాం యశ్యార్యోఽనుమతే గతః || ౪౩ ||

ఉభే సంధ్యే శయానస్య యత్పాపం పరికల్ప్యతే |
తచ్చ పాపం భవేత్తస్య యస్యార్యోఽనుమతే గతః || ౪౪ ||

యదగ్నిదాయకే పాపం యత్పాపం గురుతల్పగే |
మిత్రద్రోహే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతామ్ || ౪౫ ||

దేవతానాం పితౄణాం చ మాతాపిత్రోస్తథైవ చ |
మా స్మ కార్షీత్ స శుశ్రూషాం యస్యార్యోఽనుమతే గతః || ౪౬ ||

సతాం లోకాత్సతాం కీర్త్యాః సంజ్జుష్టాత్ కర్మణస్తథా |
భ్రశ్యతు క్షిప్రమద్యైవ యస్యార్యోఽనుమతే గతః || ౪౭ ||

అపాస్య మాతృశుశ్రూషామనర్థే సోఽవతిష్ఠతామ్ |
దీర్ఘబాహుర్మహావక్షాః యస్యార్యోఽసుమతే గతః || ౪౮ ||

బహుపుత్రో దరిద్రశ్చ జ్వరరోగసమన్వితః |
స భూయాత్సతతక్లేశీ యస్యార్యోఽనుమతే గతః || ౪౯ ||

ఆశామాశం సమానానాం దీనానామూర్ధ్వచక్షుషామ్ |
ఆర్థినాం వితథాం కుర్యాద్యస్యార్యోఽనుమతే గతః || ౫౦ ||

మాయయా రమతాం నిత్యం పరుషః పిశునోఽశుచిః |
రాజ్ఞో భీతస్త్వధర్మాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౫౧ ||

ఋతుస్నాతాం సతీం భార్యామృతుకాలానురోధినీమ్ |
అతివర్తేత దుష్టాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౫౨ ||

ధర్మదారాన్ పరిత్యజ్య పరదారాన్ని షేవతామ్ |
త్యక్తధర్మరతిర్మూఢో యస్యార్యోఽనుమతే గతః || ౫౩ ||

విప్రలుప్తప్రజాతస్య దుష్కృతం బ్రాహ్మణస్య యత్ |
తదేవ ప్రతిపద్యేత యస్యార్యోఽనుమతే గతః || ౫౪ ||

పానీయదూషకే పాపం తథైవ విషదాయకే |
యత్తదేకః స లభతాం యస్యార్యోఽనుమతే గతః || ౫౫ ||

బ్రాహ్మణాయోద్యతాం పూజాం విహంతు కలుషేంద్రియః |
బాలవత్సాం చ గాం దోగ్దుః యస్యర్యోఽనుమతే గతః || ౫౬ ||

తృష్ణార్తం సతి పానీయే విప్రలంభేన యోజయేత్ |
లభేత తస్య యత్పాపం యస్యార్యోఽనుమతే గతః || ౫౭ ||

భక్త్యా వివదమానేషు మార్గమాశ్రిత్య పశ్యతః |
తస్య పాపేన యుజ్యేత యస్యార్యోఽనుమతే గతః || ౫౮ ||

విహీనాం పతి పుత్రాభ్యాం కౌసల్యాం పార్థివాత్మజః |
ఏవమాశ్వాసయన్నేవ దుఃఖార్తో నిపపాత హ || ౫౯ ||

తథా తు శపథైః కష్టైః శపమానమచేతనమ్ |
భరతం శోక సంతప్తం కౌసల్యా వాక్యమబ్రవీత్ || ౬౦ ||

మమ దుఃఖమిదం పుత్ర భూయః సముపజాయతే |
శపథైః శపమానో హి ప్రాణానుపరుణత్సి మే || ౬౧ ||

దిష్ట్యా న చలితో ధర్మాత్ ఆత్మా తే సహలక్ష్మణః |
వత్స సత్య ప్రతిజ్ఞో మే సతాం లోకమవాప్స్యసి || ౬౨ ||

ఇత్యుక్త్వా చాంకమానీయ భరతం భ్రాతృవత్సలమ్ |
పరిష్వజ్య మహాబాహుం రురోద భృశదుఃఖితా || ౬౩ ||

ఏవం విలపమానస్య దుఃఖార్తస్య మహాత్మనః |
మోహాచ్చ శోక సంరోధాత్ బభూవ లులితం మనః || ౬౪ ||

లాలప్యమానస్య విచేతనస్య
ప్రణష్టబుద్ధేః పతితస్య భూమౌ |
ముహుర్ముహుర్నిశ్శ్వసతశ్చ ఘర్మమ్
సా తస్య శోకేన జగామ రాత్రిః || ౬౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచసప్తతితమః సర్గః || ౭౫ ||

Ayodhya Kanda Sarga 75 Meaning In Telugu

పుత్ర వ్యామోహం ఇంత చేటు తెస్తుందని కలలోనైనా తలపని కైక, తన కొడుకు కోసరం ఇదంతా చేసింది. అపకీర్తి పాలయింది కైక. కాని తనకొడుకు భరతుడు తననే నిందిస్తున్నాడు. శాపాలు పెడుతున్నాడు. తన తల్లివే కాదు పొమ్మన్నాడు. ఈ మాటలు విని కైక కుమిలిపోతోంది. నోట మాట రావడం లేదు. నేల మీద పడి ఉన్న కొడుకు భరతుని నిస్సహాయంగా చూస్తూ ఉంది.

ఇంతలో భరతుడు లేచాడు. భరతుని రాకను విని అమాత్యులు అందరూ అక్కడకు చేరుకున్నారు. కాబోయే మహారాజు భరతుడు నేలమీద పడి ఉన్నాడు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో భరతుడు తల పైకి ఎత్తి అమాత్యులను చూచాడు. భరతునికి ఒక అనుమానం పట్టుకొంది. రాముడు అరణ్యములకు వెళితే, తన తండ్రి మరణిస్తే, తానే రాజు అవుతాడు. ఈ చర్యల వల్ల లబ్ధి. పొందేది తను. అమాత్యులు తానే ఇదంతా తన తల్లి కైక తో చేయించానని అపోహ పడే అవకాశం ఉంది. తనకు ఏమీ తెలియదు అనీ, తాను అమాయకుడననీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉందని గుర్తించాడు భరతుడు. అందుకే అమాత్యులతో బిగ్గరగా ఇలా అన్నాడు.

“అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించ లేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగానీ, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగానీ నాకు ఏ మాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం.” అని బిగ్గరగా అరిచాడు.

భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య, సుమితను పిలిచింది. “సుమిత్రా! అది భరతుని కంఠస్వరము కదూ! భరతుడు తన మేనమామ ఇంటినుండి వచ్చినట్టున్నాడు. పద వెళ్లి భరతుని పలకరించి వద్దాము.” అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు, శత్రుఘ్ననితో కలిసి కౌసల్య మందిరము వైపువస్తున్నాడు.

“అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించ లేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగానీ, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగానీ నాకు ఏ మాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం.” అని బిగ్గరగా అరిచాడు.

భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య, సుమితను పిలిచింది. “సుమిత్రా! అది భరతుని కంఠస్వరము కదూ! భరతుడు తన మేనమామ ఇంటినుండి వచ్చినట్టున్నాడు. పద వెళ్లి భరతుని పలకరించి వద్దాము.” అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు, శత్రుఘ్ననితో కలిసి కౌసల్య మందిరము వైపువస్తున్నాడు.

భరతుని చూచినకౌసల్యకు దుఃఖము ఆగలేదు. ఏడుస్తూ భరతుని పొదిపట్టుకొంది. గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంది. “నాయనా భరతా! నీవు రాజ్యము కావాలని కోరుకున్నావు. నీకు అన్నదమ్ముల బాధ కానీ దాయాదుల బాధ కానీ లేని రాజ్యము లభించింది. నీ తల్లి కైక చేసిన దుశ్చర్యల వలన నీకు రాజ్యప్రాప్తి సులభంగా కలిగింది. కైక తన కొడుక్కు రాజ్యము కావాలని కోరుకోడంలో తప్పులేదు. కానీ నా కొడుకును నార చీరలు కట్టించి అడవులకు పంపడం దేనికి? దాని వలన ఆమెకు కలిగే ప్రయోజనము ఏమి? అంతకన్నా నన్ను కూడా రామునితో పాటు అడవులకు పంపాలి అని ఆమె కోరుకొని ఉంటే బాగుండేది. ఆమె కోరుకున్నా కోరుకోక పోయినా నేను, సుమిత్రా, మా కుమారుల వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాము. నీ అనుమతి కోసరం ఎదురుచూస్తున్నాము. నీకు మామీద దయ ఉంటే మమ్ములను రాముడు ఉన్నచోటికి తీసుకొని వెళ్లు. ఇదే మేము నిన్ను కోరేది.” అని భరతుని సూదుల వంటి మాటలతో బాధపెట్టింది కౌసల్య.

ఆ మాటలకు చలించిపోయాడు భరతుడు. తనకు ఏ పాపమూ తెలియకపోయినా అంతా తనకు తెలిసే జరిగిందని అంతా అనుకుంటున్నారు. తుదకు కౌసల్యకూడా ఆ ప్రకారము మాట్లాడింది. ఏం చెయ్యాలో తోచక భరతుడు అలాగే కిందికి జారిపోయాడు. గట్టిగా కౌసల్య కాళ్లు పట్టుకున్నాడు. భోరునవిలపిస్తున్నాడు. కౌసల్యముందు చేతులు జోడించి మోకాళ్ల మీద నిలబడ్డాడు. ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! నా సంగతి నీకు తెలియదా. రాముడు అంటే నాకు ఎంత ప్రేమా భక్తి ఉందో నీకు తెలియదా. ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను నిందిస్తావు. నా అన్న రాముని అరణ్యములకుపంపిన వారికి ధర్మశాస్త్రము గురించి ఏమీ తెలియదు. వారి బుద్ధి చెడిపోయినది.

అమ్మా! నాకు తెలిసీ, నేను రాముని అడవులకుపంపడానికి సమ్మతించినట్టయితే నేను నిద్రించుచున్న గోవును కాలితో తన్నిన పాపమును, సూర్యుని ఎదురుగా మలమూత్రవిసర్జన చేసిన పాపమును, పాపాత్ములను సేవించిన పాపమును పొందుతాను. అమ్మా! నేనే కనక రాముని అడవులకు పంపినట్టయితే నేను పనివాళ్ల చేత పనిచేయించుకొని వారికి పారితోషికము ఇవ్వని పాపమున పోతాను. రాముడు అడవులకు పోవడం నాకు తెలిసీ నేను ఊరకుంటే నేను రాజద్రోహము చేసిన పాపమున పోతాను.

నేను కనక రాముడు అడవులకు పోవడానికి సమ్మతి తెలియజేసినట్టయితే నేను ప్రజల నుండీ పన్నులు వసూలు చేస్తూ ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించని పాపమున పోతాను. (ప్రస్తుత రాజకీయ నాయకులందరూ ఇదే పాపం చేస్తున్నారు.)

అమ్మా! నేను కనక రాముని అరణ్యములకో పోవుటకు నా సమ్మతి తెలిపినట్టయితే నేను యాగము చేయించుకున్న తరువాత ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన పాపాన పోతాను.

నేను కనక నా అన్న రాముని అరణ్యవాసమునకు కారణము అయితే నేను యుద్ధములో పారిపోయి వచ్చిన వాడు పొందే పాపమును, పెద్దలను అవమానించిన పాపమును, వేదాధ్యయనము చెయ్యని పాపమును, మిత్రద్రోహము చేసిన పాపమును, భార్యాబిడ్డలకు, బంధువులకుపెట్టకుండా నేనొక్కడినే మృష్టాన్నమును భుజించిన పాపమును, సంతానము కలుగని వాడు పొందే పాపమును, రాజును, స్త్రీలను, బాలురను వృద్ధులను చంపిన పాపమును, తాను పోషించ వలసిన వారిని పోషించకుండా వదిలివేసిన పాపమును, అక్రమ వ్యాపారములను చేసిన వాడు పొందే పాపమును, ఇతరుల ఇండ్లు తగలపెట్టిన వాడు పొందే పాపమును, ఉదయము, సాయంత్రమూ నిద్రించేవాడు పొందే పాపమును, గురువుగారి భార్యను కామించే వాడు పొందే పాపమును, దేవతలను ఆరాధించని వాడు, తల్లితండ్రులకు సేవచేయని వాడు పొందే పాపమును, క్రూరపు పనులు చేయుచూ, అబద్ధాలు ఆడుతూ, అపవిత్రంగా, అధర్మంగా, అందరికీ భయపడుతూ దొంగవలె బతికేవాడు పొందే పాపమును, కట్టుకున్న భార్యను వదిలి, పరస్త్రీల వెంట తిరిగేవాడు పొందే పాపమును, తాగే నీరు పాడుచేసేవాడు, ఇతరులకు విషం ఇచ్చేవాడు పొందే పాపమును, సిద్ధంగా ఉన్న పూజను పాడుచేసేవాడు పొందేపాపమును, దూడకు కూడా మిగల్చకుండా ఆవునుండి పాలు అన్నీపితికేవాడు పొందే పాపమును, నా దగ్గర జలం ఉండీ, దప్పికతో ఉన్న వారికి జలం ఇవ్వని వాడు పొందే పాపమును, ఇద్దరు కొట్టుకుంటుంటే వారిని విడదీయకుండా వినోదంగా చూచేవాడు పొందే పాపమును, పొందుతాను.

అమ్మా! నేను కనక రాముని అడవులకు పంపడానికి అనుమతి ఇచ్చినట్టు నీవు భావిస్తే నేను ప్రజలందరిచేతా అందరికీ అపకారము చేసేవాడి గానూ, కృతఘ్నుడు గానూ, ఆత్మహత్యాసదృశు డుగానూ, సిగ్గులేని వాడిగానూ అవమానింపబడతాను. నేను మీ అందరి శాపములు తగిలి బిచ్చము ఎత్తుకొంటూ పిచ్చివాని వలె బతుకుతాను. నిత్యమూ మద్యము సేవిస్తూ స్త్రీలతో క్రీడిస్తూ, పాపములు చేస్తూ బతుకుతాను. ధర్మభ్రష్టుడిని, సత్కర్మ భ్రష్టుడిని అయిపోతాను. ఈ పాపాలన్నీ నేనే చేసిన ఫలితాన్ని పొందుతాను.

ఇకనైనా నన్ను నమ్మవా అమ్మా.” అని భరతుడు ఎన్నో ఒట్లు పెట్టుకున్నాడు. కౌసల్య పాదాల మీద పడ్డాడు భరతుడు. భరతుని మాటలు విన్న కౌసల్యకు నోట మాట రాలేదు. భరతుని పైకి లేవదీసింది. “కుమారా భరతా! నీవు ఇన్ని ఒట్లు పెట్టుకొని నా దు:ఖము మరింత ఎక్కువ చేసావు. భరతా! నీవు ధర్మాత్ముడివి. ఆవిషయం నాకు తెలుసు. కాని రాముని మీద ఉన్న ప్రేమతో ఏదేదో అన్నాను. ఏమీ అనుకోకు” అంటూ భరతుని కౌగలించుకొని కౌసల్య దు:ఖిస్తూ ఉంది. ఆ ప్రకారంగా భరతుడు, కౌసల్య దు:ఖిస్తూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉన్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షట్సప్తతితమః సర్గః (76) >>

Ayodhya Kanda Sarga 74 In Telugu – అయోధ్యాకాండ చతుఃసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 74

అయోధ్యాకాండం యొక్క చతుఃసప్తతితమః సర్గం లో రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి అరణ్యాన్ని చేరుతారు. ఈ సమయంలో దశరథ మహారాజు, కైకేయి కోరిన రెండు వరాలు ఇవ్వడం వల్ల, రాముని అడవికి పంపడం వల్ల బాధతో మరణిస్తారు. భార్య కైకేయి కారణంగా తన కుమారుడిని వనవాసానికి పంపడం వల్ల ఆయన తీవ్రంగా బాధపడతారు. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ అక్కడి వనచరుల సహాయంతో జీవనం సాగిస్తారు. కైకేయి చేసిన కార్యం పట్ల దశరథుడు తీవ్ర పశ్చాత్తాపంతో, తపస్సు చేస్తూ రాముని తిరిగి రావాలని ఆశిస్తూ చివరకు మరణిస్తారు.

కైకేయ్యాక్రోశః

తాం తథా గర్హయిత్వా తు మాతరం భరతస్తదా |
రోషేణ మహతాఽవిష్టః పునరేవాబ్రవీద్వచః || ౧ ||

రాజ్యాద్భ్రంశస్వ కైకేయి నృశంసే దుష్టచారిణి |
పరిత్యక్తా చ ధర్మేణ మా మృతం రుదతీ భవ || ౨ ||

కిం ను తేఽదూషయద్రాజా రామః వా భృశధార్మికః |
యయోః మృత్యుర్వివాసశ్చ త్వత్కృతే తుల్యమాగతౌ || ౩ ||

భ్రూణహత్యామసి ప్రాప్తా కులస్యాస్య వినాశనాత్ |
కైకేయి నరకం గచ్ఛ మా చ భర్తుః సలోకతామ్ || ౪ ||

యత్త్వయా హీదృశం పాపం కృతం ఘోరేణ కర్మణా |
సర్వలోకప్రియం హిత్వా మమాప్యాపాదితం భయమ్ || ౫ ||

త్వత్కృతే మే పితా వృత్తః రామశ్చారణ్యమాశ్రితః |
అయశో జీవలోకే చ త్వయాఽహం ప్రతిపాదితః || ౬ ||

మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్యకాముకే |
న తేఽహమభిభాష్యోఽస్మి దుర్వృత్తే పతిఘాతిని || ౭ ||

కౌసల్యా చ సుమిత్రా చ యాశ్చాన్యా మమ మాతరః |
దుఃఖేన మహతాఽవిష్టాస్త్వాం ప్రాప్య కులదూషిణీమ్ || ౮ ||

న త్వమశ్వపతేః కన్యా ధర్మరాజస్య ధీమతః |
రాక్షసీ తత్ర జాతాఽసి కులప్రధ్వంసినీ పితుః || ౯ ||

యత్త్వయా ధార్మికో రామర్నిత్యం సత్యపరాయణః |
వనం ప్రస్థాపితో దుఃఖాత్ పితా చ త్రిదివం గతః || ౧౦ ||

యత్ప్రధానాఽసి తత్పాపం మయి పిత్రా వినా కృతే |
భ్రాతృభ్యాం చ పరిత్యక్తే సర్వ లోకస్య చాప్రియే || ౧౧ ||

కౌసల్యాం ధర్మసంయుక్తాం వియుక్తాం పాపనిశ్చయే |
కృత్వా కం ప్రాప్స్యసే త్వద్య లోకం నిరయగామినీ || ౧౨ ||

కిం నావబుధ్యసే క్రూరే నియతం బంధుసంశ్రయమ్ |
జ్యేష్ఠం పితృసమం రామం కౌసల్యాయాత్మ సంభవమ్ || ౧౩ ||

అంగప్రత్యంగజః పుత్రః హృదయాచ్చాపి జాయతే |
తస్మాత్ప్రియతమో మాతుః ప్రియత్వాన్న తు బాంధవః || ౧౪ ||

అన్యదా కిల ధర్మజ్ఞా సురభిః సురసమ్మతా |
వహమానౌ దదర్శోర్వ్యాం పుత్రౌ విగతచేతసౌ || ౧౫ ||

తావర్ధదివసే శ్రాంతౌ దృష్ట్వా పుత్రౌ మహీతలే |
రురోద పుత్రశోకేన బాష్పపర్యాకులేక్షణా || ౧౬ ||

అధస్తాద్వ్రజతస్తస్యాః సురరాజ్ఞో మహాత్మనః |
బిందవః పతితా గాత్రే సూక్ష్మాః సురభిగంధినః || ౧౭ ||

ఇంద్రోఽప్యశ్రునిపాతం తం స్వగాత్రే పుణ్యగంధినమ్ |
సురభిం మన్యతే దృష్ట్వా భూయసీం తాం సురేశ్వరః || ౧౮ ||

నిరీక్షమాణః శక్రస్తాం దదర్శ సురభిం స్థితామ్ |
ఆకాశే విష్ఠితాం దీనాం రుదతీం భృశదుఃఖితామ్ || ౧౯ ||

తాం దృష్ట్వా శోకసంతప్తాం వజ్ర పాణిర్యశస్వినీమ్ |
ఇంద్రః ప్రాంజలిరుద్విగ్నః సురరాజోఽబ్రవీద్వచః || ౨౦ ||

భయం కచ్చిన్న చాస్మాసు కుతశ్చిద్విద్యతే మహత్ |
కుతర్నిమిత్తః శోకస్తే బ్రూహి సర్వ హితైషిణి || ౨౧ ||

ఏవముక్తా తు సురభిః సురరాజేన ధీమతా |
పత్యువాచ తతో ధీరా వాక్యం వాక్యవిశారదా || ౨౨ ||

శాంతం పాపం న వః కించిత్ కుతశ్చిదమరాధిప |
అహం తు మగ్నౌ శోచామి స్వపుత్రౌ విషమే స్థితౌ || ౨౩ ||

ఏతౌ దృష్ట్వా కృశౌ దీనౌ సూర్యరశ్మిప్రతాపినౌ |
అర్ద్యమానౌ బలీవర్దౌ కర్షకేణ సురాధిప || ౨౪ ||

మమ కాయాత్ ప్రసూతౌ హి దుఃఖితౌ భారపీడితౌ |
యౌ దృష్ట్వా పరితప్యేఽహం నాస్తి పుత్రసమః ప్రియః || ౨౫ ||

యస్యాః పుత్రసహస్రైస్తు కృత్స్నం వ్యాప్తమిదం జగత్ |
తాం దృష్ట్వా రుదతీం శక్రో న సుతాన్మన్యతే పరమ్ || ౨౬ ||

సదాఽప్రతిమవృత్తాయా లోకధారణకామ్యయా |
శ్రీమత్యా గుణనిత్యాయాః స్వభావపరిచేష్టయా || ౨౭ ||

యస్యాః పుత్రసహస్రాణి సాఽపి శోచతి కామధుక్ |
కిం పునర్యా వినా రామం కౌసల్యా వర్తయిష్యతి || ౨౮ ||

ఏకపుత్రా చ సాధ్వీ చ వివత్సేయం త్వయా కృతా |
తస్మాత్త్వం సతతం దుఃఖం ప్రేత్య చేహ చ లప్స్యసే || ౨౯ ||

అహం హ్యపచితిం భ్రాతుః పితుశ్చ సకలామిమామ్ |
వర్ధనం యశసశ్చాపి కరిష్యామి న సంశయః || ౩౦ ||

ఆనాయయిత్వా తనయం కౌసల్యాయా మహాబలమ్ |
స్వయమేవ ప్రవేక్ష్యామి వనం మునినిషేవితమ్ || ౩౧ ||

న హ్యహం పాపసంకల్పే పాపే పాపం త్వయా కృతమ్ |
శక్తో ధారయితుం పౌరైరశ్రుకంఠైర్నిరీక్షితః || ౩౨ ||

సా త్వమగ్నిం ప్రవిశ వా స్వయం వా దండకాన్విశ |
రజ్జుం బధాన వా కంఠే న హి తేఽన్యత్పరాయణమ్ || ౩౩ ||

అహమప్యవనిం ప్రాప్తే రామే సత్యపరాక్రమే |
కృతకృత్యో భవిష్యామి విప్రవాసితకల్మషః || ౩౪ ||

ఇతి నాగైవారణ్యే తోమరాంకుశచోదితః |
పపాత భువి సంక్రుద్ధో నిశ్శ్వసన్నివ పన్నగః || ౩౫ ||

సంరక్తనేత్రః శిథిలాంబరస్తథా
విధూత సర్వాభరణః పరంతపః |
బభూవ భూమౌ పతితో నృపాత్మజః
శచీపతేః కేతురివోత్సవక్షయే || ౩౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃసప్తతితమః సర్గః || ౭౪ ||

Ayodhya Kanda Sarga 74 Meaning In Telugu

తన కొడుకు భరతుడు ఎంత దూషించినా కైక మారు పలక లేదు. మౌనంగా ఉంది. భరతుడు తండ్రి మరణాన్ని తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణం తన తల్లి కైక అని గుర్తుకు తెచ్చుకున్నాడు భరతుడు. తల్లి వంక తీక్షణంగా చూచాడు.

“అమ్మా! నీవు తండ్రి గారినే కాదు నన్ను కూడా మరణించేట్టు చేసావు. అమ్మా నేను మరణించిన తరువాత నా శవాన్ని, ఈ రాజ్యాన్ని చూచుకుంటూ తీరిగ్గా ఏడుద్దువుగానీ. ఏమ్మా! నీ కొడుకు మరణిస్తే నీకు దుఃఖం వచ్చిందా! ఏ పాపమూ ఎరుగని రాముని అరణ్యాలకు పంపినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీ వలన నా తండ్రి అకాల మరణము పొందినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీకు ఏమి అపకారము చేసాడని నా రాముని అడవులకు వెళ్లమని చెప్పావు?

నీవు చేసినపాపాలకు నీకు నరకమే సరి అయిన గతి. స్వర్గములో నీకు, భార్యగా నా తండ్రి పక్కన ఉండే అర్హత నీకు లేదు. అమ్మా! ఈ తుచ్ఛమైన రాజ్యము కోసరం నీవు చేసిన పనులు చూస్తుంటే నాకే భయం వేస్తోంది. రేపు నన్నుకూడా ఏమైనా చేస్తావేమో అని భయపడుతున్నాను. నా రాముని అడవులకు పంపినది నీవే అయినా, నా తండ్రిమరణానికి కారణం నీవే అయినా, నేనే ರಾಜ್ಯಂ కోసరం ఇదంతా చేయించానని నాకు శాశ్వత అపకీర్తి అంటగట్టావు. తల్లి తన కుమారుని క్షేమం కోరుతుంది. నీవు మాత్రం నా నాశనాన్ని కోరావు. నువ్వు నా తల్లివి కావు. నావు శత్రువుతో సమానము. భర్త మరణానికి కారకురాలవైన నీ వంటి క్రూరురాలను నా తల్లి అని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది. నీ మూలంగా కౌసల్యకు, సుమిత్రకు కూడా చెడ్డ పేరు వచ్చింది.

నీవు ఇక్ష్వాకు వంశమునకే కాదు నీ తండ్రి అశ్వపతి వంశమునకు కూడా అపకీర్తి తెచ్చిపెట్టావు. మా తాత గారి వంశములో పుట్టిన రాక్షసివి. నీవు చేసిన పాపపు పనులకు నాకు పితృవియోగము, సోదరుల వియోగము కలిగాయి. ఇన్ని పాపములు చేసిన నీకు నరకము కూడా సరి అయినది కాదు. నీకు మరొక పాపలోకము సృష్టింపబడవలెను.

అమ్మా! నీకు రాముని సంగతీ, నా తండ్రి దశరథుని సంగతీ తెలియదా! వారు ధర్మము తప్పని వారనీ, ఆడి తప్పని వారనీ తెలియదా! వారికి ఇంత ద్రోహం ఎలా చేసావమ్మా! నేను నీ కన్న కొడుకును. నీ శరీరం నాకు పంచి ఇచ్చావు. మరి నాకు ఈ పితృవియోగము, భ్రాతృవియోగము ఎందుకు కలిగించావమ్మా! తల్లి ప్రేమ గురించి నీకు తెలుసో లేదో నేను చెబుతాను విను ….పూర్వము ఒక సారి కామధేనువు తన సంతతిలో పుట్టిన పుత్రులు (కోడె దూడలు) భూమిని దున్నుతూ సొమ్మసిలి పడిపోవడం చూచిందట. అలా పడిపోయిన దూడలను చూచి కామధేనువు ఏడ్చిందట. ఆ కామధేనువు కంటి నీరు దేవేంద్రుని మీద పడినవట. ఆ కంటినీరు కామధేనువువి అని అనుకున్నాడు దేవేంద్రుడు. వెంటనే దేవేంద్రుడు కామధేనువు దగ్గరకు వెళ్లాడట. ఇంద్రుని చూచి కామధేనువు ఆయనకు నమస్కరించి ఇలా అంది.

“దేవేంద్రా! నా పుత్రులు అయిన ఈ వృషభములు కష్టించి పనిచేస్తూ సొమ్మసిలి పడిపోయాయి. కాని దయజాలి లేని ఆ రైతు వాటిని కర్రతో కొడుతూ తోక మెలితిప్పుతూ బాధపెడుతున్నాడు. నా కుమారుల దుస్థితి చూచి నాకు కన్నీళ్లు వచ్చాయి. బరువుమోయలేక పడిపోయిన ఆ ఎద్దులు నా శరీరము పంచుకొని పుట్టాయి. ఎవరికైనా పుత్రులను మించిన ప్రియమైన వస్తువు వేరే ఉండదు కదా!” అని పలికింది కామధేనువు.

అమ్మా! ఈ లోకంలో ఉన్న కోటాను కోట్ల ధేనువులు అన్నీ కామధేనువు పుత్రులే. కానీ, కేవలం రెండు ఎద్దులు బాధపడుతుంటే తట్టుకోలేక కన్నీరు కార్చింది ఆ కామధేనువు. అటువంటిది లేక లేక కలిగిన కన్నకొడుకులను పోగొట్టుకున్న ఆ  కౌసల్య, సుమిత్ర నిరంతరమూ కార్చే కన్నీరు నీకు కనపడలేదా అమ్మా! వారి దుఃఖము నీ మనసును కదిలించలేదా?

అమ్మా! కన్నకొడుకులను కన్నతల్లికి దూరం చేసిన వారికి ఏ పాపం చుట్టకుంటుందో ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది. నేను వెంటనే నీవు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. నేను వెంటనే రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. రామునికి బదులుగా నేను మునివేషము ధరించి అడవులకు పోతాను. అప్పుడు పుత్రవియోగంతో నీవు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తావు. లేకపోతే నీవు కూడా నా వెంట అరణ్యములకు రా! అదీ కాకపోతే ఆత్మహత్య చేసుకొని మరణించు. ఇదితప్ప నీకు వేరుమార్గము లేదు. రాముని తిరిగి రాజ్యాభిషిక్తుని చేస్తేగానీ నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము కలుగదు.” అని కోపంతో ఊగి పోతూ తల్లి కైకను శతవిధాలా దూషించాడు భరతుడు. ఆయాసం వచ్చి నేలమీద కూలబడి పోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదినాలుగవ సర్ద సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచసప్తతితమః సర్గః (75) >>

Balakanda Sarga 75 In Telugu – బాలకాండ పంచసప్తతితమః సర్గః

BalaKanda Sarga 75 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచసప్తతితమః సర్గలో, సందర్శకుడు పరశు రాముడు విష్ణువు మరియు శివుడి విల్లుల పురాణాలను రాముడికి వివరిస్తాడు. తన కుమారులను విడిచిపెట్టమని దశరథుడు చేసిన అభ్యర్థనను పట్టించుకోకుండా, పరశు రాముడు దశరథ రాముడిని నేరుగా ఉద్దేశించి, విష్ణువు యొక్క పొడవాటి ధనుస్సుతో లక్ష్యం వేయమని అడుగుతాడు మరియు దశరథ రాముడు అలా చేయగలిగితే, పరశురాముడు ద్వంద్వ యుద్ధం చేస్తానని చెప్పాడు. అతనిని.

వైష్ణవధనుఃప్రశంసా

రామ దాశరథే రామ వీర్యం తే శ్రూయతేఽద్భుతమ్ | [వీర]
ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్ ||

1

తదద్భుతమచింత్యం చ భేదనం ధనుషస్త్వయా |
తచ్ఛ్రుత్వాహమనుప్రాప్తో ధనుర్గృహ్యాపరం శుభమ్ ||

2

తదిదం ఘోరసంకాశం జామదగ్న్యం మహద్ధనుః |
పూరయస్వ శరేణైవ స్వబలం దర్శయస్వ చ ||

3

తదహం తే బలం దృష్ట్వా ధనుషోఽస్య ప్రపూరణే |
ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘ్యమహం తవ ||

4

తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా |
విషణ్ణవదనో దీనః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ||

5

క్షత్రరోషాత్ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశాః |
బాలానాం మమ పుత్రాణామభయం దాతుమర్హసి ||

6

భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయవ్రతశాలినామ్ |
సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి ||

7

స త్వం ధర్మపరో భూత్వా కాశ్యపాయ వసుంధరామ్ |
దత్త్వా వనముపాగమ్య మహేంద్రకృతకేతనః ||

8

మమ సర్వవినాశాయ సంప్రాప్తస్త్వం మహామునే |
న చైకస్మిన్హతే రామే సర్వే జీవామహే వయమ్ ||

9

బ్రువత్యేవం దశరథే జామదగ్న్యః ప్రతాపవాన్ |
అనాదృత్యైవ తద్వాక్యం రామమేవాభ్యభాషత ||

10

ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే |
దృఢే బలవతీ ముఖ్యే సుకృతే విశ్వకర్మణా ||

11

అతిసృష్టం సురైరేకం త్ర్యంబకాయ యుయుత్సవే |
త్రిపురఘ్నం నరశ్రేష్ఠ భగ్నం కాకుత్స్థ యత్త్వయా ||

12

ఇదం ద్వితీయం దుర్ధర్షం విష్ణోర్దత్తం సురోత్తమైః |
తదిదం వైష్ణవం రామ ధనుః పరపురంజయమ్ ||

13

సమానసారం కాకుత్స్థ రౌద్రేణ ధనుషా త్విదమ్ |
తదా తు దేవతాః సర్వాః పృచ్ఛంతి స్మ పితామహమ్ ||

14

శితికంఠస్య విష్ణోశ్చ బలాబలనిరీక్షయా |
అభిప్రాయం తు విజ్ఞాయ దేవతానాం పితామహః ||

15

విరోధం జనయామాస తయోః సత్యవతాం వరః |
విరోధే చ మహద్యుద్ధమభవద్రోమహర్షణమ్ ||

16

శితికంఠస్య విష్ణోశ్చ పరస్పరజయైషిణోః |
తదా తు జృంభితం శైవం ధనుర్భీమపరాక్రమమ్ ||

17

హుంకారేణ మహాదేవః స్తంభితోఽథ త్రిలోచనః |
దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః ||

18

యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ |
జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణుపరాక్రమైః ||

19

అధికం మేనిరే విష్ణుం దేవాః సర్షిగణాస్తదా |
ధనూ రుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశాః ||

20

దేవరాతస్య రాజర్షేర్దదౌ హస్తే ససాయకమ్ |
ఇదం చ వైష్ణవం రామ ధనుః పరపురంజయమ్ ||

21

ఋచీకే భార్గవే ప్రాదాద్విష్ణుః సన్న్యాసముత్తమమ్ |
ఋచీకస్తు మహాతేజాః పుత్రస్యాప్రతికర్మణః ||

22

పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మనః |
న్యస్తశస్త్రే పితరి మే తపోబల సమన్వితే ||

23

అర్జునో విదధే మృత్యుం ప్రాకృతాం బుద్ధిమాస్థితః |
వధమప్రతిరూపం తు పితుః శ్రుత్వా సుదారుణమ్ ||

24

క్షత్రముత్సాదయన్రోషాజ్జాతం జాతమనేకశః |
పృథివీం చాఖిలాం ప్రాప్య కాశ్యపాయ మహాత్మనే ||

25

యజ్ఞస్యాంతే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణే |
దత్త్వా మహేంద్రనిలయస్తపోబలసమన్వితః ||

26

స్థితోఽస్మి తస్మింస్తప్యన్వై సుసుఖం సురసేవితే |
అద్య తూత్తమవీర్యేణ త్వయా రామ మహాబల ||

27

శ్రుత్వాతు ధనుషో భేదం తతోఽహం ద్రుతమాగతః |
తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ ||

28

క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ధనురుత్తమమ్ |
యోజయస్వ ధనుఃశ్రేష్ఠే శరం పరపురంజయమ్ |
యది శక్నోసి కాకుత్స్థ ద్వంద్వం దాస్యామి తే తతః ||

29

Balakanda Sarga 75 In Telugu Pdf With Meaning

వసిష్ఠుడు, దశరథుడు, అర్పించిన అర్ఘ్య పాద్యములు, అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు, రాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమ వంతుడవనీ, వీర్య వంతుడవనీ ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా! ఈ విల్లు తీసుకో! ” అని రాముని పిలిచాడు పరశురాముడు.

ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు.

“ఓ పరశురామా! నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడవు. కాని నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా! నా కుమారులను ఏమీ చేయనని అభయము ఇమ్ము.

ఓ పరశురామా! నీవు సామాన్యుడవుకావు. పవిత్రమైన భృగు వంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు. నీవు జయించిన ఈ భూమండలము నంతా కశ్యపునకు దానం చేసావు. మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నావు. అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముని యుద్ధమునకు పిలుస్తున్నావు. రాముడు నీతో యుద్ధము చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము ఎవరమూ బతుకలేము. కాబట్టి మా కందరకూ ప్రాణభిక్ష పెట్టు.” అని వేడుకున్నాడు.

కాని పరశురాముడు దశరథుని మాటలు లెక్క చేయలేదు. రాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు విరిచిన ధనుస్సు, నా చేతిలో ఉన్న ధనుస్సు రెండూ గొప్పవి. దివ్యలోకములకు సంబంధించినవి. బాగా ధృడమైనవి. బలమైనవి. ఈ రెండు ధనుస్సులను విశ్వకర్మ తయారు చేసాడు. అందులో ఒక ధనుస్సును త్రిపురాసుర సంహార సమయంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు. ఆ ధనుస్సునే నీవు విరిచావు. ఈ రెండవ ధనుస్సు దేవతలు విష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణు ధనుస్సు అని అంటారు. ఈ ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది.

ఒక సారి దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి శివుడు, విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు? అని అడిగారు. బ్రహ్మ కూడా చెప్పలేకపోయూడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు. అవి వారిద్దరి మధ్య యుద్ధమునకు దారి తీసాయి. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారము చేసాడు. ఆ హుంకారమునకు శివుడు భయపడి పోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు.

పరమశివునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న శివ ధనుస్సును విదేహ దేశాధీశుడు అయిన దేవరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనుస్సును భృగు వంశీకుడు అయిన ఋచీకుని వద్ద ఉంచాడు. ఋచీకుడు మా తాతగారు. మా తాత గారైన ఋచీకుడు ఆ విష్ణు ధనుస్సును తన కుమారుడు. మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు.

పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రి జమదగ్ని ని చంపాడు. నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని వాని కుమారులను చంపాను. అతనినే కాదు క్షత్రియ వంశములో ఉన్న ప్రతి వానినీ పుట్టిన వాడిని పుట్టినట్టు సంహరించాను. క్షత్రియకులమును సర్వనాశనము చేసాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేసాను. క్షత్రియులను చంపి నేను జయించిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్రపర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. ఇప్పుడు నీవు శివధనుస్సును విరిచావు అని దివ్యదృష్టి ద్వారా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను.

ఓ రామా! నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మము ప్రకారము మాకు వంశపారంపర్యముగా సంక్రమించిన ఈ విష్ణుధనుస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వ యుద్ధము చెయ్యి. ” అని పలికాడు పరశురాముడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బదిఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్సప్తతితమః సర్గః (76) >>

Valmiki Ramayana Bala Kanda In Telugu – వాల్మీకి రామాయణం బాలకాండ

Valmiki Ramayana Bala Kanda In Telugu

బాలకాండ, రామాయణంలో మొదటి భాగం, శ్రీరాముడు మరియు అతని సోదరుల బాల్య జీవితం, అయోధ్య రాజ్యం మరియు దశరథుడు రాజు గురించి చెప్పబడింది. బాలకాండంలోని ముఖ్యమైన అంశాలు శ్రీరాముడు మరియు అతని సోదరుల జననం, విద్య, ఋష్యశృంగ యాగం మరియు పట్టాభిషేకం గురించి తెలుపుతాయి.

Valmiki Ramayana Bala Kanda Telugu Pdf

బాలకాండ

  1. ప్రథమః సర్గః
  2. ద్వితీయః సర్గః
  3. తృతీయః సర్గః
  4. చతుర్థః సర్గః
  5. పంచమః సర్గః
  6. షష్ఠః సర్గః
  7. సప్తమః సర్గః
  8. అష్టమః సర్గః
  9. నవమః సర్గః
  10. దశమః సర్గః
  11. ఏకాదశః సర్గః
  12. ద్వాదశః సర్గః
  13. త్రయోదశః సర్గః
  14. చతుర్దశః సర్గః
  15. పంచదశః సర్గః
  16. షోడశః సర్గః
  17. సప్తదశః సర్గః
  18. అష్టాదశః సర్గః
  19. ఏకోనవింశః సర్గః
  20. వింశః సర్గః
  21. ఏకవింశః సర్గః
  22. ద్వావింశః సర్గః
  23. త్రయోవింశః సర్గః
  24. చతుర్వింశః సర్గః
  25. పంచవింశః సర్గః
  26. షడ్వింశః సర్గః
  27. సప్తవింశః సర్గః
  28. అష్టావింశః సర్గః
  29. ఏకోనత్రింశః సర్గః
  30. త్రింశః సర్గః
  31. ఏకత్రింశః సర్గః
  32. ద్వాత్రింశః సర్గః
  33. త్రయస్త్రింశః సర్గః
  34. చతుస్త్రింశః సర్గః
  35. పంచత్రింశః సర్గః
  36. షట్త్రింశః సర్గః
  37. సప్తత్రింశః సర్గః
  38. అష్టాత్రింశః సర్గః
  39. ఏకోనచత్వారింశః సర్గః
  40. చత్వారింశః సర్గః
  41. ఏకచత్వారింశః సర్గః
  42. ద్విచత్వారింశః సర్గః
  43. త్రిచత్వారింశః సర్గః
  44. చతుశ్చత్వారింశః సర్గః
  45. పంచచత్వారింశః సర్గః
  46. షట్చత్వారింశః సర్గః
  47. సప్తచత్వారింశః సర్గః
  48. అష్టచత్వారింశః సర్గః
  49. ఏకోనపంచాశః సర్గః
  50. పంచాశః సర్గః
  51. ఏకపంచాశః సర్గః
  52. ద్విపంచాశః సర్గః
  53. త్రిపంచాశః సర్గః
  54. చతుఃపంచాశః సర్గః
  55. పంచపంచాశః సర్గః
  56. షట్పంచాశః సర్గః
  57. సప్తపంచాశః సర్గః
  58. అష్టపంచాశః సర్గః
  59. ఏకోనషష్టితమః సర్గః
  60. షష్టితమః సర్గః
  61. ఏకషష్టితమః సర్గః
  62. ద్విషష్టితమః సర్గః
  63. త్రిషష్టితమః సర్గః
  64. చతుఃషష్టితమః సర్గః
  65. పంచషష్టితమః సర్గః
  66. షట్షష్టితమః సర్గః
  67. సప్తషష్టితమః సర్గః
  68. అష్టషష్టితమః సర్గః
  69. ఏకోనసప్తతితమః సర్గః
  70. సప్తతితమః సర్గః
  71. ఏకసప్తతితమః సర్గః
  72. ద్విసప్తతితమః సర్గః
  73. త్రిసప్తతితమః సర్గః
  74. చతుఃసప్తతితమః సర్గః
  75. పంచసప్తతితమః సర్గః
  76. షట్సప్తతితమః సర్గః
  77. సప్తసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 55 In Telugu | అయోధ్యాకాండ పంచపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 55 In Telugu

అయోధ్యా కాండ సర్గ 55 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.

యమునాతరణమ్

ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రావరిందమౌ |
మహర్షిమభివాద్యాథ జగ్మతుస్తం గిరిం ప్రతి ||

1

తేషాం చైవ స్వస్త్యయనం మహర్షిః స చకార హ |
ప్రస్థితాంశ్చైవ తాన్ ప్రేక్ష్యపితా పుత్రానివాన్వగాత్ ||

2

తతః ప్రచక్రమే వక్తుం వచనం స మహామునిః |
భరద్వాజో మహాతేజాః రామం సత్యపరాక్రమమ్ ||

3

గంగాయమునయోః సంధిమాసాద్య మనుజర్షభౌ |
కాలిందీమనుగచ్ఛేతాం నదీం పశ్చాన్ముఖాశ్రితామ్ ||

4

అథాసాద్య తు కాలిందీం శీఘ్రస్రోతసమాపగాం |
తస్యాస్తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ ||

5

తత్ర యూయం ప్లవం కృత్వా తరతాంశుమతీం నదీమ్ |
తతో న్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్ఛదమ్ ||

6

వివృద్ధం బహుభిర్వృక్షైః శ్యామం సిద్ధోపసేవితమ్ |
తస్మై సీతాఽంజలిం కృత్వా ప్రయుంజీతాశిషః శివాః ||

7

సమాసాద్య తు తం వృక్షం వసేద్వాఽతిక్రమేత వా |
క్రోశమాత్రం తతో గత్వా నీలం ద్రక్ష్యథ కాననమ్ ||

8

పలాశబదరీమిశ్రం రమ్యం వంశైశ్చ యామునైః |
స పంథాశ్చిత్రకూటస్య గతః సుబహుశో మయా ||

9

రమ్యో మార్దవయుక్తశ్చ వనదావైర్విపర్జితః |
ఇతి పంథానమావేద్య మహర్షిః సంన్యవర్తతః ||

10

అభివాద్య తథేత్యుక్త్వా రామేణ వినివర్తితః |
ఉపావృత్తే మునౌ తస్మిన్ రామో లక్ష్మణమబ్రవీత్ ||

11

కృతపుణ్యాః స్మ సౌమిత్రే మునిర్యన్నోఽనుకంపతే |
ఇతి తౌ పురుషవ్యాఘ్రౌ మంత్రయిత్వా మనస్వినౌ ||

12

సీతామేవాగ్రతః కృత్వా కాలిందీం జగ్మతుర్నదీమ్ |
అథాఽసాద్య తు కాలిందీం శీఘ్రస్రోతోవహాం నదీమ్ ||

13

తౌ కాష్ఠసంఘాటమథో చక్రతుస్సుమహాప్లవమ్ ||

14

శుష్కైర్వంశైః సమాస్తీర్ణముశీరైశ్చ సమావృతమ్ |
తతో వేతసశాఖాశ్చ జంబూశాఖాశ్చ వీర్యవాన్ ||

15

చకార లక్ష్మణశ్ఛిత్వా సీతాయాః సుఖమాసనమ్ |
తత్ర శ్రియమివాచింత్యాం రామో దాశరథిః ప్రియామ్ ||

16

ఈషత్సంలజ్జమానాం తామధ్యారోపయత ప్లవమ్ |
పార్శ్వే చ తత్ర వైదేహ్యా వసనే భూషణాని చ ||

17

ప్లవే కఠినకాజం చ రామశ్చక్రే సహాయుధైః |
ఆరోప్య ప్రథమం సీతాం సంఘాటం ప్రతిగృహ్య తౌ ||

18

తతః ప్రతేరతుర్యత్తౌ వీరౌ దశరథాత్మజౌ |
కాలిందీమధ్యమాయాతా సీతా త్వేనామవందత ||

19

స్వస్తి దేవి తరామి త్వాం పారయేన్మే పతిర్ర్వతమ్ |
యక్ష్యే త్వాం గోనహస్రేణ సురాఘటశతేన చ ||

20

స్వస్తి ప్రత్యాగతే రామే పురీమిక్ష్వాకుపాలితామ్ |
కాలిందీమథ సీతా తు యాచమానా కృతాంజలిః ||

21

తీరమేవాభిసంప్రాప్తా దక్షిణం వరవర్ణినీ |
తతః ప్లవేనాంశుమతీం శీఘ్రగామూర్మిమాలినీమ్ ||

22

తీరజైర్బహుభిర్వృక్షైః సంతేరుర్యమునాం నదీమ్ |
తే తీర్ణాః ప్లవముత్సృజ్య ప్రస్థాయ యమునావనాత్ ||

23

శ్యామం న్యగ్రోధమాసేదుః శీతలం హరితచ్ఛదమ్ |
న్యగ్రోధం తముపాగమ్య వైదేహి వాక్యమబ్రవీత్ ||

24

నమస్తేఽస్తు మహావృక్ష పారయేన్మే పతిర్వ్రతమ్ |
కౌసల్యాం చైవ పశ్యేయం సుమిత్రాం చ యశస్వినీమ్ ||

25

ఇతి సీతాఽంజలిం కృత్వా పర్యగచ్ఛద్వనస్పతిమ్ |
అవలోక్య తతః సీతామాయాచంతీమనిందితామ్ ||

26

దయితాం చ విధేయాం చ రామో లక్ష్మణమబ్రవీత్ |
సీతామాదాయ గచ్ఛ త్వమగ్రతో భరతానుజ ||

27

పృష్ఠతోఽహం గమిష్యామి సాయుధో ద్విపదాం వర |
యద్యత్ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజా ||

28

తత్తత్ప్రదద్యా వైదేహ్యా యత్రాస్య రమతే మనః |
గచ్ఛతోస్తు తయోర్మధ్యే బభూవ జనకాత్మజా ||

29

మాతంగయోర్మధ్యగతా శుభా నాగవధూరివ |
ఏకైకం పాదపం గుల్మం లతాం వా పుష్పశాలినీమ్ ||

30

అదృష్టపూర్వాం పశ్యంతీ రామం పప్రచ్ఛ సాఽబలా |
రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ ||

31

సీతావచనసంరబ్దః ఆనయామాస లక్ష్మణః |
విచిత్రవాలుకజలాం హంససారసనాదితామ్ ||

32

రేమే జనకరాజస్య తదా ప్రేక్ష్య సుతా నదీమ్ |
క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ |
బహూన్మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతుర్యమునా వనే ||

33

విహృత్య తే బర్హిణపూగనాదితే
శుభే వనే వానరవారణాయుతే |
సమం నదీవప్రముపేత్య సమ్మతం
నివాసమాజగ్ము రదీనదర్శనాః ||

34

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 55 Meaning In Telugu

ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.

“ఓ రామా! మీరు గంగా యమునా సంగమ స్థానము చేరిన తరువాత యమునా నది ఒడ్డునే పడమటి వైపుగా వెళ్లండి. అక్కడ మీరు ఒక తెప్పను కట్టుకొని యమునను దాటండి. మీరు యమునను దాటిన తరువాత మీకు ఒక పెద్ద మర్రిచెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు శ్యామము. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సీత ఆ చెట్టుకు నమస్కారము ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి.

మీరు ఆ చెట్టు కింద ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొన వచ్చును. లేని ఎడల మీరు ప్రయాణము కొనసాగించవచ్చును. అలా ఒక క్రోసెడు దూరము వెళ్లగానే మోదుగ చెట్లతోనూ, రేగు చెట్లతోనూ వెదురు పొదలతోనూ నిండి ఉన్న ఒక అరణ్యము కనిపిస్తుంది. అది యమునా నది ఒడ్డున ఉంటుంది. అదే చిత్రకూటమునకు పోవు దారి. నేను ఆమార్గములో ఎన్నోసార్లు ప్రయాణము చేసాను. అది ఎంతో సురక్షితమైన మార్గము. ఏ ప్రమాదమూ ఉండదు.” అని అన్నాడు భరద్వాజుడు.

ఆ మాటలు విన్న రాముడు భరద్వాజుని చూచి నమస్కరించి “మీరు చేసిన సాయమునకు కృతజ్ఞతలు. ఇంక మీరు ఆశ్రమమునకు వెళ్లండి. మాకు ముందుకు వెళ్లడానికి అనుజ్ఞ ఇవ్వండి.” అని ప్రార్థించాడు. ఆమాటలు విన్న భరద్వాజుడు వారిని ఆశీర్వదించి వెనుకకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు సీత ముందుకు సాగారు.

వారు యమునా నదిని సమీపించారు. రాముడు లక్ష్మణుడు అక్కడక్కడా వెతికి కొన్ని కర్రలను తీసుకొని వచ్చారు. వాటిని తీగలతో కట్టి ఒక తెప్పను తయారు చేసారు. దాని మీద ఆకులతో మెత్తగా ఆసనములను ఏర్పాటు చేసారు. ముందు సీతను తెప్పలోకి ఎక్కించారు. తరువాత సీత వెంట దశరథుడు పంపిన వస్త్రములను, ఆభరణములను, రామ లక్ష్మణులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధము లను, తెప్పలో పెట్టారు. తరువాత రామ లక్ష్మణులు ఎక్కారు. అందరూ ఆ తెప్పలో యమునను దాటుతున్నారు.

తెప్ప యమునానదీ మధ్యకు రాగానే సీత యమునకు నమస్కరించింది. “అమ్మా యమునా నదీమతల్లీ! మమ్ములను చల్లగా కాపాడు. మా అరణ్య వాసము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు. మేము సురక్షితముగా అయోధ్యకు తిరిగి వస్తే నీకు వేయి గోవులను, వంద ఘటముల మద్యమును సమర్పించుకుంటాను.” అని మొక్కుకుంది.

తరువాత అందరూ యమునా నది దక్షిణతీరము చేరుకున్నారు. అందరూ తెప్పను దిగారు. భరద్వాజుడు చెప్పిన శ్యామ అనే వటవృక్షమును సమీపించారు. సీత ఆ వటవృక్షమునకు నమస్కరించింది. తమను చల్లగా చూడమని ప్రార్థించింది.
తరువాత వారు ముందుకు సాగారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు, మధ్యలో సీత వెనక రాముడు నడుస్తున్నారు. ఆ వనములోని అందాలు చూస్తూ నడుస్తున్నారు.

సీత తాను అంతకు ముందు చూడని వృక్షముల గూర్చి మొక్కలు, లతల గూర్చీ రాముని అడిగి తెలుసుకుంటూ ఉంది. లక్ష్మణుడు వెళ్లి ఆయా చెట్లయొక్క ఆకులను పూలను తీసుకొని వచ్చి సీతకు ఇచ్చాడు. ఆ ప్రకారంగా వారు ఒక త్రోసెడు దూరము నడిచారు. అక్కడ రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువులను చంపి తీసుకొని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. అంతలో చీకటి పడింది. వారు ఒక సమతల ప్రదేశములో ఆ రాత్రికి ఉండటానికి వసతి ఏర్పాటుచేసుకున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఐదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ షట్పంచాశః సర్గః (56) >>

Ayodhya Kanda Sarga 50 In Telugu – అయోధ్యాకాండ పంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 50 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ పంచాశః సర్గ, “గుహసంగతమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసం కోసం ప్రయాణిస్తారు మరియు వారి మార్గంలో గుహ అనే అనుచరుడు మరియు స్నేహితుడు కలుసుకుంటారు. గుహ, కేవట్ కులానికి చెందినవాడు, రాముడి పట్ల ఎంతో భక్తి మరియు ప్రేమ చూపిస్తూ, అతడిని ఆదరించే విధంగా ప్రవర్తిస్తాడు. రాముడు మరియు అతని కుటుంబం గుహతో గడిపిన సమయం, అతని ఆతిథ్యం, మరియు స్నేహం ఈ సర్గలో హృద్యంగా వర్ణించబడ్డాయి. ఈ సర్గ రాముడు తన నిస్వార్థత మరియు వినయంతో గుహను సంతృప్తి పరచడం, అలాగే స్నేహం మరియు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

గుహసంగతమ్

విశాలాన్కోసలాన్రమ్యాన్యాత్వా లక్ష్మణపూర్వజః |
అయోధ్యాఽభిముఖో ధీమాన్ప్రాంజలిర్వాక్వమబ్రవీత్ ||

1

ఆపృచ్ఛే త్వాం పురి శ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |
దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ ||

2

నివృత్తవనవాసస్త్వామనృణో జగతీపతేః |
పునర్ద్రక్ష్యామి మాత్రా చ పిత్రా చ సహ సఙ్గతః ||

3

తతో రుధిరతామ్రాక్షో భుజముద్యమ్య దక్షిణమ్ |
అశ్రుపూర్ణముఖో దీనోఽబ్రవీజ్జానపదం జనమ్ ||

4

అనుక్రోశో దయా చైవ యథార్హం మయి వః కృతః |
చిరం దుఃఖస్య పాపీయో గమ్యతామర్థసిద్ధయే ||

5

తేఽభివాద్య మహాత్మానం కృత్వా చాపి ప్రదక్షిణమ్ |
విలపంతో నరా ఘోరం వ్యతిష్ఠంత క్వచిత్క్వచిత్ ||

6

తథా విలపతాం తేషామతృప్తానాం చ రాఘవః |
అచక్షుర్విషయం ప్రాయాద్యథాఽర్కః క్షణదాముఖే ||

7

తతో ధాన్యధనోపేతాన్దానశీలజనాన్శివాన్ |
అకుతశ్చిద్భయాన్రమ్యాం శ్చైత్యయూపసమావృతాన్ ||

8

ఉద్యానామ్రవణోపేతాన్సంపన్నసలిలాశయాన్ |
తుష్టపుష్టజనాకీర్ణాన్గోకులాకులసేవితాన్ ||

9

లక్షణీయాన్నరేంద్రాణాం బ్రహ్మఘోషాభినాదితాన్ |
రథేన పురుషవ్యాఘ్రః కోసలానత్యవర్తత ||

10

మధ్యేన ముదితం స్ఫీతం రమ్యోద్యానసమాకులమ్ |
రాజ్యం భోగ్యం నరేంద్రాణాం యయౌ ధృతిమతాంవరః ||

11

తత్ర త్రిపథగాం దివ్యాం శివ తోయామశైవలామ్ |
దదర్శ రాఘవో గఙ్గాం పుణ్యామృషినిసేవితామ్ ||

12

ఆశ్రమైరవిదూరస్థైః శ్రీమద్భిః సమలంకృతామ్ |
కాలేఽప్సరోభిర్హృష్టాభిః సేవితాంభోహ్రదాం శివామ్ ||

13

దేవదానవగంధర్వైః కిన్నరైరుపశోభితామ్ |
నాగగంధర్వపత్నీభిః సేవితాం సతతం శివామ్ ||

14

దేవాక్రీడశతాకీర్ణాం దేవోద్యానశతాయుతామ్ |
దేవార్థమాకాశగమాం విఖ్యాతాం దేవపద్మినీమ్ ||

15

జలఘాతాట్టహాసోగ్రాం ఫేననిర్మలహాసినీమ్ |
క్వచిద్వేణీకృతజలాం క్వచిదావర్తశోభితామ్ ||

16

క్వచిత్స్తిమితగంభీరాం క్వచిద్వేగజలాకులామ్ |
క్వచిద్గంభీరనిర్ఘోషాం క్వచిద్భైరవనిస్వనామ్ ||

17

దేవసంఘాప్లుతజలాం నిర్మలోత్పలశోభితామ్ |
క్వచిదాభోగపులినాం క్వచిన్నిర్మలవాలుకామ్ ||

18

హంససారససంఘుష్టాం చక్రవాకోపకూజితామ్ |
సదా మత్తైశ్చ విహగైరభిసన్నాదితాంతరామ్ ||

19

క్వచిత్తీరరుహైర్వృక్షైర్మాలాభిరివ శోభితామ్ |
క్వచిత్ఫుల్లోత్పలచ్ఛన్నాం క్వచిత్పద్మవనాకులామ్ ||

20

క్వచిత్కుముదషండైశ్చ కుడ్మలైరుపశోభితామ్ |
నానాపుష్పరజోధ్వస్తాం సమదామివ చ క్వచిత్ ||

21

వ్యపేతమలసంఘాతాం మణినిర్మలదర్శనామ్ |
దిశాగజైర్వనగజైర్మత్తైశ్చ వరవారణైః ||

22

దేవోపవాహ్యైశ్చ ముహుః సన్నాదితవనాంతరామ్ |
ప్రమదామివ యత్నేన భూషితాం భూషణోత్తమైః ||

23

ఫలైః పుష్పైః కిసలయైర్వృతాం గుల్మైర్ద్విజైస్తథా |
శింశుమారైశ్చ నక్రైశ్చ భుజంగైశ్చ నిషేవితామ్ ||

24

విష్ణుపాదచ్యుతాం దివ్యామపాపాం పాపనాశినీమ్ |
[* తాం శంకరజటాజూటాద్భ్రష్టాం సాగరతేజసా || *]

25

సముద్రమహీషీం గఙ్గాం సారసక్రౌఞ్చనాదితామ్ |
ఆససాద మహాబాహుః శృఙ్గబేరపురం ప్రతి ||

26

తామూర్మికలిలావర్తామన్వవేక్ష్య మహారథః |
సుమంత్రమబ్రవీత్సూతమిహైవాద్య వసామహే ||

27

అవిదూరాదయం నద్యాః బహుపుష్పప్రవాలవాన్ |
సుమహానిఙ్గుదీవృక్షే వసామోఽత్రైవ సారథే ||

28

ద్రక్ష్యామః సరితాం శ్రేష్ఠాం సమ్మాన్యసలిలాం శివామ్ |
దేవదానవగంధర్వమృగమానుషపక్షిణామ్ ||

29

లక్ష్మణశ్చ సుమంత్రశ్చ బాఢమిత్యేవ రాఘవమ్ |
ఉక్త్వా తమిన్గుదీవృక్షం తదోపయయతుర్హయైః ||

30

రామోఽభియాయ తం రమ్యం వృక్షమిక్ష్వాకునందనః |
రథాదవాతరత్తస్మాత్సభార్యః సహలక్ష్మణః ||

31

సుమంత్రోఽప్యవతీర్యాస్మాన్మోచయిత్వా హయోత్తమాన్ |
వృక్షమూలగతం రామముపతస్థే కృతాంజలిః ||

32

తత్ర రాజా గుహో నామ రామస్యాత్మసమః సఖా |
నిషాదజాత్యో బలవాన్స్థపతిశ్చేతి విశ్రుతః ||

33

స శృత్వా పురుషవ్యాఘ్రం రామం విషయమాగతమ్ |
వృద్ధైః పరివృతోఽమాత్యైరజ్ఞాతిభిశ్చాభ్యుపాగతః ||

34

తతో నిషాదాధిపతిం దృష్ట్వా దూరాదుపస్థితమ్ |
సహ సౌమిత్రిణా రామః సమాగచ్ఛద్గుహేన సః ||

35

తమార్తః సంపరిష్వజ్య గుహో రాఘవమబ్రవీత్ |
యథాఽయోధ్యా తథేయం తే రామ కిం కరవాణి తే ||

36

ఈదృశం హి మహాబాహో కః ప్రప్స్యత్యతిథిం ప్రియమ్ |
తతః గుణవదన్నాద్యముపాదాయ పృథగ్విధమ్ |
అర్ఘ్యం చోపానయత్క్షిప్రం వాక్యం చేదమువాచ హ ||

37

స్వాగతం తే మహాబాహో తవేయమఖిలా మహీ |
వయం ప్రేష్యా భవాన్భర్తా సాధు రాజ్యం ప్రశాధి నః ||

38

భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదముపస్థితమ్ |
శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనం చ తే ||

39

గుహమేవం బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ ||

40

అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వథా వయమ్ |
పద్భ్యామభిగమాచ్చైవ స్నేహసందర్శనేన చ ||

41

భుజాభ్యాం సాధు వృత్తాభ్యాం పీడయన్వాక్యమబ్రవీత్ | [పీనాభ్యాం]
దిష్ట్యా త్వాం గుహ పశ్యామి హ్యరోగం సహ బాంధవైః ||

42

అపి తే కుశలం రాష్ట్రే మిత్రేషు చ ధనేషు చ |
యత్త్విదం భవతా కించిత్ప్రీత్యా సముపకల్పితమ్ |
సర్వం తదనుజానామి నహి వర్తే ప్రతిగ్రహే ||

43

కుశచీరాజినధరం ఫలమూలాశినం చ మామ్ |
విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరమ్ ||

44

అశ్వానాం ఖాదనేనాహమర్థీ నాన్యేన కేనచిత్ |
ఏతావతాఽత్ర భవతా భవిష్యామి సుపూజితః ||

45

ఏతే హి దయితా రాజ్ఞః పితుర్దశరథస్య మే |
ఏతైః సువిహితైరశ్వైర్భవిష్యామ్యహమర్చితః ||

46

అశ్వానాం ప్రతిపానం చ ఖాదనం చైవ సోఽన్వశాత్ |
గుహస్తత్రైవ పురుషాంస్త్వరితం దీయతామితి ||

47

తతశ్చీరోత్తరాసంగః సంధ్యామన్వాస్య పశ్చిమామ్ |
జలమేవాదదే భోజ్యం లక్ష్మణేనాఽఽహృతం స్వయమ్ ||

48

తస్య భూమౌ శయానస్య పాదౌ ప్రక్షాళ్య లక్ష్మణః |
సభార్యస్య తతోఽభ్యేత్య తస్థౌ వృక్షముపాశ్రితః ||

49

గుహోఽపి సహ సూతేన సౌమిత్రిమనుభాషయన్ |
అన్వజాగ్రత్తతో రామమప్రమత్తో ధనుర్ధరః ||

50

తథా శయానస్య తతోఽస్య ధీమతః
యశస్వినో దాశరథేర్మహాత్మనః |
అదృష్టదుఃఖస్య సుఖోచితస్య సా
తదా వ్యతీయాయ చిరేణ శర్వరీ ||

51

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 50 Meaning In Telugu

రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథము మీద కోసల దేశపు సరిహద్దుల వద్దకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగాడు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ “కాకుత్థ్స వంశస్థులచే పరిపాలింప బడుతున్న ఓ అయోధ్యా నగరమా! పుట్టినప్పటి నుండి నీ ఒడిలో
పెరిగాను. ఇప్పుడు విధి వశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను, నీలో నివసించు ప్రజలను విడిచిపోవుటకు మీ అనుమతి కోరుతున్నాను. అచిరకాలములోనే నేను వనవాసము పూర్తి చేసుకొని తిరిగి వస్తాను. అయోధ్యానగర ప్రవేశము చేస్తాను.”అని అయోధ్యాపురికి నమస్కరించాడు.

అప్పటికే రాముడు వచ్చాడని వార్త తెలిసి సమీప గ్రామ ప్రజలు రాముని చూడటానికి అక్కడకు చేరుకున్నారు. వారిని చూచి రాముడు ఇలా అన్నాడు. “మీరు నా మీద జాలి చూపించారు. కాని మీ మీ పనులు మానుకొని నాకోసం దుఃఖించడం మంచిది కాదు. మీ పనులు చూచుకొనుడు.” అని వారికి నమస్కరించి చెప్పాడు. వారుకూడా రామునికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తరువాత రాముడు కోసల దేశమును దాటి వెళ్లిపోయాడు.

రాముడు ప్రయాణించు రథము పరమ పవిత్రమైన గంగాతీరము చేరుకొంది. గంగానదీ తీరమున గల మున్యాశ్రమ ములు గంగానదికి అలంకారముగా శోభిల్లుతున్నాయి. దేవలోకమునుండి అప్సరసలు గంగా స్నానము కొరకు అక్కడకు వస్తూ ఉంటారు. పవిత్రమైన ఆ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు సదా సేవిస్తూ ఉంటారూ. గంగ కొన్ని ప్రదేశములలో వేగంగానూ కొన్ని ప్రదేశములలో నెమ్మదిగానూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగానదిలో హంసలు, సారస పక్షులుయధేచ్ఛగా విహరిస్తుంటాయి. గంగానదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు గంగానదికి అలంకరించిన పూలమాలల వలె ప్రకాశిస్తున్నాయి. గంగానదీజలములు నిర్మలంగా స్వచ్ఛంగా పారుతున్నాయి. కాని అక్కడక్కడ మదగజములు గంగానదిలో దిగి స్నానము చేయడం వల్ల నీరు కలుషితము అవుతూ మరలా నిర్మలంగా మారుతూ ఉంది. గంగానదీ తీర ప్రాంతము అంతా మధురమైన ఫల వృక్షములతోనూ, పూల మొక్కలతోనూ నిండి సర్వాలంకార శోభిత అయిన మంగళకరమైన స్త్రీ వలె శోభిల్లుతూ ఉంది. అటువంటి గంగాతీరము వెంట ప్రయాణించి రాముడు శృంగిబేరపురమునకు చేరుకున్నాడు.

“సుమంత్రా! రథమును ఆపుము. ఇక్కడ ఒక ఇల్గుదీ వృక్షము ఉన్నది. ఈ వృక్షము ఫలములతో నిండి ఉంది. ఈ రాత్రికి మనము ఇక్కడే ఉండెదము. పవిత్ర గంగానదిలో స్నానము చేసి, ఈ చెట్టు కిందనే నిద్రించెదము.” అని అన్నాడు రాముడు.

రాముని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రథమును ఆవృక్షము కింద నిలిపాడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథము దిగారు. సుమంత్రుడు కూడా రథము దిగి రథమునకు కట్టిన గుర్రములను మేతకు విడిచి పెట్టి, రాముని వద్దకు వచ్చాడు.

ఆ శృంగిబేరపురంలో బోయజాతికి చెందిన వాడు, అక్కడ ఉన్న బోయలకు నాయకుడు, రామునికి మిత్రుడు అయిన గుహుడు అనే బోయవాడు నివసిస్తున్నాడు. రాముడు తన రాజ్యమునకు వస్తున్నాడని వార్త ముందే తెలిసిన గుహుడు కుల పెద్దలతోనూ, సేవకులతోనూ రాముని వద్దకు వచ్చాడు. గుహుని రాక విని రాముడు అతనికి ఎదురుపోయి అతనిని కౌగలించుకున్నాడు. గుహుని క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నాడు.

“రామా! ఇది నీకు పరాయి ఇల్లు కాదు. నీకు అయోధ్య ఎలాగో ఇదీ అలాగే. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చును. నీ వంటి మిత్రుడు అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు. క్షణంలో సమకూరుస్తాను.” అని అన్నాడు గుహుడు. రామునికి, సీత, లక్ష్మణుడు,సుమంత్రునికి రకరకాలైన భోజనములు, పానీయములు సమకూర్చాడు.

“రామా! భోజన పదార్థములు సిద్ధంగాఉన్నాయి. మీరందరూ భోజనం చేయండి.” అని అన్నాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు నా వద్దకు వచ్చి నన్ను ఆదరించడమే నీవు మాకు ఇచ్చే ఆతిధ్యము. నేను ప్రస్తుతము వనవాసములో మునివృత్తిలో ఉన్నాను. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొనను. ఫలములు తప్ప వేరే ఆహారము తీసుకొనను. కాని నా రథమునకు కట్టిన అశ్వములు మా తండ్రిగారికి ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారము సమకూర్చుము. అదే నాకుమహదానందము.” అని అన్నాడు రాముడు.

వెంటనే గుహుడు అశ్వములకు కావలసిన ఆహార ఏర్పాట్లు చేసాడు. ఆ రాత్రికి రాముడు కేవలము నీరు ఆహారంగా తీసుకొని నిద్రించాడు. గుహుడు ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. లక్ష్మణునితోనూ, సుమంత్రునితోనూ మాట్లాడుతూ మేలుకొని ఉన్నాడు.

రామునికి ఓ పట్టాన కటిక నేలమీద నిద్రపట్టలేదు. ఆ రాత్రి చాలా దీర్ఘంగా ఉన్నట్టు అనిపించింది రామునికి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకపంచాశః సర్గః (51) >>

Ayodhya Kanda Sarga 73 In Telugu – అయోధ్యాకాండ త్రిసప్తతితమః సర్గః 

Ayodhya Kanda Sarga 73

అయోధ్యాకాండ త్రిసప్తతితమః సర్గలో, భరతుడు, శత్రుఘ్నుడు మరియు వారి సహచరులు అరణ్యానికి చేరుకుని రాముడిని కలుసుకుంటారు. భరతుడు రాముని పాదాలకు నమస్కరిస్తూ అయోధ్యకు తిరిగి రావాలని వేడుకుంటాడు. రాముడు తన ధర్మాన్ని పాటిస్తూ, తండ్రి ఆజ్ఞను అవహేళన చేయలేమని స్పష్టం చేస్తాడు. భరతుడు రాముడికి పాదుకలను తీసుకువచ్చి, తన స్థానంలో రాజ్యం పాలించాలని కోరుతాడు. రాముడు తన పాదుకలను భరతుడికి అప్పగించి, భరతుడిని అంగీకరిస్తాడు. ఈ సర్గలో రాముడు తన వ్రతాన్ని కొనసాగిస్తూ, భరతుడు తన తమ్ముడి కర్తవ్యాన్ని గౌరవిస్తూ, పాదుకలను తీసుకుని తిరిగి వెళతాడు.

కైకేయీవిగర్హణమ్

శ్రుత్వా తు పితరం వృత్తం భ్రాతరౌ చ వివాసితౌ |
భరతో దుఃఖ సంతప్తైదం వచనమబ్రవీత్ || ౧ ||

కిం ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన శోచతః |
విహీనస్యాథ పిత్రా చ భ్రాత్రా పితృసమేన చ || ౨ ||

దుఃఖే మే దుఃఖమకరోర్వృణే క్షారమివాదధాః |
రాజానం ప్రేతభావస్థం కృత్వా రామం చ తాపసమ్ || ౩ ||

కులస్య త్వమభావాయ కాల రాత్రిరివాగతా |
అఙ్గారముపగూహ్య స్మ పితా మే నావబుద్ధవాన్ || ౪ ||

మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని |
సుఖం పరిహృతం మోహాత్కులేఽస్మిన్ కులపాంసిని || ౫ ||

త్వాం ప్రాప్య హి పితా మేఽద్య సత్యసంధో మహాయశాః |
తీవ్రదుఃఖాభిసంతప్తో వృత్తో దశరథో నృపః || ౬ ||

వినాశితో మహారాజః పితా మే ధర్మవత్సలః |
కస్మాత్ప్రవ్రాజితో రామః కస్మాదేవ వనం గతః || ౭ ||

కౌసల్యా చ సుమిత్రా చ పుత్రశోకాభిపీడితే |
దుష్కరం యది జీవేతాం ప్రాప్య త్వాం జననీం మమ || ౮ ||

నను త్వార్యోఽపి ధర్మాత్మా త్వయి వృత్తిమనుత్తమామ్ |
వర్తతే గురువృత్తిజ్ఞో యథా మాతరి వర్తతే || ౯ ||

తథా జ్యేష్ఠా హి మే మాతా కౌసల్యా దీర్ఘదర్శినీ |
త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే || ౧౦ ||

తస్యాః పుత్రం కృతాత్మానం చీరవల్కలవాససమ్ |
ప్రస్థాప్య వనవాసాయ కథం పాపే న శోచసి || ౧౧ ||

అపాపదర్శనం శూరం కృతాత్మానం యశస్వినమ్ |
ప్రవ్రాజ్య చీరవసనం కిం ను పశ్యసి కారణమ్ || ౧౨ ||

లుబ్ధాయా విదితః మన్యే న తేఽహం రాఘవం ప్రతి |
తథా హ్యనర్థో రాజ్యార్థం త్వయాఽఽనీతః మహానయమ్ || ౧౩ ||

అహం హి పురుషవ్యాఘ్రౌ అపశ్యన్ రామలక్ష్మణౌ |
కేన శక్తిప్రభావేన రాజ్యం రక్షితుముత్సహే || ౧౪ ||

తం హి నిత్యం మహారాజో బలవంతం మహాబలః |
అపాశ్రితోఽభూద్ధర్మాత్మా మేరుర్మేరువనం యథా || ౧౫ ||

సోఽహం కథమిమం భారం మహాధుర్యసముద్ధృతమ్ |
దమ్యో ధురమివాసాద్య సహేయం కేన చౌజసా || ౧౬ ||

అథవా మే భవేచ్ఛక్తిర్యోగైః బుద్ధి బలేన వా |
సకామాం న కరిష్యామి త్వామహం పుత్ర గర్ధినీమ్ || ౧౭ ||

న మే వికాంక్షా జాయేత త్యక్తుం త్వాం పాపనిశ్చయామ్ |
యది రామస్య నావేక్షా త్వయి స్యాన్మాతృవత్సదా || ౧౮ ||

ఉత్పన్నా తు కథం బుద్ధిస్తవేయం పాపదర్శినీ |
సాధుచారిత్రవిభ్రష్టే పూర్వేషాం నో విగర్హితా || ౧౯ ||

అస్మిన్కులే హి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే |
అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితాః || ౨౦ ||

న హి మన్యే నృశంసే త్వం రాజధర్మమవేక్షసే |
గతిం వా న విజానాసి రాజవృత్తస్య శాశ్వతీమ్ || ౨౧ ||

సతతం రాజవృత్తే హి జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే |
రాజ్ఞామేతత్సమం తత్స్యాదిక్ష్వాకూణాం విశేషతః || ౨౨ ||

తేషాం ధర్మైకరక్షాణాం కులచారిత్రశోభినామ్ |
అద్య చారిత్రశౌండీర్యం త్వాం ప్రాప్య వినివర్తతమ్ || ౨౩ ||

తవాపి సుమహాభాగాః జనేంద్రాః కులపూర్వగాః |
బుద్ధేర్మోహః కథమయం సంభూతస్త్వయి గర్హితః || ౨౪ ||

న తు కామం కరిష్యామి తవాఽహం పాపనిశ్చయే |
త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ || ౨౫ ||

ఏష త్విదానీమేవాహమప్రియార్థం తవనఘమ్ |
నివర్తయిష్యామి వనాత్ భ్రాతరం స్వజనప్రియమ్ || ౨౬ ||

నివర్తయిత్వా రామం చ తస్యాహం దీప్తతేజసః |
దాసభూతో భవిష్యామి సుస్థిరేణాంతరాత్మనా || ౨౭ ||

ఇత్యేవముక్త్వా భరతః మహాత్మా
ప్రియేతరైః వాక్య గణైస్తుదంస్తామ్ |
శోకాతురశ్చాపి ననాద భూయః
సింహో యథా పర్వతగహ్వరస్థః || ౨౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిసప్తతితమః సర్గః || ౭౩ ||

Ayodhya Kanda Sarga 73 Meaning In Telugu

తన తల్లి కైక ఎంతో సంతోషంతో చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు. కాని ఎదురుగా ఉన్నది కన్నతల్లి. అందుకని  తనకోపాన్ని బలవంతాన అణుచుకున్నాడు. కైకతో ఇలా అన్నాడు.

“అమ్మా! నా తండ్రి అకాల మరణం చెందాడు. నా సోదరులు అడవుల పాలయ్యారు. ఇంకా నాకు ఎందుకమ్మా ఈ రాజ్యము. అమ్మా! నా అన్న రాముడు అరణ్యానికి పోవుటకు, రాముని మీద ప్రేమతో నా తండ్రి మరణించుటకు నీవా కారణము? మా వంశమునకు అగ్నిలాగా దాపురించి కాల్చివేసావు కదమ్మా! ఈ విషయం తెలియక నా తండ్రి నిన్ను ఎంతో ఆదరించాడు కదా అమ్మా! నీ పాపముతో కూడిన ఆలోచనలకు నా తండ్రిని బలితీసుకున్నావు. నీ వలన మా ఇక్ష్వాకు వంశమే అపవిత్రమయింది. మా అందరికీ సుఖసంతోషాలు దూరం చేసావు. నీవు చేసిన అనాలోచితపు పని వలన నా తండ్రి మరణించాడు. చెప్పమ్మా! ఇదంతా ఎందుకు చేసావు? రాముని ఎందుకు అడవులకు పంపావు? నా తండ్రిని ఎందుకు చంపావు? ఇంతా చేసిన దానివి కౌసల్యను సుమిత్రను బతుకనిస్తావా! వాళ్లకు కూడా నీ చేతిలో మరణం తథ్యం. అమ్మా! రాముడు నిన్ను తన కన్నతల్లి కౌసల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా! మా పెద్దమ్మ కౌసల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగా ఆదరించింది కదమ్మా! అటువంటి రామునికి నారచీరలు కట్టి అడవులకు ఎలా పంపగలిగావు. కౌసల్యకు పుత్రశోకము ఎందుకు కలుగజేసావు? ఎవరి కోసం చేసావు ఇదంతా? ఇంత చేసికూడా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీవు మనిషివేనా లేక బండరాయివా!

అమ్మా! నేను, నీ కుమారుడు భరతుని, అడుగుతున్నాను. రాముని అరణ్యములకు పంపుటకు కారణమేమి? నాకురాజ్యము కట్టబెట్టడానికేనా! నాకు రాముని మీద ఉన్న భక్తి గౌరవము తెలిసే ఈ పని చేసావా? రాముడు లేకుండా ఈ రాజ్యభారం వహించే శక్తి నాకు ఉందనుకుంటున్నావా! నీకు తెలుసో లేదో! నా తండ్రి దశరథుడు కూడా తన వృద్ధాప్యంలో రాముని సహాయంతోనే ఈ రాజ్యాన్ని పరిపాలిం చాడు. అటువంటిది, రాముడు లేకుండా, నేను ఈ రాజ్యభారమును ఎలా మోయగలను అనుకున్నావు? ఒక వేళ నేను నా శాయశక్తులా ప్రయత్నించి ఈ రాజ్యభారమును మోయగలనేమో గానీ, నీ కోరిక మాత్రము తీర్చను. నీ కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఇదంతా చేసావు కాబట్టి నీ కోరిక ఎంత మాత్రమూ తీరదు.
అసలు నీవు నా తల్లివే కాదు. నిన్ను ఈక్షణముననే విడిచిపెడదామనుకుంటున్నాను. కానీ, రాముడు నిన్ను తన కన్న తల్లి కంటే ఎక్కవ ప్రేమతో చూచుకొనే వాడు. అందుకని ఆ పని చేయలేకపోతున్నాను.

అమ్మా! నాకు తెలియక అడుగుతాను! నీవు ఈ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించావా! దీని వలననీకు ఎంత అపకీర్తి వస్తుందో, మన వంశప్రతిష్ఠకు ఎంత భంగం వాటిల్లుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా! అసలు నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది. నీకే పుట్టిందా లేక ఎవరి ప్రోద్బలముతోనన్నా ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! నీకు రాజధర్మము, మా వంశాచారము తెలిసే ఈ పని చేసావా!

మా వంశాచారము ప్రకారము కొడుకులు అందరిలోకీ పెద్దవాడు రాజ్యభారము వహిస్తే, మిగిలిన వారు అన్నగారిని భక్తితో సేవిస్తారు. ఈ మాత్రం నీకు తెలియదా లేక నీకు మా వంశాచారము మీద, రాజ ధర్మము మీద గౌరవము లేదా! అమ్మా! ఇప్పుడు చెబుతున్నాను విను. మా ఇక్ష్వాకు వంశంలో, అందరిలోకీ పెద్దవాడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది మా కుల ధర్మము. మా ఇక్ష్వాకు వంశరాజులందరూ పాటిస్తున్న ఆచారము. ధర్మాచరణములో మా ఇక్ష్వాకు వంశీయులు ఎల్లప్పుడూ ముందుం టారు. ఈ నాడు నీవు మా రాజధర్మానికి చేటుతెచ్చావు. నీ పుత్ర వ్యామోహంతో మా వంశములోని రాజులందరికీ అపకీర్తి తెచ్చావు. అందుకని నేను మా ఇక్ష్వాకురాజధర్మము తప్పి ప్రవర్తించను. ఈ రాజ్యము నాకు అక్కరలేదు. ప్రాణత్యాగము అయినా చేస్తాను కానీ నీ కోరిక నెరవేర్చను. నేను ఇప్పుడే రాముని వద్దకు పోయి ఆయనను ప్రార్థించి వెనుకకు తీసుకొని వస్తాను. రాజ్యాభిషిక్తుని చేస్తాను. నేను రామునికి దాసునిగా ఉంటాను. నీకు ఇష్టంఉన్నా, లేకపోయినా ఇదే నా నిశ్చయము.”అని ఆవేశంతో అన్నాడు భరతుడు. భరతుని ఆవేశం చల్లారింది. తండ్రి మరణం గుర్తుకు వచ్చింది. ఆ దు:ఖము తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుఃసప్తతితమః సర్గః (74) >>

Valmiki Ramayana Aranya Kanda In Telugu – వాల్మీకి రామాయణే అరణ్యకాండ

Valmiki Ramayana Aranya Kanda In Telugu

అరణ్యకాండ రామాయణంలో మూడవ భాగం, ఈ కాండంలో రాముడు, సీత, లక్ష్మణులు అడవిలో గడిపిన 14 సంవత్సరాల కథను వివరిస్తుంది. ఈ కథాంశంలో చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి, వాటిలో కొన్ని దండకారణ్యానికి ప్రయాణం, విరాధుని వధ, జాబాలి, శరభంగుల ఆశ్రమాలు, పంచవటి, శూర్పణఖ వధ, రావణుని ప్రతీకారం, జటాయువు వధ, కబంధుని వధ, గుహలో హనుమానుని కలయిక.

Valmiki Ramayana Aranya Kanda In Telugu Pdf

అరణ్యకాండ

  1. ప్రథమః సర్గః
  2. ద్వితీయః సర్గః
  3. తృతీయః సర్గః
  4. చతుర్థః సర్గః
  5. పంచమః సర్గః
  6. షష్ఠః సర్గః
  7. సప్తమః సర్గః
  8. అష్టమః సర్గః
  9. నవమః సర్గః
  10. దశమః సర్గః
  11. ఏకాదశః సర్గః
  12. ద్వాదశః సర్గః
  13. త్రయోదశః సర్గః
  14. చతుర్దశః సర్గః
  15. పంచదశః సర్గః
  16. షోడశః సర్గః
  17. సప్తదశః సర్గః
  18. అష్టాదశః సర్గః
  19. ఏకోనవింశః సర్గః
  20. వింశః సర్గః
  21. ఏకవింశః సర్గః
  22. ద్వావింశః సర్గః
  23. త్రయోవింశః సర్గః
  24. చతుర్వింశః సర్గః
  25. పంచవింశః సర్గః
  26. షడ్వింశః సర్గః
  27. సప్తవింశః సర్గః
  28. అష్టావింశః సర్గః
  29. ఏకోనత్రింశః సర్గః
  30. త్రింశః సర్గః
  31. ఏకత్రింశః సర్గః
  32. ద్వాత్రింశః సర్గః
  33. త్రయస్త్రింశః సర్గః
  34. చతుస్త్రింశః సర్గః
  35. పంచత్రింశః సర్గః
  36. షట్త్రింశః సర్గః
  37. సప్తత్రింశః సర్గః
  38. అష్టాత్రింశః సర్గః
  39. ఏకోనచత్వారింశః సర్గః
  40. చత్వారింశః సర్గః
  41. ఏకచత్వారింశః సర్గః
  42. ద్విచత్వారింశః సర్గః
  43. త్రిచత్వారింశః సర్గః
  44. చతుశ్చత్వారింశః సర్గః
  45. పంచచత్వారింశః సర్గః
  46. షట్చత్వారింశః సర్గః
  47. సప్తచత్వారింశః సర్గః
  48. అష్టచత్వారింశః సర్గః
  49. ఏకోనపంచాశః సర్గః
  50. పంచాశః సర్గః
  51. ఏకపంచాశః సర్గః
  52. ద్విపంచాశః సర్గః
  53. త్రిపంచాశః సర్గః
  54. చతుఃపంచాశః సర్గః
  55. పంచపంచాశః సర్గః
  56. షట్పంచాశః సర్గః
  57. సప్తపంచాశః సర్గః
  58. అష్టపంచాశః సర్గః
  59. ఏకోనషష్టితమః సర్గః
  60. షష్టితమః సర్గః
  61. ఏకషష్టితమః సర్గః
  62. ద్విషష్టితమః సర్గః
  63. త్రిషష్టితమః సర్గః
  64. చతుఃషష్టితమః సర్గః
  65. పంచషష్టితమః సర్గః
  66. షట్షష్టితమః సర్గః
  67. సప్తషష్టితమః సర్గః
  68. అష్టషష్టితమః సర్గః
  69. ఏకోనసప్తతితమః సర్గః
  70. సప్తతితమః సర్గః
  71. ఏకసప్తతితమః సర్గః
  72. ద్విసప్తతితమః సర్గః
  73. త్రిసప్తతితమః సర్గః
  74. చతుఃసప్తతితమః సర్గః
  75. పంచసప్తతితమః సర్గః

Aranya Kanda Sarga 3 In Telugu – అరణ్యకాండ తృతీయః సర్గః

Aranya Kanda Sarga 3 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ తృతీయః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో ప్రవేశించి, ఋషులతో భేటి అవుతారు మరియు వారి ఆశీర్వాదాలు పొందుతారు. తరువాత, వారు పంచవటికి చేరి అక్కడ నివసించడం ప్రారంభిస్తారు. పంచవటిలో ఉండే సమయంలో రాముడు తన ధర్మానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, అరణ్యంలో రాక్షసులను అణచి వేస్తాడు.

విరాధప్రహారః

అథోవాచ పునర్వాక్యం విరాధః పూరయన్వనమ్ |
ఆత్మానం పృచ్ఛతే బ్రూతం కౌ యువాం క్వ గమిష్యథః ||

1

తమువాచ తతో రామో రాక్షసం జ్వలితాననమ్ |
పృచ్ఛంతం సుమహాతేజా ఇక్ష్వాకుకులమాత్మనః ||

2

క్షత్రియౌ వృత్తసంపన్నౌ విద్ధి నౌ వనగోచరౌ |
త్వాం తు వేదితుమిచ్ఛావః కస్త్వం చరసి దండకాన్ ||

3

తమువాచ విరాధస్తు రామం సత్యపరాక్రమమ్ |
హంత వక్ష్యామి తే రాజన్నిబోధ మమ రాఘవ ||

4

పుత్రః కిల జయస్యాహం మమ మాతా శతహ్రదా |
విరాధ ఇతి మామాహుః పృథివ్యాం సర్వరాక్షసాః ||

5

తపసా చాపి మే ప్రాప్తా బ్రహ్మణో హి ప్రసాదజా |
శస్త్రేణావధ్యతా లోకేఽచ్ఛేద్యాభేద్యత్వమేవ చ ||

6

ఉత్సృజ్య ప్రమదామేనామనపేక్షౌ యథాగతమ్ |
త్వరమాణౌ పలాయేథాం న వాం జీవితమాదదే ||

7

తం రామః ప్రత్యువాచేదం కోపసంరక్తలోచనః |
రాక్షసం వికృతాకారం విరాధం పాపచేతసమ్ ||

8

క్షుద్ర ధిక్త్వాం తు హీనార్థం మృత్యుమన్వేషసే ధ్రువమ్ |
రణే సంప్రాప్స్యసే తిష్ఠ న మే జీవన్గమిష్యసి ||

9

తతః సజ్యం ధనుః కృత్వా రామః సునిశితాన్ శరాన్ |
సుశీఘ్రమభిసంధాయ రాక్షసం నిజఘాన హ ||

10

ధనుషా జ్యాగుణవతా సప్త బాణాన్ముమోచ హ |
రుక్మపుంఖాన్ మహావేగాన్ సుపర్ణానిలతుల్యగాన్ ||

11

తే శరీరం విరాధస్య భిత్త్వా బర్హిణవాససః |
నిపేతుః శోణితాదిగ్ధా ధరణ్యాం పావకోపమాః ||

12

స విద్ధో న్యస్య వైదేహీం శూలముద్యమ్య రాక్షసః |
అభ్యద్రవత్సుసంక్రుద్ధస్తదా రామం సలక్ష్మణమ్ ||

13

స వినద్య మహానాదం శూలం శక్రధ్వజోపమమ్ |
ప్రగృహ్యాశోభత తదా వ్యాత్తానన ఇవాంతకః ||

14

అథ తౌ భ్రాతరౌ దీప్తం శరవర్షం వవర్షతుః |
విరాధే రాక్షసే తస్మిన్కాలాంతకయమోపమే ||

15

స ప్రహస్య మహారౌద్రః స్థిత్వాఽజృంభత రాక్షసః |
జృంభమాణస్య తే బాణాః కాయాన్నిష్పేతురాశుగాః ||

16

స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షసః | [బలాత్తు]
విరాధః శూలముద్యమ్య రాఘవావభ్యధావత ||

17

తచ్ఛూలం వజ్రసంకాశం గగనే జ్వలనోపమమ్ |
ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామః శస్త్రభృతాం వరః ||

18

తద్రామవిశిఖచ్ఛిన్నం శూలం తస్య కరాద్భువి |
పపాతాశనినా ఛిన్నం మేరోరివ శిలాతలమ్ ||

19

తౌ ఖడ్గౌ క్షిప్రముద్యమ్య కృష్ణసర్పోపమౌ శుభౌ |
తూర్ణమాపతతస్తస్య తదా ప్రాహరతాం బలాత్ ||

20

స వధ్యమానః సుభృశం బాహుభ్యాం పరిరభ్య తౌ |
అప్రకంప్యౌ నరవ్యాఘ్రౌ రోద్రః ప్రస్థాతుమైచ్ఛత ||

21

తస్యాభిప్రాయమాజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీత్ |
వహత్వయమలం తావత్పథాఽనేన తు రాక్షసః ||

22

యథా చేచ్ఛతి సౌమిత్రే తథా వహతు రాక్షసః |
అయమేవ హి నః పంథా యేన యాతి నిశాచరః ||

23

స తు స్వబలవీర్యేణ సముత్క్షిప్య నిశాచరః |
బాలావివ స్కంధగతౌ చకారాతిబలౌ తతః ||

24

తావారోప్య తతః స్కంధం రాఘవౌ రజనీచరః |
విరాధో నినదన్ఘోరం జగామాభిముఖో వనమ్ ||

25

వనం మహామేఘనిభం ప్రవిష్టో
ద్రుమైర్మహద్భిర్వివిధైరుపేతమ్ |
నానావిధైః పక్షిశతైర్విచిత్రం
శివాయుతం వ్యాలమృగైర్వికీర్ణమ్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే తృతీయః సర్గః ||

Aranya Kanda Sarga 3 Meaning In Telugu

తాను రామలక్ష్మణులను వివరాలు అడుగుతుంటే వాళ్లిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు.

“నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు. చెప్పండి మీరు ఎవరు? ఈ అరణ్యములకు ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళుతున్నారు?” అని అడిగాడు.

అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! మేము క్షత్రియులము. మునులము కాము. నా పేరు రాముడు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. కాల వశమున ఈ అరణ్యములో తిరుగుతున్నాము. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగాడు రాముడు.

“ఓ రామా! నేను రాక్షసుడను. నాపేరు విరాధుడు. నా తండ్రి పేరు జవుడు. నా తల్లి పేరు శతహ్రద. నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసాను. ఆయన వలన ఎవరిచేతా గాయపడకుండా, చావకుండా వరము పొందాను. నాకు ఈమె మీద మోహము కలిగింది. కాబట్టి మీరు ఇద్దరూ ఈమెను నాకు విడిచి పెట్టి ఇక్కడ నుండి పారిపొండి. లేకపోతే మీ ఇద్దరిని చంపి తింటాను. వెంటనే వెళ్లిపొండి.” అనిఅన్నాడు విరాధుడు.

ఆ మాటలకు రామునికి కోపం వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. కోపంతో విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! నీకు నా చేతిలో చావు మూడింది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను ప్రాణాలతో వదలను.”అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించి విరాధుని మీదికి వదిలాడు.

వరసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు. రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి. విరాధుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాధుడు తన తొడమీద ఉన్న సీతను కిందికి దించాడు. శూలాన్ని పట్టుకొని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదికి దూకాడు.

రామునికి లక్షణుడు కూడా తోడైనాడు. రామలక్ష్మణులు విరాధుని మీద బాణములను వర్షంలా కురిపించారు. ఆ రాక్షసుడు ఒక్కసారి ఆవులించి ఒళ్లు విదిలించగానే అతని శరీరమునకు గుచ్చుకున్న బాణములు అన్నీ జలజలా కింద రాలిపోయాయి. బ్రహ్మ వరప్రభావము వలన రామ లక్ష్మణులు వదిలిన బాణములు విరాధుని ఏమీ చేయలేకపోయాయి.

విరాధుడు మరలా శూలమును పైకెత్తి రామలక్ష్మణుల మీదికి దూకాడు. తన శూలమును రాముని మీదికి విసిరాడు. రాముడు రెండు బాణములతో ఆ శూలమును మధ్యలోనే ఖండించాడు. విరాధుని శూలము రెండు ముక్కలై కిందపడిపోయింది. రామలక్ష్మణులు రెండు కత్తులను తీసుకున్నారు. విరాధునిమీదికి దూకారు. ఆ కత్తులతో విరాధుని బలంగా కొట్టారు. ఇలా కాదని.

విరాధుడు రామలక్ష్మణులను తన చేతుల మధ్య బంధించాలని అనుకొన్నాడు. విరాధుని ఊహను పసికట్టాడు రాముడు. అక్ష్మణునితో ఇలా అన్నాడు.

“లక్షణా! వీడు మన ఇద్దరినీ చేతులతో ఎత్తుకొని మోసుకొని పోవాలని చూస్తున్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టు మనలను మోసుకుంటూ పోనిద్దాము. ఎందుకంటే మనం కూడా ఇదే దారిలో వెళ్లాలి కదా!” అని అన్నాడు.

ఇంతలో విరాధుడు రామలక్ష్మణులను తన చేతులతో ఎత్తుకొని తన బుజాల మీద కూర్చోపెట్టుకున్నాడు. అరణ్యంలోకి పరుగెత్తాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ చతుర్థః సర్గః (4) >>

Aranya Kanda Sarga 2 In Telugu – అరణ్యకాండ ద్వితీయః సర్గః

Aranya Kanda Sarga 2 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వితీయ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. వారు అటవీ జీవులతో మమేకమై, సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అటవీ సహజ సౌందర్యం వారికి అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. ఈ సమయంలో, సీత తన భక్తి మరియు ప్రేమతో రాముడిని నడిపిస్తుంది, లక్ష్మణుడు రాముడి ఆజ్ఞలను అనుసరిస్తూ రక్షణను కల్పిస్తాడు.

|| విరాధసంరోధః ||

కృతాతిథ్యోఽథ రామస్తు సూర్యస్యోదయనం ప్రతి |
ఆమంత్ర్య స మునీన్సర్వాన్వనమేవాన్వగాహత ||

1

నానామృగగణాకీర్ణం శార్దూలవృకసేవితమ్ |
ధ్వస్తవృక్షలతాగుల్మం దుర్దర్శసలిలాశయమ్ ||

2

నిష్కూజనానాశకుని ఝిల్లికాగణనాదితమ్ |
లక్ష్మణానుగతో రామో వనమధ్యం దదర్శ హ ||

3

వనమధ్యే తు కాకుత్స్థస్తస్మిన్ఘోరమృగాయుతే |
దదర్శ గిరిశృంగాభం పురుషాదం మహాస్వనమ్ ||

4

గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోదరమ్ |
బీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనమ్ ||

5

వసానం చర్మ వైయాఘ్రం వసార్ద్రం రుధిరోక్షితమ్ |
త్రాసనం సర్వభూతానాం వ్యాదితాస్యమివాంతకమ్ ||

6

త్రీన్సింహాంశ్చతురో వ్యాఘ్రాన్ద్వౌ వృషౌ పృషతాన్దశ | [వృకౌ]
సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరో మహత్ ||

7

అవసజ్యాయసే శూలే వినదంతం మహాస్వనమ్ |
స రామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీమ్ ||

8

అభ్యధావత సంక్రుద్ధః ప్రజాః కాల ఇవాంతకః |
స కృత్వా భైరవం నాదం చాలయన్నివ మేదినీమ్ ||

9

అంకేనాదాయ వైదేహీమపక్రమ్య తతోఽబ్రవీత్ |
యువాం జటాచీరధరౌ సభార్యౌ క్షీణజీవితౌ ||

10

ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసిధారిణౌ |
కథం తాపసయోర్వాం చ వాసః ప్రమదయా సహ ||

11

అధర్మచారిణౌ పాపౌ కౌ యువాం మునిదూషకౌ |
అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షసః ||

12

చరామి సాయుధో నిత్యమృషిమాంసాని భక్షయన్ |
ఇయం నారీ వరారోహా మమ భార్యా భవిష్యతి ||

13

యువయోః పాపయోశ్చాహం పాస్యామి రుధిరం మృధే |
తస్యైవం బ్రువతో ధృష్టం విరాధస్య దురాత్మనః ||

14

శ్రుత్వా సగర్వం వచనం సంభ్రాంతా జనకాత్మజా | [సగర్వితం వాక్యం]
సీతా ప్రావేపతోద్వేగాత్ప్రవాతే కదలీ యథా ||

15

తాం దృష్ట్వా రాఘవః సీతాం విరాధాంకగతాం శుభామ్ |
అబ్రవీల్లక్ష్మణం వాక్యం ముఖేన పరిశుష్యతా ||

16

పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్యాత్మసంభవామ్ |
మమ భార్యా శుభాచారాం విరాధాంకే ప్రవేశితామ్ ||

17

అత్యంతసుఖసంవృద్ధాం రాజపుత్రీం యశస్వినీమ్ |
యదభిప్రేతమస్మాసు ప్రియం వరవృతం చ యత్ ||

18

కైకేయ్యాస్తు సుసంపన్నం క్షిప్రమద్యైవ లక్ష్మణ |
యా న తుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శినీ ||

19

యయాఽహం సర్వభూతానాం హితః ప్రస్థాపితో వనమ్ |
అద్యేదానీం సకామా సా యా మాతా మమ మధ్యమా ||

20

పరస్పర్శాత్తు వైదేహ్యా న దుఃఖతరమస్తి మే |
పితుర్వియోగాత్సౌమిత్రే స్వరాజ్యహరణాత్తథా ||

21

ఇతి బ్రువతి కాకుత్స్థే బాష్పశోకపరిప్లుతే |
అబ్రవీల్లక్ష్మణః క్రుద్ధో రుద్ధో నాగ ఇవ శ్వసన్ ||

22

అనాథ ఇవ భూతానాం నాథస్త్వం వాసవోపమః |
మయా ప్రేష్యేణ కాకుత్స్థ కిమర్థం పరితప్యసే ||

23

శరేణ నిహతస్యాద్య మయా క్రుద్ధేన రక్షసః |
విరాధస్య గతాసోర్హి మహీ పాస్యతి శోణితమ్ ||

24

రాజ్యకామే మమ క్రోధో భరతే యో బభూవ హ |
తం విరాధే ప్రమోక్ష్యామి వజ్రీ వజ్రమివాచలే ||

25

మమ భుజబలవేగవేగితః
పతతు శరోఽస్య మహాన్మహోరసి |
వ్యపనయతు తనోశ్చ జీవితం
పతతు తతః స మహీం విఘూర్ణితః ||

26

[* అధికశ్లోకః – ఇత్యుక్త్వా లక్ష్మణః శ్రీమాన్రాక్షసం ప్రహసన్నివ | కో భవాన్వనమభ్యేత్య చరిష్యతి యథాసుఖమ్ || *]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్వితీయః సర్గః ||

Aranya Kanda Sarga 2 Meaning In Telugu PDF

రామలక్షణులు, సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోనే విశ్రమించారు. మరునాడు ఉదయము ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకొని రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా అరణ్యములోకి వెళ్లాడు. వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్యమృగములను చూచారు.

హటాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది. వాడు నరమాంసభక్షకుడు అని రాముడు గ్రహించాడు. రామలక్ష్మణులు వాడి వంక నిశితంగా చూచారు.

వాడు నల్లగా కొండ మాదిరి ఉన్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. వికృతాకారంతో ఉన్నాడు. వాడి శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. వాడి బుజం మీద ఒక శూలం ఉంది. దానికి మూడు సింహాలను, నాలుగు పెద్దపులులను, రెండు తోడేళ్లను, పది జింకలను, గుచ్చి తీసుకొని వెళుతున్నాడు.

ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూచాడు. గట్టిగా అరిచాడు. వారిని చంపడానికి వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి కళ్లక అందమైన సీత కనిపిపించింది. రావడం రావడం సీతను పట్టుకొన్నాడు. సీతను తీసుకొని పక్కకు వెళ్లాడు. రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు.

“జటలు ధరించిన మీరు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈ రోజు నా చేతిలో చావడం ఖాయం. మీరు ఇద్దరూ ముని కుమారుల వేషాలలో ఉన్నారు కదా! మీ వెంట ఈ స్త్రీ ఎందుకు ఉంది? ఈమె ఎవరు? ఈమెతో మీకు ఏమి సంబంధం? మునులు జితేంద్రియులు, సన్యాసులు కదా! మరి ముని ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించి మీరు ఎందుకు పాపం చేస్తున్నారు?” అని అన్నాడు ఆ రాక్షసుడు.

దానికి రాముడు ఆ రాక్షసుని చూచి ఇలా అన్నాడు. “నీవు మమ్ములను ఇలా అడుగుతున్నావే. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు.

“నేను ఒక రాక్షసుడను. నా పేరు విరాధుడు. నేను ఈ అరణ్యములో ఉన్న మునులను చంపి ఆహారంగా తింటూ ఉంటాను. మీ వెంట ఉన్న ఈ స్త్రీ నాకు కావాలి. ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను. ముని వేషములలో ఉండి కూడా ఈ స్త్రీని వెంటబెట్టుకొని తిరుగుతూ పాపం చేస్తున్న మిమ్ములను చంపి తింటాను.” అని అన్నాడు విరాధుడు.

ఆ మాటలు విన్న సీత చాలా భయపడింది. సీత శరీరం అంతా భయంతో వణికిపోయింది. విరాధుని ఒడిలో చిగురుటాకులా వణికిపోతున్న సీతను చూచి రాముడు చలించి పోయాడు. రాముడి మొహం పాలిపోయింది. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

లక్ష్మణా! ఆ దుర్మార్గుడు విరాధుడు సీతను తన ఒడిలోకి ఎలా లాక్కున్నాడో చూచావా! కైక మనకు ఏమి జరగాలని మనసులో అనుకున్నదో అదే జరుగుతూ ఉంది. లక్ష్మణా! కైక తన కుమారుడు భరతునికి రాజ్యం ఇప్పించుకోవచ్చు. మనలను అడవులకు పంపి ఇన్ని కష్టాలకు గురిచెయ్యడం ఎందుకు? కైక మనకు ఏమి జరగాలని కోరుకుంటూ అడవులకు పంపిందో అదే జరుగుతూ ఉంది. నాకు వనవాస ప్రాప్తి, నా తండ్రి మరణము, ఇదుగో ఇప్పుడు నా భార్యను పరపురుషుడు తాకడం, ఒడిలోకి లాక్కోవడం… ఇంతకన్నా కష్టాలు ఏముంటాయి?” అని వాపోయాడు రాముడు.

ఆ మాటలు విన్న అక్ష్మణుడు కోపంతో రగిలిపోయాడు.

“రామా! ఏమిటీ వెర్రి? నీవు దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడవు. ఇలా బేలగా మాట్లాడటం నీకు తగునా? అసలు ఇలా ఎందుకు పరితపిస్తున్నావు? రామా! నువ్వు చూస్తూ ఉండు. ఒకే బాణంతో వీడిని మట్టి కరిపిస్తాను. వీడి రక్తంతో నేలను తడిపేస్తాను. దేవేంద్రుడు పర్వతముల మీద వజ్రాయుధమును ప్రయోగించినట్టు విరాధుని మీద నేను బాణప్రయోగము చేస్తాను. వీడు కొండ కూలినట్టు కూలిపోతాడు. వీడి వక్షస్థలమును చీలుస్తాను. వీడి ప్రాణాలు హరిస్తాను.” అని కోపంతో ఊగిపోతూ అన్నాడు.

లక్ష్మణుడు. (ఒక్కమాట. విరాధుడురాక్షసుడు. నరమాంసము తినేవాడు. వాడు అన్న మాటలు చదివారు కదా. సన్యాసులు జితేంద్రియులు. వారి వెంట స్త్రీ ఉండకూడదు. వారికి స్త్రీ సాంగత్యము పనికిరాదు. ఇదీ ఆ రాక్షసునికి తెలిసిన నీతి. కాని ఈ నాడు మన మధ్యఉన్న స్వామీజీలు, సన్యాసుల చుట్టు ఉండేది ఆడవాళ్లే. సిల్కుజుబ్బాలు, చుట్టు ఆడవాళ్లు. తాము ఉండే గదుల్లో కిలోల కొద్దీ వెండి బంగారాలు, అక్రమ ఆస్తులు, పోలీసుకేసులు, అరెస్టులు ఇవి నిత్యకృత్యం అయ్యాయి. మరి ఆ రాక్షసుడికి ఉన్న జ్ఞానం కూడా మన స్వామీజీలకు లేదా! ఏమో! మీరే ఆలోచించండి)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ తృతీయః సర్గః (3) >>